Wednesday, December 31, 2008 6 comments By: visalakshi

బ్లాగు కుటుంబ సభ్యులందరికీ 2009 " నూతన సంవత్సర శుభాకాంక్షలు ".


బ్లాగు కుటుంబ సభ్యులందరికీ 2009 " నూతన సంవత్సర శుభాకాంక్షలు ".
Tuesday, December 30, 2008 6 comments By: visalakshi

2008 అనుభవాలు,అనుభూతులు.

ఒక కుటుంబంలో ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. పెద్ద అబ్బాయి ఎం.బీ. ఏ చేసి బిజినెస్ చేస్తున్నాడు. చిన్న అబ్బాయి కూడా అన్నగారి వద్ద మార్కెటింగ్ చేస్తున్నాడు. ఇద్దరు అమ్మాయిలకీ వయసు తేడా 2సం"లు.
ఈ ఇద్దరు అమ్మాయిలకి  కాలనీ  సిస్టర్స్ అని పేరు .ఆ పేరు ఎలా వచ్చిందంటే ఇంట్లో ఏ అవసరమొచ్చినా , రేషన్ కి వెళ్ళాలన్నా ఇద్దరూ జంట కవుల వలె వెళ్ళేవారు .ఏపని ఐనా కలసి చేసే వారు . కాలనీ లో అందరికీ వెల్ నోటెడ్ వీళ్ళిద్దరూ.ఒకరికొకరు అన్ని విషయాలు షేర్ చేసుకునేవారు .అలాంటి తరుణంలో అక్కకి పెళ్ళై దూరంగా వెళ్ళి పోయినా ,తనూ ఉన్నత చదువు అభ్యసించి వివాహము చేసుకుని ఉద్యోగం చేస్తూ ఎవరికి వారు బిజీ అయ్యి మరల దూరంగా ఉన్న అక్కా,బావలు ట్రాన్స్ఫర్ తో దగ్గరైన ఇద్దరమ్మాయిలు ఎవరో కాదు వేద ,రమణిలు .
ఇక విషయానికొస్తే ఈ సంవత్సరము మొదట్లో రమణి నాకు బ్లాగు రాస్తున్నాననీ ,చదువు అని చెప్పేది .కానీ నేను చిన్నప్పుడు కవితలు రాసి వినిపించేది. ఇదీ అలాంటిదే ఐ ఉంటుంది అని పట్టించుకోలేదు. కానీ పట్టు వదలని విక్రమార్కుడిలా నన్ను చదవమని అడిగేది. అప్పుడు నాకు పెద్దగా నెట్ గురించి తెలియదు .సరే అని మా పాపని అడిగి తెలుసుకుంటూ తన బ్లాగు ఓపెన్ చేసి చదివాను. నిజంగా తనలో ఇంతటి భావుకత ఉందా ! ,తన సహజమైన శైలి తో ,హాస్యం పండిస్తూ .నివ్వెర పోయాను.తేరుకుని నీ సొంతమేనా ఎక్కడైన కాపీనా అని అక్కగా అధికారంగా అడిగాను.తన జవాబు హ..హ..హ..హ ఎప్పుడూ ఇలాగే చిలిపిగా ఉంటుంది నా చెల్లెలు. అలా తన పోస్టులు చదువుతూ గడుపుతున్న నన్ను ఒక రోజు నువ్వూ రాయక్కా .అని అడిగింది .చదవడం ఈజీ ,రాయడం కష్టము అన్నాను.కానీ మనసులో పడింది రాయాలని.నా కంటూ ఒక బ్లాగు ఎలా అని అడిగాను .తను బాగా బిజీ ఉన్న రోజుల్లో నాకు ఆసక్తి ఎక్కువై తన బ్లాగునుండి కామెంట్స్ వచ్చిన వారి బ్లాగులు చదువుతూ శ్రీధరు గారి చిట్కాలతో కష్టపడి బ్లాగరునయ్యాను. తరువాత తెలుగులో ఎలా రాయాలో రమణి చెప్పింది. ఆ విధంగా సెప్టెంబరులో ఈ -తెలుగు లోకంలో అడుగు పెట్టిన నేను ప్రముఖులు కొంతమంది ఆశీస్సులతో నాకు తోచిన చిన్న చిన్న అంశాలు రాస్తున్నాను.నేను బ్లాగ్లోకంలోకొచ్చిన 4నెలల్లోనే అంతర్జాలంలో తెలుగు వెలుగులు అంటూ ప్రముఖ తెలుగు బ్లాగర్లని కలవడం మేము చేసుకున్న అదృష్టము .మరియు ప్రమదావనంలో కూడా ప్రముఖుల పరిచయం ,మొత్తానికి బ్లాగు కుటుంబంలో నన్ను సభ్యురాలిని చేసిన నా చెల్లికి ముందుగా కృతజ్ఞతలు.ఇంతమంది స్నేహితులు ,సన్నిహితులు కల ఈtelugu బ్లాగులోకం దిన,దిన ప్రవర్ధమానంగా వృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ ...............వేద
Thursday, December 25, 2008 3 comments By: visalakshi

ఎందుకీ బలవన్మరణాలు;ఆత్మహత్యలు-

దార్ల వెంకటేశ్వర రావు గారి బ్లాగులో నిన్ననే చదివాను ఎం.ఫిల్ చేస్తున్న కేశవాచారి అనే విద్యార్ధి (తెలుగు బ్లాగరు)రైలు కింద తల పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడుట .
ఒక నెల ముందు మా బాబు కాలేజీలో బీ.టెక్ 2వ సం" చదువుతున్న ఒకబ్బాయి ,వేరే కాలేజీ లో లైబ్రరీ బుక్ దొంగతనము చేసాడు అన్న అసత్య ఆరోపణతో మనస్థాపంచెంది రైలు కింద తల పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు .
ఇలా ఎంతమంది?రోజుకో వార్త ఒక విద్యార్ధిని ఉరి వేసుకుంది. అని లేక పై నుండి దూకిందని వినడం,చూడడం జరుగుతోంది. పదవ తరగతి నుండి ఉన్నత విద్యలు చదివే విద్యార్ధుల వరకు అందరూ ఒకే మార్గంలో నడుస్తున్నారు ఆత్మహత్యల విషయంలో. మంచి మేధావులు, అవగాహన ఉన్నవాళ్ళూ క్షణికమైన ఆవేశంతో ఇలాంటి పిరికి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారో ?ఆలోచిస్తే మనసు ఆందోళనకు గురౌతోంది .ఆత్మహత్య చేసుకోవాలంటే చాలా ధైర్యం కావాలంటారు కానీ వీళ్ళందరికీ బతకడానికి ధైర్యం చాలడం లేదేమో .
చిన్నప్పటినుండి వారి నవ్వులో, మాటలో ,నడకలో, అన్నిటిలో మమేకమై వారి కోసమే జీవిస్తున్న తల్లి దండ్రుల కడుపుకోత ,ఇవన్నీ ఆసమయంలో వాళ్ళకి గుర్తురాదా! ఒక అమ్మాయి కోసమో,లేక మరే ఇతర కారణమైనా సమస్యకి పరిష్కారం చావొక్కటేనా !జీవితాన్ని ఆత్మ స్థైర్యంతో సాధించకుండా ,మరణాన్ని జీవితంలోకి ఆహ్వానిస్తున్నారు ఇలాటి నిస్థేజపరులు.
ఏదో సాధించాలనే తపన :అది నెరవేరకపోతే నిర్లిప్తత .ఆవేశంలో అనాలోచిత నిర్ణయాలు .ఆత్మకి శాంతి కలగాలి అంటున్నారు కొందరు, నిజంగా బలవన్మరణాలలో ఆత్మలు శాంతిస్తాయా ?లేక ఘోషిస్తాయా !తీరని కోరికలతో ఇలా ఎంతమంది ఆత్మహత్యల పాలవుతారు .స్నేహితులు, తెలిసిన వారు కొంత కాలం బాధపడతారు.కానీ కన్నవారి కడుపు తీపి జీవితాంతం వారు కుమిలిపోతూనే ఉంటారు. పుట్టి నప్పటి నుండి తనగురించే, చావులో కూడా తన గురించే ఆలోచించి స్వార్ధాన్ని చూసుకుంటున్న విద్యార్ధుల్ని ఏమనాలి? వాళ్ళ ఆత్మలు అసంతృప్తితో క్షోభించవా !
ఇలాటి అనాలోచిత నిర్ణయాలని అరికట్టాలంటే బాల్యం నుండీ పెరిగిన పరిసరాల ప్రభావం :మానసిక స్వభావాన్ని మెరుగు పరుస్తుంది .తల్లి దండ్రులు జీవితము పట్ల సరైన అవగాహన కలిగేట్టు బాధ్యతాయుతంగా పిల్లల వ్యక్తిగత జీవితాన్ని కూడా తెలుసుకుంటూ మెలకువతో వ్యవహరించాలి .ముఖ్యంగా యువతీ యువకులు ఎక్కువగా కాలేజీలో సమయం గడుపుతారు కాబట్టి అక్కడ ఉపాధ్యాయులూ,ప్రధానోపాధ్యాయులు యువతకి ఆత్మస్థైర్యాన్ని పెంచే బోధనలు చేయాలి .
కానీ దురద్రుష్టవశాత్తూ ఈ రోజుల్లో అమ్మాయిల కాలేజీ అయితే ,ప్రతీ అమ్మాయినీ ,ఆ అమ్మాయి ఎంత మంచి నడవడిక గల యువతి అయినా సరే(మంచి క్రమశిక్షణతో కాలేజీని నడుపుతున్నాము అనే ఆలోచనతో)ప్రిన్సిపాల్ అసభ్య పదజాలంతో అమ్మాయిలను దూషిస్తూ ,ఆలస్యంగా వచ్చిన వారిని ఎవరితో తిరుగుతున్నావ్?అంటూ దారుణంగా మాట్లాడు తుంటే తల్లి దండ్రులకు ఇలాంటి ఫోనులు వెళుతుంటే యువతకి జీవితం మీద విరక్తి కాక అవగాహన ఎలా పెరుగుతుంది. ముందుగా చదువు చెప్పే ఇలాంటి గురువులకి కౌన్సిలింగ్ ఇప్పించాలి .
యువతీ ,యువకులకు నాచిన్న సలహా మరియు అభ్యర్ధన . ఆవేశంతో కాక ఆలోచనతో భవిష్యత్ ని రసరమ్యంగా తీర్చి దిద్దుకోండి .తల్లి దండ్రులను నిరాశ పరచకండి .
Sunday, December 21, 2008 4 comments By: visalakshi

అంతర్జాలంలో తెలుగు వెలుగు వేదికపై బ్లాగు మిత్రులు కలిసిన శుభ తరుణం

అందమైన సాయం సంధ్యా సమయం లో హైదరాబాదు మహా నగరంలో నెక్లెస్ రోడ్ యందు జంటలన్నీ సరదా సరదాగా తిరుగాడు సమయాన పుస్తక ప్రదర్సన జరుగుతున్న ప్రదేశంలో మన వేదిక ఏర్పాటు చేసారు బ్లాగరులలో ప్రముఖులు .ఔత్సాహికులైన వారిని ప్రోత్సహించి అంతర్జాలంలో తెలుగు వ్యాప్తి చేయాలన్న సదుద్దేశ్యంతో చదువరిగారు, తాడేపల్లి సు భ్రమణ్యం గారు, నల్లమోతు శ్రీధరు గారు, అరుణ గారు, పూర్ణిమ గారు,జ్యోతి గారు ,నేను-లక్ష్మి లక్ష్మి గారు,నా చెల్లెలు రమణి(మనలొ మాట నా మనసులో మాట ),మరియు రవి గారు ,కత్తి మహేష్ గారు,చావా కిరణ్ గారు వేద అనబడే నేను ఇంకా చాలా మంది బ్లాగరులు కలుసుకుని పరిచయ కర్యక్రమాలయ్యాక సందర్సంచినవారికి ఈ -తెలుగు వెబ్సైట్ గురించి వివరిస్తూ బ్లాగుల సమాచారాన్ని అందరికీ అందజేసి సరదా సరదాగా గడిపిన శుభ తరుణం మరువ  లేనిది
Thursday, December 18, 2008 9 comments By: visalakshi

ప్రేమ కధ ( 1982) :


పదవ తరగతి పూర్తి చేసుకుని ఇంటరులో చేరాల్సిన అమ్మాయి ప్రేమలో పడింది .రోజూ వాళ్ళింటికి వచ్చే అన్న గారి స్నేహితుడిని చూసి మనసు పడి ,ఆ విషయం అతనితో చెప్పి పరస్పర అవగాహనతో ఇద్దరూ కలిసి ప్రేమ పక్షుల్లా విహరిస్తుంటే ,అన్నగారికి విషయం తెలిసి ఇద్దరినీ మందలించాడు. ఈ లోపులో అమ్మాయిది ఇంటరు పూర్తి అయింది. అబ్బాయికి గవర్నమెంటు జాబు వచ్చింది. ఇలా ఇంట్లో గొడవలతో వాయిదా పడుతూ వచ్చిన పెళ్ళి అనుకోకుండా ఇంకో వ్యక్తి అమ్మాయి జీవితం లోకి వచ్చి విసిగించడంతో ,అమ్మాయి డిగ్రీ పూర్తి కాకుండానే ,మరియు పెద్దవాళ్ళ అమోదం లేకుండా రిజిస్టారు ఆఫీసులో పెళ్ళి చేసుకున్నారు ఆ జంట .పెళ్ళి అయ్యాక కుటుంబ సభ్యులు చాలా నెలలు కోపంగా ఉన్నా అటు వారిని ,ఇటు వారిని శాంత పరిచి అందరు ఆనందంగా కలుసుకునేలా ప్రవర్తించారు ఆ జంట .వారికి పెళ్ళి అయి ఈ రోజుకి 22సం"లు
పెళ్ళి అయిన తరువాత ఆ అమ్మాయి డిగ్రీ పూర్తి చేసింది. కంప్యూటరు కోర్సు చేసింది .కానీ హౌసు వైఫ్ గా స్థిరపడిపోయింది. ఆ అమ్మయికి ఒక పాప, ఒక బాబు.
ప్రస్తుతము పాప ,బాబు ఇంజనీరింగు చదువుతున్నారు. ఇంతకీ ఆ అమ్మాయి అనబడే సదరు స్త్రీ నేనేనండీ ,వేద. మా వైవాహిక జీవితం ఒడి దుడికులతో,మరియు సుఖ సంతోషాలతో గడిచింది ,గడుస్తోంది. బ్లాగు మిత్రులందరితో సరదాగా నా కధ చెప్పాలని రాసాను .అంతే
Saturday, December 13, 2008 7 comments By: visalakshi

బ్లాగర్స్ డే:



తెలుగు బ్లాగు మితృలందరికీ నా స్నేహపూర్వక మరియు హృదయ పూర్వక బ్లాగు దినోత్సవ శుభాకాంక్షలు .నేను కొత్తగా బ్లాగు లోకానికి వచ్చాను.తెలుగు బ్లాగర్లలో ఎందరో మహా మేధావులూ,కవి వర్యులూ ఉన్నారు.అందరికీ నా వందనాలు. దాదాపు కూడలిలో అన్ని బ్లాగులూ చదువుతాను.కొన్ని మనసుకి హత్తుకునేలా ఉంటాయి. అన్నిటికి వ్యాఖ్య రాయాలని ఉంటుంది కానీ కొన్ని బ్లాగులలో నా మనసులో భావాన్నే ఇంకొకరి వ్యాఖ్యలో చూస్తాను. వైజాగ్ డైలీ ,నవతరంగం ,పొద్దు వగైరా బ్లాగరులకు ,పెద్దలకు పిన్నలకు బ్లాగరులందరికీ మరోసారి శుభాకాంక్షలతో ...............మీ వేద.
Thursday, December 11, 2008 0 comments By: visalakshi

ఖడ్గ సృష్టి ;



" మానవుడే నా సందేశం ,మనుష్యుడే నా సంగీతం "అని ఎలుగెత్తి చాటిన మహాకవి శ్రీ శ్రీ . తెలుగు కవిత్వాన్ని మరో మలుపు తిప్పిన మహా కవి శ్రీ శ్రీ (మహా ప్రస్థానం }1950 లో పుస్తక రూపం ధరించింది .ఆయన సాహితీ తపస్సుకు గుర్తింపుగా ఖడ్గ సృష్టి కావ్యానికి 1966లో సోవియట్ భూమి నెహ్రూ అవార్డూ ,1973 లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డూ ,1979 లో శ్రీ రాజ్య లక్ష్మీ ఫౌండేషన్ వారి మొదటి అవార్డు అందుకున్నారు .తెలుగు కవిత్వాన్ని ఖండించి ,దీవించి ,ఊగించి ,శాసించి ,రక్షించిన మహా కవి శ్రీ శ్రీ .
" కృష్ణ శాస్త్రి తన బాధని అందరిలోనూ పలికిస్తే శ్రీ శ్రీ అందరి బాధనూ తనలో పలికిస్తాడు."
"కృష్ణ శాస్త్రి బాధ ప్రపంచానికి బాధ ,ప్రపంచపు బాధ అంతా శ్రీ శ్రీ బాధ"................... చలం గారు అన్న మాటలివి .
రెండు రెళ్ళు నాలుగన్నందుకు
గూండాలు గండ్రాళ్ళు విసిరే సీమలో
క్షేమం అవిభాజ్యం అంటే
జైళ్ళు నోళ్ళు తెరిచే భూమిలో

అస్వ్తంత్రతని జయించడానికి
అహింసాయుధం ధరించామంటూ
రక్త పాతం లేకుండానే
రాజ్యం సంపాదించామంటూ

అవినీతి భారీ పరిశ్రమలో
అన్యాయాల ధరలు పెంచేసి
స్వాతంత్ర్యాన్ని బ్యాంకుల్లో వేసుకుని
చక్ర వడ్డీ తిప్పే కామందులకు

క్షణ క్షణం మారుతున్న లోకాన్ని
సరీగా అర్ధం చేసుకున్న వాళ్ళంతా
పేద ప్రజల పక్షం వహించడమే
పెద్ద అపరాధమై పోయింది .

అహింస ఒక ఆశయమే కాని
ఆయుధం ఎప్పుడూ కాదు
ఆశయం సాధించాలంటే
ఆయుధం అవసరమే మరి.

ఆశయం ఉండడం మంచిదే కాని
అన్ని ఆశయాలూ మంచివి కావు
ఆశయాలు సంఘర్షించే వేళ
ఆయుధం అలీనం కాదు

అందుకే అంటున్నాను నేను
అందుకో ఆయుధం అని
ఆచరణకి దారి తీస్తేనే
ఆవేశం సార్ధకమవుతుంది .

అందుకే సృష్టిస్తున్నాను
అధర్మనిధనంచేసే ఈ ఖడ్గాన్ని
కలంతో సృష్టిస్తున్న ఖడ్గం ఇది
జనంతో నిర్మిస్తున్న స్వర్గం ఇది.

ఈ కత్తి
బూజు పట్టిన భావాలకి
పునర్జయం ఇవ్వడానికి కాదు
కుళ్ళి పోతున్న సమాజ వృక్షాన్ని
సమూలచ్చేదం చెయ్యడానికి ............................ఇంకా చాలా ఉంది.ప్రతి తెలుగు వారికి "అంకితం" చేసిన ఈ ఖడ్గ సృష్టి కావ్యం అందరూ చదివి తీరాల్సిన కావ్యం.
Friday, December 5, 2008 5 comments By: visalakshi

జీవితం--విలువలు:

మన జీవితం ఎలాంటి ఆందోళనలు లేకుండా నిర్భయంగా సాగిపోవాలంటె విలువల ఆధారంగా పయనించాలి.
జీవితంలో తమని తాము ప్రేమించుకోని వారు లోకంలో ఎవరినీ ప్రేమించలేరు.
ప్రతి వ్యక్తికీ జీవితంలో స్వార్ధం అవసరం.కానీ అది మితి మీర కూడదు.
జీవితం ముందుకు సాగిన తరువాత ,వెనక్కి గతం చుసి దిగులు పడడం అనేది వ్యర్ధమైన వేదన.
ప్రస్థుతపు నాగరికతలో తాను చేసే పనిలో తప్ప ఇతరులు చేసే పనిలో అర్ధం కనబడుటలేదు.ఈనాటి బుద్ధి మంతులకు .
ఒక బిచ్చగత్తెకి ఈ రోజు నేను ఇచ్చిన 2రూ"లు గొప్ప సంతోషాన్నిచ్చింది. కానీ నేనువారం రోజులు వరుసగా 2రూ"లు ఆమెకి ఇస్తే ,అటు తరవాత ఆ 2రూ"లు ఆమెకి ఏ సంతోషాన్ని ఇవ్వదు. 2రూ"లు దొరక నప్పుడు విచారాన్ని తప్ప .
సుఖము, బాధా ఈ రెండే జీవితపు విలువలు. ఏదైనా సరే ,ఏయత్నమైనా అన్నీ విడదీసి చూస్తే చివరికి మిగిలే అసలు విలువలు, బాధ నించి తప్పించుకోవడమూ ,సుఖాన్ని అనుభవించడమూ .
విలువల్ని మనసే కల్పిస్తుంది. మనకి కావాలనే కోర్కె పుట్టేదాకా ఎంత విలువైన పదార్ధమైనా మనకేం గొప్ప?
ఏది నిజం? ఏది న్యాయం? ఏది సుందరం?ఏది గొప్ప? ఎక్కడ వున్నాయి ఈ విలువలు ,ఎప్పుడూ మనుషులలో మారే మనసులలో తప్ప .
మన సౌఖ్యానికి ధనము ,ఆస్థి ముఖ్యమనుకున్నంత కాలమూ ఇంక ఏ విలువలకీ స్థానముండదు మన మనస్సుల్లో .
ఈ రోజుల్లో సాధారణ వ్యక్తులు ఎంతో నిజాయితీగా విలువలతో నడుచుకోవడం చూస్తుంటాము .కొందరు లక్షల్లో సంపాదిస్తూ ఉన్నత హోదా లో ఉండి కూడా చౌక బారుగా ప్రవర్తించడాన్ని గమనిస్తుంటాం .అందుకే స్థాయిని బట్టి కాకుండా సంస్కారాన్ని బట్టి ,విలువల ఆచరణను బట్టి మనిషికి ఆదరణ లభిస్తుంది.
Wednesday, November 26, 2008 8 comments By: visalakshi

స్త్రీ -స్వేచ్ఛ:-


కుటుంబ వ్యవస్థలో భర్త పాలనలో మధ్య తరగతి సగటు స్త్రీల స్వేచ్ఛ : ఉదా: మా బంధువుల అమ్మాయికి పెళ్ళి అయి 2సం"లు దాటాయి . భర్త రైల్వేలో చేస్తున్నాడు. ఈమె పెళ్ళికి ముందు ప్రైవేటు ఉద్యోగం చేసేది .పెళ్ళి సెటిల్ అయ్యాక మానేసింది. ఒక పాప పుట్టాక మరల జాబ్ లో జాయిన్ అయింది. నెల తిరిగేసరికి జీతం మొత్తం అత్తగారి చేతిలో. ఆ అమ్మాయికి బస్ పాస్ +10 రూ "లు . ఆఫీస్ నుండి వచ్చాక ఇంటిపని మొత్తం చేసుకోవాలి. ఇది ఆ అమ్మాయి ఆర్ధిక స్వాతంత్ర్యం ,వ్యక్తిగత స్వేచ్ఛ. కనీసము తల్లిదండ్రుల్కి, చుట్టాలకి ఫోను చెయ్యాలన్నా భర్తగారి ,అత్తగారి పర్మిషన్ ఉండాలి. ఆ అమ్మాయిని ఏదైనా ఫంక్షన్ కి పిలవాలంటే ,మా అత్తగారికి,మా వారికి చెప్పండి. వాళ్ళు పంపితే వస్తాను. ఇదీ జవాబు. ఇంత లోబడి ఉండి అవకాశం ఇచ్చి పైగా మీకు అన్నీ తెలుసుకదా అక్కా ! అత్తగారింట్లో ఎలా ఉండాలో అని అంటుంది. అంటే అలాంటి స్త్రీల ఉద్దేశ్యం " అత్తగారింట్లో ఒక బానిసలా ఉండమని. తల్లి దండ్రులు కష్టపడి చదివించి ప్రేమతో పెంచి పెళ్ళిచేసి అత్తవారింటికి పంపిస్తారు. అని."
సాంప్రదాయం అనే ముసుగులో లోబడి ఉంటూ పైగా తన వంశం అంటే అత్తగారి తరఫు (పుట్టినప్పటి నుండీ అక్కడే ఉన్నట్టు గా ) వంశ చరిత్రను మనకు వినిపిస్తూ వాళ్ళ జీవన విధానాన్ని గొప్పగా సమర్ధించుకుంటూ ఉంటారు. తమకి లోబడి ఉన్న స్త్రీని ,ఆమెకెంత ఘనత ఉన్నా సరే ,కుటుంబ సభ్యులు గౌరవించరు. అందరు స్త్రీలు ఇలా ఉన్నారని కాదు .ఇలా కూడా కొంతమంది మధ్య తరగతి స్త్రీలు యాంత్రికంగా జీవిస్తున్నారు.
భార్య జ్ఞానంతో ,లోకానుభవంతో మాట్లాడిందా భరించలేడు భర్త. ఎంత పట్టించుకోకపోయినా లెక్క చేయకుండా, మౌనంగా బతకగలది స్త్రీ హృదయం ఒక్కటే.
అసలు స్త్రీకి ,ఇంట్లోనూ, బయటా అధికారాలు కాదు కావలసినది. స్త్రీకి తనమీద ,తన జీవితం మీద ,తన శరీరం మీద,మనసు మీద ,హృదయం మీద సంపూర్ణ అధికారం కావాలి .బానిసత్వం లో ఏదో అశాంతి .యాంత్రికంగా అన్నీ జరిగిపోతాయి. ఎన్ని బాధలున్నా సరే స్వేచ్ఛలోనే శాంతి.ఎన్ని కష్టాలున్నా స్వేచ్ఛ కోసం పోరాడాలి స్త్రీ. అందులోనే ఉంది శాంతి, సంతృప్తి.
Thursday, November 20, 2008 5 comments By: visalakshi

నమ్మకం: పాజిటివ్ థాట్

నమ్మకం అనేది మనిషిలోని గుణం. అది ఒక విధమైన ప్రశాంతతనూ
,సంతోషాన్నీ కలిగిస్తుంది.
చిన్నతనం నుండీ అతి జాగ్రత్తను నేర్పుతూ ఎవరినీ నమ్మకు ,
మోసగిస్తారు అని తల్లి దండ్రులు వ్యతిరేక ఆలోచనలు మనసులో నాటుతారు.
వ్యక్తిని బాగా పరిశీలించి నీ అంచనాలకు సరిపోతేనే నమ్ము. అని పదే పదే చెబుతారు కొంతమంది పెద్దలు.
ఈ రకంగా నమ్మకానికి దూరంగా మనిషిలో అపనమ్మకాన్ని ఎక్కువగా ముద్ర వేస్తారు. దాని కారణంగా చివరికి తల్లిదండ్రుల మీద కూడా సరైన నమ్మకం అలవరుచుకోరు. మనసు అయోమయ స్థితికి వెళుతుంది. కొంతమంది తమని తాము నమ్మలేని స్థాయికి దిగజారిపోతారు.
అపనమ్మకం అనుమానాన్ని ,సంఘర్షణను ,అశాంతిని ,పిరికితనాన్ని పెంచుతుంది.
ఒక మహిళ భర్తగా మారిన పరాయి మగవాడికి తన సర్వస్వం అర్పించి ,అనుసరించడానికి ఆధారం" నమ్మకం. "
"ఒక గులాబి వికసిస్తున్నప్పుడు (ఎవరు తనని ఆస్వాదిస్తారో ) అని ఆలోచించదు.వికసించడం తన సహజత్వం - వికసించింది అంతే. అది సహజ గుణం .అలాగే నమ్మకం అనేది నిశబ్ధం నుంచి ,నిజ స్వరూపం నుంచి పుట్టుకొచ్చే శాంతి పూర్వక సుగంధం.
నమ్మకం మనిషిని ఉన్నతంగా ఆలోచింపజేస్తుంది. పరిపక్వతను ,వ్యక్తిత్వ వికాశాన్ని పెంపొందిస్తుంది .ముందుగా తన మీద తనకి నమ్మకం కలగాలి. ఆ నమ్మకాన్ని తన చుట్టూ వున్న వ్యక్తుల మీద పెంచాలి. అందరినీ ప్రేమించాలి.
ఎవర్ని నమ్ముతున్నానని కాదు ,ఎలా నమ్ముతున్నాను :ఎంతగా నమ్ముతున్నాను అన్నవి ప్రధానాలు .
జస్ట్ ! నమ్మకంతో కూడిన హృదయాన్ని పెంచుకోండి. అది ఒక విచిత్రమైన వాతావరణాన్ని కల్పిస్తుంది. మన ఉనికిలోనే అద్భుతం నిండిపోతుంది.
Monday, November 17, 2008 4 comments By: visalakshi

ప్రేమ(తో)లేఖ...............

ప్రేమలేఖ అంటే మిత్రులకు లే రాయడం.
నిర్మలమైన స్నేహం ,స్వచ్చమైన హృదయాల నుండి పుట్టినవే మధురమైన లేఖలు.
అంతరంగికుడైన మిత్రుడితో హృదయంలోని మార్దవమైన అభిప్రాయాన్ని చెప్పుకోవడమే ప్రేమలేఖ !!!
ప్రియురాలు దగ్గర లేనప్పుడు ఆమెతో ఇంటిమేట్‌గా మాట్లాడడమే ప్రేమలేఖ !!!!
చాలా ప్రియమైనవారు రాసిన లేఖ పదే పదే చదువుతూ కలలలోకి వెళ్ళకపోతే ఆ వుత్తరం వచ్చి ప్రయోజనం లేదు..
నన్ను మరిచిపోవద్దు. సర్వకాల సర్వావస్తల్లోనూ నిన్నే అన్వేషిస్తున్నానని జ్ఞాపకం చేయడమే ప్రేమలేఖ.
ఈ ప్రపంచమే, ఈ సృష్ఠి సౌందర్యమే ఒక పెద్ద ప్రేమలేఖ..........
"లేఖ" ఎంత మధురంగా ఉంది ఈ పదం .అందుకే మా పాప పేరు లేఖ అని పెట్టుకున్నాను. అందరూ లేఖా అని పిలుస్తారు.
తరం మారింది .ఈరోజుల్లో ఎంతమంది వుత్తరాలు రాసుకుంటున్నారు?అందరూ ఈమెయిల్సు మరియు సెల్ఫోనులో మెసేజిలు చేసుకుంటున్నారు. ఇవి కూడా పరస్పర అవగాహనకు తోడ్పడుతాయి . ఇంటర్నెట్ పుణ్యమాని బ్లాగులలో పరస్పరం అభిప్రాయాలను పంచుకునే అవకాశం వచ్చింది.
ఎన్ని వచ్చినా ఆ పాత మధురాలే తీయగా వుంటాయి.
చివరిగా ఒక మాట. పుస్తకం.......మన నేస్తం అని నిన్న ఈనాడు పత్రికలో శీర్షిక రాసారు. అందులో తెలుగు పుస్తకాల స్థానమెక్కడ అని ప్రశ్నిస్తూనే శ్రీ శ్రీ , ,చలం ,విశ్వనాధ సత్యనారాయణ ,ఆరుద్ర ,డా.సి.నారాయణ రెడ్డి,రాచకొండ విశ్వనాధశాస్త్రి ,,చాగంటి సోమయాజులు, గోపీచంద్ ,మరియు బుచ్చిబాబు తది తర సుప్రసిద్ధాల రచనలకు ఎప్పుడూ ఆదరణ వుంటుంది. నేడు వాటిని తలదన్నే రచనలు రావడంలేదని సాహితీ పిపాసులు అంటున్నారు. పుస్తకాల పట్ల జిజ్ఞాస కలిగించేందుకు వాటి ఆవశ్యకతను చాటి చేప్పేందుకు మన రాష్త్రంలో "విశాలాంధ్ర "అన్ని శాఖల వద్ద జాతీయ పుస్తక వారోత్సవాల సంధర్భంగా ఈ వుత్సవాలను చేపడుతోంది.
కాబట్టి ఆ పాత మధుర పుస్తకాలకోసం చలో విశాలాంధ్ర.
Saturday, November 8, 2008 6 comments By: visalakshi

నా బాల్యం..........

తడబడే అడుగులతో తనివి తీరని ఆటలతో సాగిపోయే బాల్యం,భగవంతుని స్వరూపమే.అందుకే అన్నారు పిల్లలూ ,దేవుడూ చల్లని వారే కల్లకపటమెరుగని కరుణామయులే :
చిన్ననాటి ఆటలు ,పాటలు ,ఆహ్లాదం,పల్లెటూరు మధురమైన జ్ఞాపకాల్ని,మరల రాని మధుమాసం లాంటి పసితనాన్ని ,అందరితో పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది .
హైదరాబాదు నగరంలో అమ్మా నాన్నల దగ్గర తెల్ల కాగితంలా ,స్వఛ్చంగా ,కల్లాకపటం తెలియని వయసులో 2వ తరగతి చదువుతుండగా మా అమ్మ ప్రోద్భలంతో మా నాన్నగారు నన్ను అమ్మమ్మ గారింటికి తీసుకెళ్ళారు . మా అమ్మమ్మకి 4గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి. మా అమ్మ ,మామయ్య హైదరాబాదులో, మిగిలిన వారు తూ"గో"లో ఉన్నారు. మా ఊరు అమలాపురం దగ్గరలోని ఒక పల్లెటూరు. అక్కడ అమ్మమ్మ, పిన్ని ఉండేవారు. వారికి తోడుగా అలా పల్లెటూరు లో అడుగు పెట్టిన నా అనుభూతుల పరిమళాలు.
మా అమ్మమ్మగారిల్లు 13గదుల పెంకుటిల్లు. అంత పెద్ద ఇంట్లో ఉంటున్నది ముగ్గురం.ఒక్కో గదికి ఒక్కోపేరు . ప్రతీ గదీ నాదే అన్న హక్కుతో మొత్తం కలియతిరిగి ,అమ్మమ్మ అరుగుమీద కూర్చుని కబుర్లు చెబుతుంటే పక్కనే కూర్చుని పెద్ద ఆరిందాలా వినేదాన్ని. అక్కడ స్కూలు 7వ తరగతి వరకు ఉండేది .స్కూలికి వెళ్ళి వచ్చాక ,సాయంత్రం మా కొబ్బరి తోటల్లో తిరిగి వచ్చేదాన్ని. రాత్రి అంటే భయం .ఎందుకంటే వూళ్ళల్లో ఎక్కువగా కరెంటు తీసేవారు. హరికెన్ లాంతరు పెట్టుకుని అమ్మమ్మ దగ్గరే ఉండేదాన్ని. చీకట్లో ఏ గదిలోకి వెళ్ళాలన్నా భయపడేదాన్ని. స్టోరు రూము అంటే మరీ భయం. పెద్ద పెద్ద భోషాణాలూ అవీ ఉండేవి. పెద్ద పులిలా నేనుండగా భయం దేనికి ,భయం వేసినపుడు ఆంజనేయస్వామి దండకం చదువుకో అనేది. పండగలకి అందరూ వచ్చినపుడు మాత్రము మా ఇల్లు ఒక బృందావనమే. అప్పుడు మనవలు, మనవరాళ్ళను చుట్టూ చేర్చుకుని మా అమ్మమ్మ రకరకాల కధలు ,అష్టోకరపక్షి ,మానుబోకి, పేదరాసిపెద్దమ్మ లాంటి కధలు చాలా చాలా చెప్పేవారు.అదీ బయట ఆకాశం, నక్షత్రాలు చూసుకుంటూ అరుగుమీద అమ్మమ్మతో కూర్చోవడం చాలా ధీమాగా అనిపించేది. అక్కద పండగలొస్తే దేవుడ్ని ఊరేగించేవారు. నేను, పిన్ని పూవులన్ని గుచ్చి పెద్ద పెద్ద దండల్ని ఊరేగింపు ఇంటి ముందుకి రాగానేస్వామి మెడలో వేసి హారతులిచ్చేవాళ్ళం . పూజామందిరం అన్నిటికన్నా నాకిష్టమైనది. నాకు ఇష్టమైన రవ్వలడ్డు చేసి పూజామందిరంలో పెట్టి రోజుకొక్కటి ఇచ్చేవారు.ఇంకోటి అడిగితే దేవుడు రోజు ఒకటి నీకోసం ఇస్తున్నాడు అని మరునాడు మందిరం నుండి ఒక లడ్డు నా చేతిలొ పడేట్లు గా చూపించారు. నా అమాయకత్వానికి ఇప్పటికీ నవ్వు వస్తోంది. నా లేలేత బాల్యాన్ని తీయ తీయగా 4ఏళ్ళు గడిపిన నాకు తీరని విషాదం మా నాన్నగారి మరణం. వెనువెంటనే నెల తిరగకుండా ఆ భాదతో మా అమ్మమ్మగారి మరణం. ఈ విషాదాలతో నేను మరల హైదరాబాదు అమ్మగారింటికి చేరుకున్నాను. నేను అమితంగా ప్రేమించిన ఇద్దరు నాకు నా చిన్నతనంలోనే దూరమయ్యారు. మరల 25 సం:ల తరువాత అంటే 6నెలల క్రితం మా ఊరు మా అక్క,చెల్లెళ్ళు ,మరియు మాపాపతోవెళ్ళి చూసి వచ్చాము. మా ఇల్లు, మాఊరు చాలా మార్పుతో సర్వాంగసుందరంగా ఉన్నాయి. మా ఊర్లో అందరి ఆప్యాయతకి కళ్ళు చెమర్చాయి. అమ్మమ్మని గుర్తుతెచ్చుకుని అందరిని పేరు పేరునా అడిగి ఊరంతా చూపించిమళ్ళి అందరూ రావాలి అంటూఆతిధ్యమిచ్చిన మా ఊరి పెద్దలందరికి నా హృదయ పూర్వక నమస్కృతులు.
Thursday, October 23, 2008 2 comments By: visalakshi

విలువైనదీ, వెలలేనిదీ మధురమైన మాట:

బి.సైదులు గారు రాసిన మాటే మంత్రము నుండి కొన్ని అంశాలు నా మాటల్లో:
మానవ సంబంధాలలో మాటల ప్రభావం మహత్తరమైనది .నాలుగు మంచి మాటలే మధుర ఫలితాలనిస్తాయి. పలికే ప్రతి పలుకూ పరులకు ఆనందాన్ని పంచాలి. మన మనసునూ ఆహ్లాదపరచాలి. ప్రకృతిలో ఏ ప్రాణికీ లేని "పలుకుల" వరాన్ని పరమాత్మ మనిషికే ప్రసాదించాడు. పరుష వాక్కులతో ,మాటల్ని తూటాలుగా ఎదుటి వారి మీద ప్రయోగించకూడదు. శారీరకమైన గాయాల కన్నా ,సున్నితమైన మనసుకయ్యే గాయం కలకాలం బాధిస్తుంది.వ్యాపార వ్యవహారాలకే కాదు. వ్యక్తిగత అనుబంధాలకూసుమధురంగా మాట్లాడటం అత్యంత ఆవశ్యకం .
కోపతాపాలు, కఠోర భాషణలు మనను అందరి నుంచీ దూరం చేస్తాయి. మృదువుగా సంభాషిస్తే ఎదుటివారి మనస్సులో శాశ్వతంగా చోటు సంపాదించుకోగలం. ఆలోచనలు పరిణతిని సాధిస్తున్న కొద్దీ పలుకుల ఒరవడి తగ్గిపోతుంది. వాక్కు విలువ తెలుస్తుంది. అందుకే మేధావులు, జ్ఞానులు వాక్సుద్ధి తెలిసి మితంగా మాట్లాడుతారు. మనసు ఎంత నిర్మలంగా ఉంటే మాటల్లో అంత పవిత్రత తొణికిసలాడుతుంది. మంచి శ్రోతగా ఉంటూ వినటం అలవాటు చేసుకోవాలి. ఎదుటివారి మాటల్ని ఆలకిస్తున్నంత వరకూ మనం న్యాయమూర్తుల స్థానంలో ఉన్నట్లు .ఎప్పుడైతే మనం మాట్లాడటం ప్రారంభిస్తామో ,అపుడు ఎదుటి వారికి మనను అంచనా వేసే అవకాశాన్నిస్తున్నట్టే!
మన మాటల్లో: "నేను" అన్న మాట ఎంత తక్కువ వినియోగిస్తే మన సంభాషణ పరులకు అంత ఆసక్తి కరంగా ఉంటుంది.
"ఎంతటి నిరుపేద ఐనా ఎదుటి వారికి ఇవ్వగలిగిన ఒకే ఒక బహుమతి "మంచిమాట" ".మన సాహచర్యం, సామీప్యం ఇతరులకు మంచి జ్ఞాపకంగా మిగిలిపోవడానికి సౌమ్యమైన సంభాషణను మించిన మార్గం లేదు. ఈరొజుల్లో అలంకరించే పువ్వులనుంచీ ఆహ్లాదపరిచే నవ్వుల వరకూ అన్నీ కృత్రిమమే కావడం దురదృష్టకరం. అలాంటి కపటత్వం నుంచి బయటపడదాం. వెల కట్టలేని విలువైన సరళ సంభాషణను ఆభరణంగా అలంకరించుకుందాం.
Friday, October 17, 2008 10 comments By: visalakshi

సంప్రదాయాన్ని గౌరవించిన జ్యోతిష విద్వన్మణి ; ఖానాదేవి.

అమృత వాహిని లో నాలుగు నెలల క్రితం చదివినప్పటినుండి
ఆలోచింప చేసిన, జరిగిన సంఘటన. భారతావని అందించిన అత్యుత్తమ జ్యోతిశ్శాస్త్రవేత్తల్లో ఒకరు- ఖానాదేవి. మహోన్నత మహిళల గురించి మాట్లాడినపుడల్లా స్వామి వివేకానంద ఆమె పేరును ప్రస్తావించేవారు .జ్యోతిష, ఖగోళ శాస్త్రాల్లో వరాహదేవుడు గొప్ప నిపుణుడు .ఉజ్జయినికి చెందిన విక్రమార్క చక్రవర్తి ఆస్థానంలో నవరత్నాలుగా ప్రసిధ్దికెక్కిన వారిలో ఆయన ఒకరు.
వరాహదేవుడు ,ధరణీ దేవి దంపతులకు మిహిరుడు జన్మించాడు. మిహిరుడు జ్యోతిశ్శాస్త్రంలో గొప్ప విద్వాంసుడిగా పేరుగాంచాడు. శ్రీలంక రాజకుమారి అయిన ఖానాదేవిని అతడు వివాహమాడాడు. ఆమెకి కూడా చిన్నప్పటినుండి జ్యోతిశ్శాస్త్రం పత్ల అపారమైన మక్కువ .పెరిగి పెద్దవుతున్న కొద్దీ జ్యోతిషంలో ఆమె దిట్టగా మారింది.
విక్రమార్క చక్రవర్తి మిహిరుని నైపుణ్యం తెలిసి ఆయనను తన ఆస్థాన జ్యోతిష్యునిగా నియమించాడు. రాజసభలో పలువురు అడిగిన ప్రశ్నలకు మిహిరుడు,వరాహదేవుడు సమాధానాలు ఇచ్చేవారు. కొన్ని క్లిష్టమైన సమస్యలకి వారు ఖానాదేవిని ఆంతరంగికంగా సంప్రదించి ఆపైన రాజసభలో వాటికి బదులిచ్చేవారు .విక్రమాదిత్యుడికి ఈ సంగతి తెలిసింది. ఖానాదేవిని కూడా రాజసభకు తీసుకురావాలనీ ,ఆమె విజ్ఞానం ద్వారా ప్రజలు లభ్ధి పొందే వీలు కల్పించాలనీ ఆయన మిహిరుడ్ని కోరారు.
చక్రవర్తి అభ్యర్ధన విని తండ్రీ, కొదుకులిద్దరూ దిగ్బ్ర్హాంతి చెందారు .కుటుంబ సాంప్రదాయం, గౌరవాల రీత్యా ఆయన అభ్యర్ధనను పాటించలేక ,వారి మాటను తిరస్కరించలేక, చర్చల అనంతరం వారు ఓ ఘోరమైన నిర్ణయం తీసుకున్నారు. మిహిరుడు జరిగిన విషయం ఖానాదేవికి వివరించాడు. ఆమెను నిండు సభకు పంపడం సరి కాదని వాదించాడు. మాట్లాడగలిగితేనే కదా, సభకు పిలిచి మాట్లాడేది .అసలు మాట్లాడడానికి వీలు లేకుండా చేస్తే1 ఈఆలోచనతో తండ్రి ఆదేశం మేరకు మిహిరుడు,ఖానాదేవి నాలుకను కత్తిరించాలని భావించాడు.
ఆమె నిశ్చల చిత్తంతో భర్త దగ్గరకు వెళ్ళి, మామగారు చెప్పినట్టుగా నాలుక కోసివేయాల్సిందిగా పేర్కొంది. మిహిరుడు అలాగే చేయడంతో, ఆమె వీర నాయికగా మరణించింది. పరుల కోసమే జీవిస్తూ, కుటుంబ సంప్రదాయం, గౌరవాలను కాపాడేందుకు జీవితాన్నే త్యాగం చేసిన ఖానాదేవికి భారతీయ మహిళా మణిదీపాలులో స్థానం కల్పించారు, స్వామి వివేకానంద.
ఇప్పుడు ఇది రాస్తూ కూడా ఒళ్ళు గగుర్పొడిచింది. ఇంత ఖఠినంగా ఉండే వారా అని.
Tuesday, October 14, 2008 8 comments By: visalakshi

మనో భావన

నేను గొప్ప ఉపన్యాసకుడిగా ఎదగాలని ఉంది !కానీ మాత్లాడబోతే ఏం చెప్పాలో గుర్తుకు రాదు! అని ఒకరు ఒక స్వామిని ప్రశ్న వేసారు. అలా ఉంది నా పరిస్థితి. నాకున్న ఆలోచనలన్నిటినీ కలబోసి రమ్యంగా వనితలనుగూర్చి బ్లాగులో పొందుపరుద్దామని ప్రారంభిస్తే ఏం రాయాలో అని ఆలోచిస్తున్నా. రాయడం కూడా ఒక కళ. జ్ఞాన తృష్ణ , జ్ఞాన కాంక్ష నేటి మహిళాతరానికి చాలా అవసరం . పుస్తకాలతో సాన్నిహిత్యం పెంచుకోవాలి గొప్ప సాహిత్యాన్ని చదవడం అభిరుచిగా చేసుకోవాలి. ఈరోజుల్లో యువతులు చాలామంది ఉన్నత చదువులు అభ్యసిస్తున్నారు ,కానీ నలుగురిలో ఎలా నడుచుకోవాలో తెలియదు ,జీవితంలో ఎలా మసులుకోవాలో తెలియదు. సాహిత్య పఠనమంటే రుచించదు. మన చదువులన్నీ జీతానికి తప్ప జీవితానికి కాదు. కళాశాలల్లో కూడా సిలబసు పూర్తైందా లేదా . అంతవరకే .పూర్వపు రోజుల్లో అధ్యాపకులు అనుభవజ్ఞులు ,వయసులో పెద్దవారు ఉండే వారు.విద్యతో జ్ఞానాన్ని ఇనుమడింపచేసేవారు. సాహిత్యం అంటే రుచించేలా కధలుగా చెప్పేవారు. నా అనుభవంతో అంటున్న మాటలివి. కేవలం టి.వి. ముందు కూర్చుని కాలాన్ని వృధా చేసుకునేవారు,, సీరియల్స్ చుస్తూ గడిపే స్త్రీలు ,,వీరివల్ల పిల్లలు కూడా అదే అలవాటు పడుతున్నారు .బాల్యం నుండి స్త్రీ తల్లిగా ప్రేమను, గురువుగా వివేకమును,మరియు సాహిత్యాభిలాషను పెంపొందించాలని నా ఆకాంక్ష.
Sunday, September 14, 2008 4 comments By: visalakshi

స్త్రీ స్వాతంత్ర్యం

ప్రస్తుత సమాజంలొ స్త్రీ స్వాతంత్ర్యం గురించి చాలా రచయితలు, సంఘ సంస్కర్తలు చాలా . విధాలుగా చెప్పారు, గాని చలం గారు చెప్పినది అప్పటి కి, ఇప్పటికి, ముందు తరానికి కూడా అదర్శం. వారు రాసిన స్త్రీ పుస్తకంలొ మొదటి మాట ఈ క్రింద విధంగ రాసారు:

” స్త్రీకి కూడా శరీరం ఉంది; దానికి వ్యా యామం యివ్వాలి .ఆమెకి మెదడు ఉంది; దానికి జ్ఞానం యివ్వాలి. ఆమెకి హ్రుదయం ఉంది; దానికి అనుభవం యివ్వాలి- అనే సంగతి గుర్తించని దేశానికి నెను రాసే సంగతులు ర్ధమవుతాయా? ఫ్రాశ్చాత్య నాగరికత వ్యామోహంలొ పడి వొళ్ళు తెలీక నో టికి వఛ్హినట్లు కూసినకూతలు అనుకుంటారు అని తెలుసు, కాని ఇట్లాంటి పుస్థకం నా చిన్నతనంలొ దొరికితే ఇప్పటికన్న ఎన్నొరెట్లు పవిత్రవంతం సార్ధకం చేసుకొగలిగేవాడిని . నా వంటివారు ఈ నూతన యుగంలొ ఉన్నారేమో ! ”

ఈ స్త్రీ పుస్త్టకం రచన కాలం 1925. మ నం ఇప్పుడు 2008 లో ఉన్నాం . అంటే 85 సంవత్సరంలు గడిచినవి. ఈ రొజుకు కూడ స్త్రీ స్వతంత్రపు స్వేచ్హాగాలులు పీల్చడంలేదు , సాధ్యం బహు కోద్ది మందికి అని నా అభిప్రాయం. స్త్రీ పురుషుని కన్న తక్కువ కాదు అనుకొవ డమే , తమను తాము తక్కువచేసుకోవడం పురుషుడు , పురుషుడే , స్త్రీ, స్త్రీయే , ఇద్దరు స్రుష్ఠి ముందు సమానులే. కావలసింది పరస్పర గౌరవం తద్వార సమాజ శ్రేయస్సు.