Saturday, July 18, 2026 0 comments By: visalakshi

సర్వ పరిపూర్ణుడు..



 

దక్షిణామూర్తి స్వయంగా వచ్చాడు. మనం గురువునందు ఆయనను భావించాలి. ఆయనే గురువై వస్తే ఎంత విశేషం! అందుకు ఆయన “ముద్రాం భద్రార్థ ధాత్రీం”- ఆ ముద్ర భద్రమైన అర్థాన్ని చెప్తుంది.


"ముద్రాం భద్రార్థ ధాత్రీం"అనేది శ్రీ దక్షిణామూర్తి స్తోత్రంలోని ప్రసిద్ధ శ్లోక పాదం.

మంగళకరమైనది, ఆత్మజ్ఞానం లేదా పరమ సత్యాన్ని అనుగ్రహించేది అయిన చిన్ముద్రను ధరించినవాడు అని భావం.

సాధారణంగా ఈ పదం దక్షిణామూర్తి స్వామి యొక్క దివ్య హస్తాన్ని వర్ణించడానికి ఆయన శిష్యులకు మౌనంగానే ఆత్మజ్ఞానాన్ని అందించే చిన్ముద్ర విశిష్టతను తెలపడానికి ఉపయోగిస్తారు.

భద్రమైన అర్థం అంటే భద్రం ఏది? కైవల్యమే భద్రం. ఆత్మయే భద్రం. దేహానికీ, ప్రాణానికీ, బుద్ధికీ భద్రం లేదు. నీలో భద్రంగా ఉన్నది నీ ఆత్మ. ఆ ఆత్మని అందించీ, ఆత్మని ప్రయోజనంగా చూపించే ఆత్మని అర్థంగా అందించే ముద్ర అది. అందుకే ముద్రాం భద్రార్థ ధాత్రీం అన్నారు.

అందుకే శంకరులు ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్తోత్రం చివరిలోకి వెళ్ళేటప్పటికి “యో ముద్రయా భద్రయా” అన్నారు. భద్రమైన ముద్రతో అని అదే మాట అక్కడ వేశారు మహానుభావుడు. కనుక ఆ ముద్రకి అంత ఉన్నదండీ. కరకలిత చిన్ముద్ర మానంద రూపం. ఇదొక విశేషం.


అంతేకాదు మొత్తం పరమేశ్వరునియొక్క లక్షణం అంత కూడా ఐదువేళ్ళల్లోనే ఉందిట. ఈ అయిదు వేళ్ళు ఏమిటి? చెప్తున్నాడు. ఈ జగత్తులో మనం చూసేది ముందు నామం, రూపం. వీటి వెనకాల ఉండే అస్తి, భాతి, ప్రియం అనేవి ప్రధానములు. బ్రహ్మ లక్షణం అది. అస్తిభాతిప్రియములు బ్రహ్మవి.


నామరూపం జగత్తు. జగత్తువి అంటే జగత్తు నుండి ఆయన వేరుగా ఉన్నాడా? అది మళ్ళీ వేరే విషయం. జగత్తుకు వేరుగా లేడు. నామరూపములతో భాసిస్తూ ఉన్న జగత్తుయందు లీనమైయున్నాడు. కానీ ఆయనకి నామం, రూపం, లేవు.


నామరూపాత్మకమైన జగత్తును చూస్తున్నాం కానీ జగత్తుకు ఆధారమైన అస్తి,భాతి, ప్రియం అంటే ఉనికియైన వాడు, ప్రకాశస్వరూపుడు, ఇష్టమైన వాడు అంటే ఆనందస్వరూపుడు. ఇష్టం అంటే మరేంటో కాదండీ ఆనందమే ఇష్టం. సృష్టిలో ఏది ఇష్టం అంటే నాకు ఆ తిండి ఇష్టం, ఆ బట్ట ఇష్టం అంటే అది ఎందుకు ఇష్టం దానివల్ల నీకు ఆనందం కలుగుతోంది కనుక ఇష్టం కదా! మనకు వస్తువు ఇష్టం కాదు. ఆనందం ఇష్టం. కనుక ఇష్టమైనది ఏమిటి? ఆనందం.


అస్తి, భాతి, ప్రియం అంటే సత్తు, చిత్తు, ఆనందం. ఇది ఎప్పుడూ మారదు. మారేవేమిటి? నామం రూపం. మారుతున్నాయా లేదా? మొన్న మన పేరు ఫలానా, ఇప్పుడు నిజానికి మారదు. కానీ అప్పుడు కుర్రాడా అని పిలిచారు, ఇప్పుడు ముసలోడా అని పిలుస్తున్నారు. మారిందా లేదా? కనుక నామం రూపం మారుతూ ఉంటాయి వ్యవహారంలో. ఈ దేహంతో రామయ్య అయితే మరొక దేహంతో పుల్లయ్య. లేకపోతే పుల్లమ్మ. ఇవీ మారిపోతున్నాయి. కనుక నామం రూపం మారుతున్నాయి కానీ మారకుండా ఉండేవి అస్తి భాతి ప్రియములు.


అది నువ్వు ఎప్పుడు చూస్తావు? నువ్వు నామ రూప దృష్టిని ఉపసంహరించి తదంతర్గతమైన ఆధార చైతన్యాన్ని ధరిస్తే మనం ఇటునుంచి లెక్కపెట్టడం జీవుడి లక్షణం. అటు నుంచి చూడడం ఈశ్వర దృష్టి. అందుకు మనం అటు నుంచి చూడాలి. (చిటికెన వేలునుంచి లెక్కిస్తే) అస్తి, భాతి, ప్రియం, నామం, రూపం - (బొటన, చూపుడు). నీకు లక్ష్యం ఏమిటి? - అస్తిభాతిప్రియములు. అందుకు ఏం చేయాలి అంటే నామరూపములను ఉపసంహరించి అస్తిభాతిప్రియములను(చిటికెన, ఉంగరంవేలు, మధ్య వేలు) చూడు. ఇదీ ఆంతర్యం. ఒక్క చేతిలో ఎన్ని చెప్తున్నాడండీ.


అన్నీ వాళ్లకి స్ఫురించాయి. వాళ్లకి స్ఫురించాయి అంటే అర్థం స్ఫురింప జేసే స్ఫురణశక్తియైన చైతన్యమే ఎదురుగా రూపం ధరించి అనుగ్రహంతో కూర్చుంది గనుక ఆ చేతినుండి అన్ని వెళ్ళాయి


వాళ్లకి, వెళ్ళి ఆ జీవబ్రహ్మైక్య అనుభవాన్ని పొందారు. ఇన్ని అర్థములున్నాయి ఆ ఒక్క హస్తంలో. అందుకే ‘ముద్రాం భద్రార్థ ధాత్రీం కరకలిత చిన్ముద్ర మానంద రూపం’. స్వాత్మారామం-తనయందు తాను ఆనందించువాడు, అది ఆయన స్వభావం. స్వాత్మా రాముడు – తనయందు తను రమించువాడు అంటే ఆనందించు వాడు, క్రీడించువాడు. జగతి అవసరం లేదు. పరిపూర్ణుడికి దేని అవసరం కావాలి? కడవలో నీళ్ళుపోస్తాం అది నిండేవరకు. నిండిపోయాకకూడా పోస్తే ఇమడదు, ప్రయోజనం కూడా లేదు. పరిపూర్ణుడికేం కావాలి? అందుకు సర్వ పరిపూర్ణుడాయన.


"సర్వపరిపూర్ణునకు వెలి ఏడ? లోనేడ?" అంటారు అన్నమాచార్యులు. సర్వమూ తానైన పరిపూర్ణునికి వెలుపల, లోపల ఏమున్నది? అంతా తానైనప్పుడు ఎవరికండీ ఆనందంకోసం ఆరాటం ఉంటుంది? తన లోపల లేదు అనుకుంటే బయట నుంచి కావాలి అనుకుంటే తాపత్రయాలన్నీ ఉన్నాయి.


కొలత, కొరత ఎవరికి ఉంటుందో వాడు ఆనందం కోసం వెంపర్లాడతాడు. కానీ కొలత లేని వాడు, కొరత లేని వాడు పరిపూర్ణుడైనటువంటి అప్రమేయుడు గనుక స్వాత్మారామం. ముదిత వదనం-అంత ఆనందం స్వభావమే కాదు రూపం స్వీకరించినప్పుడు కూడా ప్రతి అణువు ఆయనలో ఆనందాన్ని ప్రకటీకరిస్తోంది. అందులో ముఖ్యంగా ముఖం భావస్థానం కనుక పైగా రుద్రయత్తే దక్షిణం ముఖం అన్నాం గనుక ఆ ముఖంలో ఏం కనిపిస్తోంది ‘ముదిత వదనం ఆనందమయమైనటువంటి వదనం. అటువంటి దక్షిణామూర్తి మీడే!!


"వటవిటపి సమీపే భూమిభాగే నిషణ్ణం

సకలముని జనానాం జ్ఞానదాతార మారాత్

త్రిభువన గురుమీశం దక్షిణామూర్తి దేవం

జనన మరణ దుఃఖచ్ఛేద దక్షం నమామి!!"


ఇక్కడ దక్షిణామూర్తి శబ్డంలో దక్షిణ అనే శబ్దానికి నిర్వచనం ఇస్తున్నారు గురువుగారు. దక్షిణ అనగా సమర్థత. ఏ సమర్థత? - జనన మరణ దుఃఖాన్ని సమూలంగా ఛేదింపడమనే దక్షత. అది ఎవ్వడి దగ్గరా లేదు. అది దక్షిణామూర్తి ఒక్కరి దగ్గరే ఉన్నది. ఆయన తప్ప ఏ ఒక్కరూ మోక్షాన్ని ఇవ్వలేరు. ఆ మోక్షం ఆయనే ఇవ్వాలి. జనన మరణ దుఃఖచ్ఛేద దక్షతే దక్షిణ - అందుకోసమే ఈమూర్తి ధరించాడు కనుక


దక్షిణామూర్తి. చిత్రం-ఎంత ఆశ్చర్యం! మొట్టమొదట ఆశ్చర్యం. ఆశ్చర్యమే పరమాత్మ. "చిత్రం వట తరోర్మూలే వృద్ధాః శిష్యాః గురుర్యువా – ఎంత గొప్పగా మాట్లాడారండి ఇక్కడ. వట తరోర్మూలే – వటతరువుట ఇక్కడ. చాలా ఆంతర్యం కనిపిస్తుంది ఇక్కడ.


వట తరువు అంటే విస్తరించుకుపోతే వట తరువు. మన బ్రతుకే పెద్ద వటవృక్షం. బ్రతుకు అంటే పుట్టుక, చావు మధ్య మాత్రమే కాదు. అది ఇప్పుడు మనకు కనిపించే ఊడ మాత్రమే. కానీ జీవుడు అవిద్య అనే దుంపలోంచి ఎన్ని ఊడలు చించుకున్నాడో, ఎన్ని జన్మలెత్తాడో? కనుక వీడి విస్తారమైన జన్మపరంపర అంతా వటవృక్షం.


ఇంత పెరుగుతున్నది అంటే చైతన్యం ఆధారంగానే పెరుగుతున్నది. కానీ వీడి అవిద్య వల్ల ఇంత విస్తరిస్తున్నది. దానిలో జీవుడు ఇంతకాలం తిరిగి తిరిగి ఎంతటివాడో? జీవభావం అనే పరిమితత్వంతో ఆలోచిస్తే వృద్ధుడే జీర్ణించుకుపోయే లక్షణంలో తిరిగాడు కనుక వాడు ముసలివాడు. వీడు ముసలి వాడే కానీ ఎవడి వల్ల ఇదంతా నడిచిందో ఆయన యువకుడే. వాడిని చూడు ఆ లోపల. కనుక అంతవరకూ విస్తరించుకు పోయావే మర్రి చెట్టుని.


ఇంత మర్రిచెట్టుకీ మూలమైన ఈశ్వర చైతన్యాన్ని దర్శించు. ఏది అధిష్ఠాన చైతన్యమై ఉన్నదో దానిని దర్శించు. అందుకు నీలోని తలపులన్నీ కూడా నిరంతర చింతనతో, విచారణతో, సాధనతో పండి ఈ చింతనలే మహర్షులు. మహర్షులు అంటే దర్శన శక్తి కలవారు. మన ఆలోచనలే మహర్షులు. మన బ్రతుకే వటవృక్షం. దీనికి మూలంలో ఉన్న అధిష్ఠాన చైతన్యమే దక్షిణామూర్తి.


అటువైపు ఈ ఆలోచనలన్నీ వెళితే అక్కడ జరామరణ మర్జితుడైనటువంటి, నిత్య యౌవనుడైనటువంటి, పూర్ణ బ్రహ్మము అయినటువంటి ఆయన సాక్షాత్కరిస్తున్నాడు. అది చిత్రం-ఆశ్చర్యం! "ఆశ్చర్యవ త్పశ్యతి కశ్చి దేనం"-అని మనకి ఉపనిషత్తులు, గీత చెప్తున్నాయి. ఆశ్చర్యం అనే మాట నుంచి శంకరులు


"చిత్రం వటతరోర్మూలే వృద్ధాః శిష్యా గురుర్ యువా.

గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు ఛిన్న సంశయాః"


ఆయనను ఆశ్రయించినప్పుడు ఉపన్యాసాలు లేవు. ఎందుకంటే అఖండమైన ఆత్మత్వమ్ ఆనందానుభూతి. అంతేకానీ దీపం వెలిగించి నాకు వెలుగునిమ్ము అని ప్రార్థించక్కరలేదు. ఆయన ఇచ్చేదే అది. ఈశ్వర సాక్షాత్కారానభవంతో నాకు జ్ఞానమివ్వు. అని అనక్కరలేదు. జ్ఞానమే ఆయన.


"గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం!

నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః!!"


"ఓం నమః ప్రణవార్థాయ శుద్ధఙ్ఞానైకమూర్తయే!

నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః!!"


కేవల జ్ఞానమే ఆయన మూర్తి. మనకి మూర్తి వేరు, జ్ఞానం వేరు. భగవంతునికి జ్ఞానమే మూర్తి. జ్ఞానమే మూర్తీభవిస్తే దక్షిణామూర్తిగా గోచరిస్తున్నాడు అని చెప్పి స్తోత్రం 

చేస్తున్నారిక్కడ. అయితే దీనిని స్తోత్రం అని ఎందుకన్నామంటే ఆయనే అన్నారు ’అముష్మిన్ స్తవే"-ఈ స్తోత్రమునందు అని. కానీ నిజానికి స్తోత్రం అంటామా అంటే దీనిలో చెప్పబడేదంతా ఆత్మతత్త్వ విచారణే. ఈ స్తోత్రాన్ని ఎలా అనుసంధానం చేయాలో చివరి శ్లోకంలో చాలా చక్కగా వివరించారు. దానిని బాగా మననం చేసుకుంటే ఈ స్తోత్రాన్ని అనుసంధానం చేయవలసిన విధానం పూర్తిగా గమనించవచ్చు.


"తేనాస్వ శ్రవణాత్తదర్థ మననాద్ధ్యానాచ్చ సంకీర్తనాత్!" ఈ స్తోత్రాన్ని వినడం, దాని అర్థాన్ని మననం చేయడం, మననం చేసిన దాన్ని బుద్ధియందు ఏకాగ్రంగా ఎల్లవేళలా నిలపడం, ఏకాగ్రతవల్ల కలిగిన అనుభూతితో దానినే నిరంతరం స్మరిస్తూ ఉండడం ఏదైతే ఉందో అది సంకీర్తనం. ఇలా చేస్తే "సర్వాత్మత్వమహావిభూతి సహితం స్యాదీశ్వరత్వం స్వతః"-వాడు ఈశ్వరునితో తాదాత్మ్యం చెందుతాడు. సర్వాత్మకత్వాన్ని స్ఫుటీకరించే స్తోత్రమిది అన్నారు.


అంటే ఈ స్తోత్రం యొక్క లక్షణం ఏమిటి? ఏవిధంగా దీనిని అనుసంధానించాలో చెప్పారు. అంటే మందిచ్చేవాడు ఆ మందు వల్ల యేజబ్బు పోతుందో చెప్పి మందు ఎలా పుచ్చుకోవాలో చెప్తాడు కదా!


అలా ఇక్కడ ఈ తొమ్మిది శ్లోకాల ఔషధాన్ని తయారుచేసి ఈ మందు purpose ఏంటి? అంటే సర్వాత్మత్వ స్ఫుటీకృతం. సర్వమూ ఒకటే ఆత్మ అది తెలుసుకోవాలి. రెండవది లేదు. ఉన్నది ఒక్కటే ఆత్మ. ఏమిటండీ నాముందు లక్ష కనపడుతున్నాయి. అదే కదా సమస్య! అందుకు కదా సాధన, స్తోత్రం, గీత, ఉపనిషత్తు మనకి. సర్వాత్మత్వాన్ని స్ఫుటీకృతం స్పష్టం చేయడానికై ’అముష్మిన్ స్తవే - ఈ స్తోత్రంలో ప్రతిపాదించారు సత్యాన్ని. చదివినంత మాత్రాన తెలిసిపోతోందా. కాదు. శ్రవణాత్- శ్రవణం చేయాలి.


శ్రవణం ఎలా చేయాలో శివపురాణంలో శివుడు చెప్తాడు. "ప్రియుడు ప్రియురాలి గురించి కబుర్లు వినడానికి ఎంత అటెన్షన్ పే చేస్తాడో నా విషయం వినడానికి అంత ఆసక్తి చూపడాన్ని" శ్రవణం అంటారు అన్నాడు. ఎంత చక్కటి ఉపమానం చెప్పాడో శివుడు.


అలా చెప్తే కానీ మనకు అర్థం కాదు. ఎందుకంటే నిత్యజీవితంలో అనుభూతులవన్నీ కూడా. Sweet Nothings అంటారు. ఏమీ ఉండదు కానీ తీయగా  ఉంటుందిట. ప్రియుడు ప్రియురాలి మాటలు వినడానికి ఎంత ఆసక్తి చూపిస్తాడో భగద్విషయాలు వినడానికి శ్రద్ధాళువు అంత ఆసక్తి చూపిస్తాడట. మనం అది తప్ప మిగిలిన వాటియందు అంత ఆసక్తి చూపిస్తాం.


శ్రవణం తరువాత తదర్థం మననాత్-అర్థాన్ని మననం చేయాలి. మననం చేసినదాన్ని ధ్యానించాలి. ధ్యానించాక కలిగే ఆనందపు అనుభూతిని వ్యక్తీకరించడమే సంకీర్తన. మద్దెలలు, హార్మోనియం పట్టుకొని పాడడం కాదు సంకీర్తన అంటే. సంకీర్తనా గీతం అనే మాటకి శాస్త్రీయమైన అర్థం ఏంటంటే ఆనందానుభూతితో పలికే వ్యక్తీకరణ. అది జరిగితే అప్పుడు ఆ సర్వాత్మకుడైన ఈశ్వరునితో తాదాత్మ్యం చెంది జీవుడనబడే నేను ఈశ్వరుడికి వేరు అనే భావం పోయి "ఈశ్వరత్వం తథః" దానిని పొందుతాడు సుమా! అని purpose చెప్పేశాడు ఆయన. Densified చేసి ఒక్క capsule గా ఇస్తే దానిని గమనించి తత్త్వం తెలుసుకోవడం అంటే అంత తేలికా?


అందుకు ఇప్పుడు మనం శ్రవణం, మననం వీటన్నిటి ద్వారా కేవలం శ్రవణం అంటే నేను శ్లోకాలు చదివేస్తే మీరు వినేస్తే అయిపోలేదు కదా! ఏమి చెప్పారో మనస్సుకు పట్టడానికి ఆ ఆత్మతత్త్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం.


                 🙏 శ్రీ దక్షిణామూర్త యే నమః🙏


                              ఓం నమః శివాయ 🙏

Thursday, January 8, 2026 0 comments By: visalakshi

దేవి బీజాక్షరాలు..

 


                       ఓం ఐం హ్రీం శ్రీo శ్రీ మాత్రే నమః...


ఉమాదేవి బీజాక్షర వివరణ చేసిన గణపతిముని...


ఉమాసహస్రంలో శ్రీ కావ్యకంఠ గణపతిముని 

దేవి బీజాక్షరాలపై గొప్ప వివరణ నిచ్చారు.

ఈదర్శనం అంతా నవమ శతకంలో ముప్ఫైమూడవ స్తబకంలో ‘’వంశస్థ వృత్తాలు‘’లో మనోహరంగా, మనోజ్ఞంగా ఆరాధనా భావ బంధురంగా రచించి అమ్మవారి పరిపూర్ణ కటాక్షసిద్ధి పొంది , మనలనూ ఆ అనుభూతిని పొందమన్నట్లు చేశారు.


మొదటి శ్లోకంలోనే..!

‘’సుధాం కిరంతో ఖిల తాప హరిణీం,తమో హరంతః పటలేన రోచిషాం –శ్రియం దిశంతో దిశి దిశ్య సంక్షయాం ,జయంతి శీతాద్రి సుతాస్మితాంకురాః’’


తాపత్రయాన్ని ,వేడిని హరించే అమృతాన్ని వెదజల్లుతూ కాంతిపుంజంతో చీకటిని అజ్ఞానాన్ని నశింప జేస్తూ అన్నిదిక్కులలోను అక్షయమైన శోభను,సంపదను ప్రదర్శిస్తున్న ఉమాదేవి మందహాసాలు గొప్పగా విరాజిల్లుతున్నాయి అని కీర్తించారు.


నాలుగవ శ్లోకంలో..!

‘’మనః ప్రతాపస్య భవ త్యసంశయం ప్రవర్ధనం వైదిక మంత్రం చింతనం –ప్రశస్యతే ప్రాణమహః ప్రదీపనే దయాన్వితే తాంత్రిక మంత్రం సేవితా ‘’


దయామయీ ! ఋషులు దర్శించిన ‘’తత్స వితుః మొదలైన మంత్రాల ధ్యానంతో మన మనస్సు ప్రభావం పెరుగుతుంది.

ఇందులో సందేహమే లేదు.

శ్రీ విద్య మొదలైన తాంత్రిక మంత్రోపాసన వలన 

ప్రాణ తేజస్సు వృద్ధి చెందుతుంది అన్నారు.

వేదం మంత్రాలు తాంత్రిక మంత్రాలకంటే 

అర్ధ ప్రాధాన్యం కలిగి ఉంటాయని,

ఆమంత్రార్ధ విచారణ వల్ల జ్ఞానం కలుగుతుందని , 

హ్రీం కారం మొదలైన బీజాక్షరాలు ఉండే 

తాంత్రిక మంత్రాల పునశ్చరణ వలన 

ప్రాణనాడి శుద్ధి జరిగి నాదం అభివ్యక్తమౌతుందని 

దానివలన ప్రాణప్రభావం పెరుగుతుందని భావం.


తాంత్రిక మంత్రాలను ఉపాశించేవారినుండి విద్యుత్తుతో సమానమైన తేజస్సు బయటికి వచ్చి ప్రపంచమంతా వ్యాపిస్తుందని తర్వాతి శ్లోకంలో చెప్పారు ముని.

తాంత్రిక మంత్రోపాసకులకు మనస్సు వికారం చెందదని వారి దృష్టి ,బుద్ధి విషయ వాసనలకు లోను కాదని, వారి దేహంలో రోగాలు ప్రవేశించలేవని మరో శ్లోకంలో వివరించారు.


ఏడవ శ్లోకంలో..!

‘’స్మరన్తి మాయాం గగనాగ్ని  శాంతి భిః స్సహాచ్చ భాసా సాహితాభి రంబికే –తదా రసజ్నాం ద్రుహిణాగ్ని శాన్తిభి ర్భణంతి  దోగ్ధ్రీం తుఖషస్ట బిన్దుభిః’’


అమ్మా! పూర్ణ చంద్రుడితో కూడిన ఆకాశ -అగ్ని , శాంతులతో మాయా బీజాన్ని ,

చంద్రునితో కూడిన బ్రహ్మ –

అగ్ని శాంతులతో రసనా బీజాన్ని ,

ఆకాశ –షష్ఠ స్వర బిందువులతో ధేనుబీజాన్ని చెప్పటం లోకంలో అలవాటుగా ఉంది.

దీనికి వివరణ తెలుసుకోవాలి.

పూర్ణ చంద్రుడు అంటే పూర్ణానుస్వారం..అంటే 

నిండు సున్నా.

ఆకాశం అంటే హకారం అగ్ని అంటే రేఫం.

శాంతి అంటే ఈ కారం.

పూర్ణానుస్వారంతో కూడిన హకార ,రకార ,

ఈ కారాలతో ‘’హ్రీం ‘’అనే బీజాక్షరం ఏర్పడుతుంది.

దీన్ని మాయా బీజం అంటారు.


బ్రహ్మ అంటే క కారం .అగ్ని రకారం .శాంతి ఈకారం .

పూర్ణానుస్వారంతో కూడిన కకార,రకా,ఈకారాలతో ఏర్పడేదే’’క్రీం’’అనే బీజాక్షరం.

దీన్నే రసనాబీజం అంటారు.

ఆకాశం అంటే ఖ .హకారం షష్ఠ స్వరం,అంటే 

ఆరవ స్వరం ఊ కారం.

వీటన్నిటితో బిందువు సున్నాతో ఏర్పడిన ‘’హూం ‘’ 

అనే బీజాక్షరం ఏర్పడుతుంది.

దీనికే ధేనుబీజం అని పేరు.

ఈ మూడు మహా మంత్రాలు.


తరువాత గణపతి ముని ఈమహామంత్రం దేవతలను వివరించారు.


‘’అభాన్య తాడ్యాభువనేశ్వరీ బుధై  రనంతరా మాత రగాది కాళికా-ప్రచండ చండీ పరికీర్తితా పరా ,త్రయోష్యమీ తేమనవో మహా ఫలాః ‘’


దేవీ ! మొదటిది అయిన హ్రీంకార మాయాబీజంకు దేవత భువనేశ్వరి!

రెండవది అయిన క్రీం కార రసనాబీజానికి  దేవత 

కాళికా దేవి!

మూడవది అయిన హూం కార మనే  దేనుబీజానికి దేవత ప్రచండ చండి!

అని మంత్రం వేత్తలు చెప్పారు.

ఈ మూడు మంత్రాలూ మహా సిద్ధిదాయకాలే .

ప్రచండ చండికే మరో పేరు ‘’చిన్న మస్త ‘’లేక ‘

’వజ్ర వైరోచని ‘’అంటారు .


మరికొంచెం వివరణ ఇస్తూ తరువాతిశ్లోకాన్ని రచించారు.

‘’ఉపాధి భూతం శుచి నాభసం రజో దధాతి సాక్షా ద్భువనేశ్వరీపదం-తదాశ్రయా వ్యాపక శక్తి రర్భుతా,మనస్వినీ కాచన కాలి కేరితా ‘’


దేనితోను సంబంధంలేని స్వతస్సిద్ధంగా అందరికి ఉపాదానమైన ఆకాశరేణువే భువనేశ్వరి.

ఆ ఆకాశరేణువును ఆశ్రయింఛి ప్రాజ్న అయి ,

ఆశ్చర్య కరి అయి ,

మాటలతో వర్ణించటానికి వీలులేని సర్వవ్యాపకశక్తియే కాళికాదేవిగా చెప్పబడింది అని ముని అభిప్రాయం . 

అంటే సూక్షంగా చెప్పాలంటే  ఆకాశరేణువే భువనేశ్వరి అని సర్వవ్యాపిని అయిన చిచ్చక్తియే కాళీ అని అర్ధం .


తరువాత –

‘’అమర్త్య సామ్రాజ్య భ్రుతః ప్రవర్తికా ,విశాల లోకత్రయ రంగ నర్తికా –పరాక్రమాణా మది నాయికోచ్యతే ,ప్రచండ చండీతి  కలా సవిత్రి తే’’


‘’దేవతలా రాజు ఇంద్రుడిని ప్రపంచ వ్యవహారాలకు నియమించి మూడు లోకాలలోనూ ,

అప్రతి హతంగా విహరిస్తూ ,

వివిధ పరాక్రమాలకు అది దేవతవు అయిన 

నీ కళయే ప్రచండ చండిగా లోకంలో ప్రసిద్ధమైంది .

దీని వలన నీకు శచి ,,ఇంద్రాణి అనే పేర్లు సార్ధకాలైనాయి .

కొంచెం లోతుకు వెళ్లి విచారిస్తే –

ప్రచండ చండికి క్రియాశక్తి ముఖ్యం .

కాళికి వ్యాపించటం జ్ఞాన శక్తి  ముఖ్యం .

అయితే ఈ రెండిటికి మూలం భువనేశ్వరీ మాతయే .


ఈరకంగా దేవియొక్క మూడు మహామంత్రం 

దేవతా విభూతులను గణపతి ముని ప్రతిపాదించారు .

అలాంటి భువనేశ్వరిని అర్చించేవారికి ఏమిఫలం లభిస్తుందో తరువాతి శ్లోకాలలో చెప్పారు .


‘’స్మరన్ మానుం రోదితి భక్తిమాం స్తవ ,ప్రగృహ్య పాదం ముని రంబ లంబతే –ఫలం చిరాయ ప్రధమః సమాప్నుయాత్ ,పరో మరందం పద ఏవ విన్దతి ‘’


‘’తల్లీ ! నీ మంత్రాన్ని ధ్యానించే భక్తుడు ఏడుస్తూ  చాలాకాలానికి కాని ఫలాన్ని పొందలేదు .

కాని నీ పాదాల్ని ఆశ్రయించిన మౌని మాత్రం వెంటనే ఫలసారాన్ని పొందుతాడు .

అంటే మంత్రం జపిస్తే ఎప్పుడో కాని ఫలితం రాదు. 

అదే పాదాలను ఆశ్రయిస్తే వెంటనే ఫలితాన్ని పొందుతాడు అని భావం .


పదహారవ శ్లోకంలో..!

‘’అహం (నేను )అనే పదం యొక్క అర్ధం జ్ఞానం అనే 

తీగ అయితే ,

అది అంటే అహంకార పదార్ధం దేనుబీజం అయిన ‘’హూం ‘’అనే మంత్రార్ధం కంటే వేరైనది ఎలా అవుతుంది?

అహం అనేది ప్రాణధ్వనియొక్క వైఖరి అయితే దేనుబీజం అయిన హూం ఆ ప్రాణ ధ్వని వైఖరి కాదు 

అని చెప్పటానికి వీలే లేదు .

ఇంకొంచెం వివరంగా –

అహం శబ్దం ప్రాణ ధ్వనియే .

హూమ్కారమూ ప్రాణ ధ్వనే .

కనుక శబ్దంలో ఈ రెండిటికి భేదం ఉంది

కాని అర్ధంలో భేదం లేదని కావ్య కంఠుల అభిప్రాయం


మరో శ్లోకంలో..!

‘’పారేతు యాం చేతన శక్తి మామన ,న్త్యభాణి సా కుండలి నీతి తాన్త్రికైః-విలక్షణా  నామ చమత్రుతి ర్జడాన్ ,ప్రతారయత్యాగమ సార దూరాన్ ‘’


కొందరు తంత్ర వేత్తలు  చేతన శక్తి ఉన్నదాన్నే కుండలిని అన్నారు .

ఈ అసాధారణ చమత్కారం  మంత్రం శాస్త్రం  తెలియని మంద బుద్ధులను వంచించటానికే కదా అని ప్రశ్నించారు .

అంటే తాంత్రికులు చిచ్చక్తిని కుండలిని అన్నారు .

ఇది విలక్షణమైన చమత్కారం .

కుండలిని అంటే పాము అని సామాన్యులు భయపడతారు.

కాని కుండలిని అని వారికీ చప్పున స్పురించదు .

దీనివలన మోహం జరిగే ప్రమాదం ఉంది అని అంటారు .


‘’మతిః పరాచీ వ్యవహార కారణం ,భావేత్ప్రతీచీ పరమార్ధ సంపది –ఉభౌ దిశే యస్య మతి ర్విగాహతే ,

పదా చ మూర్ధ్నా చ స సిద్ధి ఇష్యతే ‘’బహిర్ముఖం 

అయిన బుద్ధి బయటి ప్రపంచ వ్యవహారానికి కారణం అవుతుంది .

అంతర్ముఖం అయిన బుద్ధి పరమ పురుషార్ధం అయిన మోక్షానికి కారణం అవుతుంది .

బహిర్ముఖం అంతర్ముఖం అయిన బుద్ధి గల యోగి 

పాదం చేతా ,శిరస్సు చేతా సిద్దుడౌతాడు .

ఇక్కడ పాదం అంటే హృదయం అనే ఆకాశం .

మూర్ధం అంటే సహస్రారం .

అంటే  హృదయం చేత సిద్దుడైనవాడు ప్రత్యేక దృష్టి సిద్ధుడు అవుతాడు .

సహస్రారం చేత సిద్ధుడైనవాడు పరాక్ దృష్టి సిద్దుడవుతాడు .

అందరికి పరాగ్ దృష్టి అంటే బాహ్య దృష్టి అవకాశం కలుగుతుంది .

కాని ప్రత్యక దృష్టి అంటే అంతర్ దృష్టి కలవాడికి 

బాహ్య దృష్టి అదుపులో ఉంటుంది .

జీవన్ముక్తుడు అయిన పురుషుడు మాత్రమే అంతర్ముఖంగా ప్రజ్ఞను విడవకుండా బాహ్య వ్యవహారాలూ నిర్వహించే సమర్ధుడు అవుతాడు..అని అంతరార్ధంగా వివరించారు. వ్యాఖ్యాతలైన కపాలి శాస్త్రి, పన్నాల రాధా కృష్ణ గార్లు .


బుద్ధికి లక్ష్యమైన స్థానం హృదయం అని హృదయంలో ఎల్లప్పుడూ దృఢంగా ఉన్నవాడు 

బుద్ధి బయటి ప్రపంచం విషయాల్లో తిరుగుతున్నా ,

చిచ్వరూపిణి అయిన దేవియందు నిమగ్నుడయ్యే ఉంటాడు .

కనుక జనన మరణ భయం అలాంటివారికి ఉండదని తరువాతి శ్లోకంలో చెప్పారు .

ధ్యానంలో అద్భుతమైన ధ్యాన శక్తిగా ,

దర్శనంలో దీప్తం అయిన దర్శన శక్తిగా ,

ప్రవచనం చేసేటప్పుడు శ్రేష్టమైన ప్రవచన శక్తిగా 

దేవిని దర్శించే నైష్టిక పురుషుడు బాహ్య విషయాల చేత బంధింపబడడు అని తరువాతి శ్లోకంలో వివరించారు . 

ఆశ్రితుల భయాన్ని పోగొడుతూ పండితుల చేత ప్రస్తుతింపబడే పరమేశ్వరి కనిపించేవాటియందు’ ’సంగం’’(బంధం ) వదిలి దర్శన కర్మ ను చూసే 

క్రాంతదర్శి అయిన కవి దృష్టిలో నిత్యం సన్నిహితం గా ఉంటుంది అన్నారు.


చివరి శ్లోకం లో..!

‘’అయం భయానాం పరిమార్జక స్సతాం సమస్త పౌపేఘ నివారణ క్షమః –మనోజ్ఞ వంశస్థ గణో గణేషితు-,ర్మనో మహేశాబ్జ దృశో దినోత్పలం ‘’


సజ్జనులకు భయహరంగా ,

సమస్త పాపాలకు నివారణగా గణపతి కవి 

‘’వంశస్త వృత్తం‘’లలో రచించిన 

ఈరమణీయ శ్లోక బృందం ఉమాదేవికి పరమానందం కలిగించుగాక అని చెప్పి ముగించారు.

                  *ఓం శ్రీ మాత్రే నమః*  

Saturday, December 20, 2025 0 comments By: visalakshi

జై గురుదేవ దత్త....



              ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః 🙏🙏

ఓ దత్తా! నా హృదయమనెడి పద్మమున "శ్రీ దత్త"అనెడి నినాదము వెలువడును. నా మనసు సంతసించినపుడు "శ్రీ దత్త"అనెడి నినాదము ప్రతిధ్వనించును. ఓ దత్తా! ఓంకార స్వరూపమైన హృదయపద్మమున "శ్రీ దత్త"అనెడి నినాదము వినవచ్చును. ఓ శ్రీ దత్తా! నా హృదయనివాసా నీకు నా ప్రణామాలు.🙏🙏..

దత్తుని అవతారం గురురూపం. అజ్ఞానము పోగొట్టి జ్ఞాన ప్రాప్తి ద్వారా మోక్షము నొసగుటయే ఈ అవతారమునకు లక్ష్యం. శ్రీ దత్తులు స్మర్తృగామి. అనగా పిలిచిన వెంటనే వచ్చి ఆదుకొను దయాస్వరూపుడు. శ్రీ దత్తాత్రేయులు  ప్రహ్లాదునకు ,కార్తవీర్యునకు , అలర్కునకు , యదువునకు , పరశురామునకు జ్ఞానోపదేశకులు. కలియుగమందును శ్రీ గురువు అవతారధ్యేయము జ్ఞానప్రబోధముతో నడచుచునేయున్నది.


దత్తాత్రేయ తవ శరణం!దత్తనాధా!తవ శరణం

త్రిగుణాత్మక త్రిగుణాతీతా త్రిభువనపాలకా!తవ శరణం!!


శ్రీ దత్తాత్రేయ స్వామి  అర్ధాంగి కి “అనఘాదేవి” అని పేరు.

అఘము అనగా పాపము అనఘ అనగా పాపము లేనిది పాపము మూడు విధాలు మనసు తో, బుద్దితో, ఇంద్రియములతో, మూడు విధాల పాపములు పోగట్టునది అనఘ


ఆమె సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారము. అనఘాదేవి లో శ్రీ రాజరాజేశ్వరి, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి లక్షణాలు నిండుగా ఉన్నాయి. అనఘస్వామి లో బ్రహ్మ,రుద్ర, విష్ణు లక్షణాలు ఉన్నాయి. అనఘుడు విష్ణు స్వరూపుడు, అనఘాదేవి లక్ష్మి స్వరూపము. ఈ దంపతులిద్దరూ నిత్యమూ తపోమయమైన జీవనం గడుపుతూ భక్తులకు తత్వ జ్ఞానాన్ని అనుగ్రహించే అతి ప్రాచీన, ఆది దంపతులు. వారికే అష్టసిద్ధులు (అణిమా,లఘిమా, ప్రాప్తి, ప్రాకామ్యం ,ఈశిత్వం, వశిత్వం, కామావసాయితా, మహిమా ) పుత్రులై అవతరించారు .


అనఘాదేవి యోగేశ్వరి, జగన్మాత, యోగంనందు ప్రీతి గలది. గృహం, పతి, పత్ని, పుత్రులను అనుగ్రహిస్తుంది. వంశవృద్ధిని కలిగిస్తుంది. సమస్త కోరికలను సిద్ధింపజేస్తుంది, కవితా శక్తిని, కళలను ఇస్తుంది. ఈమెకే “మధుమతి ” అనే పేరు కూడా కలదు. ఈమె అనఘస్వామి భ్రూమద్య నుండి ఉద్భవించినది. దత్తాత్రేయుడు అనఘను వామభాగమున ధరించి ఉన్న శాక్త రూపము . “అఘము” అంటే పాపము, ఇది మూడు రకాలు. అనఘము అంటే ఆ మూడు రకాల పాపాలను నశింపజేయడం.


దత్తుని రూపంలో అంతరార్థం:

శ్రీ దత్తమూర్తి మూడు శిరస్సులతో, ఆరుభుజములతో, ఆయుధములతో, నాలుగు కుక్కలతో, ఆవుతో ఉన్నట్టు చిత్రించబడి ఉంటుంది. వీటికి గల అర్థాలను పరిశీలిస్తే •


1. మూడు శిరస్సులు: బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, సృష్టి, స్థితి, లయములు, ఓంకారములోని అ, ఉ, మ లు త్రిమూర్త్యాత్మక పరబ్రహ్మము.


2. నాలుగు కుక్కలు: నాలుగు వేదములు ఇవి. దత్తమూర్తి సకల వేదవిజ్ఞానమును అధిగమించిన జ్ఞానసాగరుడు.


3. ఆవు: మనసే మాయాశక్తి. సంకల్ప, వికల్పములకు, సుఖదుఃఖములకు కారణమైన మాయను యోగబలముచే శ్రీదత్తమూర్తి కామధేనువుగా మార్చాడు.


4. మాల: అక్షరమాల, సర్వమంత్రమయము, సమస్త వైఖరి, వాగ్జాలమునకు,సాహిత్యసంగీతములకు సర్వ వ్యవహారములకు మూలము.


5. త్రిశూలము : ఆచారము, వ్యవహారము, ధర్మార్థ కామముల సంపుటి.


6. చక్రము: అవిద్యా నాశకము, ఆత్మావలోకన, సామర్థ్యమును, వివేకమును కలుగచేయును.


7. డమరు: సర్వవేదములు దీనినుంచి ప్రాదుర్భవించినవి.


8. కమండలము:సమస్త బాధలను పోగొట్టును. శుభములను సమకూర్చును.


దత్త తత్వం:

దత్తం దత్తం పునర్దత్తం యోవదేత్ భక్తి సంయుతః !

తస్య పాపాని సర్వాణి క్షయం యాంతి న సంశయః !!


దత్తాత్రేయుని భక్తితో స్మరించిన వారికి సమస్త పాపములు నశిస్తాయి. దీనిలో సందేహం లేదని‘ దత్త హృదయం ’లో చెప్పబడింది. దత్తాత్రేయుడు కేవలం స్మరణ మాత్ర్ర సంతుష్టుడు. తీవ్రమైన పూజాదికాలు చేయకపోయినా “అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ” అనే పవిత్ర భావనతో, భక్తితో దత్త, దత్త అని స్మరిస్తే చాలు, ఏదో ఒక రూపంలో వచ్చి, రక్షించి కోరిన కోరికలు తీర్చుతాడని నమ్మకం. శ్రీభాగవత గ్రంథమునందు ప్రథమస్కంధ, తృతీయాధ్యాయములో భగవంతుని 21 అవతారములలో ఆరవ అవతారం దత్తాత్రేయుని అవతారమని చెప్పబడింది.


            శ్రీ సిద్దమంగళ స్తోత్రం:


1. శ్రీ మదనంత శ్రీవిభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా

జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ


2. శ్రీవిద్యాధరి రాధ సురేఖా శ్రీరాఖీధర శ్రీపాదా

జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ


3. మాతాసుమతీ వాత్సల్యామృత పరిపోషిత జయశ్రీ పాదా

జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ


4. సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణా

జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ


5. సవితృకాఠకచయన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవా

జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ


6. దో చౌపాతీ దేవ్‌లక్ష్మీ ఘన సంఖ్యాబోధిత శ్రీచరణా

జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ


7. పుణ్యరూపిణీ రాజమాంబ సుతగర్భ పుణ్యఫల సంజాతా

జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ


8. సుమతీ నందన నరహరినందన దత్తదేవ ప్రభు శ్రీపాదా

జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ


9. పీఠికాపుర నిత్యవిహారా మధుమతి దత్తా మంగళరూపా

జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ


పరమ పవిత్రమయిన యీ సిద్ధ మంగళ స్తోత్రమును పఠించిన అనఘాష్టమీ వ్రతము చేసి సహస్ర సద్భ్రాహ్మణ్యమునకు భోజనం పెట్టిన ఫలము లభించును. మండల దీక్ష వహించి ఏక భుక్తం చేయుచూ, కాయకష్టముతో ఆర్జించిన ద్రవ్యమును వినియోగించి సహస్ర సద్భ్రాహ్మణ్యమునకు భోజనం పెట్టిన ఫలము లభించును. ఈ స్తోత్రము యోగ్యులచే పఠించబడును. దీనిని పఠించుట వలన సిద్ధపురుషుల దర్శన, స్పర్శనములు లభించును. మనసున తలచిన కోరికలు నెరవేరును. మనసా, వాచా కర్మణా దత్తారాధన చేయు భక్తులు యీ స్తోత్రమును పఠించినంతనే శ్రీపాదుల వారి కృపకు పాత్రులగుదురు. ఈ స్తోత్రమును పఠించిన చోట సూక్ష్మ వాయుమండలము నందలి సిద్ధులు అదృశ్యరూపమున సంచరించుదురు.


        🙏🙏   || ఓం ద్రాo దత్తాత్రేయాయ నమః ||🙏🙏

Wednesday, May 28, 2025 0 comments By: visalakshi

శ్రీ దత్త స్తవము....

                      ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమః



శ్రీ వాసుదేవానంద సరస్వతీ స్వాములవారు (టెంబేస్వామి)దత్తస్వామిని సదా కీర్తించిన స్తవమే ఈ శ్రీ దత్తస్తవము. వారు భక్తులకు దత్తాత్రేయుడు అనుగ్రహం సులభంగా లభించాలన్న తపనతో, దత్తస్వామిని ఆర్తితో స్మరించి ఈ స్తవాన్ని రచించారు. ఈ దత్తస్తవము అమిత శక్తివంతమైనది. దత్త స్తోత్రాలన్నింటికీ ఇది తలమానికం లాంటిది. దత్తుడి అనుగ్రహాన్ని సత్వరమే అందించే విశేషశక్తి కలిగి వుండడం ఈ స్తోత్ర ప్రత్యేకత. ఈ విశేషాన్ని గ్రహించిన ఎందరో ఉపాసకులు దీనిని పఠించి ఆధ్యాత్మికంగా ఎంతో ప్రగతిని సాధించారు. ఈ స్తవాన్ని నిత్యం పఠించేవారికి దత్తుడే రక్షకుడిగా ఉంటాడు అంటే సత్యదూరం కాదు.

ఈ దత్తస్తవ పారాయణతో ఎంతోమందికి మనశ్శాంతి కలిగింది. దీర్ఘ రోగాలు నివారణ అయ్యాయి.ఇది సమస్త గ్రహదోషాలు నివారిస్తుంది. సర్వ అనర్ధాలనూ..సమస్త క్లేశాలనూ నివారించి సకల శుభాలు ఒనగూర్చుతుంది భావాన్ని గ్రహించి పారాయణ చేయడం ఫలప్రదం.

  శ్రీ దత్త స్తవము...

1.దత్తాత్రేయం మహాత్మానాం వరదం భక్తవత్సలం !

   ప్రపన్నార్తి హరం వందే స్మర్తృగామి సనోవతు !!

భా...మహాత్ముడు , వరములనిచ్చేవాడు , భక్తులను కన్నబిడ్డలవలె రక్షించేవాడు , ఆశ్రయించినవారి బాధను తొలగించేవాడు అయిన దత్తాత్రేయ స్వామికి వందనం చేస్తున్నాను. స్మరించగానే వచ్చి దత్తాత్రేయుడు మమ్ము రక్షించుగాక!

2. దీనబంధుం కృపాసింధుం సర్వకారణ కారణం !

   సర్వ రక్షాకరం వందే స్మర్తృగామి సనోవతు !!

భా..దీనజన బాంధవుడు, దయాసముద్రుడు, సర్వకారణాలకు మూలకారణమైనవాడు , సమస్త రక్షణలను ఇచ్చేవాడు అయిన దత్తాత్రేయ స్వామికి వందనం చేస్తున్నాను.స్మరించగానే వచ్చి దత్తాత్రేయుడు మమ్ము రక్షించుగాక!

3. శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణం !

    నారాయణం విభుం వందే స్మర్తృగామి సనోవతు !!

భా..తనను శరణు వేడినవారిని ,దీనులను ,ఆర్తులను బాధలనుండి రక్షించడమే కర్తవ్యంగా కలవాడు , నారాయణ స్వరూపుడు , విశ్వవ్యాపకుడు అయిన దత్తాత్రేయ స్వామికి వందనం చేస్తున్నాను. స్మరించగానే వచ్చి దత్తాత్రేయుడు మమ్ము రక్షించుగాక !

4. సర్వానర్ధ హరం దేవం సర్వ మంగళ మంగళకం !

    సర్వక్లేశ హరం వందే స్మర్తృగామి సనోవతు !!

భా.. సర్వ అనర్ధాలనూ హరించేవాడు ,  భగవంతుడు , అన్ని శుభాలకు శుభకరుడు , సమస్త దుఃఖాలను నివారించేవాడు అయిన దత్తాత్రేయ స్వామికి వందనం చేస్తున్నాను. స్మరించగానే వచ్చి దత్తాత్రేయుడు మమ్ము రక్షించుగాక!

5. బ్రహ్మణ్యం ధర్మ తత్వజ్ఞం భక్త కీర్తి వివర్ధనం !

   భక్తాభీష్టప్రదం వందే స్మర్తృగామి సనోవతు !!

భా..బ్రహ్మజ్ఞానియు ధర్మతత్వము నెరిగినవాడు , తన భక్తుల కీర్తిని వర్ధిల్లజేయువాడు ,భక్తుల కోర్కెలు నెరవేర్చేవాడు అయిన దత్తాత్రేయ స్వామికి వందనం చేస్తున్నాను. స్మరించగానే వచ్చి దత్తాత్రేయుడు మమ్ము రక్షించుగాక!

6. శోషనం పాప పంకస్య దీపనం జ్ఞాన తేజసః !

   తాప ప్రశమనం వందే స్మర్తృగామి సనోవతు !!

భా.. పాపాలనే బురదను ఎండింపజేసేవాడు , జ్ఞానాన్ని తేజస్సు ను అభివృద్ధి చేసేవాడు తాపత్రయాలను(అనగా శారీరక.. మానసిక.. దైవిక తాపాలను)  నశింపజేసేవాడు అయిన దత్తాత్రేయ స్వామికి వందనం చేస్తున్నాను. స్మరించగానే వచ్చి దత్తాత్రేయుడు మమ్ము రక్షించుగాక !

7. సర్వరోగ ప్రశమనం సర్వ పీడా నివారణం !

    విపదుద్ధరణం వందే స్మర్తృగామి సనోవతు !!

భా.. సర్వరోగాలనూ ఉపశమింపజేసేవాడు ,సర్వ పీడలనూ నివారించేవాడు , ఆపదలనుండి ఉద్ధరించేవాడు అయిన దత్తాత్రేయ స్వామికి వందనం చేస్తున్నాను. స్మరించగానే వచ్చి దత్తాత్రేయుడు మమ్ము రక్షించుగాక !

8. జన్మ సంసార బంధఘ్నం స్వరూపానంద దాయకం!

    నిశ్శ్రేయస పదం వందే స్మర్తృగామి సనోవతు !!

భా.. జనన మరణాలతో కూడిన సంసార బంధనాలను తెగగొట్టేవాడు , జీవుడికి తన నిజ స్వరూపమైన బ్రహ్మానందాన్ని ప్రసాదించేవాడు , మోక్షపదాన్ని అనుగ్రహించేవాడు అయిన దత్తాత్రేయ స్వామికి వందనం చేస్తున్నాను. స్మరించగానే వచ్చి దత్తాత్రేయుడు మమ్ము రక్షించుగాక !

9. జయలాభ యశః కామ దాతు ర్దత్తస్య యస్తవం!

    భోగ మోక్షప్రద స్యేమం ప్రపఠేత్ న కృతీ భవేత్ !!

భా.. జయము , లాభము ,యశస్సులను కలుగజేసేవాడు , కోరికలు నెరవేర్చేవాడు , భోగము ,మోక్షములను ప్రసాదించేవాడు అయిన దత్తాత్రేయుడి యొక్క ఈ స్తోత్రాన్ని ప్రతి నిత్యం ఏకాగ్రతతో పఠించేవారు కృతకృత్యులౌతారు.

                 ఓం శ్రీ దత్తాత్రేయ నమో నమః...



Thursday, April 17, 2025 0 comments By: visalakshi

అక్షరాభ్యాసం-వసంతపంచమి

                           వసంత పంచమి ...



మాఘశుద్ధ పంచమిని సరస్వతీ జయంతిగా ఆరాధించడం అనేది మనకి పురాణాలలోను, ఇతర శాస్త్రాలలోను కనబడుతున్నటువంటి అంశం. 

ఈ మాఘశుద్ధ పంచమికే వసంత పంచమి అని వ్యవహారం ఉన్నది. 

 నిజానికి వసంత ఋతువు చైత్రమాసంలో వస్తుంది, కానీ శాస్త్రరీత్యా దీనికి శ్రీపంచమి అనే పేరు ప్రసిద్ధిగా కనిపిస్తున్నది.

ఈరోజున సరస్వతీ దేవి ఆవిర్భావదినంగా దేవీ భాగవతం, బ్రహ్మవైవర్త పురాణం ప్రస్తావిస్తున్న అంశములు. 

 పరమ పురుషుని యొక్క వదనం నుంచి సరస్వతీ దేవి ఆవిర్భవించింది అని కథ, ఇందులో ఉన్న సంకేతార్థం ఏమిటంటే ఈ జగతి అంతటికీ కారణమైనటువంటి పరమేశ్వరుడు, విరాట్ పురుషుడు; ఆయన యొక్క వాక్కు, బుద్ధి, జ్ఞానము ఈ మూడింటి యొక్క స్వరూపమే సరస్వతి. 

మనం కూడా ఏదైనా పని చేయాలంటే మననుంచి రకరకాల శక్తులు వ్యక్తమవుతుంటాయి.      

అందులో జ్ఞానశక్తితో ఏదైనా ఒక విషయాన్ని జ్ఞానశక్తితో, క్రియాశక్తితో, ఇచ్ఛాశక్తితో చేయగలం. 

 ఒక పని చేయడానికి మనయొక్క వాక్కు, బుద్ధి, జ్ఞానము ఎలా కావాలో ఈ విశాలమైన విశ్వమనేటటువంటి దీని యొక్క సృష్టిస్థితిలయలు చేయడానికి పరమేశ్వరుడికి కూడా ఒక జ్ఞానము, ఒక వాక్కు, ఒక బుద్ధి ఉంది.

 ఆయన యొక్క బుద్ధి, జ్ఞానము ఏదైతే ఉందో ఆ శక్తిని మనం సరస్వతి అని ఉపాసన చేస్తున్నాం. 

ఆ సరస్వతి ఈనాడు విరాట్ పురుషుని నుంచి ఆవిర్భవించింది.  అని మనకు శాస్త్రం చెప్తున్న వాక్యం, అందుకే ఈరోజున సరస్వతీ దేవి ఆరాధన అత్యంత ప్రశస్తిగా ఉన్నది. 

కేవలం భూలోక మానవులు మాత్రమే కాకుండా దేవలోకంలో వారు కూడా ఈరోజు సరస్వతీ దేవిని ఆరాధిస్తారు అని దేవీభాగవతం చెప్తున్నది. 

అందుకు ఈరోజున విద్యార్థులు, పెద్దవారు అందరూ కూడా అమ్మవారిని వివిధ విధాలుగా పూజించాలి అని శాస్త్రం చెప్తున్న విషయం.

అమ్మ దగ్గర అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలు జ్ఞాన రాశులు అవుతారు.సరస్వతీ మాత ఆరాధన వల్ల వాక్సుద్ధి కలుగుతుంది.. అమ్మ కరుణతో సద్భుద్ధిని పొందుతారు.

మేధ ,ఆలోచన ,ప్రతిభ ,ధారణ ,ప్రజ్ఞ ,స్ఫురణ శక్తుల స్వరూపమే శారదాదేవి. అందుకే ఈ దేవిని శివానుజ అని అంటారు.

అహింస కు అధినాయిక సరస్వతీ దేవి. సరః అంటే కాంతి. కాంతినీ ఇచ్చే మాత సరస్వతి. అజ్ఞాన తిమిరాంధకారాన్ని దూరంచేసి విజ్ఞానాన్నిఅందించే సరస్వతీ మాత పుస్తకం, జపమాల ,అభయముద్రలను ధరించి ఉంటుంది. జ్ఞాన కాంతిని అందించే ఈ తల్లిని తెల్లని పూవులతోనూ ,శ్వేత వస్త్రాలతోనూ ,శ్రీ గంధము తోనూ అలంకరిస్తారు. క్షీరాన్నం..అరటిపళ్ళు.. నారికేళ నివేదన చేస్తారు.ఆ తల్లి చల్లని కరుణాకటాక్షాలతో అపార విజ్ఞాన రాశిని పొందవచ్చు..

"సామాంపాతు సరస్వతీ.." అని మాతను ఆవాహనాది షోడశోపచారాలతో పూజించి సర్వవేళలా సర్వావస్థలయందు మాతోనే ఉండుమని మనమందరం ఆరాధిద్దాము.🙏



శ్రీ పంచమి సందర్భంగా...అక్షరాభ్యాసం..

’వసంత పంచమి’ నాడు అక్షరాభ్యాసం చేయించడం అనేది అనాది కాలంగా ఆచారంగా వస్తూ ఉంది. సాధారణంగా అమ్మ ఆవిర్భావ దినం రోజు విద్య మొదలుపెడితే సకల విద్యలు సులభంగా సుసాధ్యం అవుతాయి అనేది నమ్మకం. 

యజ్ఞం, పూజలు, అర్చనలు పూర్తి అయిన తరువాత పంతులు తమ చిన్నారిని ఒడిలో కూర్చోబెట్టుకుని పలక మీద బలపంతో ‘ఓం నమః శివాయః సిద్ధం నమః’ అని రాసి దిద్దిస్తారు.

అక్షరాభ్యాసం ఎలా చేయాలి? 

విద్య బతుకు తెరువును చూపేది మాత్రమే కాక బతుకు పరమార్థాన్ని తెలిపేది అని కూడా మన పెద్దల అభిప్రాయం.      ఈ దృష్టితోనే అక్షరాభ్యాసాన్ని ఒక పవిత్రమైన సంస్కారంగా మనవాళ్లు రూపొందించారు. వసంత పంచమి సందర్భంగా పిల్లలతో  తొలిసారి అక్షరాలు దిద్దించడం మన ఆనవాయితీ.

పర్వదినాలు అక్షరాభ్యాసానికి అనువైనవి. ముఖ్యంగా విజయదశమీ, శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రం ఉన్న రోజు, శ్రీపంచమి వంటి పర్వదినాలలో ఈ కార్యక్రమం చేయటంవల్ల ఆ దేవతల ఆశీస్సులూ అనుగ్రహమూ లభించి, విద్యాభివృద్ధికి దోహదం కలిగిస్తుందని మన నమ్మకం.

సర్వసాధారణంగా అక్షరాభ్యాసం ఐదో ఏట చేస్తారు. ఆ వయస్సు వచ్చేసరికి విషయాన్ని గ్రహించి అర్థం చేసుకుని, మనస్సులో నిలుపుకొనే శక్తి విద్యార్థికి లభిస్తుంది. ఈ కాలంలో దేశకాల పరిస్థితులను బట్టి మూడవయేటనే అక్షరాభ్యాసం చేస్తున్నారు. ఉదయం వేళ ఇంట్లోగానీ,  దేవాలయంలోగానీ, పాఠశాలలోగానీ, పెద్దలు, గురువుల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించవచ్చు.

మన సంప్రదాయంలో విద్యాధిదేవతలు కొందరున్నారు. అక్షరాభ్యాసం నాడు ఆ దేవతలను పూజించి విద్యార్థిచేత అక్షరాలు దిద్దించటం సంప్రదాయం. సకల విఘ్నాలనూ తొలగించే వినాయకుణ్ణి, విద్యల దేవత అయిన సరస్వతీ దేవిని అర్చించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. దక్షిణామూర్తి, దత్తాత్రేయుడు, విష్వక్సేనుడు మొదలైనవారిని విద్యాదేవతలుగా పూజిస్తారు.

అక్షరం అంటే నశించనిది అని ,అభ్యాసం అంటే నేర్చుకోవటం అని అర్థం. వర్ణమాలను నేర్చుకోవటానికి చేసే తొలి ప్రయత్నమే ఈ అక్షరాభ్యాసం అనే కార్యక్రమం. 

తల్లి తండ్రులు కుటుంబ సభ్యుల సమక్షంలో పురోహితుని ద్వారా పిల్లల కుడిచేతితో బిడ్డను తన ఒడిలో ఉంచుకుని ,పంచాక్షరీ మంత్రం తో పాటు "ఓం"ను వ్రాస్తూ అక్షరం దిద్దిస్తారు.

ఆ తరువాత ‘ఓం నమః శివాయః సిద్ధం నమః’ అనే అక్షరాలను విద్యార్థిచేత దిద్దిస్తారు. విద్యాధి దేవత సరస్వతి అయినా, జ్ఞానస్వరూపుడు శివుడు కాబట్టి ‘నమశ్శివాయ’ అక్షరాలు దిద్దడంతో అక్షరాభ్యాసం ప్రారంభమవుతుంది.

విద్యార్థితో తొలి అక్షరాలను బియ్యంపై రాయించే ఆచారం కొన్నిచోట్ల ఉంది. ఆ చిన్నారికి ఎప్పుడూ ధనధాన్యాలు సమృద్ధిగా చేకూరాలని దీవించడమే ఇందులోని అంతరార్థం.

         

         🙏లోకా సమస్తా సుఖినోభవన్తు🙏

Thursday, February 13, 2025 0 comments By: visalakshi

శుద్ధ భక్తి...

 


#శుద్ధ భక్తికి ముగ్ధుడైన పూరి జగన్నాథుడు ....

[కళ్ళలో ఆనందభాష్పాలు తెప్పించే కృష్ణుడి లీల] ...

  

బంధు మహంతి అతని భార్య , ఇద్దరు మగపిల్లలు భోజనం చేయక 2 రోజులు అయ్యింది. వర్షాలు లేక  కరువుకు బలి అయిన పేద కుటుంబం అతనిది. ఒడిషాలోని కటక్ మరియు బాలాసోర్ మధ్య వున్న జాజ్పూర్ లో భిక్షమెత్తుకొని  వచ్చిన కొంత అన్నాన్ని పిల్లలకు పెట్టి తాను  తన భార్య ఇంకా మిగిలివున్న చెట్ల యొక్క ఆకులు తింటూ బ్రతుకుతున్నాడు బంధు మహంతి. 


భార్య కంట తడిపెట్టినప్పుడల్లా బంధు ఇలా అనేవాడు '' ఏడవకు. నాకు పూరి నగరంలో ఒక ధనవంతుడైన స్నేహితుడున్నాడు. చాలా మంచివాడు. ఎవరు ఏ సహాయం అడిగినా అతను కాదనడు. మనకూ అతను సహాయం చేస్తాడులే''. 


ఒకరోజు భార్య ''మనం మీ  స్నేహితుడిదగ్గరికెళ్ళి మన దీనావస్థను చెప్పుకొందాం. ఇంకా ఆలస్యం చేస్తే పిల్లలు చనిపోతారు , '' అంటే బంధు మహంతి భార్య  పిల్లల్ని తీసుకొని  144 కి.మీ. దూరం లో వున్న పూరి నగరానికి బయలుదేరాడు. మధ్య దారిలో అడవి వస్తుంది. 


1530 వ సంవత్సరం లో నాలుగురోజులు కాలినడకన ప్రయాణించి బంధు మహంతి పురి నగరం చేరాడు. రాత్రి అయ్యింది. '' ఇపుడు నా స్నేహితుడు నిద్ర పోతుంటాడు. నిద్రా భంగం చేయడం మంచిది కాదు. ఉదయం ఆయన ఇంటికి వెళదాం '' అన్నాడు బంధు.


ఆమె సరే అంటూనే '' ఇపుడు పిల్లలకు తినడానికేమీ లేదు. వాళ్లు ఆకలికి ఏడుస్తున్నారు '' అని అంటే అపుడు బంధు '' చూడు , మనం ఇపుడు పూరి జగన్నాథుడి మందిర ప్రాంగణంలోవున్నాం. గుడి తలుపులు మూసేసారు అయినా ఒకసారి ఆ తలుపులనే చూసి వద్దాం అంటూ భార్యా పిల్లల్ని తీసుకొని ద్వారం బయటే నిలబడి కృష్ణ భగవానుడిని ప్రార్థించాడు . ఆరాత్రి అతను చేసిన ప్రార్థన ఎంత గొప్పదంటే సమస్త పురాణాల సారమంతా అందులో వుంది :  


'' ప్రభూ , నేను నీ భక్తుడిని . నీవు తప్ప నాకు ఎవరు దిక్కు ? నేను కటిక పేదవాడిని. నేను ఆకలితో వున్నాను. అయినా నాకు బాధ లేదు. కానీ నా భార్య , పిల్లలు ఆకలితో మరణిస్తారేమో. నేను ఇన్ని రోజులూ నా భార్యకు 'నాకో స్నేహితుడున్నాడు, అతను మనకు సహాయం చేస్తున్నాడు' అని చెపుతూ వస్తున్నాను. 


కానీ ఆమెకు తెలియదు నీవే ఆ స్నేహితుడని. ఇపుడు వాళ్ళ ఆకలి తీరలేదు, ఏ సహాయం అందలేదు అనుకో, ఆమెకు నీవు వున్నావు అనే విశ్వాసం పోతుంది. నేనది భరించలేను. నా మాటలు నమ్మి నీమీద నమ్మకం పెట్టుకొన్న ఆమెను నిరాశ పరచొద్దు. నీవు వున్నావు , నీవు ఇదంతా చూస్తున్నావు. ఇది నా నమ్మకం. ఆతరువాత నీ ఇష్టం. '' 


వాపసు వచ్చి ఆలయ ప్రాంగణంలో కుండల్లో పెట్టిన నీరు త్రాగి అక్కడే పడుకొన్నారు. మధ్యరాత్రి అయ్యింది. ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన బ్రాహ్మణ రూపంలో వున్నాడు. బంధు మహంతి భార్య కళ్ళు మూస్కొన్నది కానీ నిద్రపట్టలేదు. చిన్నగా చప్పుడైతే లేచి కూర్చొంది. ఆ బ్రాహ్మణుడు ఒక పెద్ద పళ్ళెంలో కమ్మని పదార్థాలను ఆమె ముందు పెట్టాడు. ఆమె భావోద్వేగంతో పళ్ళెం అందుకొన్నది. ఆయన వెళ్ళిపోయాడు. 


ఆమె బంధును, పిల్లల్ని నిద్రలేపి 'ఒక బ్రాహ్మణుడు వచ్చి ఇది ఇచ్చిపోయాడు ' అని చెప్పింది. బంధు అన్నాడు 'నేను చెప్పాను కదా? నా స్నేహితుడు చాలా మంచివాడు అని. అతనే పంపివుంటాడు.' ఆ రాత్రి జగన్నాథుడే స్వయంగా అందించిన ఆహారాన్ని ఆ పేద భక్త కుటుంబం సంతోషంగా తిని , ఆ పళ్ళాన్ని కడిగి గుడ్డ సంచిలో పెట్టి నిద్ర పోయారు. 


కథ అయిపోయిందా? లేదు . ఇపుడు మొదలౌతుంది. 


తెల్లవారింది. జగన్నాథ దేవాలయం అర్చకులు మందిరం తలుపు తెరచి , స్వామి విగ్రహానికి నీళ్ళతో అభిషేకించి , అలంకరించబోతుంటే అక్కడుండాల్సిన బంగారు పళ్లెం లేదు. నిమిషాల్లో వార్త అందరికీ తెలిసిపోయింది.   ఇంతలో ఆలయంలో పనిచేసే ఒక వ్యక్తి బంధు దగ్గర బంగారు పళ్ళెం వుండటాన్ని చూసి , అధికారులకు చెప్పాడు. 


వాళ్ళు అర్చకులతో కలిసివచ్చి బంధును పట్టుకొని కొట్టడం మొదలుపెట్టారు. బంధు  ఏమీ మాట్లాడటం లేదు. కళ్ళు మూసుకొని దెబ్బలు తింటూనే మనసులో ' నేను దొంగను అని వీళ్లు నన్ను కొట్టినంతమాత్రాన, నీపై నాకున్న నమ్మకం పోతుందా? నీవు వున్నావు, ఇదంతా చూస్తున్నావు ' అని జగన్నాథుడైన  కృష్ణుడితో అంటున్నాడు. 


అతని భార్య మాత్రం ఏడ్చుకొంటూ ' ఆయన్ని కొట్టకండి. ఆయనకు ఏమీ తెలియదు. నిన్నరాత్రి ఒక  బ్రాహ్మణుడు వచ్చి ఈపళ్ళెంలో నాకు ఆహారం ఇచ్చి వెళ్ళిపోయాడు. మేము దొంగలం కాదు,'' అని  అంటున్నా వాళ్ళు వదల్లేదు. బంధును తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఆలయప్రాంగణంలో ఒక చెట్టు క్రింద ఏడ్చి ఏడ్చి పిల్లలను గుండెలకు హత్తుకొని బంధు భార్య సొమ్మసిల్లి పడిపోయింది. 


రాత్రి అయ్యింది. పూరి నగరంలోవున్న అప్పటి రాజు ప్రతాపరుద్రుడికి మధ్యరాత్రి ఒక కల వచ్చింది. '' అక్కడ నా భక్తుడు చెరసాలలో బాధపడుతుంటే , ఇక్కడ నీవు హాయిగా నిద్రపోతున్నావా ? అతను నాకు నిజమైన భక్తుడు. అతను నిరపరాధి. అతనికి బంగారు పళ్ళెంలో ఆహారాన్ని ఇచ్చింది నేనే , '' అని స్పష్టంగా ఎవరో చెప్పారు. ఆయన కాక ఇంకెవరు చెప్పివుంటారు ?


ఆ క్షణమే ప్రతాపరుద్రుడు జగన్నాథ మందిరానికి వెళ్ళి , అధికారులందరినీ రమ్మని ఆదేశించాడు. బంధు భార్య గురించి అక్కడివారు రాజుకు చెప్పారు. వారినీ అక్కడికి తీసుకురండి చెప్పి , స్వయంగా ప్రతాపరుద్ర రాజే జైలు గదికి వెళ్ళి , తాళాలు తీయించాడు. ఆ తరువాత ఆయన చేసిన పని అక్కడున్న వారిని దిగ్భ్రాంతికి గురిచేసింది. 


ఒడిషా మహారాజు అయిన ప్రతాపరుద్రుడు ,  బంధు మహంతి కాళ్ళకు సాష్టాంగ ప్రమాణం చేసాడు. అంతే కాదు , అక్కడిక్కడే బంధు మహంతిని పూరి జగన్నాథ మందిరపు వంటశాలకు ప్రధాన వంటవాడి గా నియమించాడు. అదొక్కటే కాదు , బంధు మహంతి కుటుంబానికి జగన్నాథ  దేవాలయం యొక్క ప్రధాన వంటవాళ్ళు గా శాశ్వత హక్కులు కల్పించాడు.ఇప్పటికీ బంధు మహంతి కుటుంబమే 494 సంవత్సరాలుగా జగన్నాథ దేవాలయంలో వంటపనిని నిర్వహిస్తున్నారు.


నమ్మక బాగుపడినవారు.. లేరు .. నమ్మి చెడినవారు లేరు.

.

..జై.. జగన్నాధ్ ....

నేటి వివాహవ్యవస్థ ....

                           ఓం శ్రీ మాత్రే నమః...


                                

                                    వివాహం....

బంధువులు.. ఆప్తులు...మిత్రుల సందడితో..ముక్కోటి దేవతలు ఆశీర్వాదం తో వేదోచ్ఛారణ మంత్రాలతో... భాజా భజంత్రీలతో అపురూపంగా జరిగే పెళ్లి వేడుక...నూతన వధూవరులు కోటి ఆశలతో ఒకటయ్యి...సంసారం లోకి అడుగిడుతున్నారు... ఇంత వరకు సజావుగా సాగిన వీరి జంట చిన్న చిన్న తగవులతో. మొదలయ్యి...తారాస్థాయికి గొడవలు జరుగుతున్నాయి..ఈ రోజుల్లో... స్వతంత్ర భావాలతో ఎవరికి వారు సంపాదనాపరులై వ్యక్తిత్వంతో గౌరవం గా మెలుగుతున్నారు..కానీ విలువలు లేని జీవితాన్ని కొనసాగిస్తున్నారు....కొందరు కొన్ని సంవత్సరాలుగా జంటగా కనిపిస్తున్నా ఇన్నర్ గా గొడవలు... ఒక స్టేజ్ లో విపరీత మానసిక స్ట్రగుల్ తో ఇరువురు ద్వేషాలతో పరుష పదాలతో వారిని వారు అందరి ముందు చులకన చేసుకుంటున్నారు... కొందరు మిత్రులు వారిని సమర్ధిస్తూ వారి గొడవలను పెంచుతారు .వైవాహిక బంధం.. మరియు జీవనానికి ఒకరికి ఒకరు కట్టుబడి ఉండట్లేదు సరికదా!నేను నీకు లోబడి ఉండను అనే వైఖరి కొన్ని జంటలలో చూస్తున్నాం...చిన్న చిన్న విషయాలకే విడాకులు దాకా... స్వతంత్ర జీవనం కావాలి.. ఇరువురికీ...పిల్లల భవిష్యత్ కోసం ఆగాం కానీ అంటూ ఈనాటి మహిళల ఆవేదన...భార్యాభర్తల ఇగో లతో కుటుంబ వ్యవస్థలో అపార్ధాలతో..అవమానించుకుంటూ పెద్ద వారికి తెలియకుండా వారిని లెక్కచేయకుండా.. స్వంత నిర్ణయాలతో జీవితాన్ని దుఃఖమయం చేసుకుంటున్నారు.

ఇలా నేను ఈ విషయం రాద్దాం అని ఒక పేరా రాసాను.. ఈరోజు whatsapp లో ప్రస్తుత పరిస్థితి అని ఒక లాంగ్ మెసేజ్ వచ్చింది.. చదివాను..కొంచం కఠినంగా ఎవరో రాసినా నిజమే కదా అని కింద కాపీ చేసాను...లాస్ట్ కొద్దిగా ముగింపు నేను రాసాను....


*ప్రస్తుత  పరిస్థితి*

------------------------------------------------

 *కోడళ్ళ కోసం పరితపిస్తున్న పేరెంట్స్...అర్హత లేకున్నా అందలం ఎక్కుతున్న అమ్మాయిలు!! కొడుకు కు ముప్ఫై ఏళ్ల లోపు పెళ్లి కాకుంటే ఆజన్మ బ్రహ్మా చారిగా ఉంటాడనే బెంగ తల్లి దండ్రులను పట్టి పీడిస్తుంది...ఎక్కడ చూసినా మహిళా జనాభా ఎక్కువైనా కూడా ముప్ఫై ఏళ్ల వరకు అమ్మాయిలు కూడా పెళ్లి ధ్యాస లేకుండా ఉద్యోగం లో ఎదుగుదల కోసం ...మరియు సమాన స్థితిలో కాబోయే భర్త ఉండాలని సమాజంలో ఉన్నత స్థాయిలో ఆ జంట ఉండాలనే పెళ్లి  ఆలస్యం గా చేసుకుంటున్నారు అమ్మాయిలు.  ఈ తరం అమ్మాయిలు చెట్టు ఎక్కి మరి పిల్లవాడి రేజ్యూం చూసి పెదవి విరవడంతో ఒక అమ్మాయికి పదిమంది నిష్పత్తి చొప్పున పెళ్లి చూపుల పరంపర కొనసాగుతూనే ఉంది!! అబ్బాయిలు బెండకాయ ముదిరినట్టు ముదిరి పోతున్న పెళ్లి జాడ లేక విలవిల లాడి పోతున్నారు...అమ్మాయిల డిమాండ్ కన్నా ఆమెను కన్న పేరెంట్స్ కోరికలు చాంతాడు అంత ఉండడం తో పెళ్ళి కొడుకులు క్యూ కడుతున్నారు...వాడికి పర్మినెంట్ జాబు ఉండాలి ఒక ఐదెకరాల పొలం ఉండాలి...హైదరాబాద్ లో కోటి రూపాయల అపార్ట్మెంట్ ఉండాలి...అమ్మాయి మెళ్ళో ఇరవై ఐదు తులాల బంగారం వేయాలి...పెద్ద వివాహ వేదిక లో వెయ్యి మందికి భోజనం పెట్టాలి... ఆన్న డిమాండ్ ముందు ఉంచడమే కాకుండా అమ్మాయి పెళ్లి అయ్యాకా కూడా జాబ్ చేస్తే ఆ అమ్మాయి సంపాదన తల్లి దండ్రులకు చెందాలి  ఆన్న ప్రధాన డిమాండ్ల ను తలవొగ్గి పెళ్లి పీటల మీద కు అమ్మాయి వచ్చే వరకు వణుకుతూ పెళ్లి పనులు చేసే మగ పెళ్లి వారి బాధలు ఏ పగ వాడికి కూడా వద్దు! ఒక్క తెలుగు రాష్ట్రాల లోనే కాదు దేశం మొత్తం మీద అమ్మాయిల కోరికలు గుర్రాలు అయి పరిగెడుతుంటే భవిష్యత్ భారతంలో వివాహ వ్యవస్థ ఉంటుందా లేక *సహాజీవన వ్యవస్థ* గా మారిపోతుందా అనే భయం విద్యాధికులకు, సంప్రదాయ వాదులకు పట్టుకుంది..ఎందుకంటే కాలేజీ దాటగానే ఉద్యోగం ఆఫర్ రావడంతో ఇరవై ఐదేళ్ళకే అమ్మాయిలకు ముప్ఫై వేల ఉద్యోగం దొరకడం...మూడేళ్లలో అది రెట్టింపు కావడంతో సొంత కారు...కావాల్సిన కాస్మెటిక్స్...మాడ్రన్ దుస్తులతో కార్పోరేట్ కల్చర్ లోకి వెళ్లి పోతున్న అమ్మాయిలు...పెళ్లి ధ్యాస మరిచి రంగుల ప్రపంచం లో విహరిస్తూ *ఆడింది ఆట పాడింది పాట* జీవితం కొనసాగుతుంటే, పెళ్లి మీద ద్యాస ఎందుకుంటుంది?!...దానికి తోడు అమ్మాయిల కొలీగ్స్ లలో ఇద్దరో  ముగ్గురో డైవర్స్ కేసులు ఉంటే వాళ్ళ ప్రభావం వీళ్ళ మీద పడి, "పెళ్లి  చేసుకొని వాడి చెప్పిన మాట వినే కన్నా సోలో లైఫ్ బెటర్" అనే అమ్మాయిల సైకాలజీ వల్ల పెళ్ళిళ్ళు అటు మొగవారికి ఇటు ఆడవారికి సరియైన వయసులో జరగపోవడం, దానికి తోడు అబ్బాయి *మంచి వాడా చెడ్డవాడా* అని  తెలుసుకోవడానికి ఆర్నెల్లు *సహజీవన యాత్రలు* చేసి రావడంతో మోజు తీరి మరో *ఎర్నర్* కోసం వెతుకుతున్న ఈ తరం యువతుల వల్ల వివాహ వ్యవస్థ పెద్ద కుదుపునకు లోనవుతుంది...*కులం చెడ్డ సుఖం దక్కాలనే* పెద్దల మాట పెడచెవిన పెట్టి, రంగు రూపు చూసి వాడి బుట్టలో పడి రిజిష్టర్ మ్యారేజ్ చేసుకొని వాడు *సకల కళా వల్లభుడు* అని తెలుసుకొని అమ్మ గారి ఇంటికి చేరుకుని లబోదిబోమంటే పోయిన మృదుత్వం వస్తుందా?! ఇలా ముప్ఫై ఏళ్లు గడిచాకా డబ్బున్న ఏజ్ బార్ వాడు దొరికితే వాడితో నైనా సరిగా సంసారం చేస్తుందా అంటే అదీ లేదు! పిల్లలు పుడితే అందం ఎక్కడ మసి బారుతుందో అని ముప్ఫై ఐదేళ్ల వరకు పిల్లలు కనకుండా టాబ్లెట్లు మింగే అమ్మాయిల అతి ప్రవర్తన వల్ల మనవలు - మనవరాళ్లు కావాలనుకునే  పేరెంట్స్ ఆశలు అడియాశలు అయి పోతున్నాయి...2024 లో యువతుల *పెళ్లి సందడి* ముప్ఫై ఏళ్ళు దాటుతుంది అంటే అమ్మాయిల్లో పెళ్లి ద్యాస కన్నా సంపాదన ద్యాస ఎక్కువగా ఉందనే విషయం తేట తెల్లమవుతుంది...! ఏ వయసులో ఆ వయసు ముచ్చట తీరాలని పెద్దలు ఊరికే అనలేదు...అది లేకే నేటి పిల్లల పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నాయి...ఎంత మంచి ముహూర్తం పెట్టినా కూడా పెళ్ళిళ్ళు మూడు నాళ్ళ ముచ్చటగా కావడానికి ఆడపిల్లల తండ్రులు మొదటి కారణం కాగా *పిల్లవాడు సెటిల్* కాలేదు...అని అబ్బాయి ఆదాయం పై ఆశలు పెంచుకున్న తల్లిదండ్రులు రెండో కారణం! ముప్ఫై ఏళ్ల వరకు మహా అయితే అదా చేసుకుంటే యాభై లక్షలు ఉంటాయి కాబోలు *కోటి* ఆశలు తల్లి దండ్రులు ఉంటే ఆ కోటి వచ్చేసరికి నెత్తి మీద జుట్టు ఊడి పోతూ లేక...చిక్కి శల్యమైన *అతన్ని* ఏ పిల్ల పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తుంది?...ఆడపిల్లలు అందరూ మహేష్ బాబు లాంటి అబ్బాయి...ఆయన లా ఆడి కారు ఉండాలని కోరుకోవడంలో  తప్పులేదు.... కానీ అలాంటి వరుడు వేటలో ఉన్న ఎంపిక అయ్యే సరికి ఈడు పోయి అనాకారి దొరికితే వాళ్ళ ఆశలు అడి యాశలు అయి పెళ్లయిన ఏడాదికే కోర్టు మెట్లు ఎక్కుతూ డైవర్స్ ఆట మొదలు పెడుతున్నారు!🌷🌷🌷🌷🌷🌷🌷ఇక పవిత్ర భారత దేశంలో ఇప్పుడు అత్తల ఆరళ్ళ కన్నా కోడళ్ళ ఆరళ్ళు ఎక్కువవుతున్నాయి...   పెళ్లయిన ఆర్నేళ్ళకే వేరు కాపురం పెట్టి, అత్త మామలు రాకుండా సూటి పోటి మాటలు అంటూ దూరం పెడుతున్న వనితల అతి ప్రవర్తన వల్ల కుటుంబ వ్యవస్థ బీటలు వారిపోయింది...వృద్ధాప్యంలో కొడుకు కన్నా ఇంటి ముందు శునకం పెంచుకోవడం బెటర్ అనే మైండ్ సెట్ లో ఓల్డ్ ఏజ్    పేరెంట్స్ ఉంటున్నారు...పొరపాటున ఆడపిల్లల కన్న తల్లి దండ్రులు కూడా అటు అల్లుడి పంచన చేరలేక...చేరినా కూడా అక్కడ అడ్జెస్ట్ కాలేక మానసిక వేదన తో కుమిలి  పోతున్నారు...ఇక ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుళ్లు ఉన్న ఇంట్లో.... పేరెంట్స్ బాధ వర్ణనాతీతం...ఆస్తుల పంచాయతీలు ఒక వైపు ఆదరణ లేక *వృద్ధ పక్షులు* ఒకరికి ఒకరై ఓదార్చు కుంటూ దేవుడు ఎప్పుడు తీసుకు వెళ్తాడా? అని ఎదురు చూస్తున్నారు! పదేళ్లు ఎత్తుకొని కాలికి ముల్లు అంటకుండా పెంచిన పిల్లలు...సంపాదన పరులు అయ్యాక తల్లి దండ్రులకు మంచి చెప్పులు కూడా కొనివ్వని దౌర్భాగ్య పరిస్థితి నేడు కనబడుతుంది...! నాలుగు రోజులు పెద్ద కొడుకు...నాలుగు రోజులు బిడ్డ దగ్గర ఉంటే వాళ్లకేం తోడి పెడుతున్నారని కొడుకు - కోడళ్ళ వేధింపులతో ఒంటరి జీవనంలో ఇమడలేక....అటు పిల్లలు ఆదరణ కోల్పోయి  కళ్ళ   వెంట ధారగా కన్నీళ్లు కారుస్తూ ఎవరూ ముందు పోయినా మరొకరికి కష్టం అని *భార్యభర్తలు* ఒకరికొకరం ఉన్నామని ధైర్యం చెప్పుకుంటూ జీవనం వెళ్ళ బోస్తున్నారు...! చాలా మంది అత్తమామలు కొడుకు కోడలు నుండి ఆదరణ -  ఆప్యాయతతో కోరుకుంటారు. చాలా సందర్భాల లో వాళ్లకు అది దూరం అవుతుంది..

మన 'ఆధునిక సమాజంలో అత్త మామలు అడ్జెస్ట్ కాలేక పోతున్నారు...ఇదీ చాదస్తం అనే కన్నా *ప్రేమ* ఎక్కువవడం అంటే కరెక్ట్!

భారతదేశంలోని కొంతమంది కోడలు ఎదుర్కొంటున్న మానసిక, ఆర్థిక సమస్యలు దీని వల్లే తలెత్తుతున్నాయి...అత్త పెత్తనం కోడలు సహించదు...తన కోడలు తన చెప్పు చేతల్లో ఉండాలని కోరుకుంటున్న తల్లి తన కూతురు మాత్రం *స్వేచ్ఛ* లేదు అని ఆరాట పడుతుంది...మహిళల్లో ఈ ద్వంద వైఖరి వల్లే కోడళ్ళు శాడిస్ట్ లుగా తయారవుతున్నారు...

అత్తమామలతో జీవించడం వాళ్లకు పెద్ద సవాళ్లు గా అనిపిస్తుంది.

ఈ తప్పుడు భావాలు అనాదిగా ఉంటూనే ఉన్నాయి..*కోడలు బిడ్డ కాదు...అల్లుడు కొడుకు కాదు* అనే  మైండ్ సెట్ ఇంకా వందేళ్లు అయినా మారేట్టు లేదు!  అత్తగారు - కోడలు మధ్య సంబంధం నిజానికి అందంగా ఉండాలి... కానీ తరచుగా వారి మధ్య ఘర్షణ వాతావరణం, ఆధిపత్య పోరాటం కొనసాగుతూనే ఉంటుంది..ఈ తప్పుడు భావాలు ఇద్దరి మధ్య మంచితనాన్ని నాశనం చేస్తున్నాయి. బహుశా, అత్తమామల జోక్యం, కొడుకు పై పెత్తనం వల్ల తాను *స్వాతంత్ర్యం* కోల్పోతున్నాననే అభద్రతా భావం లో కోడలు ఉంటుంది.. ఆ భయాలను ఆమె తల్లి దండ్రులు ఎక్కువ చేయడం వల్ల ఇంట్లో అశాంతి ఎక్కువవుతుంది.. తన కుమార్తె  తన అత్తమామలతో సుఖంగా జీవించాలని కోరుకునే తల్లి దండ్రులు ఉంటే ఇలాంటి అపశృతులు రావు...కూతురికి ఒక న్యాయం కోడలికి ఒక న్యాయం ఉండాలని కోరుకోవడం వల్లే ఈ అశాంతి!!

  ఒక కోడలు మరియు ఆమె అత్తగారి మధ్య ఏర్పడే సమస్యలు 'పోటీ' పడుతుంటాయి!  ఇది వివాహవ్యవస్థలో చాలా సమస్యలను కలిగిస్తుంది!  తల్లి మరియు భార్య ఇద్దరి మధ్య కొడుకు నలిగి పోతాడు...తల్లి కన్నా పెళ్ళామే బెల్లం అనుకున్న మరుక్షణం కొడుకు ఇంటి వైపు తల్లి చూడదు!!  అటు తల్లి ఇటు పెళ్ళాం మధ్య మానసిక వేదనకు గురయ్యే పుత్ర *రత్నాలు* కూడా కోకొల్లలు!!🌷🙏🌷🌷🙏🙏🌷🙏🌷🙏🙏

ఈ ఇంటికి నేను మొదటి కోడలు ను అనే ఇగో తల్లిలో బలంగా ఉంటుంది..

 35 సంవత్సరాలకు క్రితం ఈ ఇంటి పరువును నిలబెట్టాను...అలా నువ్వు అణిగి మణిగి ఉండాలని అత్తా కోరుకోవడంలో తప్పు లేదు కానీ  ఆనాటి అత్తలు వేరు ఈ  నాటి కోడళ్ళు వేరు! ఆనాటి అత్తలకు కావాల్సిన అస్తి ఉండేది...దానికి చూసుకోవడానికి కోడలు కు ఇంటి బాధ్యత అప్పగిం చేది. అయిన ఆనాటి అత్త కోడళ్ళు మధ్య కూడా అభిప్రాయ బేధాలు ఉండేవి...ఇంటి నిండా పనిమనుషులు ఉన్నారు కాబట్టి ఇంటి గుట్టు  బయట పడలేదు... ఇప్పుడు అలా కాదు కోడళ్ళు సంపాదన పరులు అయ్యారు. అత్త కొంగు పట్టుకు తిరగాలి అంటే ఏ కోడలు ముందుకు రాదు!   ఇప్పుడు కట్న కానుకల కన్నా *స్వేచ్ఛ జీవితం*, కోరుకుంటున్న ఈ తరం జంటల వల్ల మానవ సంబంధాలు ఆప్యాయతలు గంగలో కలిసి పోయాయి...మనవలతో అడుకోనివ్వని కోడళ్ళు...ఆతి గారాబం చేయవద్దని చెప్పే కొడుకుల వల్ల తాత మనవల ఆత్మీయత మసి బారి పోయింది!

కొత్తగా పెళ్లయిన వధువులు తమకు ఇష్టమైన దుస్తులను ధరించడానికి,  లేదా వారి తల్లిదండ్రులను ఎప్పుడు తన దగ్గరకు వచ్చి పోతుండాలి అని కోరుకుంటుంది తప్ప అత్తా మామలను ఆదరించాలని అనుకోక  పోవడం వల్లే అత్త కోడళ్ళ మధ్య బాగా గ్యాప్ పెరిగిపోతుంది! ఒక వేళ కొడుకు ఇంటికి వెళితే   ఆలస్యంగా నిద్ర లేచిన  కోడలు... చెప్పులు వేసుకొని ఇంట్లో తిరిగే కోడలు...పూజలు పునస్కారాలు  లేకుండా, స్నానం ఆచరించకుండానే వంటింట్లో దోసెలు వేసే కోడళ్ళ *పనితీరు* వంట బట్టలేక ఏదైనా మాట అత్త గారు అంటే తాను స్వేచ్చలేని పంజరంలో చిలుకను అయ్యాయని ఏడుస్తూ బెడ్ రూం లో అలక పాన్పు ఎక్కుతున్న సుందరాంగి మాటలు విని తల్లి పై కోపగిస్తున్న కొడుకుల ప్రవర్తన వల్ల కూడా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ బీటలు వారిపోతుంది!! అత్తమామలు కొడుకు ఇంటికి వస్తే *హై-సెక్యూరిటీ జైలు* లో బంధించి నట్టు కోడలు ఫీలు అవుతుంది.. అత్త 'నియమాలు' కోడలు కు నచ్చవు...కోడలు తీరు అత్తకు నచ్చదు...

పిల్లల యొక్క ఏకైక బాధ్యత ఎలా కోడలు తీసుకుంటుందో 

అత్తమామలతో కలిసి జీవించడం కూడా బాధ్యత అనుకునే కోడళ్ళు ఈ కాలంలో చాలా తక్కువ!  

వృద్ధ అత్తమామలతో కలిసి జీవించడం ప్రతి కోడలికి ఎంతో విజ్ఞాన దాయకం., ఎందుకంటే వారి ప్రతి చిన్న విషయం పట్ల శ్రద్ధ వహించడం వాళ్ళు చేస్తారు...తెలివైన కోడలు అయితే అత్తా మామలతో ప్రేమ గా ఉంటే సగం పనిభారం తగ్గినట్టే! అత్త గారే వంట చేస్తుంది...మామ గారే పిల్లలను బడికి పంపే బాధ్యత తీసుకుంటారు...కానీ వంటింట్లో ఏదో *దోచుకుపోతుంది* అని భయపడి కిచెన్లోకి రానివ్వని కోడళ్ళు...కోడలు ఇంట్లో సమకూర్చిన ప్రతి వస్తువు తన కూతురు ఇంట్లో ఉండాలని అనుకునే అత్తల వల్ల ఈ గ్యాప్ ఎక్కువవుతూనే ఉంది! భారతదేశంలో పవిత్రమైన కర్తవ్యంగా అత్త కోడళ్ళు ఉండాలి... కానీ ఈ తరం మహిళల లో మార్పు వస్తేనే కుటుంబ వ్యవస్థ మళ్ళీ చిగురిస్తుంది..సేకరణ...

ముగింపు......

అమ్మాయి.. అబ్బాయి తల్లి తండ్రులు వివాహం దాని ప్రాధాన్యత గురించి ముందుగా వారికి వివరించి, ముందు తరాలకు ఆదర్శంగా నిలవాలి మీ కుటుంబం అని వారికి ఆశీర్వాదాలతో దీవెనలు ఇవ్వాలి...ఉమ్మడి కుటుంబం యొక్క విలువలు వివరించగలగాలి..మన ప్రయత్న లోపం లేకుండా మనం చెప్పగల వివరణ చెప్పాలి...ఇక వారి వారి పరిధిలో వారిని వదిలేయాలి...

                  సర్వే జనా సుఖినోభవంతు....