Saturday, April 18, 2015 0 comments By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామాయి షిర్డీసాయి సేవా సత్సంగం - 76

 ఓం శ్రీ వేంకటేశ రమణాయ నమ:

 శ్లో" అనంతకోటి జన్మానాం బిజభూతం సత్ యత్ కర్మజాతం!

      తిష్తతి తత్ సంచితం జ్ఞేయం!!

 సంచిత కర్మ అంటే ....The collection of invisible karma phalam that  is acquired during many many previous births is known as 
   sanchita.

  సంచిత కర్మ  ఎలా నశిస్తుంది అంటే...
శ్లో" సంచితం కర్మ బ్రహ్మైవహం !
   ఇతి నిశ్చయాత్మిక జ్ఞానేన నష్యతి!!
Sanchita karma exhausted by the sheer knowledge that I am the same as the ultimate consciousness swaroopa athma.

 "ఒక లోభి సాయిబాబాను బ్రహ్మజ్ఞానం గురించి అడిగినప్పుడు సాయిభగవానుడు దాన్ని అతని జేబులోనించే తీసిచ్చారు." 

ఇంద్రియాలు దుర్భలమయ్యాక, జగత్తులోఎవరూ గౌరవించకపోయినప్పుడు వూరికే పనిలేకుండా కూచుని, కాలక్షేపంకోసం బ్రహ్మను తెలుసుకోవాలని ఆ లోభి ప్రయత్నం ...ఈ లోభి కధ ద్వారా సంచిత పాప కర్మ ఫలమును,అది నశించు విధమును సాయి తత్వభోద ద్వారా తెలుసుకుందాము. 

ఒక లోభి అయిన ధనవంతుడు సత్వర బ్రహ్మజ్ఞానమును ప్రసాదించమని అందుకే షిర్డీకి వచ్చానని బాబా పాదాలకు నమస్కరించి.. నాకు బ్రహ్మ లభిస్తే కృతకృత్యుడినౌతాను అని బాబాతో విన్నవించుకున్నాడు.
 బాబా ఇలా అన్నారు."చింతపడకు బ్రహ్మను వెంటనే చూపిస్తాను.అసలు నీలాగ బ్రహ్మను ఎవరూ అడగరు. నా వద్దకు వచ్చేవారు ధనమో,రాజ్యపదవి,కష్టనివారణ,రోగనివృత్తి,సుఖాన్నికోరుతారు.
నీలాంటివాళ్ళు దొరకరు.బ్రహ్మజిజ్ఞాసువుల కోసం నేను ఆకలిగొని ఉన్నాను.అలాంటి నాకు పర్వకాలం వచ్చింది."అని బాబా ఆ బ్రహ్మార్ధిని కూచోబెట్టి ..ఒక పిల్లవాణ్ణి పిలిచి అతనితో,వెంటనే వెళ్ళి బాబాకి అవసరం పడింది అని నందూ మార్వాడితోచెప్పి ఓ అయిదు రూపాయలు తీసుకురా! అన్నారు. పిల్లవాడు నందూ ఇంటికి వెళ్ళాడు. అతని తలుపు తాళం పెట్టి ఉంది.వెనక్కొచ్చి బాబాగారికీసంగతి చెప్పాడు. బాబా ఇలా అన్నారు,"మళ్ళీ వెళ్ళు.బాళా వ్యాపారి ఇంటికెళ్ళి డబ్బు తే" అన్నారు.అతను కూడా ఇంట్లో లేడని పిల్లవాడు తిరిగొచ్చి చెప్పాడు.తిరిగి,తిరిగి అలసిపోయినా ఆ పిల్లవాడికి చిల్లుగవ్వ కూడా దొరకలేదు. ఇది అంతయు బాబాలీల. ఆయనకు తెలుసు.ఆ వ్యాపారులు ఇం ట్లో లేరని. సర్వజ్ఞులైన సాయి నడుస్తూ మాట్లాడే దైవం. వారి పని 5 రూ"ల కోసం ఆగిపోతుందా? కానీ ఆ బ్రహ్మార్ధి కోసం ఈ చమత్కారం చూపారు.ఆ బ్రహ్మార్ధి జేబులో అప్పుడు రెండువందల యాభై రూపాయలున్నాయి.అది సాయినాధులకు తెలుసు. బ్రహ్మార్ధి జేబులో నోట్లకట్ట ఉండి కూడా ఇవ్వాలా,వద్దా? అవి తిరిగి తనవద్దకు వస్తాయా లేదా? అన్న సంధిగ్ధావస్థలో పడిపోయాడు.బాబాగారికి ఐదు రూపాయలు అప్పుగాకొద్దిసేపు ఇవ్వగల ధైర్యం అతనికి లేకపోయింది.బ్రహ్మసాక్షాత్కారం అడగటానికొచ్చాడు.అతను ధనమోహంలో చిక్కుకొన్నాడు. తిరిగి వెళ్ళిపోయే ఆతృతలో బాబాతో "బ్రహ్మని చూపండి" అన్నాడు.
బాబా ఇలా అన్నారు.."కూచున్నచోటునే బ్రహ్మను చూపించాలని ఇప్పటివరకు ప్రయత్నించాను. అది నీకు తెలీటం లేదా? బ్రహ్మకోసం పంచప్రాణాలు,పంచజ్ఞానేంద్రియాలు,పంచకర్మేంద్రియాలు,అహంకారం,బుద్ధీ,మనసు ఇవన్నీ సమర్పించవలసి వుంటుంది.దురాశా లోభభూయిష్టుడైన నువ్వు ముందు ఆ రెండింటినీ (దురాశ,లోభం) వదులుకో. ఎవరి మనస్సైతే ధనధారాపుత్రేషణత్రయంలో తగులుకోనివ్వకుండా తాను బద్ధుడనని గ్రహించి,తద్విముక్తిని మాత్రమే ఆశించి, బాహ్యాన్ని విస్మరించి తన లోపలి ఆత్మను చూడగలుగుతాడో వాడికే బ్రహ్మజ్ఞానం లభిస్తుంది. అంతర్ముఖానుభవం నుంచే ఆత్మవిద్య అలవడుతుంది.
 'సత్యం,తపస్సు,ధ్యానం,బ్రహ్మచర్యం అనే నాలుగింటి సంయోగాన్ని పాటించనిదే త్యాగి కాలేడు.త్యాగి కాలేనివాడు యోగి కాలేడు.యోగి కాని వాడికి సమదృష్టి కలగదు. సమదృష్టి లేని వాడికి ఆత్మసాక్షాత్కారం కలగదు."అన్న సాయిబాబావారి బోధలో పరిపూర్ణజ్ఞానం అవగాహన చేసుకుంటే సంచిత కర్మలు నశిస్తాయి.  

   ఇలా  ..పెద్ద పెద్ద ఆధ్యాత్మిక ఉపన్యాసాలు,ప్రవచనాలు చేయకుండా ఉపదేశించిన సద్గురువు "శ్రీ సాయిబాబా". అందుకే అందరికీ ఉపాసన దైవమైనారు.


సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు