Saturday, January 30, 2021 0 comments By: visalakshi

శ్రీ భూ వరాహ స్తోత్ర మహిమ..

 శ్రీ భూ వరాహ స్తోత్ర మహిమ*


ఇల్లు కట్టుకోవాలనే కోరిక, ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ అనేక కారణాల చేత సొంత ఇంటి కల కుదరక పోవచ్చు.సొంత ఇల్లు ఒక్కటే కాదు, స్థలాలు,భూములు,ఇళ్ళు కొనాలన్నా, అమ్మాలన్నా అడ్డంకులు తొలగడానికి ప్రతి రోజు పూజలో భాగంగా ఈ స్తోత్రంని కూడా చేర్చుకోని, ఈ స్తోత్రమును రోజూ 9సార్లు మండలం రోజులు పఠించాలి.


#శ్రీ భూ వరాహ స్తోత్రం*


ఋషయ ఊచు |

జితం జితం తేఽజిత యజ్ఞభావనా

త్రయీం తనూం స్వాం పరిధున్వతే నమః |

యద్రోమగర్తేషు నిలిల్యురధ్వరాః

తస్మై నమః కారణసూకరాయ తే || ౧ ||


రూపం తవైతన్నను దుష్కృతాత్మనాం

దుర్దర్శనం దేవ యదధ్వరాత్మకం |

ఛన్దాంసి యస్య త్వచి బర్హిరోమ-

స్స్వాజ్యం దృశి త్వంఘ్రిషు చాతుర్హోత్రమ్ || ౨ ||


స్రుక్తుండ ఆసీత్స్రువ ఈశ నాసయో-

రిడోదరే చమసాః కర్ణరంధ్రే |

ప్రాశిత్రమాస్యే గ్రసనే గ్రహాస్తు తే

యచ్చర్వణంతే భగవన్నగ్నిహోత్రమ్ || ౩ ||


దీక్షానుజన్మోపసదః శిరోధరం

త్వం ప్రాయణీయో దయనీయ దంష్ట్రః |

జిహ్వా ప్రవర్గ్యస్తవ శీర్షకం క్రతోః

సభ్యావసథ్యం చితయోఽసవో హి తే || ౪ ||


సోమస్తు రేతః సవనాన్యవస్థితిః

సంస్థావిభేదాస్తవ దేవ ధాతవః |

సత్రాణి సర్వాణి శరీరసంధి-

స్త్వం సర్వయజ్ఞక్రతురిష్టిబంధనః || ౫ ||


నమో నమస్తేఽఖిలయంత్రదేవతా

ద్రవ్యాయ సర్వక్రతవే క్రియాత్మనే |

వైరాగ్య భక్త్యాత్మజయాఽనుభావిత

జ్ఞానాయ విద్యాగురవే నమొ నమః || ౬ ||


దంష్ట్రాగ్రకోట్యా భగవంస్త్వయా ధృతా

విరాజతే భూధర భూస్సభూధరా |

యథా వనాన్నిస్సరతో దతా ధృతా

మతంగజేంద్రస్య స పత్రపద్మినీ |


త్రయీమయం రూపమిదం చ సౌకరం

భూమండలే నాథ తదా ధృతేన తే |

చకాస్తి శృంగోఢఘనేన భూయసా

కులాచలేంద్రస్య యథైవ విభ్రమః |


సంస్థాపయైనాం జగతాం సతస్థుషాం

లోకాయ పత్నీమసి మాతరం పితా |

విధేమ చాస్యై నమసా సహ త్వయా

యస్యాం స్వతేజోఽగ్నిమివారణావధాః 


కః శ్రద్ధధీతాన్యతమస్తవ ప్రభో

రసాం గతాయా భువ ఉద్విబర్హణం |

న విస్మయోఽసౌ త్వయి విశ్వవిస్మయే

యో మాయయేదం ససృజేఽతి విస్మయమ్ |


విధున్వతా వేదమయం నిజం వపు-

ర్జనస్తపః సత్యనివాసినో వయం |

సటాశిఖోద్ధూత శివాంబుబిందుభి-

ర్విమృజ్యమానా భృశమీశ పావితాః |


స వై బత భ్రష్టమతిస్తవైష తే

యః కర్మణాం పారమపారకర్మణః |

యద్యోగమాయా గుణ యోగ మోహితం

విశ్వం సమస్తం భగవన్ విధేహి శమ్ 


ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే తృతీయస్కంధే శ్రీ వరాహ ప్రాదుర్భావోనామ త్రయోదశోధ్యాయః | సంపూర్ణం.

Saturday, January 23, 2021 0 comments By: visalakshi

శ్రీ కృష్ణ దేవాలయం...



          శ్రీ కృష్ణ అద్భుత వింత దేవాలయం!


మీకు తెలుసా ?  ఈ దేవాలయంలో దేవుడికి ప్రసాదం పెడితే ప్రత్యక్షంగానే ఆయన భుజిస్తారు. సమర్పించిన నైవేద్యం అందరూ చూస్తుండగానే మాయమవుతుంది.


 గ్రహణం సమయంలో కూడా తెరిచి ఉండే ఏకైక కేరళ దేవాలయం తిరువరపు శ్రీకృష్ణ దేవాలయం, కొట్టాయం.


 అర్ధరాత్రి ఏకాంతసేవ తర్వాత కూడా దీపారాధన చేసే ప్రపంచంలోని అరుదైన  హిందూ దేవాలయంగా పిలుస్తారు.


 ఇక్కడి కృష్ణపరమాత్మ మూర్తి చాలా ఆకలితో ఉంటారు. ఇక్కడ అర్చకులు రోజుకు 7 సార్లు స్వామికి మహా నైవేద్యాన్ని సమర్పిస్తారు. సమర్పించిన నైవేద్యం ప్రతిసారి కొంచెం తగ్గుతూ ఉండటం తరుచుగా గమనిస్తుంటారు. స్వామివారు స్వయంగా తింటారు అని ఇక్కడి భక్తుల విశ్వాసం. అదే విధంగా అందరూ చూస్తుండగానే ప్రసాదం మాయమవుతుంది.


 గుడి తెల్లవారుజావున 2 గంటలకు తెరుస్తారు. సాధారణంగా అన్ని దేవాలయాలలో అభిషేకం, అలంకరణ అనంతరం స్వామివారికి నైవేద్యం సమర్పిస్తారు కానీ ఈ దేవాలయంలో నైవేద్యం నివేదన చేసిన తర్వాత అభిషేకం, అలంకరణ చేస్తారు.


 నైవేద్యం సమర్పించడంలో కొంత ఆలస్యమైనా, ఆలయ ప్రధాన ద్వారం తెల్లవారుజామున తెరవకపోయినా చాలా దోషంగా భావిస్తారు. అందుకే ప్రధాన అర్చకుడి చేతిలో గొడ్డలి పట్టుకుంటారు. ఏదేని కారణం చేత తాలం పనిచేయకపోయినా, తాళం పోయినా, గొడ్డలితో తాళాన్ని పగలకొట్టడం ఇక్కడి ఆనవాయితీ.


కృష్ణుడికి చేసే నైవేద్యం చాలా రుచికరంగా ఉంటుంది. స్వామికి నివేదించిన అనంతరం భక్తులందరికీ ప్రసాదం పంచుతారు. ప్రసాదం తీసుకోకుండా ఏ భక్తుడూ ఆకలితో వెళ్ళకూడదని ఇక్కడి నియమం. అందుకే అర్చక స్వాములు “ఇంకా ఎవరైనా ప్రసాదం తీసుకోనివారు ఉన్నారా అని పెద్ధగా అరుస్తారు”.  


 కృష్ణుడికి సమర్పించే నైవేద్యం ఆలస్యమైతే ఆకలికి తట్టుకోలేక కడుపు ఖాళీ అవ్వడం చేత స్వామివారి నడుము చుట్టూ కట్టిన ఆభరణం వదులై కొన్ని ఇంచులు క్రిందకు దిగడం మనం చూడవచ్చు. పూర్వం గ్రహణం సమయంలో ఆలయం మూయడం వలన ఇలాంటి అపసృతి చోటు చేసుకోవడం వలన, ఈ దేవాలయాన్ని గ్రహణం సమయంలోనే కాదు మరెప్పుడూ మూయరు .


గ్రహ దోషాలు, గ్రహణ దోషాలు, సంతాన దోషాలు, సర్పదోషాలు, వ్యాపారాలలో నష్ట దోషాలు, వివాహ దోషాలు, బ్రహ్మహత్య వంటి మహాపాతకాలు ఏమున్నా సరే ఇక్కడికి వచ్చి కృష్ణపరమాత్మను దర్శించి, పూజిస్తే దోషాలు నివారింపబడుతాయి. దేవతలు, నవగ్రహాలు, అష్టదిక్పాలకులు కృష్ణభగవాణుడి సేవకులు కనుక ఇక్కడి కృష్ణభక్తులకు ఎటువంటి జాతక దోషాలు అంటవని స్వామిని భక్తితో కొలుస్తారు.


సైంటిష్టులకు కూడా అంతుచిక్కని ఎన్నో అద్భుతాలు ఈ ఆలయంలో జరిగాయి. భగవంతుడు ఉన్నాడు అని చెప్పడానికి ఇంత కన్నా గొప్ప దేవాలయం ఎక్కడ ఉంటుంది! 


                  *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

Monday, January 18, 2021 0 comments By: visalakshi

మానవజీవితం..

 శరీర విషయంలో జ్ఞాపకం ఉంచుకోవలసిన ముఖ్యవిషయం ఏమిటి ?


వ్యాఖ్యానం : సూక్ష్మంగా

🌺*ప్రతివారి జీవితంలోనూ, బాల్యం, యవ్వనం, వార్ధక్యం - అని 3 స్థితులు ఉంటాయి. ఈ 3 స్థితులను అజ్ఞానంలో ఎలా గడిపేస్తున్నాడో ఇక్కడ తెలియజేస్తున్నారు*. 

*1. బాల్యం*:- బాల్యావస్థ అంతా ఆటపాటలతోను, చదువు సంధ్యల తోను గడిచిపోతుంది. ఈ వయస్సులో జీవితాన్ని గురించిన అవగాహన ఉండదు. ఆటబొమ్మల మీద, చిత్ర విచిత్ర వస్తువుల మీద ఆసక్తి కలిగి ఉంటాడు. అవి కావాలని కోరుకుంటాడు. వాటికోసం మారాం చేస్తాడు. లభిస్తే ఆనందిస్తాడు. లభించకపోతే దుఃఖిస్తూ గోల చేస్తాడు. కర్తవ్యాన్ని గురించి ఆలోచించే అవకాశం ఈ అవస్థలో రానేరాదు. 

*2. యౌవనం*:- బాల్యం గడిచిపోగానే యౌవనం వస్తుంది. ఈ వయస్సులో శరీర సౌష్టవం బాగా ఉంటుంది. యౌవనమంతా శారీరక సంబంధమైన వాంఛలతోను, ధనసంపాదనల గురించి వృత్తి, వ్యాపారం, ఉద్యోగం, వ్యవసాయం మొదలైన ఆలోచనలతోను గడిచిపోతుంది.

*3. వార్ధక్యం*:- యౌవనం గడిచిపోతే క్రమక్రమంగా శరీరంలోని బిగువులన్నీ సడలిపోయి వృద్ధాప్యం వస్తుంది. శరీర అవయవాలలో పటుత్వం తగ్గిపోయి పనిచేసేశక్తి క్షీణిస్తుంది. పనిచేయగలిగినంత కాలం పనిలో నిమగ్నమైపోతాడు. అనేక విషయాలలో తల దూర్చుతాడు. తన చుట్టూ పెద్ద లంపటాన్ని చేర్చుకుంటాడు. ఇక వృద్ధాప్యంలో దానిని గురించిన ఆలోచనలు - చింతలు. 

🌺ఇలా వృద్ధాప్యం గడిచిపోతుంది. ఆ తర్వాత ఎప్పుడో ఒక్కప్పుడు అన్ని బంధాలు తెంచుకొని, దేహంతో సహా అన్నింటిని, అందరిని వదలి అవ్యక్తంలోకి వెళ్ళిపోవటమే. 

🌺జీవితమంతా ఇలా గడచిపోతుంటే ఇక జీవిత పరమార్థమైన మోక్షాన్ని అందుకోవటానికి కృషి చేసేదెప్పుడు? పరమాత్మను చేరుకొనేదెప్పుడు? అన్నీ లౌకికవిషయాలే అయితే పారమార్థిక విషయాలకు చోటెక్కడ? మనిషిగా పుట్టినందుకు, భగవంతుడు వివేకాన్ని ఇచ్చినందుకు వాటిని ఉపయోగించుకొని సాధించవలసినది ఇదేనా? కానేకాదు*. 

🌺పరమాత్మవైపుకు బుద్ధిని మళ్ళించి - ఆయనపై ప్రేమానురాగాలు చూపించి, ఆయనకు సంబంధించిన సత్కర్మలు చేస్తూ, ఆయనను గురించి ఆలోచనలు చేస్తూ, ఆయనను స్మరిస్తూ, ఆయనను అందుకోవటమే మానవ జీవిత పరమార్థం. అందుకే మనకు మానవ జన్మ లభించింది. పరమాత్మను అందుకుంటున్నాం అంటే దుఃఖాలతో, బాధలతో కూడిన ఈ సంసార జనన మరణ చక్రం నుండి తప్పించుకొని మనను మనం ఉద్ధరించుకొంటున్నామన్న మాట. క్షణికమైన లాభనష్టాలు, సుఖదుఃఖాల నుండి విముక్తి చెంది శాశ్వత పరిపూర్ణ ఆనందాన్ని అందుకొంటున్నామన్న మాట. 

🌺కనుక జీవితమంతా ఆటపాటలతోను, కామవాంఛలతోను, చింతలతోను గడిపి, జీవితాన్ని వ్యర్థం చేస్తుకోవటం గాక సచ్చిదానంద స్వరూపమైన పరమాత్మవైపుకు అడుగు వేయాలి. అదీ బాల్యంలోనే వేస్తే మహా అదృష్టం. అలాగాక పోతే యౌవనంలోనన్నా వేయాలి. కనీసం వృద్ధాప్యంలో కూడా భగవంతునివైపు తిరగలేకపోతే ఈ మానవజీవితాన్ని వ్యర్థం చేసుకున్నట్లే. 

ఓం శ్రీ సాయి నాథాయ నమో నమః..
    
Saturday, January 2, 2021 0 comments By: visalakshi

భగవంతుని పాదపూజ..

 

               #శ్రీ షిర్డీ సాయినాథ చరణం శరణం..*

భగవానుడొక్కడే పాదపూజకు అర్హుడు. ఆయన సృష్టికర్త, అనంతుడు. ఆయన చరణాలు శ్రీచరణాలు. అహంకారాన్ని, ఆభిజాత్యాన్ని వదిలిపెట్టి చేసే పాదసేవ సంపూర్ణ శరణాగతికి నిదర్శనం. మనసులోని సకల కల్మష భావాలను ఆవల పెట్టి చేసే సేవే పాదసేవనం.

అనంతుడి పాదపీఠమే భూమి. హరిపాదం సోకని తావుండదు. ఆయన సర్వవ్యాపకుడు. విశ్వం మొత్తాన్ని ప్రకాశింపజేసే చైతన్యరూపం ఆయనది. బ్రహ్మాండ గోళాలన్నింటినీ కొలిచిన పాదం. ఒక పాదంతో భూమిని, మరొకపాదంతో ఆకాశాన్ని ఆక్రమించి తన విరాట్‌ స్వరూపాన్ని ప్రదర్శించాడు. అహంకారంతో తుళ్ళిపడే జీవులను సంస్కరించిన పాదమది. పావనగంగ ఆ పాదాలనుంచే ఉద్భవించింది. అందుకే భక్తి జగత్తులో, మనసును పుష్పంలా మలచి ఆ పాదాలకు సమర్పించాలి. మనోవాక్కాయ కర్మలు ఏకీకృతమై, శుద్ధత్వంతో ఆ పాదాలను ఆశ్రయించాలి. భగవానుడికి సమర్పించే అధాంగపూజలో ప్రథమంగా పాదౌ పూజయామి అంటారు.

హిరణ్యకశిపుణ్ని తన నరసింహాకృతితో వధించిన పిదప, ఉగ్రరూపంలో సింహాసనాన్ని అధిష్ఠించిన శ్రీహరిని ప్రహ్లాదుడు నీ పాదాశ్రయుడిగా చేయమంటూ ప్రార్థిస్తాడు. అంతకన్నా సామ్రాజ్య వైభవాలు వద్దంటాడు.

శ్రీరామచంద్రుడి పాదుకలను తలపై ధరిస్తాడు భరతుడు. తల ఉన్నతమైన స్థానం. అది బ్రహ్మరంధ్రం ఉండే చోటు. సహస్రారకమలం నెలవై ఉండే చోటు. శ్రీరామచంద్రుడి పాదుకలను సింహాసనంపై ఉంచి శ్రీరామచంద్రుడి పేరిట రాజ్యపాలన చేస్తాడు. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు కాళియుడి పడగలపై నాట్యం చేస్తాడు. ఆయన పాదముద్రలే నాగజాతికి అలంకారాలయ్యాయి.

శ్రీకృష్ణుడు గోవులతో గోపబాలురతో యమునాతీరంలో బృందావనంలో విహరిస్తుండగా గోవులను, గోప బాలురను మాయం చేస్తాడా విధాత. సృష్టికి ప్రతిసృష్టి చేస్తాడు శ్రీకృష్ణుడు. మనసును కమ్మిన మాయ, అహంకారం తొలగుతాయి విధాతకు. శ్రీకృష్ణుడి అవతార వైభవానికి తన్మయుడైన విధాత ‘స్వామీ! ఆ బ్రహ్మపథం ఎందుకు! నీతో కలిసి ఆడిపాడే గోపబాలుర పాదరేణువు నా తలపై ధరించినా నాకది చాలు’నంటాడు. మధురానగరంలో మాలాకారుడైన సుదాముణ్ని అనుగ్రహించి వరం కోరుకొమ్మని అంటాడు శ్రీకృష్ణుడు. నీ పాదకమల సేవ నీ పాదార్చకులతోడి స్నేహం అనుగ్రహించమని అడుగుతాడు సుదాముడు.

ఆదిశంకరుల అద్భుత రచనల్లో దేవీదేవతల పాదాల వైభవాన్ని వర్ణించారు.

సర్వ భయాలను పోగొట్టి సుఖాలనిచ్చే సదాశివుడి పాదపద్మాలను ఆశ్రయించాలని శివానందలహరిలో ప్రబోధిస్తారు. అరిషడ్వర్గాలను తొలగించి ముక్తిపథాన్ని చూపేది ఒక్క గురుపాదాలేనని, తన గురుపాదుకాస్తోత్రం ద్వారా తెలియజేశారు.

వివాహ వేడుకలో వరపూజ ముఖ్యమైన ఘట్టం. కన్యాదాత వరుణ్ని లక్ష్మీనారాయణ స్వరూపుడిగా భావించి, సుగంధ పూజాద్రవ్యాలతో కూడిన జలంతో పాదప్రక్షాళన చేస్తారు. అలాగే తల్లిదండ్రులను దైవస్వరూపులుగా భావించి, పాదపూజ జరుపుతుంది సంతానం. పాదప్రక్షాళన చేసిన జలాన్ని తమ శిరస్సులపై చిలకరించుకొని ధన్యత చెందినట్లుగా భావిస్తారు.

వినమ్రతకు, మనసులో మెదిలే భక్తి భావనకు నిదర్శనాలు ఇవన్నీ. ఆధ్యాత్మిక సాధనాజగత్తులో పాదసేవ గొప్ప సంస్కారవంతమైనది. భగవానుడి అవతారమూర్తుల చరణాలపైన నిలిచే దృష్టి, ఆ రూప వైభవాన్ని, తత్వాన్ని కాలగమనంలో గ్రహించగలుగుతుంది.

ఆ పాదాలకు-మనసుకు బంధం ఏర్పడాలి. ఆ బంధం మానవుణ్ని మాధవత్వం వైపు నడుపుతుంది.

                 శ్రీ సాయి చరణారవిందార్పితం..



#శాంతాకారం - శ్లోకంలోని అద్భుత భావన*


శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం

విశ్వాధా(కా)రం గగన సదృశం, మేఘవర్ణం శుభాంగం!

లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం

వందే విష్ణుం భవభయహరం సర్వ లోకైక నాథం!!


ఇందులో సృష్టిక్రమం..

సృష్టిని పాలించే ఈశ్వర స్వరూపం..

ఒక చక్కని క్రమపద్ధతిలో నిబద్ధించారు.


#శాంతాకారం

సృష్టికి పూర్వం ఈ జగమంతా శాంత స్థితిలో ఉన్నది.

శాంతం, శమనం – అంటే అన్నీ లయించిన స్థితి.

అనేకంగా ఉన్న వృక్షం, బీజంలో లీనమయినట్లుగా, సర్వ జగతి, పరమాత్మయందే లీనమై ఉన్న స్థితి – శాంతి.

ఏ వికారమూ లేని పరిపూర్ణత్వాన్ని కూడా, ఈ శబ్దం తెలియజేస్తోంది.

శాంతమే తన స్వరూపంగా కలిగిన పరమాత్మ.


#భుజగ శయనం

భుజగశయనుడు..అనంత కాలతత్త్వమే అనంతుడు – ఆదిశేషువు – భుజగము.

ఈ కాలానికి ఆవల కాలాన్ని అధిష్ఠించిన ఈశ్వరుడే భుజగశయనుడు.

కాలానికి లొంగి ఉన్నవి లోకాలు.

కాలాతీతుడు, కాలం ద్వారా జగతిని శాసించే భగవానుడు కాలభుజగశయనుడు.


#పద్మనాభం

సృష్టికి తగిన కాలాన్ని అధిష్ఠించిన నారాయణుని సంకల్పం మేరకు, సృష్టి బీజాల సమాహార రూపమైన పద్మం, ఆయన నాభీ కమలం నుండి ఆవిర్భవించింది.

సృష్టిగా విచ్చుకుంటున్న బీజ స్వరూపమే పద్మం.

దానికి నాభి (కేంద్రం) విష్ణువే.

అందుకే ఆయన ‘పద్మనాభుడు’.


#సురేశం

విశ్వపు తొలిరూపమైన ఆ పద్మమందు,

విష్ణు శక్తియే సృష్టికర్తగా, బ్రహ్మగా వ్యక్తమయింది.

నలువైపులా దృష్టిని ప్రసరించి తన నుండి జగన్నియామక శక్తులైన వివిధ దేవతలను వ్యక్తీకరించాడు బ్రహ్మ.

జగతికి మేలు(సు)కలిగించే వారే సురలు

(సు- అంటే మేలు, ‘రాతి’ అంటే కలిగించు వాడు. సుం-రాతి – మేలును కలిగించువారు సురలు).

ఈ దేవతా శక్తులతో విశ్వమంతా నిర్మితమయింది. నిజానికి దేవతా శక్తులు స్వతంత్రులు కాదు.

ఆ శక్తులన్నీ ఆదిమూలమైన వాసుదేవుని కిరణాలే.

అందుకే ఆ సురలందరికీ తానే నియామకుడై ‘సురేశు’డయ్యాడు.


#విశ్వాధారం

కనిపిస్తున్న విశ్వాన్ని నియమించే సూక్ష్మ శక్తులు ‘సురలు’. వారితో పాటు విశ్వానికి సైతం ఆధారమై ఉన్న చైతన్యం ఆ వాసుదేవుడు.

సమస్తమునకు ఆధారమై ఉన్నందున అతడే ‘విశ్వాధారుడు’.

కనిపించే జగమంతా ఆయన చైతన్యంతో నిండి ఉన్నందున ఆతడే ‘విశ్వాకారుడు’ కూడా.

నదిలో అలలన్నిటికీ జలమే ‘ఆధారం’.

అలల ‘ఆకారం’  అంతా జలమే.

జలం అలలకు ఆధారమై, ఆకారమై ఉన్నట్లే..

విశ్వాధారుడై విశ్వాకారుడై పరమాత్మయే ఉన్నాడు.


#గగన సదృశం

ఇది ఎలా సంభవం?

ఆకాశంలో వ్యక్తమయ్యే సమస్తము నందూ, ఆకాశమే ఉన్నది.

సమస్తమూ ఆకాశము నందే ఉన్నది.

అదేవిధంగా ఆకాశంతో సహా,

సమస్త విశ్వమూ ఎవరియందు,

ఎవరిచే వ్యాప్తమై ఉందో,

అతడే పరమాత్మ.

అందుకే ఆయన ‘గగనసదృశుడు’(గగనం వంటివాడు).

ఇదే భావాన్ని ‘ఆకాశాత్ సర్వగతః సుసూక్ష్మః’ అంటూ ఉపనిషత్తు ప్రకటిస్తోంది.

ఇది నిరాకారుడైన పరమేశ్వరుని తెలియజేస్తోంది.


#మేఘవర్ణం

నిరాకారుడై సర్వవ్యాపకుడైన ఆ పరమాత్మయే..

తన లీలా శక్తితో భక్తులను అనుగ్రహించడానికై దివ్యమంగళ విగ్రహుడై సాకారుడయ్యాడు.

ఆ సాకారం ‘మేఘవర్ణం’ (మబ్బువన్నె)గా ఉన్నది.


#శుభాంగం

మేఘం నీటితో నిండి తాపాన్నీ, దాహాన్నీ పోగొడుతుంది. అదేవిధంగా కరుణారసంతో నిండిన విష్ణు మేఘం, సంసార తాపత్రయాల్ని పోగొట్టి, జ్ఞానదాహాన్ని తీర్చుతున్నది.

అందుకే అది నీలమేఘశ్యామం.

ఆ శ్యామల వర్ణ దేహంలో ప్రత్యంగమూ శుభమే. ప్రాపంచిక దేహాలు ప్రకృతి దోషాలతో కూడి ఉంటాయి కనుక అవి అశుభ రూపాలే.

కానీ స్వామి దాల్చిన విగ్రహంలో అవయవాలు శుభ స్వరూపాలు.

తలచే వారికి శుభాలు కలిగించే స్వభావంతో దివ్యమంగళ స్వరూపంగా భాసిస్తున్నాడు భగవానుడు.

అందుకే ఆయన రూపం ‘శుభాంగం’.


#లక్ష్మీ_కాంతం

ప్రపంచాన్ని పోషించే ఐశ్వర్యాలన్నీ ఆయనను ఆశ్రయించుకున్నాయి.

ఐశ్వర్యాల అధిదేవత లక్ష్మి ఆయననే చేరి,

ఆయన సంకల్పానుగుణంగా ప్రవర్తిస్తున్నది.

అందుకే ఆ శుభ స్వరూపం ‘లక్ష్మీకాంతం’.


#కమల_నయనం

ఐశ్వర్య దేవతకు ప్రీతికరం.

కమలముల వలె విచ్చుకున్న సూర్యచంద్ర కాంతులతో జగతిని గమనిస్తున్న కరుణామయ దృష్టి కల భగవానుడు ‘కమలనయనుడు’.


#యోగిహృద్యానగమ్యం

ఇటువంటి విష్ణుతత్త్వం, స్వరూపం అందరూ అందుకోలేరు.

యోగులు మాత్రమే ఏకాగ్రమైన దృష్టితో ధ్యానం ద్వారా తమ హృదయాలలో దర్శించగలుగుతున్నారు.

ఆ కారణం చేతనే అతడు ‘యోగిహృత్ ధ్యానగమ్యుడు’.


#వందే విష్ణుం  భవ భయహరం

విశ్వమంతా వ్యాపించిన పరమేశ్వరుడు కనుక ‘విష్ణువు’.

ఈ తత్త్వాన్ని గ్రహించి, శుభాంగాన్ని ధ్యానించే వానికి ఈ సంసారంలో భయాలు తొలగి, అవిద్య నశిస్తున్నది. అందుకే ఆ స్వామి ‘భవభయహరుడు’.


#సర్వలోకైకనాథమ్

సర్వలోకములకు ప్రధానమైన నాథుడు అతడే ‘సర్వలోకైకనాథమ్’.


14నామాలతో ‘విశ్వానికీ – విష్ణువునకు’ ఉన్న అభిన్న సంబంధాన్ని, ఈ శ్లోకం స్పష్టపరుస్తోంది.


ఒకే శ్లోకంలో, విశ్వానికి పూర్వ స్థితి నుండి సృష్టి స్థితులను కూడా నిర్వహిస్తున్న భగవత్తత్త్వాన్ని స్పష్టపరచడం, ఆర్ష దృష్టి వైభవం.


ఇంత స్పష్టంగా పరమేశ్వరుని గొప్పతనాన్ని,

ఆయనలోని సాకార నిరాకార తత్వాలను తెలియజేస్తూ యోగపూర్వక ధ్యానం ద్వారా,

మన హృదయాలలోనే ఆయనను దర్శించగలమనే, సాధనా రహస్యాన్ని కూడా, ఈ శ్లోకం అందిస్తోంది.


                 సర్వం శ్రీ పరమేశ్వరార్పణ మస్తు....