tag:blogger.com,1999:blog-26409086861543585052024-03-14T09:58:21.491+05:30వనితావని వేదికనీలాకాశంలో ఓ చిన్న మబ్బు తునక నుండి జాలువారిన చిరుజల్లులా హృదయనివేదిత ఈ వనితావని వేదిక.visalakshihttp://www.blogger.com/profile/12353866459824269934noreply@blogger.comBlogger325125tag:blogger.com,1999:blog-2640908686154358505.post-43934203804103475132023-06-18T18:48:00.001+05:302023-06-18T18:48:54.808+05:30నాన్నకో ఉత్తరం.....మణిగాడి లేఖ...<p><span style="color: #ff00fe;"> నాన్నకో ఉత్తరం...</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p></p><div class="separator" style="clear: both; text-align: center;"><a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjS0whg129nA4h6Y6wk9tAtlwvnJbmbB39i9tnCFas_cns5t5etGc_uoSHCOplI1BIKc2TGUe0U6_ehiDUDR2TJGeErhj8uvm1Fkp8gBvOdoeSynU8aQGHIIe5N9wT_O5msmLw9xITpHbfXaIzAL8N5MX4iAjSZzbQCi4nfeybHV_7evMdd-sC_PyUq/s960/IMG-20230618-WA0004.jpg" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="960" data-original-width="580" height="320" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjS0whg129nA4h6Y6wk9tAtlwvnJbmbB39i9tnCFas_cns5t5etGc_uoSHCOplI1BIKc2TGUe0U6_ehiDUDR2TJGeErhj8uvm1Fkp8gBvOdoeSynU8aQGHIIe5N9wT_O5msmLw9xITpHbfXaIzAL8N5MX4iAjSZzbQCi4nfeybHV_7evMdd-sC_PyUq/s320/IMG-20230618-WA0004.jpg" width="193" /></a></div><br /><span style="color: #ff00fe;"><br /></span><p></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">మీకంటూ ఒక రోజుని కేటాయించి ఆరోజు మీకు శుభాకాంక్షలు చెప్పాలని తహ తహలాడే ఎంతో మంది అమ్మాయిలని అబ్బాయిలని చూస్తూ, ఆశ్చర్యపోతూ , ఈరోజు ప్రత్యేకంగానో, ప్రత్యక్షంగానో,పరోక్షంగానో అందరిచేత అందరి నాన్నలు శుభాకాంక్షలు అందుకొంటుంటే, మరి నేనెలా అందజేయను నా శుభాకాంక్షలు మీకు? "నేను మీదగ్గరికి వచ్చేయనా నాన్నగారు "? అని అడుగుదామనిపిస్తొంది , మరి నేను వచ్చేస్తే ..మీ మనవడు, మనవరాలు ఎలా?</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> " ఉత్తరం అంటే ఎదుటి మనిషి మనముందే ఉండి మనతో మాట్లాడుతున్నట్లు ఉండాలి! ఏ నది వడ్డునో కూర్చుని, వెచ్చటి టీ తాగుతూ, గుప్పున సిగరెట్ పొగ, చేతిలో చెలి ఉత్తరం, పక్కన నెచ్చెలి అలా అలలా తీయగా మాట్లాడ్తున్నట్లుగా ఉండే భావన ఎంతో బాగుంటుందిట. చలంగారు ప్రేమలేఖలు చెప్తాయి.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">మేము ఉత్తరాలు రాసే అవసరం లేకుండా ఎప్పటికప్పుడు క్షేమ సమాచారాలు తెలుసుకొనే అవకాశం మా చేతిలో ఉండేట్టుగా అరచేతిలోనే ప్రపంచాన్ని చూపించేస్తొంది ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానం.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">మరిలా ఈ సెల్ ఫోన్లలో మాట్లాడుకొంటూ, కంప్యూటర్లో శుభాకాంక్షలు అందుకోంటూ అందరూ అధునిక సాంకేతికపరిజ్ఞానం ఆసరాగా అందరికి దగ్గర్లో ఉంటున్నట్టుగా భావించి, అంత ఆనందంగా పరస్పర శుభాకాంక్షల వెల్లువ కురిపిస్తుంటే నువ్వేంటి పాతకాలంలా ఉత్తరం వ్రాస్తున్నాననుకొంటున్నారా నాన్నగారు? " ఏం చేయను? వెళ్తూ వెళ్తూ కనీసం ఒక్కమాట చెప్పారా నాకు, నేను "వెళ్తున్నానమ్మా" అని, (అయినా నా పిచ్చి కాని , మీరు వెళ్ళేప్పటికి ఈ email కాని, ఈ సెల్ ఫోన్లు కాని ఉన్నాయా నాన్నగారు, నంబరు అడగడానికి గాని, మెయిల్ అడ్రస్ అడగడానికి గాని) "నాన్నగారు స్కూలుకి వెళ్తున్నాను" అంటే "తప్పమ్మా వెళ్ళొస్తాను అనాలి, ఒక్క హాస్పిటల్ లో ఇలా అనకూడదు" అని చెప్పిన మీరు ఎక్కడ నేను "నాన్నగారు వెళ్ళొస్తాను అనండి" అని సతాయిస్తాననే కదూ మాటవరసకన్నా నాకు "వెళ్తున్నాను " అని చెప్పలేదు.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> అవును నాన్నగారు! ఒక్క విషయం ఎన్నాళ్ళుగానో అడగాలని అనుకొంటూ ఎప్పటికప్పుడు దాటేస్తున్నాను. ఆరోజు మీకు గుర్తుందా? అమ్మా , తమ్ముడు వరలక్ష్మి వ్రతం అని ఊరెళ్ళారు. చిన్నదాన్ని నాదగ్గిర ఉంచమని మీరు అమ్మదగ్గిర మంకు పట్టు పట్టారు, ఎందుకని ? "ఆడపిల్లలు ఇద్దరూ ఉండాలి ఇంటి మహాలక్ష్ములు, వరలక్ష్మీ వ్రతానికి వాళ్ళిద్దరూ ఉండాలి అన్నా కాని, వద్దంటే , వద్దని వాదన చేసి నెగ్గారు. ఎందుకు నాన్నగారు, మీరు అంత బతిమాలి నన్ను మీదగ్గిర అట్టేపెట్టుకొని, జాగ్రత్తగా చూసుకొంటానని మాట తప్పారు కదూ.. చూసుకోలేకపోయానని, అమ్మకి చెప్పెస్తే సరిపోయేది కదా, దానికి మీరలా వెళ్ళిపోవడమెందుకు? .</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">నాకింకా గుర్తుంది నాన్నగారు! తెల్లవారుఝామునే నన్ను లేపి తలంటు పోసి, నీకేమి తెచ్చానో చెప్పుకో చూద్దాం అని కళ్ళు మూసి , నాతో దోబూచులాడి మరీ చూపించిన ఆకుపచ్చ గళ్ళ పట్టులంగా కళ్ళల్లో నిన్నో మొన్నో కొని తెచ్చినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. అదివేసి, జడలు వేయడానికి విఫల ప్రయత్నం చేసి, " నాకు రాదురా అత్తయ్య చేత వేయించుకో " అని అన్నప్పుడు, పరిగెత్తుకొని వెళ్ళి అదేదో హక్కులా "అత్తయ్యా మా నాన్నగారు జడ వెయ్యమంటున్నారు " అంటే , "పండగ పనిలో ఉన్నానిప్పుడు, నా దగ్గిరకి పంపడమేమిటే?" అని విసుక్కొంటూ అత్తయ్య జడ వేస్తే , "ఇదిగోండి, పాపని విసుక్కొవద్దు, పసిపిల్ల దానికేమి తెలీదు " అని నన్ను తీసుకొచ్చుకొన్నారు కదూ.. నిన్న మొన్న జరిగినట్లుండే ఏ విషయాన్ని మనసుపొరల్లోంచి బయటికి పంపలేక పోతున్నాను. మరి పక్కింటావిడ విసుక్కొంది అని, అలా చెప్పి నన్ను తీసుకెళ్ళిన మీరు ఆరోజు సాయంత్రమే ఎందుకు వెళ్ళిపోయారు? "మావయ్యా వాళ్ళింటికి వెళ్తున్నాను" అన్నారు. ఆ తరువాత ఈరోజు వరకూ ఎంత మంది మీరు లేరని అలుసుగా తీసుకొని నన్ను విసుక్కొన్నారో మీకు తెలుసా? మీరు చెంతనుంటే ఎవరన్నా ఎమన్నా అనేవారా? ఎందుకొదిలేసారలా?</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> మొన్నే అనుకోకుండా ఎవరో ఒక sms పంపించారు. అది చదువుతుంటే అసలు తప్పు మాది కూడా ఉందనిపిస్తొంది నాన్నా!.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ఒక చిన్న పాప, వాళ్ళ నాన్న అలా నడుస్తూ ఉంటే.... ఒక చిన్న పిల్ల కాలువ దాటాల్సివచ్చిందిట. అప్పుడు వాళ్ళ నాన్న అన్నారుట:</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> "చిన్నారి! నన్ను జాగ్రత్తగా పట్టుకోమ్మా! గబుక్కున ఎక్కడన్నా కాలువలో జారిపడ్తావేమో! జాగ్రత్త" అని చెప్తే ....ఆ చిన్నారి అందిట</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> "నాన్నా! నేను నీ వేలు పట్టుకొంటే భయానికి గబుక్కున జార విడిచేస్తానేమో, నువ్వే నా వేలు పట్టుకో.. నేనెక్కడపడిపోతానో అని వడిసి పట్టుకొంటావు, అప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉంటావు, నేను సేఫ్" అని అందిట.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ఆ చిన్నారి తెలివితేటలు నిజానికి నా(మా)కు లేవేమో కదా నాన్నగారు, మేము మీవేలు వదిలేసాము. మీకు కోపమొచ్చింది కదూ.. "తెలియక చేసిన తప్పు నాన్నగారు ! మా వేలు పట్టుకోండి నాన్నగారు" అని చెప్పాడానికి అందనంత దూరానికి వెళ్ళిపోయారు. ఉండిలేక ఉన్నది మీరే, ఉన్నా కూడా లేనిది నేనే. మిమ్మల్ని మా వేలు పట్టుకోనీయకుండా , నేనే మీ వేలు పట్టుకొని నడుద్దామన్న స్వార్థం మమ్మల్ని ఇలా శిక్షించింది. అయినా... ఈరోజు ప్రత్యేకమంటూ అందరూ శుభాకాంక్షలు చెప్తుంటే, నేను మటుకు మౌనం వహించడమెందుకని, ఇంకో ఇన్ని జన్మలకి మీకే కూతురిగా పుట్టాలని, అప్పుడు ఆ భగవంతుడిని మిమ్మల్ని పూర్ణాయుష్కుడిని చేయాలని, మీరే మావేలు పట్టుకొని నడిపించాలని మనస్పూర్తిగా కోరుకొంటూ........</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ఇక్కడ లేని నాన్నగారికి! ఇక్కడే ఉన్న నా శుభాకాంక్షలు. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ఎప్పటికీ మీ కూతురే అయిన మణిగాడు</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">*******</span></p><p><span style="color: #ff00fe;">మా చెల్లి రాసిన ఈ లేఖ నా మనసును కదిలించింది.. అందుకే ఇలా బ్లాగులో...నాన్న గారికి నా నమస్సులు..🙏🙏🙏...</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p>visalakshihttp://www.blogger.com/profile/12353866459824269934noreply@blogger.com3tag:blogger.com,1999:blog-2640908686154358505.post-44243475395141189562023-02-03T11:23:00.000+05:302023-02-03T11:23:21.347+05:30అద్వైతం - విశిష్టాద్వైతం<div class="separator" style="clear: both; text-align: center;"><span style="color: #ff00fe;">ఓం శ్రీ గురుభ్యో నమః</span></div><div class="separator" style="clear: both; text-align: center;"><span style="color: #ff00fe;"><br /></span></div><div class="separator" style="clear: both; text-align: center;"><a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhihc_XHRCWBpBll7dZyYM8j9rE5zc7AUCouu8kDxEPsQdR1mBCa_wlCWmQxsjF8es24WC88Thjp4pQ-OtZUiPSh8ViBiFZ_OcjdJRUP6--WkJs9g_bYFpOkiRoRsnVoMbsPn0loSsuCrOpkp8_x4truDPkLtrU4zkyTR9ymQ1BIKrfTlhDzMvogtTp/s554/20230202_213200.jpg" style="margin-left: 1em; margin-right: 1em;"><span style="color: #ff00fe;"><img border="0" data-original-height="554" data-original-width="552" height="320" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhihc_XHRCWBpBll7dZyYM8j9rE5zc7AUCouu8kDxEPsQdR1mBCa_wlCWmQxsjF8es24WC88Thjp4pQ-OtZUiPSh8ViBiFZ_OcjdJRUP6--WkJs9g_bYFpOkiRoRsnVoMbsPn0loSsuCrOpkp8_x4truDPkLtrU4zkyTR9ymQ1BIKrfTlhDzMvogtTp/s320/20230202_213200.jpg" width="319" /></span></a></div><span style="color: #ff00fe;"> 🙏🙏🙏...<br /></span><div class="separator" style="clear: both; text-align: center;"><span style="color: #ff00fe;"><br /></span></div><div class="separator" style="clear: both; text-align: center;"><span style="color: #ff00fe;"><br /></span></div><span style="color: #ff00fe;"><br /></span><p><span style="color: #ff00fe;"><span>అద్వైతం - విశిష్టాద్వైతం / జగత్ గురువులు జగతికి వెలుగులు</span>.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">శ్రీ శంకరాచార్యులు - అద్వైతం - సర్వ భౌతిక ప్రపంచానికి బ్రహ్మమే ఆధారం.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">శ్రీ రామానుజాచార్యులు - విశిష్టాద్వైతం</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> సర్వ భౌతిక ప్రపంచంతో బ్రహ్మం అంతర్లీనమై అంతా ఒక్కటే.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> </span></p><p><span style="color: #ff00fe;"> జగత్తులో అనేక రకాల ఆధ్యాత్మిక సాధనాలున్నాయి. ఇందులో ఏది ఎవరికి తగినదనే దాన్ని సాధకుని యోగ్యత, అవగాహన స్థాయిని బట్టి నిర్ణయించి, అది వారికి ఉపదేశించేది గురువే. గురువు అంటే అజ్ఞానాన్ని దూరం చేసేవాడని అర్థం. ‘గు’ అంటే చీకటి. ‘రు’ అంటే ప్రకాశం. గురువు అంటే చీకటిని తొలగించి వెలుగుతో ప్రకాశింపచేసేవాడు అని అర్థం. జ్ఞాన మార్గ దర్శకుడైన గురువు స్థానం పరమ పవిత్రమైనది. జ్ఞానాన్ని ఆర్జించడం కన్నా సద్గురువు చరణారవిందాలను సేవించడం, అనుగ్రహాన్ని పొందడం ఉత్తమమైనది.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">వేదాంతులందరూ జరిపే తత్వవిచారం జీవాత్మ, పరమాత్మల అంతర్లీనత ప్రాతిపదికన జరుగుతుంది. అవి వేరుకాదన్న ఏకాభిప్రాయమే వారందరిలో కనపడుతుంది. ప్రామాణికాలైన వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత- అద్వైతం చెప్పేదంతా పొందుపరచి బ్రహ్మజిజ్ఞాసులకు అందుబాటులో ఉంచాయి. వేదాంతులైన మహాగురువులు ఆదిశంకరుడు, రామానుజుడు ఇద్దరూ జీవాత్మపరమాత్మల సంలీనమే అద్వైతానికి మూల సూత్రంగా అంగీకరిస్తారు. ఆ రెండింటి స్వరూపం మీద, ఆ సంయోగం జరిగేది ఎలాగో, అందుకు వారిచ్చే వివరణలు మాత్రం భిన్నమైనవిగా ఉన్నట్లు అనిపిస్తాయి.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">జీవాత్మ పరమాత్మలు వేరుకాదని చెప్పే తిరుగులేని అద్వైతం శంకరుడిది. ‘లోకమాయ’, ‘కర్మసిద్ధాంతం’ కేంద్ర బిందువులుగా ఆయన అద్వైత వాదనలుంటాయి. జీవుడు, దేవుడు ఒకరేనన్న నిజాన్ని మాయా ప్రభావంతో మనిషి గుర్తించలేడంటారు శంకరులు. చీకటిలో చూసిన తాడును పాము అనుకుని, వెలుతురు రాగానే అది పాము కాదు తాడు అని తెలుసుకున్నట్లే- లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు అనిపింపజేసే ‘సర్పరజ్జుభ్రాంతి’లాంటి అటువంటి మాయను అధిగమించలేనంత కాలం ‘అవిద్య’తో ఉండిపోతాడని చెబుతారు. జీవితకాలమంతా అతణ్ని వెంటాడుతూ వేధించే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలకు అది మూలరూపమంటారు. ఆత్మశక్తికి తప్ప అవి లొంగుబాటులోకి రావని తెలుసుకొమ్మంటారు. కార్యం లేకుండా ఫలితం ఉండదని, ఫలితం ఉండబట్టే అందుకొక కారణం ఉండితీరాలని ఆయన విశ్వసిస్తారు. వర్తమానంలో మనిషికి ఎదురయ్యే పర్యవసానాలన్నీ కార్యకారణాలతో ముడివడిఉన్నవేనని చెప్పే కర్మసిద్ధాంతం, ఆయన అద్వైతవాదనలన్నింటిలో కీలకమై కనిపిస్తుంది.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">శంకరులు- నిద్రాణమై తనలోనే ఉన్న ఆత్మను జ్ఞానభక్తి సాధనలతో జాగృతం చేయమంటారు. అప్పుడే అది బ్రహ్మంతో పునరేకీకరణ పొందగలదంటారు. జ్ఞానానికి, భక్తికి సమగ్రమైన వివరణలుండే సౌందర్యలహరి, శివానందలహరి, వివేకచూడామణి వంటి రచనలు శంకరులవే. అహంకారభావనలు తొలగిపోవటమే జ్ఞానమని చెప్పే సారాంశమే ఆ రచనలన్నీ ప్రస్ఫుటిస్తాయి.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">రామానుజులు వైదిక పరమైన దైవత్వాన్ని గురించి చెప్పే అద్వైతాన్ని ఆమోదిస్తారు. వేదోక్తమైన ఆస్తికత్వాన్ని సమర్థించేదాన్ని ‘విశిష్టాద్వైతం’ అన్నారు. దేహం, ఆత్మ రెండూ దైవ స్వరూపాలే అంటారాయన. శంకరులు చేసినట్లు- సగుణ నిర్గుణ బ్రహ్మలుగా, బ్రహ్మాన్ని వేరుచేసేందుకు అంగీకరించరు. అద్వైతానికి మౌలిక సూత్రమైన జీవాత్మపరమాత్మల సంవిలీనాన్ని మాత్రం వ్యతిరేకించరు. జీవుడు, పరమాత్ముడు ఒకరేనన్న ప్రగాఢ విశ్వాసంతో జీవుణ్ని పరమాత్ముడిని వెదకమంటారు. కర్మరాహిత్యం అయినప్పుడే జీవుడికి ‘శుద్ద సత్వస్వరూపం’ లభిస్తుందని, ‘బ్రహ్మశరీరం’ అంటే అదేనని, ఆ శరీరంతోనే అతడు అంతర్యామిలో విలీనం కాగలడన్నారు. ‘వైకుంఠపాప్త్రి’ అదేనంటారు.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">సామాజిక స్పృహ కనపడని ఆధ్యాత్మికతను విశిష్టాద్వైతం ప్రోత్సహించదు. రామానుజులు-మనుషుల మధ్య సంచారం చేస్తూ, కులం మూఢనమ్మకాలకు అతీతంగా వారిని కొనసాగమంటూ ఉద్బోధించారు. దేవాలయాల్లో ప్రవేశానికి అందరూ అర్హులేనన్నారు. సామూహికంగా ప్రజలు, భగవత్సేవలు నిర్వహించమన్నారు. విశిష్టాద్వైతానికి వివరణలన్నీ ఆయన రచించిన శ్రీభాష్యం, వేదాంత సాగరం, వేదాంత సంగ్రహాల్లో కనపడతాయి.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">శంకరుడు అది అద్వైతం అన్నా, రామానుజుడు విశిష్టాద్వైతం అని చెప్పినా, వారిద్దరూ భగవంతుడైన బ్రహ్మాన్ని చేర్చేది అద్వైత మార్గం ఒక్కటేనని తెలిసిన మహాజ్ఞానులు. అది సూత్రీకరించి మనిషికి సులభగ్రాహ్యం చేసిన మహాపురుషులు.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">మన సనాతన ధర్మాన్ని కాపాడటానికి జన్మించిన</span></p><p><span style="color: #ff00fe;">మహనీయులు,ఈ రోజు మన ధర్మం ఉందంటే</span></p><p><span style="color: #ff00fe;">అది వారు ఏర్పరిచిన బాట,క్షేత్రాలు,మార్గదర్శనం తోనే అని మనం తెలుసుకోవాలి.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">మన భారతీయ సంప్రదాయంలో ‘గురు’ శబ్దం చాలా మహత్తరమైనది. ఆధ్యాత్మిక వేత్తల్ని గురువులుగా భావించే విలక్షణ సంస్కృతి మనది. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">విశిష్ట దర్శనాలతో ప్రజానీకానికి మార్గదర్శనం చేసిన శంకరాచార్యులు, రామానుజాచార్యులు ఇరువురూ వైశాఖ శుద్ధ పంచమి నాడే జన్మించడం విశేషం.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">#శ్రీ ఆది శంకరులనగానే అద్వైతం, శ్రీ రామానుజుడనగానే విశిష్టాద్వైతం గుర్తుకు వస్తాయి.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">#శ్రీ ఆది శంకరాచార్యులు</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">శంకరులు కేరళలోని కాలడి గ్రామంలో జన్మించారు. ఆర్యాంబ, శివగురువులు వీరి తల్లిదండ్రులు. రెండేళ్ల స్వల్ప వ్యవధిలోనే వేదాలను, వేదాంతసారాన్ని అధ్యయనం చేసిన కుశాగ్రబుద్ధి. గోవింద భగవత్పాదుల వద్ద సన్యాస దీక్షను స్వీకరించారు. గురువుల ఆదేశానుసారం కాశీకి వెళ్ళి శిష్యులకు ఉపదేశంచేస్తూ, పండితులతో చర్చలు సాగిస్తూ, వివిధ మతాల్లోని దోషాలను సహేతుకంగా విమర్శించేవారు. మండనమిశ్రుణ్ని, అతడి భార్య ఉభయ భారతిని శాస్త్ర చర్చల్లో ఓడించి, సత్యనిష్ఠతో జ్ఞానమార్గ వైశిష్ట్యాన్ని గుర్తింపజేశారు. సన్యాసం ఒక మానసిక పరిపక్వ స్థితి. మనుషుల మధ్య ఉంటూనే మమతానుబంధాలను అధిగమించి మానవతా ధర్మాన్ని ప్రచారం చెయ్యాలని శంకర సందేశం.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">శంకరులు బోధించిన తత్వం అద్వైతం. అది ఈ దేశపు అఖండత్వాన్ని కాపాడటానికి అక్షయమైన సిద్ధాంతం. ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ వంటి శ్రుతి వాక్యాలు అద్వైత సిద్ధాంతానికి ప్రాతిపదికలు. నాలుగు వేదాల నుంచి ఈ నాలుగు వాక్యాలు గ్రహించి బ్రహ్మ స్వరూపాన్ని వివరించడంలో వాటిని సమన్వయించారు. శంకరాచార్యులు జ్ఞానమార్గానికి అత్యంత ప్రాముఖ్యం ఇచ్చారు.</span></p><p><span style="color: #ff00fe;"> </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> అద్వైతం అంటే రెండు కానిది. అంటే జీవుడికి, దేవుడికి భేదం లేదని చెప్పే మతమన్నమాట. ఈ సిద్ధాంతానికి రూపకర్త జగద్గురు శ్రీ ఆదిశంకరులు. కేరళలోని కాలడి అనే గ్రామంలో జన్మించిన ఆదిశంకరులు ప్రపంచమంతా జగద్గురువుగా గౌరవించే అత్యున్నతమైన ఆధ్యాత్మికవేత్త, మహాజ్ఞాని, మహాపండితులు. సౌందర్యలహరి, శివానందలహరి, వివేకచూడామణి, ప్రస్థాన త్రయభాష్యంతో బాటు ఈనాడు మనం స్తుతించుకునే అనేక స్తోత్రగంథాలు, ప్రకరణ గ్రంథాలు, కనకధారాస్తోత్రం, భజగోవింద శ్లోకాలు ఆయన రచించినవే. రవాణా సదుపాయాలు లేని రోజుల్లోనే ప్రపంచమంతా కాలినడకన పర్యటించి అన్ని మతాలను, విశ్వాసాలను ఒక తాటిపైకి తెచ్చిన ఈ జగద్గురువు భారతదేశంలో నాలుగు పీఠాలను స్థాపించారు.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> బదరీనాథ్, పూరి, శృంగేరి, ద్వారకలలో వీరు స్థాపించిన ఈ పీఠాలకు బాధ్యతలు చేపట్టిన వారు కూడా వీరి నామంతోనే జగద్గురువులుగా ప్రఖ్యాతి చెందుతుండటం విశేషం. వీరి లెక్క ప్రకారం దేహమే దేవాలయం. దేహంలో ఉండే జీవుడే దేవుడు. భౌతికమైన దేహం నశించినా, ఆ దేహంలో ఉండే జీవుడు మాత్రం స్థిరంగా ఉంటాడని అద్వైతుల నమ్మకం. నిశ్చలమైన బుద్ధితో ‘అహం బ్రహ్మాస్మి’ అంటే నే నే బ్రహ్మను అని తెలుసుకునేవాడు జీవన్ముక్తుడు అవుతాడని అద్వైతులంటారు.</span></p><p><span style="color: #ff00fe;"> ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మ సూత్రాలు అనే ప్రస్థానత్రయానికి భాష్యం రాశారు. వివేక చూడామణి, శివానందలహరి, సౌందర్య లహరి, భజగోవిందం, కనకధారాస్తవం వంటి గ్రంథాల్లో వారి పాండిత్యం వెల్లడవుతుంది. సర్వజనామోదంగా ఉండేలా శివ, విష్ణు, గణపతి, సూర్య, శక్తి రూపాలతో కూడిన పంచాయతన పూజా విధానాలను ప్రవేశపెట్టారు. శంకరులు జాతీయ సమైక్యతా సూత్రాన్ని పరిరక్షించడానికి ధార్మిక జాగృతిని కలిగిస్తూ బదరి, ద్వారక, పూరి, శృంగేరిలలో నాలుగు పీఠాలు స్థాపించారు.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> °°°°°°°°°°°°</span></p><p></p><div class="separator" style="clear: both; text-align: center;"><a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiAfw4jaQ95xakrZ7pWKdUEohhWy7pmyqMcDdPbHusSyjM37gneL07Ozz5334YdnY3Pfng3bM4u02UxUF2DOhtZHZ2gQBLv4LV0kY7tglASIhY0nrMiYyuijQKI-jhjfC1bYUe1l6_0iVhqtu6SMjH0kgoaANZKhVFD35q68i88athIW1MWswvzBahb/s406/20230202_213057.jpg" style="margin-left: 1em; margin-right: 1em;"><span style="color: #ff00fe;"><img border="0" data-original-height="406" data-original-width="406" height="320" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiAfw4jaQ95xakrZ7pWKdUEohhWy7pmyqMcDdPbHusSyjM37gneL07Ozz5334YdnY3Pfng3bM4u02UxUF2DOhtZHZ2gQBLv4LV0kY7tglASIhY0nrMiYyuijQKI-jhjfC1bYUe1l6_0iVhqtu6SMjH0kgoaANZKhVFD35q68i88athIW1MWswvzBahb/s320/20230202_213057.jpg" width="320" /></span></a></div><div class="separator" style="clear: both; text-align: center;"><span style="color: #ff00fe; text-align: left;">🙏🙏🙏...</span></div><p></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">#శ్రీరామానుజాచార్యులు</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">రామానుజులు తమిళనాడులో శ్రీపెరంబుదూరులో జన్మించారు. తల్లిదండ్రులు కాంతిమతి, కేశవాచార్యులు. యామునాచార్యుల వద్ద వైష్ణవ దీక్షను పొందారు. తిరుకోష్ఠియారు ‘ద్వయ’ మంత్ర రహస్యాన్ని వివరించి గోప్యంగా ఉంచమని కోరితే మోక్షం ఏ కొద్దిమందికో పరిమితం కాకూడదని తలచిన రామానుజులు ఆలయ గోపురం అధిరోహించి అక్కడ గుమిగూడిన జనులందరికీ మంత్రాన్ని బోధించారు.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">పరమాత్మ ఒక్కడే. ఆయన విశిష్ట గుణసంపన్నుడు. ఆ విశేషణాలు, తత్వాలకు గల లక్షణాల్ని, వాటి మధ్య పరస్పర సంబంధాన్ని అవగాహన చేసుకునేందుకు తోడ్పడేదే జ్ఞానమని విశిష్టాద్వైతం చెబుతుంది. సూక్ష్మరూపంలో ఉండే అనేక జీవాత్మలు స్థూల రూపుడైన పరమాత్మలో అంశగా ఉంటూ పరమాత్మతో భేదాన్ని కలిగి ఉంటాయని, ఇదే విశిష్టాద్వైతమని పేర్కొన్నారు రామానుజులు. రామానుజులు సంస్కర్త. నాటి సమాజంలోని వివిధ వర్ణాలవారికి వైష్ణవంలో స్థానం కల్పించారు. భక్తిని ఉద్యమస్థాయిలో ప్రచారం చేశారు.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">రామానుజులు వేదాంత సారం, వేదాంత సంగ్రహం, వేదాంత దీపం అనే గ్రంథాలు రచించారు. బ్రహ్మ సూత్రాలు, భగవద్గీతకు భాష్యం వెల్లడించారు. ఆయన కేవలం వేదాంతి కాదు. సమత, మమతలను నిత్య జీవితంలో ఆచరించిన పుణ్య యోగి. అనేక ప్రత్యేక సేవలను భగవదారాధనలో భాగంగా చేసి, విలక్షణ పూజా విధానాన్ని వ్యాప్తి చేశారు.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> బ్రహ్మానికి, ప్రకృతికి భేదం లేదని బోధించే విశిష్టాద్వైత మత స్థాపకులు రామానుజాచార్యులు. ఈ మతాన్ని అనుసరించేవారు విశిష్టాద్వైతులుగా ప్రసిద్ధి. జగత్తు సత్యం, జీవుడు సత్యం, దేవుడు సత్యం అన్నది వీరి విశ్వాసం. దేహంలోని భాగాల వలె జీవుడు కూడా దేవునితో చేరి ఉంటారని, దేహం నశించిన తరువాత జీవుడు మరో దేహంలో ప్రవేశిస్తాడు లేదా ప్రకృతిలో లీనమైపోతారని వీరి నమ్మకం.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">విశిష్టాద్వైతమతాచార్యులైన భగవద్రామానుజులు నేటి చెన్నైకు చేరువలోని శ్రీపెరంబుదూరులో జన్మించారు. కాంచీపురం లోని తిరుక్కచినంబికి శిష్యులైన రామానుజులు శ్రీరంగంలో గొప్ప పండితుడు, వైష్ణవ మత ప్రవక్త అయిన యామునాచార్యులవారి వారసుడిగా నిలిచారు.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> బ్రహ్మసూత్రభాష్యానికి విశిష్టాద్వైత దృష్టితో శ్రీ భాష్యం వ్యాఖ్యను రచించారు. మొట్టమొదటి మత సంస్కర్తగా నిలిచిన రామానుజులవారు వేదాంత సంగ్రహం, గద్యత్రయం వంటి విశిష్టమైన గ్రంథాలను రచించారు. ఉత్తరభారతమంతా విస్తృతంగా పర్యటించిన ఆయన దేశం నలుమూలలా నాలుగు శ్రీైవైష్ణవ మఠాలను నెలకొల్పారు. జాతి, మత భేదాలను పాటించకుండా భక్తి భావంతో భగవంతుని సందర్శించాలనుకున్న ప్రతి ఒక్కరికి ఆలయ ప్రవేశం కల్పించేలా చేశారు. తిరుమలతో సహా అనేక దేవాలయాలలో నిర్దిష్టమైన పూజావిధానాలను, సంప్రదాయాలను ఏర్పరిచారు.</span></p><p><span style="color: #ff00fe;"> </span></p><p><span style="color: #ff00fe;"><span>తత్వాలు భిన్నంగా గోచరించినా గమ్యం ఒక్కటే. పుణ్య శ్లోకులు సదా స్మరణీయులే.</span>....,,🙏🙏🙏.....</span></p><p><span style="color: #ff00fe;">సంగ్రహించిన వ్యాసం...</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><br /></p>visalakshihttp://www.blogger.com/profile/12353866459824269934noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2640908686154358505.post-20230910382843844212023-02-02T20:09:00.001+05:302023-02-02T20:57:01.944+05:30సీతోపనిషత్<p style="text-align: center;"><span style="color: #ff00fe;"> ఓం నమో శ్రీ నారాయణాయ నమః</span></p><p style="text-align: center;"></p><div class="separator" style="clear: both; text-align: center;"><a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEh5Bb9CGWSwFDeZdlHCeezIUK426Ij_gWaS0F6vT7FgkLn5fVHEsbVV5xqobGiPUffwxFZFLOpyjgrU4ATjGzj2EaUVxgi1JFGnqS60uNaeoHQ-HAEv6U8w39P_o0g95jNojpgUHVHdUr_5WefCBIPk0_Bnj5dulBuPDLHuc_V5nxL0-nO-wXIMuYCq/s705/images%20(3).jpeg" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="705" data-original-width="435" height="320" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEh5Bb9CGWSwFDeZdlHCeezIUK426Ij_gWaS0F6vT7FgkLn5fVHEsbVV5xqobGiPUffwxFZFLOpyjgrU4ATjGzj2EaUVxgi1JFGnqS60uNaeoHQ-HAEv6U8w39P_o0g95jNojpgUHVHdUr_5WefCBIPk0_Bnj5dulBuPDLHuc_V5nxL0-nO-wXIMuYCq/s320/images%20(3).jpeg" width="197" /></a></div><br /><br /><span style="color: #ff00fe;"><br /></span><p></p><p style="text-align: left;"><span style="color: #ff00fe;"> శ్లో" ఇచ్చా జ్ఞాన క్రియాశక్తి త్రయం యద్భావ సాధనం!</span></p><p><span style="color: #ff00fe;"> తద్బ్రహ్మసత్తా సామాన్యం సీతాతత్వ ముపాస్మహే !!</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">మం!! ఓం దేవాహవై ప్రజాపతి మబ్రువన్, కా సీతా కిం</span></p><p><span style="color: #ff00fe;"> రూపమితి, సహోవాచ, ప్రజాపతిః సా సీతా ఇతి (1)</span></p><p><span style="color: #ff00fe;">ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తులనే మూడు శక్తులూ ఎలాంటి దివ్యభావాన్ని సాధించడానికి ఉపయోగపడతాయో , అలాంటి బ్రహ్మసత్తాతో సమానమైన సీతాదేవి తత్వాన్నిఉపాసిస్తున్నాను. </span></p><p><span style="color: #ff00fe;">పూర్వం ఒకనాడు దేవతలు బ్రహ్మ దగ్గరకు వెళ్లి పితామహా! సీత అంటే ఎవరు? ఆమె ఎలాంటి రూపం కలిగి ఉంటుంది ?అని ప్రశ్నించారు.</span></p><p><span style="color: #ff00fe;">బ్రహ్మదేవుడు వారికిలా సమాధానం చెప్పాడు. "సీతాదేవి మూలప్రకృతి స్వరూపిణి అందుకే ఆమె ప్రకృతి అని పిలవబడుతోంది.'సీతా' అనే పదంలో మొత్తం మూడు అక్షరాలు ఉన్నాయి. ఆమె సాక్షాత్తు మాయా స్వరూపిణి. విష్ణువు ప్రపంచ బీజం. 'ఈ'కారం మాయా, 'స'కారం సత్యం అమృతం, ప్రాప్తం, చంద్రుడు, 'త'కారం లక్ష్మీ బీజం. శ్రీంకారం,వైరాజం , సోమ , అమృతావయవాలు కలిగిన దేవి 'ఈ'కార రూపిణి అవుతోంది. ఆ దేవి ఆభరణాలతో ముత్యాలతో అలంకరించబడివుంది. ఆది మహామాయ శబ్ద బ్రహ్మరూపం. అందుకే స్వాధ్యాయం సమయంలో ప్రసన్నురాలౌతుంది. సమున్నతమైన భావాల్ని ఉత్పత్తి చేస్తుంది. ఇక రెండవ మాయ పృధ్వీభాగంలో హలం (నాగలి)చివర సీతగా జన్మించింది.'ఈ'కార స్వరూపిణి అనే ఆమె ఆ దేవికి చెందిన మూడో మాయ. అది అవ్యక్త రూపంలో ఉంటుంది. శౌనకీయమైన శౌనకీ తంత్రంలో సీతాదేవి ఈవిధంగా వర్ణించబడివుంది. ఆమె శ్రీరాముడు సన్నిధిలో జగదానంద కారిణిగా ఉన్నది. సృష్టి , స్థితి, లయకారిణి కూడా ఆ సీతాదేవే.ఆ సీతమ్మ వ్యక్తంగా ఉన్న అన్ని జీవుల శరీరాలలో మూలప్రకృతి స్వరూపిణిగా జ్ఞేయరూపంలో ఉంటుంది. ఆమె ప్రణవ స్వరూపిణి కనుక ప్రకృతి అని వ్యవహరిస్తారు. ఆమెనే బ్రహ్మవాదినీ అని కూడా అంటారు. ఆ దేవి "అధాతో బ్రహ్మజిజ్ఞాసా" స్వరూపిణి , సర్వవేదమయి , సర్వకీర్తిమయి , సర్వధర్మమయి , సర్వలోకమయి , సర్వాధార కార్యకారణమయి , మహాలక్ష్మీ తదితర దేవేశుల భిన్నాభిన్న రూపమయి , చేతనా చేతనాత్మక , బ్రహ్మ స్థావరాత్మక , గుణ ,కర్మ ,విభాగ భేదంలోదేహ స్వరూపిణి, ఆమె. దేవ ,ఋషి ,మనుష్య ,గంధర్వ స్వరూపిణి, అలాగే అసుర ,రాక్షస, భూత ,ప్రేత ,పిశాచ , దేహాలు ధరించినది.పంచభూత ,ఇంద్రియ ,మనః ప్రాణ స్వరూపిణి కూడా ఆమేనని తెలుస్తోంది. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><div class="separator" style="clear: both; text-align: center;"><a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhg_XAyoM9oGXV59oFfCkmZWEFYY6s8vLZxt2lJXfoULPzNHSasTiZKDh5y3ne4NqJQLprqQMIkalWkH95R8Ix152DI_eHBt9WtBNH4j12b9P-RxIiCg5Vc6MoC6FvrgMBNgxBphBXrFQrXUDtMe6zOxCc7qpi_ZOEEuyyAmKy1iHZeVV44i3kyITjq/s617/images%20(4).jpeg" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="457" data-original-width="617" height="237" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhg_XAyoM9oGXV59oFfCkmZWEFYY6s8vLZxt2lJXfoULPzNHSasTiZKDh5y3ne4NqJQLprqQMIkalWkH95R8Ix152DI_eHBt9WtBNH4j12b9P-RxIiCg5Vc6MoC6FvrgMBNgxBphBXrFQrXUDtMe6zOxCc7qpi_ZOEEuyyAmKy1iHZeVV44i3kyITjq/s320/images%20(4).jpeg" width="320" /></a></div><p></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ఆ సీతాదేవి 1.ఇచ్ఛాశక్తి 2.క్రియాశక్తి 3.సాక్షాత్ శక్తి అనే నామాలతో మూడు రూపాల్లో శక్తి స్వరూపిణిగా ఉన్నది. ఆమే శ్రీ, భూ , నీలా , భద్రరూపిణీ ,ప్రభావరూపిణీ ,సోమసూర్యాగ్ని రూపిణీ అవుతున్నది. ఆ జనని సోమరూపిణిగా ఓషధుల్ని పుట్టిస్తోంది.కల్పవృక్షం, పుష్ప ,ఫల ,లతా, గుల్మాత్ములైన ఔషధ భేషజాత్మికా ఉంది.అమృతం రూపంలో దేవతలకి మహస్తోమరసఫలాన్నిస్తోంది. అలా దేవతలకు అమృత రూపంలో, మానవులకు అన్నం రూపంలో , పశువులకి గడ్డి రూపంలో ఇలా సకల జీవులకీ ఎన్నో విధాలుగా ఆహారాన్ని అందిస్తోంది. ఆ సీతాశక్తి సూర్యాదులతో సకల లోకాల్నీ ప్రకాశింపజేస్తోంది. రాత్రి -పగలు రూపంతో , కాలస్వరూపిణిగా కల , విమేషం నుంచి ఘడియ,8జాములు ,దినం ,వారం ,పక్షం ,ఋతుఆయన ,సంవత్సర భేదాలతో మనుషులకి (వందసంవత్సరాలు ) కల్పనతో ప్రకాశిస్తోంది. ఇలా చిర ,క్షిప్ర రూపాలలో నిముషం నుంచి పదార్ధం వరకు ఉన్న ఈ కాలచక్రాన్ని ఒక చక్రం లాగ త్రిప్పుతూ ,తన కాల విశేషాలతో ప్రకాశిస్తూ, తానే కాల స్వరూపిణి అవుతోంది.</span></p><p><span style="color: #ff00fe;">ఆ సీతాదేవి అగ్ని రూపం కలిగింది. ఆమె ఆకలి దప్పికల రూపంలో ప్రాణులలో , ముఖ రూపంలో దేవతలలో , శీతోష్ణ రూపంలో వనౌషధులలో , కాష్ఠం(కర్ర) లోపలా బయటా నిత్యానిత్య రూపంతో ఉఃటుంది. ఆ శ్రీదేవి మొత్తం మూడు రూపాలు ధరించి శ్రీహరి సంకల్పం ప్రకారం లోకాల్ని రక్షిస్తూ ఉంటుంది. కాలానుగుణంగా ఆయా అవతారాలు ధరిస్తుంది. </span><span style="color: #ff00fe;">శ్రీ అని లక్ష్మీ అని భూదేవి అని ఆమెని పిలుస్తారు. ఆ తల్లి సప్త సాగరాల్లో నీరుగా , సప్త ద్వీపాలతో కూడిన భూమిగా, భూమి మొదలు14లోకాలకీ ఆధార ఆధేయమైన ఓంకార రూపిణి గా ఉంటుంది. సీతాదేవి అవతారమైన నీళాదేవి విద్యున్మాలినీ రూపంతో సకల ఔషధులకీ ,ప్రాణులకీ పోషణ నిమిత్తం సర్వ స్వరూపిణి గా ఉంటుంది. అంతేకాక ఈ దేవి సమస్త భువనాలకీ క్రింది భాగంలో జలాకారాత్మకమైన ఒక మండూకం (కప్ప)రూపంలో భువనాలన్నిటికీ ఆధారంగా ఉంటుంది.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">సీతాదేవి క్రియాశక్తి స్వరూపిణి. ముందుగా శ్రీ మహావిష్ణువు ముఖం నుంచి నాదం , ఆ నాదం నుంచి బిందువు, ఆ బిందువు నుంచి ఓంకారం , ఆ ఓంకారానికి చివర వైఖానస పర్వతం ఆవిర్భవించాయి. ఆ పర్వతం నుంచి కర్మజ్ఞానమయమైన ఉపశాఖలు వచ్చాయి. ఆ ప్రదేశం లో త్రయీమయ రూపంలో అనగా ఋగ్వేదం యజుర్వేదం సామవేదం.. సర్వార్ధాలు దర్శనమిస్తాయి. లోకంలో వేదాలు మూడే అని చెప్పినప్పటికీ కార్యసిద్ధికో నాలుగో వేదం ఏర్పడింది. ఆ నాలుగో దాన్నే ఆసంగిరసం అంటారు. ఈ అధర్వాంగి రసవేదం కూడా త్రివేదాత్మకంగానే ఉంటుంది. ఋగ్వేదం21శాఖలతో., యజుర్వేదం 109శాఖలతో సామవేదం 100శాఖలతో ,అధర్వణ వేదం 50శాఖలతో ఉంది. ముందుగా అన్ని దర్శనాలకన్నా వైఖానస దర్శనం ప్రత్యక్ష దర్శనంగా ఉంది. ఆ తరువాత కల్పం ,వ్యాకరణం ,శిక్ష, జ్యోతిష్యం , నిరుక్తం ,ఛందస్సు అనేవి షడాంగాలు (ఇవే వేదాంగాలు).వీటి ఉపాంగాలైన న్యాయ మీమాంస లు ఏర్పడ్డాయి. ధర్మాన్ని తెలుసుకోవడం కోసం వేదవేదాంగాలన్నిటికన్నా అధికంగా కాలానుగుణంగా ధర్మశాస్త్రాలు ఏర్పడ్డాయి. ధర్మశాస్త్రము అంటే అది మునీశ్వరుల అంతఃకరణ ప్రవృత్తే. బ్రహ్మ చెబుతున్నాడు ..ఇంకా ఇతిహాస పురాణాలు 1. వాస్తు వేదం 2.ధనుర్వేదం 3.గాంధర్వవేదం 4.ఆయుర్వేదం 5.మునివేదం..అనే ఈ అయిదు ఉపవేదాలు ఉన్నాయి. అలాగే దండం ,నీతి, వార్త ,విద్య ,వాయుజయం లాంటి స్వయంప్రకాశాలైన 21రకాల శాస్త్రాలున్నాయి. వైఖానస మహర్షికి పూర్వమే శ్రీ మహావిష్ణువు వాక్కు ప్రభవించింది. అది మూడువేదాల రూపంలో ఆవిర్భవించింది. వైఖానస మహర్షికి ముందు సాంఖ్యశాస్త్రం ఎలా పుట్టిందో అది ఏం చెప్పిందో మీకు బోధిస్తాను శ్రవణం చేయండి. (ఇతిహాస.. పురాణాలని పంచమవేదంగా పండితులు చెబుతారు.)</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ఆ క్రియాశక్తి స్వరూపిణి ఉత్తమమైన బ్రహ్మమయ రూపం కలిగింది. సాక్షత్తు బ్రహ్మమైన ఆ శక్తిని స్మరించినంత మాత్రానే ఆమె అనుభవాన్నిస్తుంది. అంతే కాక ఆ దేవి నిగ్రహానుగ్రహ స్వరూపిణి. శాంతి తేజోరూపిణి. ఆమె వ్యక్తావ్యక్తకారణ చరణాది సమగ్ర అవయవ రూపంలో ,భేదాభేద రూపంగా ప్రకాశిస్తుంది. ఆ దేవి భగవంతుడి సహచారిణిగా ఉంటుంది. అనపాయిని అయిన ఆమె అనవతరం సాధకులకి సహాయ ఆశ్రయాల్ని ప్రసాదిస్తుంది. కళ్ళు మూసి తెరిచేంతలోనే సృష్టి ,స్ధితి, సంహార తిరోధాన ,అనుగ్రహాది శక్తుల్నీ ఆమె ప్రదర్శించగలదు.ఇంత సమర్ధులు కలిగిన ఆ దేవి (సీత) సాక్షాత్తు శక్తిగా ప్రస్తుతించబడుతోంది.</span></p><p><span style="color: #ff00fe;">ఇచ్ఛాశక్తి అనేది మూడు విధాలుగా ఉంటుంది. 1.యోగశక్తి 2.భోగశక్తి 3.వీరశక్తి అని.</span></p><p><span style="color: #ff00fe;">1.యోగశక్తి - ప్రళయకాలంలో విశ్రాంతి తీసుకుంటున్న భగవంతుడి (శ్రీహరి) వక్షస్ధలంలో శ్రీవత్సాకార రూపంతో విశ్రమిస్తూ ఉంటుంది.</span></p><p><span style="color: #ff00fe;">2.భోగశక్తి- భోగరూపంలో కల్పవృక్ష ,కామధేను ,చింతామణి ,శంఖ ,పద్మ నిధుల్ని ,నవనిధుల్ని ఆశ్రయించి ఉంటుంది. భగవంతుణ్ణి కోరికలతోగానీ ,కోరికలు లేకుండా గానీ ఉపాసించేవారిని అనుగ్రహిస్తుంది. అంతేకాదు భక్తులైనవారు అగ్నిహోత్రాలతో, యమ నియమాది అష్టాంగాలతో ,ఆరాధనలతో ,నిత్యపూజా జపహోమాదికాలతో ,పితృపూజలు ,నైవేద్యాలు ,వ్రతాలు, నోములు వంటి వాటితో నిత్యం భగవంతుని ఆరాధిస్తున్నారు.</span></p><p><span style="color: #ff00fe;">3.వీరశక్తి - సీతాదేవి వీరశక్తి రూపంలో చతుర్భుజగా ,అభయ ,వరద ,పద్మాలని ,కిరీటాది సకలాభరణాలనీ ధరించి ఉంటుంది. సకల దేవతలతో పరివేష్ఠించబడి ,కల్పవృక్షం నీడలో నాలుగు ఏనుగులు తమ తొండంతో ఉంచిన రత్న ఘటాలలోని అమృత జలాలతో అభిషేకం చేస్తుండగా, దివ్యంగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఆమె సమస్త దేవతల చేతా ,బ్రహ్మాదుల చేతా ,కామధేనువు ,వేదశాస్త్రాల చేతా ప్రస్తుతించబడుతూ జయాది అప్సరసలు చేత పరిచర్యలు అందుకుంటూ ఉంటుంది. ఆమె సూర్య చంద్రులనే దీపాలతో ప్రకాశించబడుతుంది. నారద తుంబురులు నిత్యం ఆమె ని తమ గానంతో సంతృప్తి పరుస్తుంటారు. ఆమె రాకా ,సినీవాలీ అనే ఛత్రాల నీడలో అలంకృతమై ఉంటుంది. హ్లాదినీ అనే మాయ ఆమె కి చామరాలు వీస్తూ ఉంటుంది. స్వాహా, స్వధా అనేవారు వ్యజనాలతో ఆమెను పూజిస్తారు. బృగువు లాంటి ఎందరో మహర్షులు ఆమెని నిత్యం అర్చిస్తుంటారు. ఇలా దివ్య సింహాసనం మీద ఆసీనురాలై సకల కార్యకారిణి అయిన ఆ లక్ష్మీదేవి భవనానికి వేరుగా స్థిరంగా ఉన్నది. ఆమె ప్రసన్నమైన నేత్రాలతో సర్వదేవతలతో పూజించబడుతూ వీరలక్ష్మి అనే నామంతో ప్రసిద్ధి చెందింది..</span></p><p><span style="color: #ff00fe;"> ఓం శ్రీ మాత్రే నమో నమః</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p>visalakshihttp://www.blogger.com/profile/12353866459824269934noreply@blogger.com1tag:blogger.com,1999:blog-2640908686154358505.post-6144378452516651472022-09-30T19:24:00.000+05:302022-09-30T19:24:29.663+05:30శ్రీ పాదరాజం శరణం ప్రపద్యే...<p> https://youtu.be/TuK46UUWC3M</p>visalakshihttp://www.blogger.com/profile/12353866459824269934noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2640908686154358505.post-33043240234162166942022-04-14T23:06:00.002+05:302022-04-20T06:28:11.204+05:30ఆప్తగమన....అంతగమన...<p><span style="color: #ff00fe;"> </span></p><p></p><div class="separator" style="clear: both; text-align: center;"><a href="https://blogger.googleusercontent.com/img/a/AVvXsEhgJdSLNQFDKsi3oQcxxRsqq6raKnqF579nKsIowNHx6-5EbSEB4ndgUsGnGWQaiZ9T2drViknAL8WyRCf0vb4_1BKX6ivWR5c_Huo3UA9zIGt-lNPbwAMaB6w9kmZqtqVb8lBw1fHTKa1d-12MTBfgcKEDBSpFah53fp6vPn-BQitQplYLzWkMz3J5=s294" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="294" data-original-width="244" height="294" src="https://blogger.googleusercontent.com/img/a/AVvXsEhgJdSLNQFDKsi3oQcxxRsqq6raKnqF579nKsIowNHx6-5EbSEB4ndgUsGnGWQaiZ9T2drViknAL8WyRCf0vb4_1BKX6ivWR5c_Huo3UA9zIGt-lNPbwAMaB6w9kmZqtqVb8lBw1fHTKa1d-12MTBfgcKEDBSpFah53fp6vPn-BQitQplYLzWkMz3J5" width="244" /></a></div><br /><span style="color: #ff00fe;"><br /></span><p></p><p><span style="color: #ff00fe;">శ్లో" ఊర్ధ్వమూలో 2 వాక్ శాఖ ఏషో 2 శ్వత్థః సనాతనః !</span></p><p><span style="color: #ff00fe;"> తదేవ శుక్రం తద్ బ్రహ్మ తదేవామృతముచ్యతే !</span></p><p><span style="color: #ff00fe;"> తస్మింల్లోకాః శ్రితాః సర్వే తదు నాత్యేతి కశ్చన !ఏతద్ వై తత్ !!</span></p><p> </p><p><span style="color: #ff00fe;">ఈ అశ్వత్థ వృక్షం పురాతనమైనది.పైకి వ్రేళ్ళూనినది. క్రిందికి వ్యాపించిన కొమ్మలు కలది. అదే పావనమైనది. అదే భగవంతుడు. అది అవినాశి. సమస్త లోకాలూ దానియందే ఉన్నాయి. దానిని ఎవరూ అతిక్రమించలేరు.అదే సత్యం.</span></p><p><span style="color: #ff00fe;">తలక్రిందులుగా నిలబడి ఉన్న ఒక రావిచెట్టు తో (అశ్వత్థవృక్షం) జీవితం పోల్చబడుతోంది.ఎప్పుడు ఒక వస్తువు తలక్రిందులుగా కనిపిస్తుంది?ప్రతిబింబించి నప్పుడు. ఏటి ఒడ్డున నిలబడ్డ చెట్టు ప్రతిబింబాన్ని నీటిలో చూసినప్పుడు చెట్టు తలక్రిందులుగా నిలబడ్డట్లుగా కనిపిస్తుంది. దాని వ్రేళ్ళభాగం పైన కొమ్మలు క్రింద ఉన్నట్లుగా కనిపిస్తుంది. ప్రతిబింబం నిజం కాదు.</span></p><p><span style="color: #ff00fe;">ఏటి నీటిలో చెట్టు తలక్రిందులుగా కనిపిస్తుంది. దాన్లోని సత్యాన్ని ఆకళింపు చేసుకోగోరితే ఆ ప్రతిబింబాన్ని వదిలిపెట్టి, ఆ ప్రతిబింబానికి ఆధారమైన చెట్టును చూడాలి. అదే సత్యం. ఆ విధంగానే జీవిత సత్యాన్ని తెలుసుకోగోరితే జీవితానికి ఆధారమైన భగవంతుణ్ణి పొందగోరాలి.జీవిత వృక్షాన్నే భగవంతునిగా చెబుతోంది ఈ మంత్రం.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p></p><div class="separator" style="clear: both; text-align: center;"><a href="https://blogger.googleusercontent.com/img/a/AVvXsEikGP8lqQNYiURJD5-tsNG_T3ulYq37GfC-nCmsKmiLZaZ3_JbXx1CWrxWeqeT8AnevRojgZyBmhX-Th8HABimuU7KEvPp1yctfBOye0DeDOYGk_mikXeasVTMIJw6Bx9dt-RourHxgaaKiXSujAdvRIx1Qd0ruKCMKfd4X52B27kTyXRM3F_27Wa-b=s858" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="607" data-original-width="858" height="226" src="https://blogger.googleusercontent.com/img/a/AVvXsEikGP8lqQNYiURJD5-tsNG_T3ulYq37GfC-nCmsKmiLZaZ3_JbXx1CWrxWeqeT8AnevRojgZyBmhX-Th8HABimuU7KEvPp1yctfBOye0DeDOYGk_mikXeasVTMIJw6Bx9dt-RourHxgaaKiXSujAdvRIx1Qd0ruKCMKfd4X52B27kTyXRM3F_27Wa-b=s320" width="320" /></a></div><br /><span style="color: #ff00fe;"><br /></span><p></p><p><span style="color: #ff00fe;">నీవు గాఢ నిద్రలో ఉన్నప్పుడు నీకు శరీరధ్యాస ఉండదు. అప్పుడు మృత్యుభయముంటుందా..? నీవు పూర్తిగా మేల్కొని, నీ శరీరాన్ని, ప్రపంచాన్నికి చూస్తున్నప్పుడే ఆ భయముంటుంది. కలలు లేని నిద్రలో వలె నీవు వీటిని చూడకుండా, కేవలం ఆత్మగానే ఉన్నప్పుడు ఏ భయమూ నిన్ను సోకలేదు. ఏదో పోతుందన్న భావమే భయాన్ని కలిగిస్తుంది. ఆ పోయేదేమిటి అని విచారిస్తే అది నీ శరీరం కాదనీ, అందులో పని చేసే మనస్సనీ తేలుతుంది.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">తనకి ఎల్లప్పుడు ఎరుక ఉండేట్టయితే, ఈ రోగపీడితమైన శరీరాన్ని, దాని వల్ల కలిగే ఇబ్బందినీ వదిలించు కోవటానికీ అందరూ సిద్దమే. పోతుందని అతను భయపడేది ఈ ఎరుకని, ఈ చైతన్యాన్ని. జీవించి ఉండటమంటే, సదా ఎరుక కలిగి ఉండటమే. అదే వారి ఆత్మ. ఇదంటేనే అందరికీ ప్రీతి. అటువంటప్పుడు ఈ దేహంలో ఉంటూనే ఆ శుద్ధ చైతన్యాన్నే పట్టుకొని ఎందుకుండ కూడదు.. అన్ని భయాలనీ ఎందుకు వదిలించుకోకూడదు..</span><span style="color: #ff00fe;">నీ సహజస్థితి లోనే ఉండు"...</span></p><p><span style="color: #ff00fe;">అంతగమనమైన మృత్యువు ను అత్యంత ఆత్మీయమైన చెలికాడుగా భావించి, ఆలింగనం కోసం అంతరంగం పడుతున్న తపన ఇది. మరణం దారుణమైనది కాదనీ , దయామయమైందన్న భావనకు నిదర్శనమిది. పరమశాంతికి మనల్ని చేరువ చేసే ప్రస్థానమే పరలోకగమనం. అందుకే జీవితపరమావధి తెలిసిన ప్రాజ్ఞులు , అస్తమయాన్ని ఆత్మబంధువుగా అక్కున చేర్చుకునేందుకు సంసిద్ధులై ఉంటారు.</span></p><p><span style="color: #ff00fe;">భౌతిక శరీరంతో జీవాత్మకు కలిగే సంబంధమే జన్మ. శరీరం నుండి జీవాత్మ విడిపోవడమే మృత్యువు.</span></p><p><span style="color: #ff00fe;">నా ఆగమనంలోనూ నీవే... నా నిష్క్రమణంలోనూ నీవే! నా ఆనందంలోనూ నీవే... నా ఆవేదనలోనూ నీవే! అనుక్షణం నీ అద్భుత, అదృశ్యశక్తి నన్ను ఆత్మీయపవనమై ఆలింగనం చేసుకుంటూనే ఉంటుంది. నా ప్రమేయం లేకుండానే నీ అనురాగ హస్తం నన్ను చేయి పట్టుకుని ముందుకు నడిపిస్తూనే ఉంటుంది. అది జననంలోనైనా...మరణంలోనైనా!</span></p><p><span style="color: #ff00fe;">గమనించినా గమనించకపోయినా మనం ఊపిరి పోసుకున్న క్షణం నుంచి ఊపిరి విడిచే క్షణం వరకు ఓ దివ్యశక్తి మనల్ని అనుక్షణం అనుగమిస్తూనే ఉంటుంది. అజ్ఞాతంగా అందరి ఆలనకు పాలనకు ఆధారభూతమవుతూనే ఉంటుంది. ఈ ప్రపంచంలో ప్రత్యక్షంగా కనిపించే మమతానుబంధాలకు , కురిపించే ప్రేమానురాగాలకు పరోక్ష ప్రేరకుడు ఆ పరమాత్మే!</span></p><p><span style="color: #ff00fe;">నిజమే!అంతర్యామి అయిన ఆ అనంతాత్ముడు ఆనుదినం మనపై అనేక రూపాల్లో తన ప్రేమవృష్టిని కురిపిస్తున్నాడు.</span></p><p><span style="color: #ff00fe;">జీవితమంటే ఎడతెగని బంధంతో మన ఆలోచనల్లోకి మరణాన్ని రానివ్వం.అది అనివార్య పరిణామమే అని తెలిసినా దాన్ని భయంకరమైన ఆలోచనగా దూరంగా ఉంచడానికి, వీలైనంత సుదూర ప్రక్రియగా మరచిపోవటానికి ఇష్టపడతాం. కానీ సత్యాన్ని అంగీకరించడానికి సిద్ధపడాలి. మృత్యు భయాన్ని జయించడం కంటే తపస్సిద్ధికి మరో తార్కాణం ఏముంటుంది!నిజానికి మరణం అంటే మరో రూపంలో మాధవుడే! అందుకే 'సంహారకులలో సర్వసంహర్తయైన మృత్యువును నేనే 'అంటాడు భగవద్గీత 'విభూతియోగం'లో శ్రీ కృష్ణభగవానుడు.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p></p><div class="separator" style="clear: both; text-align: center;"><a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgfE3TwcYMHM1C4zy0ALxcNGDVhMF3sRe3AgTzUTWLz9nvmnaiWsl5hV0MrHP_zB5aaB6LkBDmKgLMHGP9PmDbLrv77XO0zYfz8haV6QV49c5RJw6RVFAKnEo84Qv2do75f6Lp4hENoYK7yZcfGvuFMpLX7lC1vqr8zD7PWCULYe28IRM_us1Ertx7E/s610/20220414_215225.jpg" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="610" data-original-width="502" height="320" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgfE3TwcYMHM1C4zy0ALxcNGDVhMF3sRe3AgTzUTWLz9nvmnaiWsl5hV0MrHP_zB5aaB6LkBDmKgLMHGP9PmDbLrv77XO0zYfz8haV6QV49c5RJw6RVFAKnEo84Qv2do75f6Lp4hENoYK7yZcfGvuFMpLX7lC1vqr8zD7PWCULYe28IRM_us1Ertx7E/s320/20220414_215225.jpg" width="263" /></a></div><br /><span style="color: #ff00fe;"><br /></span><p></p><p><span style="color: #ff00fe;">ధర్మ పురిని దర్శిస్తే యమపురి ఉండదని శాస్త్ర వాక్కు .శ్రీ నృసింహ స్వామివారి మహా మృత్యుంజయ మంత్రం మహామహిమాన్వితమైన మంత్రం ప్రతీరోజూ పఠించడం వలన అపమృత్యువు, అకాల మృత్యువు, అనుకోని ఆపదలు మన దరిచేరవు. ఆదిశంకరాచార్య విరచిత నృసింహ కరావలంబ స్తోత్రం. ఋణ విమోచన శ్రీ నృసింహ స్తోత్రం. శ్రీ నృసింహ ద్వాదశనామ స్తోత్రం.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ప్రతిరోజూ ఈ నరసింహ మహా మృత్యుంజయ మంత్రాన్ని 108 సార్లు జపించండి. జాతకరీత్యా అపమృత్యు దోషాలున్నవారు ప్రతిరోజూ జపించినా, లక్ష్మీ నరసింహ స్వామిని పూజించినా దోషం నివారింపబడి దీర్గాయుష్మంతులు అవుతారని శాస్త్రవాక్కు.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">🙏శ్రీ నృసింహుని మహా మృత్యుంజయ మంత్రం🙏</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ఉగ్రం వీరం మహావిష్ణుం </span></p><p><span style="color: #ff00fe;">జ్వలంతం సర్వతోముఖమ్</span></p><p><span style="color: #ff00fe;">నృసింహం భీషణం భద్రం </span></p><p><span style="color: #ff00fe;">మృత్యోర్ మృత్యుం నమామ్యహం</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">🙏నరసింహ స్వామి అంత గొప్ప రక్షణ ఇస్తారు. ఆనాడు మృత్యువు కోరలలో చిక్కుకున్న ప్రహ్లాదుడిని రక్షించినట్లుగా మనల్ని కూడా రక్షణ చేస్తారు. పిల్లల చేత ప్రతిరోజూ చేయిస్తే వారికి ఆయుష్షు చేకూరుతుంది.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">🙏ఆదిశంకరులు చేసిన నృసింహ కరావలంబ స్తోత్రం కూడా విశేష ఫలదాయకమైనది. శ్రీ నృసింహ కరవలంబ స్తోత్రం, రుణ విమోచన నృసింహ స్తోత్రం, నృసింహ ద్వాదశనామ స్తోత్రం కూడా పఠించాలి.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ఆదిశంకర భగవత్పాదాచార్య విరచిత శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం🙏</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ప్రతీ రోజు శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి వారిని స్మరించడం, సకల శుభకరం.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ఆదిశంకరభగవత్పాదులు ఒకటి లక్ష్మీనృసింహకరావలంబ స్తోత్రం చేశారు, రెండు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చేశారు. ఇంకా ఏమైనా వారు చేసిన కరావలంబ స్తోత్రం ఉన్నాయేమో నాకు తెలియదు. అసలు కరావలంబం అంటే ఏమిటి? స్వామి వారిని "మాకు సహాయం చేసే చేతులను ఇవ్వు..." అని వేడుకోవడం. అంటే ఈ సకల లోకాలనూ రక్షించే నీ బాహువులతో మమ్మల్ని రక్షించు అని. కరావలంబ స్తోత్రం చాలా చాలా శక్తివంతమైనది. ఆదిశంకరులు ఒక విపరీతమైన ఆపద సమయములో నరసింహస్వామి వారిని కరావలంబస్తోత్రముతో పిలిస్తే, స్వామి తత్ క్షణమే వచ్చి ఆదిశంకరులను రక్షించారు. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> శంకరులు మమదేహి కరావలంబం అని అంత అద్భుతమైన రెండు స్తోత్రాలు ఇచ్చారు అంటే, వాటిని ప్రతీరోజు మనం అనుసంధానం చేసుకుంటే, ఏ విధముగా ఆపదల నుంచి రక్షింపబడి, స్వామి యొక్క కృపకి పాత్రులము అవుతామో మన ఊహకి కూడా అందదు.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p></p><p><span style="color: #ff00fe;">ఆదిశంకరులు అందించిన అటువంటి అద్భుతమైన మరియు శక్తివంతమైన స్తోత్రములలో ఒకటి శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం...</span></p><p><span style="color: #ff00fe;">***** ****** *****</span></p><p></p><div class="separator" style="clear: both; text-align: center;"><a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjNRBI0GlBSg_JhoEc3jvotX_7Vlbdo6BKx3OeAbI7EnUYYn6y7mP8k3BwADWasZh5PSY4kF0qfV278teazNxo8ViPrnU1t6LBDImFpdHW-6ibkkrVxXYixYcmwXfh7TvLllyJ4TqmV8J2xNAUKiTclPCXzYIw3bms0u7oxC6uxuu1sCIvg3HxTSuZ1/s234/images%20(3).jpeg" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="234" data-original-width="187" height="234" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjNRBI0GlBSg_JhoEc3jvotX_7Vlbdo6BKx3OeAbI7EnUYYn6y7mP8k3BwADWasZh5PSY4kF0qfV278teazNxo8ViPrnU1t6LBDImFpdHW-6ibkkrVxXYixYcmwXfh7TvLllyJ4TqmV8J2xNAUKiTclPCXzYIw3bms0u7oxC6uxuu1sCIvg3HxTSuZ1/s1600/images%20(3).jpeg" width="187" /></a></div><br /><span style="color: #ff00fe;"><br /></span><p></p><p><span style="color: #ff00fe;">"నిర్భయంగా వచ్చాను; నిర్భయంగా వెళతాను</span></p><p><span style="color: #ff00fe;">ఉచ్ఛ్వసిస్తూ వచ్చాను ; నిశ్వసిస్తూ వెళతాను</span></p><p><span style="color: #ff00fe;">మృత్యువు నృత్యం చూసి జడిపిస్తారెందుకని?</span></p><p><span style="color: #ff00fe;">భయమెందుకు? నా ఇంటికి నే వెళతాను!</span></p><p><span style="color: #ff00fe;">అంటూ ఈ లోకం నుంచి సెలవు తీసుకున్నారు.... దాశరధి కృష్ణమాచార్యులు.</span></p><p><span style="color: #ff00fe;"> *******************</span></p><p><span style="color: #ff00fe;"> ఓం నమః శివాయ...</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p>visalakshihttp://www.blogger.com/profile/12353866459824269934noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2640908686154358505.post-26811869678461419372022-04-10T00:07:00.004+05:302022-05-10T13:52:16.465+05:30భద్రాద్రి రాముడు...<p style="text-align: justify;"><span style="color: #ff00fe;"> భద్రాద్రి....శ్రీ సీతారామచంద్రస్వామి..</span></p><p></p><div class="separator" style="clear: both; text-align: justify;"><a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhvMW_ayYz818l60ecaQPiEVNJBTgoVkA-BdrILIiqebhq7PFgSXYQin_Zdlm6Oi0Wb42FLw9puJ6SEAxnXfWVSISWth7mpE2THNlBhcitixjpTK5cFXy2pSQqMgorGCGRwy44ZDPYyR5hLSqHk6b_TPDhFaR58fEyIuGfT0fpbkRLqs6ryf6Pawup1/s554/images%20(1).jpeg" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="554" data-original-width="554" height="320" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhvMW_ayYz818l60ecaQPiEVNJBTgoVkA-BdrILIiqebhq7PFgSXYQin_Zdlm6Oi0Wb42FLw9puJ6SEAxnXfWVSISWth7mpE2THNlBhcitixjpTK5cFXy2pSQqMgorGCGRwy44ZDPYyR5hLSqHk6b_TPDhFaR58fEyIuGfT0fpbkRLqs6ryf6Pawup1/s320/images%20(1).jpeg" width="320" /></a></div><div style="text-align: justify;"><br /></div><span style="color: #ff00fe;"><div style="text-align: justify;"><br /></div></span><p></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">శ్రీ సీతారాముల స్వామి వారి దేవస్థానం, ఖమ్మం జిల్లా, భద్రాచలం లో ఉంది.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"> దక్షిణ_అయోధ్య గా పిలవబడే ఈ ఆలయం తెలంగాణ రాష్ట్రంలోని రామాలాయాలలోకెల్లా అతి పెద్దది. హిందువులు ఆరాధ్య దైవంగా భావించే శ్రీరాముని ఆలయం ఇది. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున ఈ దేవాలయ ప్రాంగణంలో శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">17 వ శతాబ్దం నాటి సంకీర్తనాచార్యులు శ్రీరామదాసుగా పేరు పొందిన కంచర్ల గోపన్న జీవితంతో ఈ ఆలయ నిర్మాణం ముడిపడి ఉంది. 17 వ శతాబ్దం (1674) రెండవ భాగంలో కంచర్ల గోపన్న భద్రాచలం తహశీల్దార్ గా ఉన్నపుడు ప్రభుత్వానికి తెలియకుండా ఈ ఆలయ నిర్మాణం కోసం ప్రభుత్వ ఖజానాకు సంబంధించిన ధనాన్ని ఉపయోగించారని గోల్కొండ లోని ఒక చెరసాలలో ఇతనిని బంధించారు. కంచర్ల గోపన్న భక్తికి మెచ్చిన శ్రీరాముడు చెరసాల నుండి విడిపించేందుకు గోల్కొండ సంస్థానాదీశుడైన సుల్తాన్ కు దివ్య రూపంలో కనిపించి, గోపన్నను విడుదల చేయమని ఆలయ నిర్మాణానికి వెచ్చించిన మీర్_ఉస్మాన్_అలీ_ఖాన్ సొమ్మును చెల్లించాడని చారిత్రక కథనం. బందీఖానా నుండి విడుదలైన గోపన్న శ్రీరాముని కీర్తిస్తూ తెలుగులో అనేక సంకీర్తనలను రచించాడు. అప్పటి నుండి గోపన్నను రామదాసు అని పిలుస్తుండేవారు. భద్రాచలం, విజయనగరం ప్రాంతాలకు రామాయణంతో దగ్గర సంబంధమున్నట్లు రామాయణ గ్రంథాల ద్వారా తెలుస్తుంది. భద్రాచలం నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్ణశాలలో రాముడు, సీత, లక్ష్మణుడు కొంతకాలం నివాసం ఉన్నట్లు తెలియజేయబడింది. గోదావరి నదిఒడ్డున ఉన్న భద్రగిరి అనే చిన్నకొండ వద్ద శ్రీరాముడు శ్రీలంకలో ఉన్న సీతను రక్షించడానికి బయలుదేరినప్పుడు మార్గమధ్యంలో ఉన్న ఈ నదిని దాటాడు. మేరుపర్వతం, మేనకల కుమారుడే భద్రుడు (భద్రగిరి). ఈ భద్రుని కోరిక మేరకు భద్రగిరిపై వెలసిన శ్రీరాముడు భద్రాద్రిరాముడు అయ్యాడు. ఈ భద్రగిరిపైవెలసిన శ్రీరాముని ఆలయమే శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం. ముస్లిం మతంలో పుట్టిన కబీర్ దాస్ కు కూడా ఈ ఆలయంతో దగ్గర సంబంధముంది. కబీర్ దాస్ ఒకసారి ఆలయంలోకి ప్రవేశిస్తున్నపుడు అతన్ని నిరాకరించడంతో ఆలయంలోని దివ్య చిత్రాలు అదృశ్యమైయ్యాయని మళ్ళీ అతనిని ఆలయంలోకి ప్రవేశించేందుకు అనుమతి ఇవ్వడంతో దివ్య చిత్రాలు పునర్దర్శనం అయ్యాయని చెబుతుంటారు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన ఈ దేవాలయం ప్రపంచ నలుమూలల నుండి వేలాది భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. పవిత్రమైన గోదావరి నది ఈ కొండను చుట్టుకొని దక్షిణ దిశ వైపుగా ప్రవహిస్తూ ప్రకృతి అందాలను ఒలకపోస్తూ ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా భాసిల్లేలా భద్రాచలంకి మరింత తోడ్పాటునందించింది. మేరుపర్వతం, మేనక లకు లభించిన వరం వల్ల పుట్టిన బాలుడే భద్ర పర్వతం. ఈ భద్రుడి (చిన్నకొండ) వలనే ఈ చిన్నకొండను భద్రగిరి అని ఇక్కడ ఏర్పడిన ఊరికి భద్రాచలం అని పేరు వచ్చింది.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 7 వ నిజాం ఈ ఆలయానికి సంవత్సరానికి రూ.82,000 విరాళంగా ఇచ్చాడు.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">#దేవాలయ ప్రత్యేకతలు</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">శ్రీరాముని దేవాలయాలలో ఉండే శ్రీరాముని విగ్రహం రెండు చేతులతో మానవుని రూపం పోలి ఉంటుంది. కాని భద్రాచలం దేవాలయంలో ఉండే శ్రీరాముని విగ్రహం నాలుగు చేతులతో శ్రీరామునిలా * కుడి చేతిలో బాణంను, ఎడమ చేతిలో విల్లును ధరించి అలాగే విష్ణువు మాదిరిగా కుడిచేతిలో శంఖునుఎడమచేతిలో చక్రంను ధరించి ఉంటుంది.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">భద్రుని కోరికమేరకు వైకుంఠం నుండి విచ్చేసిన విష్ణుమూర్తి నాలుగు భుజములతో దర్షనమివ్వటంవల్ల వైకుంఠరామునిగా పిలువబడుతున్నాడు.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">ఇతర దేవాలయములలో సీతాదేవి రాముని ప్రక్కన నిల్చుని ఉంటుంది. కాని ఈ దేవాలయములో స్వామి ఎడమ తొడపై ఆసీనవతియై ఉంటుంది. మిగిలిన దేవాలయాలలో ఇరువురకూ రెండు పీఠాలు ఉంటాయి. ఇక్కడ ఒకే పీఠం ఉంటుంది.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"> అన్ని దేవాలయాలలో లక్ష్మణుడు రామునికి కుడివైపున ఉంటాడు, కాని ఇక్కడ మాత్రం ఎడమవైపున ఉంటాడు.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">నిత్యపూజలు, ఉత్సవాలు, కళ్యాణం</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">ఇక్కడ జరిగే ఉత్సవాలలో ముఖ్యమైనది శ్రీరామనవమిరోజున జరిగే కళ్యాణం. ఇది దేశ వ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధి చెందిన ఉత్సవం. ఈ కళ్యాణానికి అనేక లక్షల భక్తులు హాజరవుతుంటారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టు బట్టలు ఈ దేవాలయమునకు ప్రతి సంవత్సరం పంపడం జరుగుతుంది.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"> 🙏 శ్రీరామనవమి...!!</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">విశ్వంలో చిన్న పెద్ద తేడాలు లేకుండా భగవంతుడిని నమ్మే ప్రతి ఒక్క భక్తుడికి అత్యంత ముఖ్యమైన పండుగ శ్రీరామనవమి, పండగను అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. </span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">శ్రీ రాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల సమయంలో త్రేతాయుగంలో జన్మించాడని, పురాణాలు శాస్త్రాలు చెబుతున్నాయి, ఆయన జన్మదినమును ప్రజలు పండుగగా జరుపుకోవడమే శ్రీ రామ నవమి.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">14 సంవత్సరములు అరణ్యవాసం, రావణ సంహారం తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడయ్యాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగిందని ప్రతీతి. సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగిందని పురాణాలు చెబుతున్నాయి.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">ఈ చైత్ర శుద్ధ నవమి నాడు అందరూ పరమ పవిత్రమైన దినంగా భావించి సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అతి వైభవంగా పట్టణంలో, పల్లెపల్లెల్లోనూ , వాడ వాడల్లోనూ రమణీయంగా, కమణీయంగా జరుపుకోవడం ఓ సంప్రదాయం.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">ఖమ్మం జిల్లా భద్రాచలంలో సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు. </span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">సీతారామ కళ్యాణం లోక జీవన హేతుకం, సకల దోష నివారణం, సర్వ సంపదలకు నిలయం, సకల జన లోక సంరక్షణమే శ్రీరామనవమి పండుగ పరమార్థం.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">శ్రీ రాముని క్షేత్రాలలో అత్యంత వైశిష్ట్య ప్రాధాన్యత ప్రాశస్త్యముగల క్షేత్రం భద్రాచలం దివ్య క్షేత్రం. </span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">శ్రీ రాముడు తన వనవాస జీవితం ఇక్కడే గడపడమే ఈ పుణ్య క్షేత్రం యొక్క వైశిష్ట్యం. </span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">శ్రీరామ నామము సకల పాపాలను పోగొడుతుందని సకల శాస్త్రాలూ చెబుతున్నాయి. </span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">భక్త రామదాసు చెరసాలలో ఉండిపోవడంతో పూర్వం సీతారాముల కళ్యాణము మార్గశిర శుద్ధ పంచమినాడు జరిగినట్లుగా తెలుస్తోంది. </span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">అయితే తాను చెరసాల నుంచి తిరిగి వచ్చాక చైత్రశుద్ధ నవమినాడు శ్రీరామ చంద్రుని పుట్టినరోజు వేడుకలు, కళ్యాణ వేడుకలు ఒకేసారి జరిపించారు.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">సీతారామ కల్యాణం, రాముడు రావణున్ని సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చింది శ్రీరామనవమి నాడే.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">ఆ మరునాడు దశమి శ్రీరామ పట్టాభిషేకం జరిగిందని చెబుతారు.</span></p><p></p><div class="separator" style="clear: both; text-align: justify;"><a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiquQTZ7XF-h9n16i2thwoMEqkiJPcXl84Tg8AkMQc8Q_YKmtKbzyhhtT3hDAnesbh1ynMTRyHyM8w8Bb_c8LvMhiNdsebj5HayVSKdNzPMNTk1NgsHvFk4_6lki21YByKsr4W-PAg5RrepYY1Op1KyHPSDraLQw4jUYMEzyP89yceq4YCigRUm1Fy_/s640/images.jpeg" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="480" data-original-width="640" height="240" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiquQTZ7XF-h9n16i2thwoMEqkiJPcXl84Tg8AkMQc8Q_YKmtKbzyhhtT3hDAnesbh1ynMTRyHyM8w8Bb_c8LvMhiNdsebj5HayVSKdNzPMNTk1NgsHvFk4_6lki21YByKsr4W-PAg5RrepYY1Op1KyHPSDraLQw4jUYMEzyP89yceq4YCigRUm1Fy_/s320/images.jpeg" width="320" /></a></div><div style="text-align: justify;"><br /></div><span style="color: #ff00fe;"><div style="text-align: justify;"><br /></div></span><p></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">కోదండ రామకల్యాణాన్ని చూసేందుకు మనమే కాదు సకల లోకాల దేవతలు దివి నుంచి భువికి దిగివస్తారంటా. శ్రీరామచంద్రుని దివ్య దర్శనం మహనీయంగా, నేత్ర పర్వంగా పట్టాభిషేక సమయాన తిలకించి పులకితులవుతారట.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">శ్రీరాముడు సత్యపాలకుడు ధర్మాచరణం తప్పనివాడు, ఏకపత్నీ వ్రతుడు, పితృ, మాతృ, భాతృ, సదాచారం, నిగ్రహం, సర్వ సద్గుణాలు మూర్త్భీవించిన దయార్ద హృదయుడు. </span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">శ్రీరామనవమి రోజున సీతారాముని, లక్ష్మణ, భరత, శతృఘ్న, ఆంజనేయ సమేతముగా ఆరాధించి, వడ పప్పు, పానకము నైవేద్యముగా సమర్పించుకుంటారు...</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">🙏ఇంట్లో ఈ పండుగ జరుపుకునే విధానము🙏</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">శ్రీరామనవమి రోజున కుటుంబ సభ్యులందరూ ఉదయమే లేచి, తలంటు స్నానం చేయాలి. </span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">శుభ్రమైన లేదా కొత్త వస్త్రములను ధరించాలి. </span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">సీతా, లక్ష్మణ, భరత, శతృఘ్న, ఆంజనేయ సమేత శ్రీరామచంద్ర మూర్తి పటమును గాని, సీతారాముల విగ్రహములనుగాని పూజా మందిరంలో ఉంచి శ్రీరామ అష్టోత్తర పూజ చేయాలి.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">నీటిలో బెల్లం, మిరియాలు, యాలకులు కలిపి పానకం తయారు చేసి, వడపప్పు (నానపెట్టిన పెసర పప్పు), పానకం నైవేద్యం పెట్టి ఆ తర్వాత ప్రసాదంగా స్వీకరించాలి. </span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">సాయంత్రం కుటుంబ సభ్యులతో కలసి ఊరిలోని రామాలయమునకు, పందిళ్లకు వెళ్లి సీతారాములను చూసి, వారిని ధ్యానించుకొని, ప్రసాదం స్వీకరించాలి.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">వీలైన వారు రామాలయంలో గాని, శ్రీరామ నవమి పందిళ్లలో గాని సీతారాముల కళ్యాణం జరిపించవచ్చు. </span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">లేదా ఆ సమయానికి వెళ్లి సీతారాముల కళ్యాణం చూసి రావాలి. </span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">శ్రీసీతారాముల కళ్యాణం జరిపించినా లేక చూసినా సర్వ శుభాలు కలుగుతాయని పెద్దలు చెబుతారు.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">🙏పూజ...🙏</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">వినాయక ధ్యానం, సంకల్పం, పూజ చేసి దేవునికి షోడశపూజలు మాములే గనుక పూజ యధావిధిగా వాటిని ముగించి, ఆపై శ్రీరామాష్టకం, శ్రీరామ అష్టోత్తరం, జానకీ అష్టకం పఠించి పువ్వులతో పూజ చేయాలి.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">చైత్రమాసం మల్లెలమాసమే గనుక మల్లెపూవులతో పూజించడం శుభప్రదం, </span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">మల్లెపూవులు లభ్యంకాని ప్రాంతాలలో వుండేవారు ఏదైనా సువాసనలు గల తెల్లరంగు పూవులతో</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"> సీతాలక్ష్మణాంజనేయ సమేత శ్రీరామ పటానికి, లేదా విగ్రహానికి పూజించాలి.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">వడపప్పు, పానకం, రామయ్యకు ప్రీతి.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">అంటే స్వామి ఖరీదైన వ్యయ ప్రయాసలతో ముడిపడిన పిండివంటలేవీ కోరుకోడనీ, స్వామి సాత్వికుడనీ భక్తుల నుంచి పిండి వంటలుగాక పరిపూర్ణ భక్తి విశ్వాసాలు మాత్రమే ఆశిస్తాడని మనకు తెలుస్తోంది..</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">వీటితో పాటు ఏదైన ఒక ఫలం స్వామి వారికి నివేదించాలి.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">ఈ రోజంతా రామ నామ స్మరణ (రామ రామ రామ సీత) లో ఉండాలి, వీలైతే నలుగురు పేద జంటలకు కొత్త బట్టలు పెట్టాలి, వారికి తృప్తిగా భోజనం పెట్టాలి, చిన్న పిల్లలకు పానకం వడపప్పు పంచాలి.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"> </span><span style="color: #ff00fe;">🙏సమస్తలోకా సుఖినోభవంతు🙏</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">భద్రాచలం లో వైకుంఠ ఏకాదశి పర్వదినం</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">వైకుంఠం నుండి విష్ణుమూర్తి నేరుగా వచ్చి భద్రునికి దర్శనమివ్వటంవల్ల వైకుంఠఏకాదశి పర్వదినం ఉత్తర ద్వారదర్శనం ఈ క్షేత్రంలో చాలా ప్రసిద్ధిచెందింది.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">#నిత్యపూజలు</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">తమిళనాడులోని శ్రీరంగం నుండి రామదాసుచే తీసుకురాబదడిన ఆరు వంశాలకు చెందిన శ్రీవైష్ణవ ఆచార్యుల కుటుంబాలు ఇప్పటికి భద్రాచలంలో నిత్యపూజలు నిర్వహిస్తున్నారు. రామానుజులవారిచే శ్రీరంగంలో నిర్ణయించబడిన విదంగానే ఇక్కడి ఆలయంలో కూడా పూజలు నిర్వహిస్తున్నారు.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">#పర్ణశాల</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">ఇది భద్రాచలంనుండి 35 కి.మీ. దూరంలో ఉంది. సీతారామలక్ష్మణులు తమ వనవాస వనవాసం సమయంలో ఇక్కడ నివసించారని భావిస్తారు. వారి వనవాస సమయంలోని కొన్ని అందమైన దృశ్యాలు ఇక్కడ చిత్ర, శిల్ప రూపాలలో ప్రదర్శింపబడుతున్నాయి. ఉదాహరణకు సీతను ఎత్తుకుపోవడానికి మాయలేడి రూపంలో వచ్చిన మారీచుని బొమ్మ, పర్ణశాలకు</span><span style="color: #ff00fe;">సమీపంలో ఉన్న సీతమ్మ వాగువద్ద సీత ఆరవేసిన చీర గుర్తులనీ, ఆమె పసుపు కుంకుమలు సేకరించిన రంగురాళ్ళనీ కొన్ని చిహ్నాలను చూపిస్తారు. నదికి ఆవలివైపుని రావణుని రథపు జాడలని కొన్ని గుర్తులను చూపిస్తారు.రావణుడు సీతను అపహరించిన ప్రదేశం ఇది.సీత వియోగాన్ని పొందిన రామచమంద్రుడు శోక మూర్తిగా కనిపిస్తాడు. భద్రాచలంలో ఉన్న రామచమంద్ర మూర్తి ముఖంలో ఉండే తేజస్సు పర్ణశాల రామునిలో కనిపించదు.శ్రీరామ నవమి రోజున ఇక్కడ కూడా కల్యాణోత్సవం జరుగుతుంది.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">#జటాయుపాక (యేటపాక)</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">ఇది భద్రాచలానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. సీతాపహరణం సమయంలో జటాయువు రావణుని ఎదుర్కొని, సీతను రక్షించే యత్నంలో తన ప్రాణాలను ఇచ్చిన స్థలంగా దీనిని చెబుతారు. జటాయువుయొక్క ఒక రెక్క ఇక్కడికి 55 కి.మీ. దూరంలో ఉన్న వి.ఆర్.పురం మండలంలో రెఖపల్లి గ్రామంలో పడిందట.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">#దుమ్ముగూడెం</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">ఇక్కడ జరిగిన భీకరయుద్ధంలో రాముడు 14,000 రాక్షసులను హతమార్చాడట. ఆ రాక్షసుల బూడిదపై ఈ గ్రామం ఉంది. గనుక దీనిపేరు దుమ్ముగూడెం. ఇక్కడి రాముడిని ఆత్మారాముడంటారు.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">#గుండాల</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">ఇవి భద్రాచలానికి 5 కి.మీ. దూరంలో ఉన్న వేడినీటి బుగ్గలు. ఇక్కడ నదిఒడ్డున ఎక్కడ తవ్వినా వేడినీరు ఊరుతుంది. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడుచలికాలంలో ఇక్కడ స్నానం చేస్తారట.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">#శ్రీరామగిరి</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">ఇది గోదావరి దిగువన 55 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ కొండపైన యోగరాముని మందిరం ఉంది.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">#పాపికొండలు</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">పాపికొండలు, తూర్పు కనుమలలోని దట్టమైన అడవులతో కూడిన ఒక కొండల శ్రేణి. ఇవి ఖమ్మం జిల్లా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల నడుమ ఆనుకొని ఉన్నాయి. సుందరమైన గోదావరి నది, కొండలు, ఆహ్లాదకరమైన వాతావరణము. భద్రాచలం నుంచి పడవలో ఇక్కడికి వెళ్ళే సౌకర్యం ఉంది. పాపికొండల ప్రాంతంలో సాధారణంగా చెట్లు ఆకులు రాల్చవు. ప్రశాంతమైన, సుందరమైన, రమణీయమైన, ఆహ్లాదకరమైన ప్రదేశము. ఎండాకాలంలో కూడా పాపికొండల ప్రాంతం చల్లగానే ఉంటుంది. పాపికొండల అడవుల్లో వివిధ రకాల జంతువులు, పక్షులు, విష కీటకాలు ఉంటాయి. అలాగే వేలాది రకాల ఔషధ వృక్షాలు, మొక్కలు ఉంటాయి. భధ్రాచలం వద్ద మునివాటం అను ప్రదేశం దగ్గరలో జలపాతం ఉంది. ఇక్కడే ఒక శివలింగం సర్పం నీడలో అద్భుతంగా ఉంటుంది. పాపికొండల వద్ద గోదావరి చాలా తక్కువ వెడల్పులో రెండు కొండల మధ్య ప్రవహిస్తూ ఆ వాతావరణానికి మరింత రమణీయతను తెచ్చి పెడుతుంది.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">సేకరణ...</span></p><p style="text-align: justify;"></p><div class="separator" style="clear: both; text-align: center;"><a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgsMIUjoPFxsaO6CSty9nG5rq_Xsxnu7J7JqmLaeACoSYInvoUWKQF-AiPncFW_J0TkF1g3pUbhxq49fZQ0Pouqhco5GtxSegbdGbfx78SS862zjQlOA_UCgjzjmt7CnoOpzfGYpX6H6H8VTmogNy1Fvpvudlzg5ESXw7r7XnGqxvsHbOeXEv2qmMZ8/s885/IMG-20220510-WA0004.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="885" data-original-width="720" height="320" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgsMIUjoPFxsaO6CSty9nG5rq_Xsxnu7J7JqmLaeACoSYInvoUWKQF-AiPncFW_J0TkF1g3pUbhxq49fZQ0Pouqhco5GtxSegbdGbfx78SS862zjQlOA_UCgjzjmt7CnoOpzfGYpX6H6H8VTmogNy1Fvpvudlzg5ESXw7r7XnGqxvsHbOeXEv2qmMZ8/s320/IMG-20220510-WA0004.jpg" width="260" /></a></div><br /><span style="color: #ff00fe;"><br /></span><p></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">🕉🚩🕉🚩🕉🚩🕉🚩🚩భద్రాచలం 🕉.....</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం గర్భగుడిపై </span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">ఉన్న సుదర్శన_చక్రం ఎవరూ తయారుచేసినది కాదు.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">మరి అది ఎలా వచ్చిందంటే</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">భక్తరామదాసు తాను ఆలయం నిర్మించిన తర్వాత ఆలయం పైభాగాన సుదర్శన చక్రం ప్రతిష్ఠించడానికై గొప్ప గొప్ప లోహ శిల్పులను రప్పించి వారిచేత సుదర్శన చక్రాన్ని తయారచేయిస్తున్నాడు.కానీ వారు ఎన్నిసార్లు ప్రయత్నించినా అది విరిగిపోవటమో,లేదా సరిగా రాకపోవడమో జరుగుతుంది.కలత చెందిన రామదాసు కలలో ఆ రాత్రి శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమై "భక్తా..!! సుదర్శన చక్రం అంటే మహిమాన్వితమైనది దాన్ని సామాన్య మానవులు నిర్మించలేరు.అందుకే నేను నీకు నా సుదర్శన చక్రాన్ని ఇస్తున్నాను అది గోదావరిలో ఉంది తెచ్చి ప్రతిష్ఠించు" అని చెప్పాడు.మరుసటి రోజు గజ ఈతగాళ్ళతో రామదాసు వెతికించాడు.కానీ కనిపించలేదు. మళ్ల రాముడు కలలో కనిపించి "అది నామీద అమితమైన భక్తిని పెంచుుకున్న నీకు మాత్రమే కనిపిస్తుంది" అని చెప్పడంతో స్వయంగా రామదాసే వెళ్ళి గోదావరి మాతకు నమస్కరించి రామచంద్రునికి స్తోత్రం చేసి గోదావరిలో చేతులు పెట్టగా వచ్చి ఆ సుదర్శన చక్రం చేతిలో ఆగింది.ఆ సుదర్శన చక్రమే ఇప్పుడు మనం చూస్తున్నది.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"> 🙏🏻🚩🕉🙏🏻🕉🚩🙏🏻🕉🚩</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"> భక్తులకు శ్రీ రామనవమి శుభాకాంక్షలు...</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"> || జై శ్రీరామ్ ||</span></p>visalakshihttp://www.blogger.com/profile/12353866459824269934noreply@blogger.com5tag:blogger.com,1999:blog-2640908686154358505.post-68586075062476583142022-03-23T16:05:00.001+05:302022-03-23T16:10:49.649+05:30"నీలోకి నీవు"<p style="text-align: justify;"><span style="color: #ff00fe;"> ఓం శ్రీ సాయి నాధాయ నమో నమః</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"> </span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">శ్లో" శ్రవణాయాపి బహుభిర్యో న లభ్యః</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"> శృణ్వన్తో2పి బహవో యం న విద్యుః !</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"> ఆశ్చర్యో వక్తా కుశలో2స్య లబ్ధా</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"> ఆశ్చర్యో జ్ఞాతా కుశలానుశిష్టః !!</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">భా...దేనిని గురించి వినడానికి అనేకులచే సాధ్యపడదో , విన్నప్పటికీ ఎందరో దేనిని అర్థం చేసుకోలేరో , ఆ ఆత్మను గురించి ఉపదేశించేవాడూ అరుదు , వినేవాడూ అరుదు. అంతటి అరుదైన వ్యక్తి ఉపదేశాలను పాటించి దానిని తెలుసుకున్నవాడు కూడా అరుదే.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><div class="separator" style="clear: both; text-align: center;"><a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgJIbAHiMw691z8X24aqdCXL1gtoBmbB9MkhhlOatc25ZItLHySXUE2uGGbVBgk0PIOt9BT7yx8tMQ0Db0hZ3ODzt2iaVZbQ6qFdmAKOlOlBfLcbx8m0QpT55UoE3KA4IYAaVG2vDZIAfi9JdVYIdHBnCIg-fwd_wLF3SQTH8EEG5ITyCZTRHjW3Bmj/s345/Om.jpg" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="336" data-original-width="345" height="312" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgJIbAHiMw691z8X24aqdCXL1gtoBmbB9MkhhlOatc25ZItLHySXUE2uGGbVBgk0PIOt9BT7yx8tMQ0Db0hZ3ODzt2iaVZbQ6qFdmAKOlOlBfLcbx8m0QpT55UoE3KA4IYAaVG2vDZIAfi9JdVYIdHBnCIg-fwd_wLF3SQTH8EEG5ITyCZTRHjW3Bmj/s320/Om.jpg" width="320" /></a></div><br /><span style="color: #ff00fe;"><br /></span><p></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">మనం ఎలాంటి సంపదను కూడగట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాం, ఇక్కడ వదిలిపెట్టేదా లేక మనం వెంట తీసుకువెళ్లగలిగేదా ?</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">నిజమైన సంపద...</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">ఒక ఫకీరు రోజూ చెట్టు కింద కూర్చుని ధ్యానం చేసుకుంటూ ఉండేవాడు. రోజూ అక్కడకు ఒక కట్టెలు కొట్టేవాడు వచ్చి, కొన్ని చెక్కలను కొట్టుకుని తనతో తీసుకెళ్లేవాడు. ఒకరోజు అతనితో ఆ ఫకీరు ఇలా అన్నాడు, "నాయనా నువ్వు రోజంతా కష్టపడి ఈ కలప కొట్టుకుని, తీసుకెళ్తావు. అది నీకు రెండు పూటలా తిండికే సరిపోదు. ఇంకొంచెం ముందు వెళ్ళావంటే అక్కడ ఒక పెద్ద గంధపు చెట్ల అడవి ఉంది. నువ్వు అక్కడ ఒక్కరోజు కలపను నరికితే, అది నీకు ఏడు రోజులకు సరిపడా సంపాదన ఇస్తుంది."</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">పేదవాడైన ఆ చెక్కలు కొట్టేవాడు నమ్మలేకపోయాడు, ఎందుకంటే ఈ అడవి గురించి తనకు తెలిసినంతగా మరెవరికీ తెలియదని అతను అనుకున్నాడు. అతను తన జీవితమంతా అడవిలో కట్టెలు కొట్టడంలోనే గడిపాడు. రోజూ కేవలం చెట్టుకింద కూర్చునే ఈ ఫకీరుకి ఏమి తెలుసు? అని అనుకుని మొదట అతను అంగీకరించడానికి ఇష్టపడలేదు, కానీ వెళ్లి చూడడం వల్ల వచ్చే నష్టమేమిటనే నిర్ణయానికి వచ్చాడు. ఏమో ఎవరికి తెలుసు, అతను చెప్పింది సరైనది కావచ్చు కదా ! పైగా, ఇతను అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది ?</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">చాలా ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఉన్న వ్యక్తిలా కనిపిస్తున్నాడు, తన లోకంలో తాను సంతోషంగా ఉన్నట్లుగా ఉన్నాడు. ఇంతకు ముందు ఎప్పుడూ ఏమీ మాట్లాడలేదు. కాబట్టి అతను స్వయంగా వెళ్లి చూడాలని నిర్ణయించుకున్నాడు.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">అలా ముందుకు వెళ్ళాడు. </span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">వెనక్కి తిరిగి వచ్చి, నమస్కరించి, ఫకీరు పాదాలపై పడి ఇలా అన్నాడు: "దయచేసి నన్ను క్షమించండి ! ఈ అడవి నా కంటే బాగా ఎవరికి తెలుసు అని అనుకునేవాడిని. కానీ చందనాన్ని ఎలా గుర్తించాలో నేను తెలుసుకున్నాను. </span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">నా తండ్రి కూడా కట్టెలు కొట్టేవాడు; అతని తండ్రి కూడా అంతే. కానీ మేమందరం రోజుల తరబడి ఈ కట్టెలు కొట్టుకుంటూనే ఉన్నాం, మాకు ఆ గంధం చెట్ల గురించిగాని, సరిగ్గా గంధం అంటే ఏమిటో తెలియలేదు? గంధపు చెక్క దొరికినా, దాన్ని కోసి మామూలు చెక్కలాగానే బజారులో అమ్మేసేవాళ్ళం. మీరు దాని గుర్తింపును, దాని వాసనను, దానిని ఎలా గుర్తించాలో నాకు వెల్లడించారు. నేను ఎంత దురదృష్టవంతుడిని ! నాకు ముందే ఇది తెలిసిఉంటే బాగుండేది." </span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">దానికి ఫకీరు "బాధపడకు నాయనా, ఇప్పుడు నీకు తెలిసింది కదా" అన్నాడు.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">ఆ తర్వాత కట్టెలు కొట్టేవాడు తన రోజులను ఎంతో ఆనందంగా గడపడం ప్రారంభించాడు.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"> ఒక్కరోజు అడవికి వచ్చి కట్టెలు కొట్టుకునేవాడు, ఆపై ఏడెనిమిది, లేదా పది రోజులకి కూడా రావాల్సిన అవసరం వచ్చేది కాదు.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">ఒక రోజు, ఫకీరు అతనితో ఇలా అన్నాడు, " సోదరా, నీకు కొంత తెలివి వస్తుందని నేను అనుకున్నాను, ముందుకు వెళ్లకుండా నీ జీవితమంతా ఇక్కడే కట్టెలు కొట్టుకుంటూ ఉండిపోయావు. ఇప్పుడు కూడా, ఈ చందనాన్ని మించి విలువైనది ఇంకేదైనా ముందుఉందేమోనని నువ్వు అనుకోవట్లేదు."</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">కట్టెలు కొట్టేవాడు,"నేను అది కనీసం ఆలోచించలేదు. చందనానికి మించినది ఏదైనా ఉందా ?", అని అడిగాడు.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">"గంధపు చెక్కను దాటి ముందుకు వెళ్ళు, అక్కడ ఒక వెండి గని ఉంది, ఈ కట్టెలు కొట్టుకోవడం వదిలేయ్. ఈ వెండిని ఒకసారి తెచ్చుకుంటే, రెండు నుండి నాలుగు నెలల వరకు సరిపోతుంది", అని అన్నాడు.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">ఇప్పుడు అతను ఫకీరును నమ్ముతున్నాడు. దాంతో ఒక్కసారిగా పరిగెత్తాడు. ఇప్పుడు అతని మనసులో ఎలాంటి సందేహాలు తలెత్తలేదు. వెండి గనిని కనిపెట్టాడు! ఇప్పుడు జీవితం విలాసవంతంగా గడుస్తోంది. ఇప్పుడు నాలుగైదు నెలలు వరకు కనిపించడం లేదు. ఒకరోజు వచ్చి, మళ్లీ కనిపించకుండా పోయేవాడు. కానీ మనిషి మనస్సు చాలా మూర్ఖంగా ఉంటుంది, ఇంతకు మించినది మరొకటి ఉంటుందని అతను గ్రహించలేదు.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">మళ్ళీ ఒకరోజు ఆ ఫకీరు అతనితో ఇలా అన్నాడు, "నువ్వు అసలు ఎప్పటికైనా మేల్కొంటావా ? లేదా నేను నిన్ను మళ్ళీ లేపాలా? ఎదురుగా బంగారు గని ఉంది, మూర్ఖుడా ! నీ వైపు నుండి నీకు ఏలాంటి ప్రశ్నలూ, ఉత్సుకత, ఏమీ ఉండదా ? ముందు ఇంకేముందో చూడాలా ? ఇప్పుడు ఆరు నెలలుగా నువ్వు స్థబ్దుగా ఉన్నావు, ఇంట్లో పనిలేదు, ఖాళీగా ఉన్నావు, అడవిలో ఇంకా ముందుకెళ్లి చూద్దాం అని ఎప్పుడూ అనుకోలేదు..?"</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">దానికి కట్టెలు కొట్టేవాడు, "నేను చాలా నిదానంగా ఉన్నాను, నేను దాని గురించి కూడా ఆలోచించలేదు ! వెండే ఆఖరిది అని నేను నమ్మాను, ఇంతకు మించి ఏమి ఉంటుంది అనుకున్నాను! పేదవాడిని, నేను ఎన్నడూ బంగారం చూడలేదు, దాని గురించి కేవలం విన్నాను అంతే." </span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">ఫకీరు, "ఇంకా ముందుకు వెళ్తే బంగారు గని ఉంది" అని జవాబిచ్చాడు.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"> కథ ఇలా సాగుతుంది. ఆపై, మరింత ముందుకి వజ్రాల గని ఉంది. ఈ కథ ఇలా చాలా సంవత్సరాలు సాగింది. </span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">ఒక రోజు ఫకీరు ఇలా వ్యాఖ్యానించాడు, "నువ్వు చాలా అజ్ఞానివి, ఇప్పుడు నువ్వు వజ్రాల దగ్గర ఆగిపోయావా ?" </span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">ఇప్పుడు కట్టెలు కొట్టేవాడు కూడా సంపన్నుడు అయ్యాడు, అతనికి స్వంతగా భవనాలు ఉన్నాయి. "ఇక వదిలెయ్, నన్ను ఇబ్బంది పెట్టకు. ఇంక వజ్రాల తర్వాత ఏముంటుంది" అన్నాడు అహంకారంతో.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">ఫకీరు ఇలా అన్నాడు, "వజ్రాలను దాటి, నేను ఉన్నాను, ఈ వ్యక్తి ఇక్కడే కూర్చుని ఉన్నాడని, ఇతనికి వజ్రాల గని గురించి తెలిసి కూడా, వజ్రాలను ఎందుకు సేకరించడం లేదని నీవు ఎప్పుడూ ఆలోచించలేదు.. అంటే అంతకన్నా విలువైనది అతనికి దొరికి ఉండాలి... అది వజ్రాలను మించి ఉండాలి కదా... అన్న ఈ ప్రశ్న నీ మనసులో ఎప్పుడూ తలెత్తలేదా?"</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">ఆ మనిషి ఏడవడం మొదలుపెట్టాడు. అతను ఫకీరు పాదాలపై పడి, తన తలని పాదాలకేసి కొట్టుకుంటూ, ఇలా అన్నాడు: "నేను ఎంత మూర్ఖుడిని ! ఈ ప్రశ్న ఎప్పుడూ నా మనసులోకి రాలేదు! మీరు చెప్పినప్పుడు మాత్రమే నేను దీని గురించి ఆలోచిస్తున్నాను. నా జీవితంలో వజ్రాల కంటే ఎక్కువ సంపద మీ వద్ద ఉందని నేను ఊహించలేకపోయాను. .</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"> దయచేసి మీ వద్ద ఉన్న నిజమైన సంపదను పొందే మార్గం చూపండి !"</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">ఫకీరు ఇలా అన్నాడు, "ఆ సంపదే ధ్యానం, ఇప్పుడు నీ వద్ద చాలా డబ్బు ఉంది, ఇంక నీకు డబ్బు అవసరం లేదు. ఇప్పుడు ఇంక నీ అంతరంగంలో ఉన్న గనిని త్రవ్వు, అది అన్నింటికంటే మించినది."</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">ఈ ప్రశ్న మనందరికీ కూడా - </span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">మనం ముందుకు సాగాలి ..... అనుభవాలన్నీ నిశ్శబ్దం అయ్యే వరకు ముందుకు సాగుతూ ఉండాలి .... </span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">భగవంతుని అనుభూతి కొనసాగుతున్నంత వరకు, ద్వంద్వత్వం ఇంకా ఉనికిలో ఉన్నట్లుగానే సూచిస్తుంది -</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">దర్శించువారు - దృశ్యం రెండూ ఉన్నట్లే.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">ఆ అనుభవం కూడా పోయినప్పుడు సమాధి స్థితి లభిస్తుంది. అప్పుడు దృశ్యము లేదు, దర్శించువారు లేరు, ఏమీ ఉండదు. ఒక నిశ్శబ్దం ఉంది, ఆ శూన్యంలో, అవగాహన యొక్క దీపం ప్రకాశిస్తుంది. అదే అంతిమ స్థితి, అదే సమాధి.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"></p><div class="separator" style="clear: both; text-align: center;"><a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgz-ug-_IxTZ8vuGq_Skzd2Ltjb6OvMKdJ-RCdC10KkwL6XuJW8_0MshM0qvtTGsVp8g_2lLLizGMxqhb--NGE1xRpQdvTcUjL_bgj1wJdScGxf3xwwHUOmdzWZsjl-FEkbNhdxcR3cSH4MVjqHTbjaHLPG4lAMEML--sNHkVjisCRpuCOHYkUfXLOS/s500/20220323_152726.jpg" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="350" data-original-width="500" height="224" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgz-ug-_IxTZ8vuGq_Skzd2Ltjb6OvMKdJ-RCdC10KkwL6XuJW8_0MshM0qvtTGsVp8g_2lLLizGMxqhb--NGE1xRpQdvTcUjL_bgj1wJdScGxf3xwwHUOmdzWZsjl-FEkbNhdxcR3cSH4MVjqHTbjaHLPG4lAMEML--sNHkVjisCRpuCOHYkUfXLOS/s320/20220323_152726.jpg" width="320" /></a></div><br /><span style="color: #ff00fe;"><br /></span><p></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">ధ్యానంలో, మనం మొదట స్వీయ-సంతృప్త స్థితికి చేరుకుంటాము, తరువాత ఆత్మతో సన్నిహితంగా రావడం ద్వారా, శాంతి యొక్క వాస్తవ అనుభవాన్ని మొదటిసారిగా పొందుతాం.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"> </span><span style="color: #ff00fe;">స్మరణం.. ధ్యానం..తపస్సు, అంతర్గత ప్రకాశాన్ని పెంచుతాయి, ఆత్మను సుసంపన్నం చేస్థాయి. భగవత్సాక్షాత్కారం లభింంపజేస్తాయి.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">‘నీలోకి’ నీ ప్రయాణం ..</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">వేదాంతంలో కస్తూరీ మృగం గురించిన ప్రస్తావన ఉంటుంది.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">కస్తూరి మృగం అంటే ఏమిటి? అదెలా ఉంటుంది?కస్తూరి మృగం ఒకరకమైన జింక. సీజన్ వచ్చినపుడు దాని బొడ్డు ప్రాంతం నుంచి ఒకరకమైన ద్రవం ఊరుతూ ఉంటుంది. అది మదపు వాసనగా ఉంటుంది. అప్పుడు ఆ వాసన ఎక్కడి నుంచి వస్తున్నదా అని ఆ జింక వెదకడం మొదలుపెడుతుంది. ఆ వాసన తన వద్ద నుంచే వస్తున్నదని అది ఎంతకీ గ్రహించలేదు. ఆ అన్వేషణలో అలా అడవి అంతా తిరిగీ తిరిగీ చివరికి ఏదో ఒక పులి నోట్లో అది పడిపోతుంది. ప్రాణాలు కోల్పోతుంది. వేదాంత గ్రంథాలలో ఉన్న ఈ కథ చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">మనిషి కూడా తనలోనే ఉన్న ఆత్మను తెలుసుకోలేక లోకమంతా ఇలాగే వ్యర్థంగా తిరుగుతూ ఉంటాడు. పుణ్యక్షేత్రాలనీ, తీర్థయాత్రలనీ అనవసరంగా తిరిగి డబ్బునీ, కాలాన్ని వృథా చేసుకుంటూ ఉంటాడు. నిజానికి వీటివల్ల పెద్దగా ఆధ్యాత్మిక ఉపయోగం అంటూ ఏమీ ఉండదు.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">పాండవులు తీర్థయాత్రలకు వెళ్తూ కృష్ణుడిని కూడా తోడు రమ్మని పిలుస్తారు. సాక్షాత్తు భగవంతుడైన కృష్ణునికి తీర్థయాత్రల అవసరం ఏముంది? ఆ సంగతి మాయా మోహితులైన పాండవులకు తెలియదు. కనుక కృష్ణుడిని కూడా తమలాగే మామూలు మానవుడిగా వారు భావించి తీర్థయాత్రలకు రమ్మని ఆహ్వానిస్తారు. ఆయన చిరునవ్వు నవ్వి వారికి ఒక దోసకాయ ఇస్తాడు.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">‘నా ప్రతినిధిగా దీనిని తీసుకుని వెళ్లి మీరు మునిగిన ప్రతి గంగలోనూ దీనినీ ముంచండి’ అని కృష్ణుడు పాండవుల చేతిలో దోసకాయ పెడతాడు. వారు అలాగే చేసి తీర్థయాత్రలు ముగించి తిరిగి వస్తారు.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">అప్పుడు ఏర్పాటు చేసిన విందులో అదే దోసకాయతో వంటకం చేయించి వారికి వడ్డింప చేస్తాడు కృష్ణుడు. ఆ వంటకం పరమ చేదుగా ఉంటుంది.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">‘అదేంటి బావా! ఇది చేదు దోసకాయ. కటిక విషంలాగా ఉంది. ఇలాంటి వంటకం చేయించావేమిటి?’ అని పాండవులు కృష్ణుడిని అడుగుతారు.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">దానికి కృష్ణుడు నవ్వి, ‘బావా ఎన్ని గంగ లలో మునిగినా దీని చేదు పోలేదు చూశావా?’ అంటాడు.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">ఎన్ని తీర్థయాత్రలు చేసినా మనిషిలో మౌలికంగా ఎటువంటి మార్పూ రాదని కృష్ణుడు ఈ సంఘటన ద్వారా వారికి సూచించాడు. ఆధ్యాత్మిక జీవితంలో ఇది అత్యున్నతమైన సత్యం.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">మనిషి ప్రయాణం బయటకు కాదు. లోపలకు జరగాలి. యాత్ర అనేది బయట కాదు. అంతరంగిక యాత్రను మనిషి చెయ్యాలి. ప్రపంచమంతా తిరిగినా చివరకు మనిషి ఆధ్యాత్మికంగా ఏమీ సాధించలేడు. అదే తనలోనికి తాను ప్రయాణం చేస్తే ఉన్న గదిలో నుంచి కదలకుండా జ్ఞానాన్ని పొందవచ్చు.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">పాతకాలపు మహర్షులు దేశాలు పట్టుకుని ఎప్పుడూ తిరగలేదు. ఒకచోట స్థిరంగా కూర్చుని తపస్సు చేశారు. జ్ఞానసిద్ధిని పొందారు.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">జ్ఞానం ఎక్కడో బయట దొరికే వస్తువు కాదు. అది మనలో అంతర్లీనంగా ఉన్న శక్తి. దానిని గుర్తించి, కనిపెట్టి మసులుకునే వారే విజ్ఞులు.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">భగవాన్ రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, ఇంకా ఎందరో మహా యోగులు ఉన్న చోట నుంచి కదల కుండానే అద్భుతమైన జ్ఞానాన్ని సంపాదించారు. అరుణాచలమే తన ఆశ్రమంగా చేసుకుని రమణ మహర్షి జ్ఞానసిద్ధి పొందారు.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">జ్ఞాన మార్గాన్ని చూపిన మన పూర్వికులు మంచి మార్గాన్ని ఉపదేశించారు మనకు ఆత్మసాక్షాత్కారాన్ని పొందిన యోగుల ఉన్నారు.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">ప్రయత్నం చేస్తే మనమూ అలా కాగలం. కానీ, మనపై మనకు నమ్మకం తక్కువ. ఇంకా జ్ఞానం, దేవుడు.. ఎక్కడో ఉన్నారని నమ్ముతూ దేశాలు తిరిగే అమాయకత్వం మనది.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">ఆత్మ , దానిని గ్రహించడం వంటి విషయాలు అంత సులభతరం కావు. నిరంతర సాధన అనుష్ఠానాల ప్రయత్నం తక్షణమే ఫలితం కానరాని స్థితిలో ఓర్పు, పలువురు దీనిని సాధించారు కనుక నేను కూడా చేయగలననే ఆత్మవిశ్వాసం ఉండాలి.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"> సర్వం శ్రీ సాయి నాధార్పణ మస్తు...</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p>visalakshihttp://www.blogger.com/profile/12353866459824269934noreply@blogger.com4tag:blogger.com,1999:blog-2640908686154358505.post-51039532265890137672022-03-09T09:47:00.062+05:302022-03-20T10:36:38.319+05:30కాళీమాత..<p style="text-align: justify;"><span style="color: #ff00fe;">కాళికా దేవి అనంత శక్తి దాయిని అయిన హిందూ దేవత.కాళిక పేరుకు కాల అనగా కాలం , నలుపు ,మరణం, శివుడు మొదలైన అర్ధాలు ఉన్నాయి.శాక్తీయులు కాళీమాతను తాంత్రిక దేవతగా బ్రహ్మ జ్ఞానం ను కలిగించే దేవతగా ఆరాధిస్తారు. కొందరు భవతారిణిగా కొలుస్తారు.</span></p><p></p><div class="separator" style="clear: both; text-align: center;"><a href="https://blogger.googleusercontent.com/img/a/AVvXsEiwvttZIr3y2q2KWDZsblWLP6AXpYzXO8ubd73-EMWZSZexdEoXt4ppBFiFZOhiouqriW0TmqmEmBkuYHNiCCCMO2e7xak_Z-oUpzHlj7tzNW4FCSwSZfTSkeod5tMy5w3Ztm2oII2pYH9PbECVhh8eUKYUxf5gLWKNF-7BpPqfRA3DYaqnJbSIxXO6=s416" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="416" data-original-width="316" height="320" src="https://blogger.googleusercontent.com/img/a/AVvXsEiwvttZIr3y2q2KWDZsblWLP6AXpYzXO8ubd73-EMWZSZexdEoXt4ppBFiFZOhiouqriW0TmqmEmBkuYHNiCCCMO2e7xak_Z-oUpzHlj7tzNW4FCSwSZfTSkeod5tMy5w3Ztm2oII2pYH9PbECVhh8eUKYUxf5gLWKNF-7BpPqfRA3DYaqnJbSIxXO6=s320" width="243" /></a></div><div class="separator" style="clear: both; text-align: justify;"><span style="color: #ff00fe; text-align: left;"><br /></span></div><div class="separator" style="clear: both; text-align: justify;"><span style="color: #ff00fe; text-align: left;">హిందూ మతంలో పూజించే అత్యంత ప్రసిద్ధ రూపాలలో కాళీ మాత ఒక్కరు. 'కాళీ’ అనే పదానికి మూల పదం 'కల్’ అంటే సమయం అని అర్ధం. కాళీని 'సమయం’ అని సూచిస్తారు.</span></div><p></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">ఎందుకంటే ఇది సృష్టించిన దేనినీ విడిచిపెట్టని అత్యంత శక్తివంతమైన విధ్వంసం. కాళీ అహం మరియు అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది మరియు ఆమె భక్తుల హృదయాల్లో జ్ఞానం యొక్క దీపాన్ని వెలిగిస్తుంది. ఆమె భీకర రూపంతో కనిపించినప్పటికీ, ఆమె తన భక్తులపై విముక్తి యొక్క అత్యున్నత విజయాన్ని అందించే అత్యంత దయగలది.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">కాళీ రూపం హిందూ ఐకానోగ్రఫీలో, కాళీని చీకటి రంగులో చిత్రీకరించారు, ఆమె పొడవైన నాలుకతో భయాన్ని సృష్టించే విధంగా పొడుచుకు వచ్చింది. శరీరం, అహం మరియు అజ్ఞానంతో గుర్తింపును నాశనం చేసే చిహ్నంగా ఆమె పుర్రెలు మరియు ఎముకలు చేసిన చేతుల దండను ధరించి కనిపిస్తుంది. ఆత్మ లేదా మరణం అమరత్వం ఉన్నప్పుడు మాంసంతో తయారైన భౌతిక శరీరం నాశనం అని ఆమె మనకు గుర్తు చేస్తుంది.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">ఆమె చీకటి రంగు ఆమె నిజమైన గుర్తింపును సూచిస్తుంది ఆమె చీకటి రంగు ప్రతిదీ ఉద్భవించిన మానిఫెస్ట్ విశ్వంగా ఆమె నిజమైన గుర్తింపును సూచిస్తుంది. ఆమె తన భార్య శివుడిపై నిలబడి చాలా ప్రశాంతంగా మరియు స్వరపరచినట్లు కనిపిస్తుంది. సత్ చిత్ ఆనంద యొక్క అతీంద్రియ అవగాహన ఆమెకు మద్దతు ఇస్తుందని అర్థం. </span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">కాళీ మాత హిందూ దేవతలలో అత్యంత పవిత్రమైన వారిగా ఆరాధించబడ్డారు. మన దేశంలో కాళీ మాత దేవాలయాలు ప్రతి రాష్ట్రంలోనూ కనిపిస్తాయి. ఈ విశ్వంలోనే కాళీ దేవత అంటే అత్యంత శక్తివంతమైన తల్లి. కాళీ మాత రూపం అద్భుతమైనది. ఆమెను కొలిచిన వారి కోరికలను నెరవేరుస్తుంది. ఈ దేవత యొక్క ఆశీర్వాదం కోసం భక్తులు ప్రత్యేక ఆరాధాన మరియు ఉపవాసం చేస్తారు. ఈ దేవత గురించి ఇతిహాసాలలో ఉన్న కొన్ని ఆశ్చర్యకరమైన వాస్తవాలను ఈరోజు తెలుసుకుందాం.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">ఈ దేవత శక్తి, సామర్థ్యాల గురించి అనేక ఇతిహాసాలు ఉన్నాయి. స్వామి వివేకానంద తన అభిమాన దేవతపై 1898లో ‘‘కాళి ది మదర్‘‘ అనే కవితను రాశారు. కాళీ దేవి గురించి చాలా మందికి భయంకరమైన రూపం గురించి మాత్రమే తెలుసు. చాలా మందికి ఆమె యొక్క గొప్ప శక్తి గురించి వాస్తవం తెలీదు. ఆమె దేవత యొక్క ప్రత్యేక రూపం.</span></p><p style="text-align: justify;"><br /></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">కాళిదేవి యొక్క రూపాలను సాధారణంగా రెండు రూపాల్లో వర్ణించబడ్డాయి. ఒక అవతారంలో ఈ దేవత ప్రత్యేకమైన చేతులు కలిగి ఉంటుంది. మరో రూపంలో పది చేతులను కలిగి ఉంటుంది. ఆమె విగ్రహాన్ని నలుపు లేదా నీలం రంగులో పెయింట్ చేస్తారు. కానీ ఈ దేవత కళ్లు ఎర్రగా ఉంటాయి. పూర్తిగా కోపంతో ఉన్న చిత్రంగా కనిపిస్తూ వెంట్రుకలు మచ్చగా కనిపిస్తాయి. ఈమె పళ్లు నోటి నుండి పొడుచుకుపోయి నాలుక బయట ఉండి కోపంగా ఉంటుంది</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"> ఆమె రాక్షసుల దుస్తులను నడుము పట్టీలో ధరించి కనిపిస్తుంది. ఆమె చాలా కోపంగా ఉన్నప్పుడు తనను తాను నియంత్రించుకోవడం కష్టం.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">కాశీ శివునిపై నిలబడిన కాళీ దేవి యొక్క చిత్రం అన్ని పేర్లు మరియు రూపాలు శక్తిని సూచిస్తాయి. కాళి దేవికి కోపం వచ్చినప్పుడు లేదా కోపంగా ఉన్న రూపాన్ని భరిస్తే ఆమెకు నియంత్రణ ఉండదు. అలాంటప్పుడు ఆమెను నియంత్రించడానికి లేదా ఆమెను శాంతబరచటానికి శివుడు తన మార్గాన్ని చాటుతాడు. ఆమె పాదాలు శివుడిని తాకినప్పుడు, కోపం నిగ్రహానికి వస్తుంది. అప్పుడు కాళిదేవి ప్రశాంతంగా ఉందని చెబుతుంటారు.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">విశ్వం ముగిసినప్పటికీ, కాళి దేవత యొక్క ఉనికి సాధారణంగా నగ్నంగా చిత్రీకరించబడుతుంది. అద్భుత శక్తికి మించినదని ఇది సూచిస్తుంది. ఆమె స్వచ్ఛమైన మరియు ఆనందకరమైనది. విశ్వం ముగిసిన తరువాత కూడా కాళి దేవి ఉనికిలో ఉందని నమ్ముతారు. కాబట్టి రంగు, కాంతి, మంచి లేదా చెడు అనే భావనలు ఆమెకు సంబంధించినవి కావు. ఆమెను స్వచ్ఛమైన, కల్తీ లేని ఆది శక్తిగా భావిస్తారు.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">కాళి దేవికి మరో భయంకరమైన రూపం ఉంది. కాళీ దేవి ఎడమ కాలి కింద రాక్షసుడిని, కుడి చేతిలో కత్తిని పట్టుకున్న రూపం. ఈ దేవిని అంత్యక్రియల మైదానంలో పూజిస్తారు. రామకృష్ణ పరమహంసుల భార్య శారదాదేవి దక్షిణేశ్వర్ వద్ద కాశీ స్మశానవాటికను పూజించారు</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">సాయుధ కాళిగా పిలవబడే మహా కాళి పది చేతుల్లో పది చేతులు పట్టుకొని ఉంటుంది. ఆమెకు పది ముఖాలు, పది అడుగులు ఉన్నాయి. మూడు కళ్ళతో ఉన్న తల్లి అన్ని అవయవాలపై ఆభరణాలతో అలంకరించబడి ఉంటుంది. ఈ రూపానికి శివుడితో సంబంధం లేదు.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">కాళి దేవత ప్రకాశవంతమై రంగు కలిగి అందమైన మహిళలాగా దర్శనమిస్తుంది. ఈ దేవత సింహం మీద కూర్చుని స్వారీ చేస్తుంది. ఆమె నాలుగు చేతుల్లో చేతులు నీలం కమలం కలిగి ఉంది. ఆమె జుట్టు దట్టమైనది, దట్టమైనది. దేవత యొక్క స్వరూపం బలమైన మరియు నిశ్శబ్ద చిత్రం.</span></p><p style="text-align: justify;"><br /></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">ఈ కాళి మాతకు భయంకరమైన రూపం ఉన్నప్పటికీ ఈ దేవత అత్యంత దయగలది. ఆమె తన భక్తులను ఎంతో ఆప్యాయతతో పలకరిస్తుంది. భక్తులు కాళి దేవిని విశ్వ తల్లి అని పిలుస్తారు. కాంగీ దేవిని ఎందుకు ఆరాధిస్తారో బెంగాలీ సాధువు రామకృష్ణ భక్తుడి వద్ద అడిగారు. అప్పుడు అతను, "పౌరులు బాధలో ఉన్నప్పుడు, వారు ఆమె పాలకుడి వద్దకు వస్తారు. భక్తులు బాధలో ఉన్నప్పుడు, వారు ఆమె తల్లి / దేవత వద్దకు వస్తారు. నా తల్లి కాళి ". అని అన్నారు.</span></p><p style="text-align: justify;"><br /></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">కాళీ దేవి యొక్క ఆయుధాలు ఆమె ప్రతి చేతిలో ఉంటాయి. ఒక్కో చేతిలో ఒక్కో ప్రత్యేక ఆయుధాన్ని పట్టుకొని చూడవచ్చు. ఆమె కత్తి, త్రిశూలం, కత్తిరించిన తల, గిన్నె/కపాలం పట్టుకుంది. కత్తి దైవిక జ్ఞానాన్ని సూచిస్తుంది. మోక్షానికి దైవిక జ్ఞానం పొందాలి. మిగతా రెండు చేతులు అభయ్ ముద్ర మరియు ఆశీర్వాదం సూచిస్తాయి.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">కాళి దేవి యొక్క హారాన్ని కాళి దేవి మెడలో చూడవచ్చు. అందులో 108 లేదా 51 సంఖ్యలు ఉన్నాయి. హిందూ మతంలో 108 మంచి సంఖ్య. 108 సార్లు జపించడం. దేవదూతల 108 వేర్వేరు పేర్లు కూడా ఉన్నాయి. 51 సంఖ్య వర్ణమాలను సూచిస్తుంది. సంస్కృత వర్ణమాలలో, దేవనాగరికి 51 అక్షరాలు ఉన్నాయి. సంస్కృతాన్ని హిందువులు చైతన్య భాష అని పిలుస్తారు. ఈ అక్షరాలు ప్రతి ఒక్కటి శక్తి లేదా కాశీ అని నమ్ముతారు. అందువల్ల కాళి దేవిని మంత్రాల భాష మరియు రూపం అంటారు.</span></p><p><span style="color: #ff00fe;"></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">దక్షిణ భారతదేశంలోని కొన్ని సంప్రదాయాలను, శివ, కాశీ నృత్యాలను వివరించాడు. సుమాభా మరియు నిసుంబ రాక్షసులను ఓడించిన తరువాత, కాళి దేవత తిరువలంకాడు లేదా తిరువలంకాడు అనే అడవికి వెళ్ళింది. మరుసటి రోజు ఆమె అక్కడ నివసించిన ఒక కథ ఉంది.</span></p><p style="text-align: justify;"></p><div class="separator" style="clear: both; text-align: center;"><a href="https://blogger.googleusercontent.com/img/a/AVvXsEh17OlarX2ap9CTQrLdRiLgg_ZacagWoMQ8-uWBiuqcAu66CsLfNvQZW0NiAnhPyaoxpkTgqeT_L2M8yP83JHkci6VwYjnPa8G6ILjk5W8O5Joqwfj-Adh2J06yBbHhE1Lmo5VD9A_E0Z-7GJvgGCMxx3QQqWBUh22RMBIiiTQSPK45ASpyrm4ehp9a=s900" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="900" data-original-width="676" height="320" src="https://blogger.googleusercontent.com/img/a/AVvXsEh17OlarX2ap9CTQrLdRiLgg_ZacagWoMQ8-uWBiuqcAu66CsLfNvQZW0NiAnhPyaoxpkTgqeT_L2M8yP83JHkci6VwYjnPa8G6ILjk5W8O5Joqwfj-Adh2J06yBbHhE1Lmo5VD9A_E0Z-7GJvgGCMxx3QQqWBUh22RMBIiiTQSPK45ASpyrm4ehp9a=s320" width="240" /></a></div><br /><span style="color: #ff00fe;"> "కలకత్తా కాలిఘట్ కాళీమాత"</span><p></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"> " మహా కాళి మంత్రం "</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">'ఓం శ్రీ మహా కాళికాయై నమ:' </span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">కాళి మంత్రం యొక్క అర్థం: - </span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">నేను దైవ స్వరూపిణి అయిన కాళిమాతని నమస్కరిస్తున్నాను.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">దశ మహా విద్యలలో మొదటిది కాళి.సృష్టిలోని సమస్తమైన శక్తికి కేంద్ర బిందువు కాళిక. కాలాన్ని నడిపించేది , అత్యంత కఠినతరమైన ఆమె ఉపాసనతో సాధకుల మృత్యు భయాన్ని పోగొట్టి అనంత శుభ ఫలాలు అందించడమే అమ్మ అనుగ్రహం.🙏🙏🙏...</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">జేషోరేశ్వరి కాళీ దేవాలయం బంగ్లాదేశ్ లోని ప్రసిద్ధ హిందూ దేవాలయం. ఇక్కడి ప్రధాన ఆరాధ్యదైవం మహంకాళి మాత. ఈ ఆలయం సత్ఖిరాలోని శ్యామ్ నగర్ ఉపజిల్లాలోని ఈశ్వరీపూర్ అనే గ్రామంలో ఉంది. జేషోరేశ్వరి అనే పేరుకు జేషోర్ దేవత అని అర్థం.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"> || ఓం శ్రీ మహా కాళికాయై నమః ||</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">సేకరణ....</span></p><p style="text-align: justify;"><br /></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><br /></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p>visalakshihttp://www.blogger.com/profile/12353866459824269934noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2640908686154358505.post-84242988831728537872022-02-26T20:45:00.001+05:302022-02-26T21:55:33.001+05:30"నిజమైన యజమాని"<p><span style="color: #ff00fe;"> *ఈలోకంలో మనకు నిజమైన ' యజమాని* ' *ఎవరు.??* </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p></p><div class="separator" style="clear: both; text-align: center;"><a href="https://blogger.googleusercontent.com/img/a/AVvXsEgrkzlVgnPxA4YDbSa6G16yC2rHEWPjo3MwvE3UbTpz8uhENXe_8_1YFK8LFV4Ac_dxq3NRjXnhto7AgrFxAz6qOEf4XkCHZIsIsnuajKS942eZAKLHdLuo1bCcL6PYmhyIwNaL6FdFs93TtkVaAE3-ZTCyTmYGgKPm9KAYURt5rGwYgJkeXOV0UTUf=s989" style="margin-left: 1em; margin-right: 1em;"><span style="color: #ff00fe;"><img border="0" data-original-height="989" data-original-width="668" height="320" src="https://blogger.googleusercontent.com/img/a/AVvXsEgrkzlVgnPxA4YDbSa6G16yC2rHEWPjo3MwvE3UbTpz8uhENXe_8_1YFK8LFV4Ac_dxq3NRjXnhto7AgrFxAz6qOEf4XkCHZIsIsnuajKS942eZAKLHdLuo1bCcL6PYmhyIwNaL6FdFs93TtkVaAE3-ZTCyTmYGgKPm9KAYURt5rGwYgJkeXOV0UTUf=s320" width="216" /></span></a></div><div><span style="color: #ff00fe;"><br /></span></div><span style="color: #ff00fe;">శ్లో" నగురోరధికః కశ్చోత్రిషు లోకేషు విద్యతే !</span><div><span style="color: #ff00fe;"> గురుర్భ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవోః సదాచ్యుతః !!</span></div><div><span style="color: #ff00fe;"><br /></span></div><div><span style="color: #ff00fe;">ముల్లోకములందును గురువుకు మించిన వస్తువు లేదు.బ్రహ్మ, విష్ణు, అవ్యయుడైన పరమాత్మ గురువే అయి ఉన్నాడు అని యోగ శిఖోపనిషత్తు తెలుపుతుంది.</span></div><div><span style="color: #ff00fe;"><br /></span></div><div><span style="color: #ff00fe;"><span>మహాత్ముల మహిమ వర్ణనకు అందదు.వారితో పోల్చదగినదేది ఈ ప్రపంచంలో లేదు. వీరు అసమానులు. వీరికి పేరు ప్రతిష్టలపై ఆశలుండవు. దేనినైనా సాధించగల అలౌకిక ప్రజ్ఞావంతులు. సమస్త ప్రాణకోటి ఆనందమే తమ ఆనందంగా భావించే మహాత్ములను పొందిన ఈ భరతభూమి ధన్యత చెందింది. మహాత్ములైన సద్గురు వల్లనే ఈ జగత్తు కొంతవరకు నిలదొక్కుకుంటోంది.</span></span></div><div><span style="color: #ff00fe;"><span><br /></span></span></div><div><span style="color: #ff00fe;"><span><br /></span></span></div><div><span style="color: #ff00fe;"><span>శ్లో" జీవన్ముక్తస్తు తద్విద్వా న్పూర్వోపాధిగుణాన్ త్యజేత్ !</span></span></div><div><span style="color: #ff00fe;"><span> సచ్చిదానంద రూపత్వాత్ భవేద్భ్రమర కీటవత్ !!</span></span></div><div><span style="color: #ff00fe;"><span><br /></span></span></div><div><span style="color: #ff00fe;"><span>ఉపాధులను , గుణాలను విస్మరించిన ఆత్మజ్ఞాని జీవన్ముక్తుండగుచున్నాడు. తుమ్మెద యొక్క శబ్ధ సంసర్గముచే కీటకము తుమ్మెదగా మారునట్లు , జీవుడు నిరంతర బ్రహ్మ చింతనచే బ్రహ్మముగా మారుచున్నాడు. </span></span></div><div><span style="color: #ff00fe;"><span><br /></span></span></div><div><span style="color: #ff00fe;"><span><br /></span></span></div><div><span style="color: #ff00fe;"><span>"***పరమాత్మ మన నిజమైన యజమాని."***</span></span></div><div><span style="color: #ff00fe;"><span><br /></span></span></div><div><span style="color: #ff00fe;"><span><br /></span></span></div><div><span style="color: #ff00fe;"><div class="separator" style="clear: both; text-align: center;"><a href="https://blogger.googleusercontent.com/img/a/AVvXsEhIsE-NVCe5yKCNjO9LTcpyIj9qecfcfi9gj96_OZt5gOXjYLf9gqJimp4-xCmFmf6pOB9ZbP0mc9a1NuyujAHAxKD9lneGN_7VDn105Aa6WTeVjn-iBldUw8HEMMLAX1PC-7KNvbgI5Cnqq4epG3aZ8enIxJixEr1SFitxPo1Fs5lg2hePZj80WeQF=s901" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="901" data-original-width="720" height="320" src="https://blogger.googleusercontent.com/img/a/AVvXsEhIsE-NVCe5yKCNjO9LTcpyIj9qecfcfi9gj96_OZt5gOXjYLf9gqJimp4-xCmFmf6pOB9ZbP0mc9a1NuyujAHAxKD9lneGN_7VDn105Aa6WTeVjn-iBldUw8HEMMLAX1PC-7KNvbgI5Cnqq4epG3aZ8enIxJixEr1SFitxPo1Fs5lg2hePZj80WeQF=s320" width="256" /></a></div><br /><span><br /></span></span></div><div><span style="color: #ff00fe;"><span><br /></span></span></div><div><span style="color: #ff00fe;"><table align="center" cellpadding="0" cellspacing="0" class="tr-caption-container" style="margin-left: auto; margin-right: auto; text-align: center;"><tbody><tr><td style="text-align: center;"> </td></tr><tr><td class="tr-caption" style="text-align: center;"><br /></td></tr></tbody></table></span><span style="color: #ff00fe;">*ఒక ఆవు ఒకరోజు గడ్డి మేయడానికి అడవిలోకి వెళ్లిoది. పాపం దానికి సమయం తెలియలేదు ఇంతలో సాయంత్రం అయ్యింది చీకటిపడేలా ఉంది.* </span></div><div><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> *ఇంతలో ఒక పులి తనవైపు పరిగెత్తుకుంటూ రావడం ఆ ఆవు చూసింది. పులి నుంచి తప్పించుచుకోవడం కోసం ఆవు అటూ ఇటూ పరుగులెట్టి, పారిపోతోంది, పులి కూడా అంతే వేగంగా అవుని వెంబడిస్తోంది. చివరికి అవుకు ఎదురుగా ఒక చెరువు కనిపించింది, పులి నుంచి తప్పించుకునే కంగారులో ఆవు చెరువులోకి దూకేసింది, పులి కూడా ఆవుని పట్టుకోవాలని దాని వెనుకే ఆ చెరువులోకి దూకేసింది.* </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> *దురదృష్టవశాత్తు ఆ చెరువులో నీళ్ళు చాలా తక్కువ ఉన్నాయి, ఆవు ఈదుకుంటూ ఈదుకుంటూ చెరువు మధ్యలోకి వెళ్ళిపోయింది.అక్కడ చాలా లోతైన బురద ఉంది అందులో ఆవు పీకివరకూ కూరుకుపోయింది.* </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> *అవుని వెంబడిస్తూ వచ్చిన ఆ పులి కూడా ఆ బురదలో చిక్కుకుని పీకల్లోతు లో మునిగి కేవలం తన ప్రాణాలు రక్షించుకోవడం కోసం అవుకి కొద్ది దూరంలో ఆగిపోయింది.* *ఇక అంతకుమించి ముందుకి వెళితే ఆ పులి పూర్తిగా బురదలో కూరుకుపోయి చనిపోతుంది.* </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> *ఈ స్థితిలో ఉన్న ఆ* *"ఆవు-పులీ" రెండూ ఒక దానికి ఒకటి ఎదురు ఎదురుగా కదలలేని స్థితిలో నిలబడిపోయాయి.* </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> *కొద్దిసేపయ్యాక, ఆవు పులితో ఇలా అంది,* </span></p><p><span style="color: #ff00fe;"> *" నీకెవరైన యజమాని గానీ గురువు గానీ ఉన్నారా.?? అని అడిగింది ". దానికి ఆ పులి గర్వంతో ఇలా అంది,* </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> *నేనే ఈ అడవికి రాజుని, స్వయంగా నేనే ఈ అడవి అంతటికీ యజమానిని, నాకు వేరే ఎవరు యజమాని ఉంటారు అంది గొప్పగా..* </span></p><p><span style="color: #ff00fe;"> *అప్పుడు ఆవు ఇలా అంది, నీ గొప్పదనం,* *నీ శక్తి ఇవేవీ కూడా ఇప్పుడు నిన్ను ఈ స్థితిలో రక్షించలేక పోయాయి కదా.., అంది* </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> *అప్పుడు ఆ పులి, ఆవు తో ఇలా అంది, నీ పరిస్థితి కూడా నాలాంటిదే కదా, నువ్వు కూడా నాలాగే పీకల్లోతులో మునిగిపోయావు, చావుకు దగ్గరలో ఉన్నావు మరి ఇప్పుడు నిన్ను ఎవరు రక్షిస్తారు.?? అంది.* </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> *అప్పుడు ఆవు చిరునవ్వుతో ఇలా అంది,* </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> *"చాలా తప్పు. నాకు ఒక యజమాని ఉన్నాడు,* *సాయంత్రం అయ్యేసరికి నేను ఇంటికి చేరకపోతే నన్ను* *వెతుక్కుంటూ, ఎంత దూరమైన వచ్చి నన్ను ఈ* *బురదనుంచి బయటకు లాగి క్షేమంగా ఇంటికి* *తీసుకెళతాడు." మరి నిన్ను ఎవరు బయటకు* *లాగుతారు .?? అంది.* </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> *ఇలా అన్న కొద్దిసేపటికి ఆ ఆవు యొక్క యజమాని నిజంగానే వచ్చాడు. వచ్చీ రాగానే ఆ అవుని గట్టిగా పట్టుకుని అతి కష్టం మీద ఆ బురదగుంట నుంచి ఆ అవుని బయటకు లాగి, తన ఇంటికి తీసుకెళ్లాడు. వెళ్లేటప్పుడు ఆ ఆవు తన యజమాని కేసి ఎంతో కృతజ్ఞతా పూర్వకంగా* *చూసింది. కావాలంటే ఆ ఆవు, మరియు దాని యజమాని..* *వాళ్లిద్దరూ కలిస్తే ఆ పులిని బయటకు లాగగలరు, కానీ* *అది వాళ్ళ ప్రాణాలకు ముప్పు అని గ్రహించి, ఆ పులిని బురదలో వదిలేసి వెళ్లిపోయారు.* </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> *ఈ కథలో...* </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> *ఆవు* - *సర్వసమర్పణ చేసిన సాధకుని హృదయo* .</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> *పులి* - *అహంకారం నిండిఉన్న మనస్సు.* </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> *యజమాని* - *సద్గురువు/పరమాత్మ.* </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> *బురదగుంట* - *ఈ సంసారం/ప్రపంచం* </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> *మరియు,* </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> *ఆ ఆవు-పులి యొక్క సంఘర్షణ* : *నలుగురిలో మనం మన ఉనికిని చాటుకోవడమo కోసం చేసే జీవన పోరాటం.* </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> *నీతి :* </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> *ఎవరిమీదా ఆధార పడకుండా జీచించడం అనేది మంచి ఉద్దేశ్యమే. కానీ,* </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> *" నేనే అంతా, నా వలనే అంతా జరుగుతోంది, నేను లేకపోతే ఏమీ లేదు.. నాకు ఎవరి అవసరం లేదు, రాదు." అనే భావన ఎన్నడూ మనలో కలుగరాదు.* </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> *దీనినే* ' *అహంకారము* ' *అంటారు. మన వినాశనానికి ఇదే బీజం అవుతుంది.* </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> *ఈ జగత్తులో* *'సద్గురువు'*( *పరమాత్మ)ను మించిన హితాభిలాషి , మన* *మంచిని కోరుకునే వారు వేరే* *ఎవరుంటారు.?? ఉండరు.* </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> *ఎందుకంటే.??* *వారే అనేక రూపాల్లో వచ్చి, ఆయా సమయాల్లో మనల్ని నిరంతరం అనేక ఆపదల నుంచి రక్షిస్తూ ఉంటారు.* </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> *పరమాత్మా నీవే ఉన్నావు...!* </span></p><p><span style="color: #ff00fe;"> *అంతా నీ ఇష్టప్రకారమే జరుగనీ..!!*</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> ***సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు..***</span></p></div>visalakshihttp://www.blogger.com/profile/12353866459824269934noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2640908686154358505.post-36008297813426105872022-02-17T17:06:00.002+05:302022-02-17T17:19:04.438+05:30కృష్ణ తత్వం.. మహత్యం<p style="text-align: justify;"><span style="color: #ff00fe;"> సర్వవ్యాపినమీశ్వరం....</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p></p><div class="separator" style="clear: both; text-align: justify;"><a href="https://blogger.googleusercontent.com/img/a/AVvXsEjsE_tXZ_lEzXE-0xn1FBOpfsnQ-3SsrXbZJHz3UPg0U99tQOCqjvJEiVDn4MNEAylz0xSXSxv69cCPOF19Lm9V-y4D6b3vklJ-DyFZ274yoaEPJFsOmZ63T_l9AwAyO398UXQzGlLHC6dTzU_Wz-MgC_VS3A2L3zgXpqSziNaDmewS50rWAV6ub1xG=s274" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="182" data-original-width="274" height="182" src="https://blogger.googleusercontent.com/img/a/AVvXsEjsE_tXZ_lEzXE-0xn1FBOpfsnQ-3SsrXbZJHz3UPg0U99tQOCqjvJEiVDn4MNEAylz0xSXSxv69cCPOF19Lm9V-y4D6b3vklJ-DyFZ274yoaEPJFsOmZ63T_l9AwAyO398UXQzGlLHC6dTzU_Wz-MgC_VS3A2L3zgXpqSziNaDmewS50rWAV6ub1xG" width="274" /></a></div><div style="text-align: justify;"><br /></div><span style="color: #ff00fe;"><div style="text-align: justify;"><br /></div></span><div style="text-align: justify;"><span style="color: #ff00fe;">ధ్యానం.... భగవధ్యానం చేసుకోడానికి ఏకాంతంగానూ ,పవిత్రంగానూ ఉండే ప్రదేశం కావాలి. అక్కడ ఎట్టి విఘ్నాలు ఉండకూడదు. ఏ కోలాహలం ఉండరాదు. ప్రశాంత స్థానం కావాలి. ఆసనంగా దర్భాసనం , తివాచీ వంటి దానిని కానీ ఉపయోగించుకోవాలి.సుఖంగా పద్మాసనం కానీ స్వస్తికాసనం గానీ వేసుకుని కుదురుగా కూర్చోవాలి. స్థిరంగా సుఖంగా అచంచలంగా ఎక్కువ సేపు కూర్చునే విధంగా ఉండాలి. శరీరము నిట్టనిలువుగా ఉండు విధముగా కూర్చోవాలి.</span></div><div style="text-align: justify;"><span style="color: #ff00fe;">సంసారం క్షణభంగురం అని గుర్తించి ఆసక్తి ని పరిత్యజించి ధ్యానం చేయాలి. భగవానుడు నిర్గుణ నిరాకార రూపంలో సర్వదా , సర్వత్రా ఉన్నాడు. భగవానుడు సగుణ నిరాకారూపంలోనూ ,తరువాత సగుణ సాకారూపంలోనూ ప్రకటం అవుతూ ఉంటాడు. సగుణము ,నిర్గుణము ,సాకారము ,నిరాకారము అన్నీ ఒకే భగవానుని </span><span style="color: #ff00fe;">విభిన్నరూపాలు.</span></div><div style="text-align: justify;"><span style="color: #ff00fe;">సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్మ భక్తులకు సగుణ సాకారూపంలో ప్రకటమౌతాడు...భక్తుల ప్రేమ కారణంగా ఈ లీలను ప్రదర్శిస్తాడు భగవానుడు.</span></div><div><p></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">భగవంతుని గూర్చి తెలుసుకోవాలనుకొని అన్వేషిస్తూ ఉంటే భగవంతుని సృష్టిలోని ప్రతి లీలలోనూ పరమార్థం కనిపిస్తుంది.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">గాలి వీచడంలోను, నదీజలాలు పారడంలోను ఎన్నో నిగూఢార్థాలు కలిగిఉన్నట్టు కనిపిస్తుంది. సృష్టిలో ఏవస్తువు కూడా పనికిరానిది అంటూ ఏదీ లేదు. ఏ కారణం లేకుండా ఏ జీవి పుట్టదు. వస్తువైనా, అ వస్తువైనా దానికోసం ఏదో ఒక కారణంగా అది ఏర్పడుతోంది.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">ఎపుడైతే కారణం అయిపోతుందో అపుడు ఆ ప్రాణి అదృశ్యవౌతుంది. అంటే అవి వచ్చిన లేక చేయవలసి పని అయిపోతే చాలు అవి కనిపించకుండా కాలగర్భంలో కలసిపోతాయి</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు చేసిన ఎన్నో అద్భుత లీలలున్నాయి. శ్రీకృష్ణుడు చేసిన ఏ పనికైనా సరే అంతరార్థం మరొకటి ఉంటుంది. అవి తెలుసుకొంటే భగవంతుని తత్వమేమిటో కొద్దిగా తెలిసే అవకాశం ఉంది అనిపిస్తుంది.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">అమ్మ దగ్గరపాలు తాగే వయస్సులో తనకు పాలిచ్చినట్లుగానే ఇచ్చి ప్రాణాలు తీద్దామని వచ్చిన పూతనను సంహరించాడు. అంటే - ‘పూతము’ అనగా పవిత్రము. పవిత్రము కానిది పూతన. అనగా అజ్ఞానము, అవిద్య, పవిత్రమైనది జ్ఞానము. అజ్ఞానమువలన వాసనలు బయలుదేరుతాయి. పూతన వాసనా స్వరూపమే.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">పూతన రాక్షసి చిన్ని కృష్ణుడిని చంపడానికొచ్చింది. కంసుడే ఆ ఆడబూచిని పంపాడు. రవిక ఒదులు చేసుకుని, ‘రారా కృష్ణా!’ అని పిలవగానే బిరబిరా వెళ్లాడా బిడ్డడు. ‘పాలకుండలనుకుని ఆబగా జుర్రుకుంటున్నాడు. కాలకూట భాండాలని తెలియదు కాబోలు’ అనుకుంది పూతన. దేవతలకే అమృతాన్ని పంచి ఇచ్చినవాడికి, పచ్చి విషపు ఆలోచనలు తెలియకుండా ఉంటాయా? నవ్వుకుని ఉంటాడు! ఎంత రాకాసి అయినా అమ్మే కదా! చనుబాలిస్తూ రెప్పపాటు సమయం మాతృత్వ తన్మయత్వాన్ని అనుభవించింది. చాల్చాలు. ఆ కాస్త ప్రేమ చాలు. మహామహా యోగీంద్రులు యజ్ఞయాగాలు చేసి ‘కృష్ణార్పణం’ అన్నంత ఫలం ఆమె ఖాతాలో జమైపోయింది. కృష్ణప్రేమలోని గొప్పదనమే అది. పూతన ఒంట్లోని విషాన్నంతా సర్రున జుర్రుకున్నాడు. రాక్షసి అంటేనే నిలువెల్లా పాషాణం. కృష్ణయ్య చేదునంతా మింగేశాక...పూతనతోపాటే పూతనలోని రాక్షసత్వమూ చచ్చిపోయింది. శవాన్ని వూరవతల తగులబెడుతుంటే, అద్భుత పరిమళాలు! కృష్ణ ప్రేమ తాలూకు సువాసనలవి.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">ఈ వాసన మన దేహంలో పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రిములు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అను పదు నాలుగు స్థానములలో తిష్ఠవేసి ఉంటుంది. మాయ త్రిగుణాత్మకం. </span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">మనం సంసారం అనే బండిలో భగవంతుణ్ణి మన రథసారథిగా చేసుకుంటే ఇంద్రియములు అనే గుఱ్ఱాలు సక్రమంగా నడుస్తాయి.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">శకటాసుర భంజనంలో అంతరార్థం ఇదే.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">ఒకసారి శ్రీకృష్ణుడు యశోదను తనకు పాలివ్వమని అల్లరిచేస్తూండసాగాడు.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">అదే సమయంలో పొయ్యిమీద పెట్టిన పాలు పొంగితే యశోద అటు పరిగెడుతుంది. ఇక్కడ సామాన్య జీవికి భగవంతుని యందు భక్తికంటే ఇహముపై అనురక్తి ఎక్కువ అని తెలుసుకోవాలి. </span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">శ్రీకృష్ణుడు రాతితో పెరుగు కుండ పగులగొడతాడు. యశోద కోపముగా కఱ్ఱ తీసుకొని అతని వెంటబడుతుంది. ఇక్కడ కఱ్ఱ అభిమానానికి, గర్వానికి ప్రతీక.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">యశోద అలసిపోయి నిస్సహాయత ప్రకటించగానే శ్రీకృష్ణుడు ఆమెకి దొరికిపోతాడు. అహంకారం, అభిమానం, గర్వం విడిచిపెట్టి తనను సేవిస్తే తాను బంధీనవుతానని పరమాత్మ చెప్పకయే చెపుతాడు.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">ఒకసారి శ్రీకృష్ణుడు అల్లరి మితి మీరుతోందని భావించిన యశోద త్రాటితో బంధించటానికి ప్రయత్నిస్తుంది. కాని త్రాడు రెండు అంగుళాలు తక్కువ అవుతుంది.అంటే ఆ రెండు అంగుళముల త్రాడే అహంకార, మమకారములు. అహంకార, మమకారములు కలవారు తన దరి చేరజాలరని కేవలము ప్రేమ అనే రజ్జువుకే తాను బందీనవుతానని భగవానుని చెప్పాడన్నమాట.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">గోపికా వస్త్రాపహరణలో కూడా ‘లౌకిక సంస్కార శూన్యులై ఉన్న మీరు మాయ అనే తెరను (వస్తమ్రులను) తొలగించి నా దగ్గరకు రండి. మీ మోహమనే తెరను నేను తొలగిస్తాను’ అని భగవంతుడు చెబుతున్నాడన్నమాట</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">ఓ ఉప్పు బొమ్మకు సముద్రం లోతులు చూడాలన్న కోరిక కలిగింది. ఆత్రుత కొద్దీ దూకేసింది. నీళ్లలోకి వెళ్లగానే తానెవరో మరచిపోయింది. తనెందుకొచ్చిందీ మరచిపోయింది. కరిగి కరిగి సముద్రంలో భాగమైపోయింది. కృష్ణ ప్రేమా అలాంటిదే. ఎవరు ఏ రూపంలో ఆయనకు తారసపడినా.... చివరికంతా కృష్ణప్రేమాంబుధిలో కలసిపోవాల్సిందే, కరిగిపోవాల్సిందే. కృష్ణ...అన్న మాటకు ఆకర్షించేవాడన్న అర్థమూ ఉంది. గోపికలు వలపు భావనతో దగ్గరయ్యారు. మహర్షులు తపస్సుతో దగ్గరయ్యారు. కంసాది రాక్షసులు శతృత్వంతో దగ్గరయ్యారు. పాండవులు భక్తితో దగ్గరయ్యారు. ఎవరిదారులు వారివే. గమ్యం మాత్రం ఒకటే - కృష్ణుడే.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">మధురాధిపతే అఖిలం మధురం! కృష్ణుడు మధురకే కాదు, ప్రేమ మాధుర్యానికీ అధిపతి. పద్నాలుగేళ్ల పసివాడు...అన్న బలరాముడితో కలసి కంసమామ చేపట్టిన ధనుర్యాగానికి బయల్దేరాడు. రథం దిగి వీధుల్లో నడుస్తుంటే, మధురానగరమంతా ‘అధరం మధురం, వదనం మధురం...’ అంటూ కృష్ణ సౌందర్యాన్ని కీర్తించింది. ఓ నిరుపేద నేత కళాకారుడిచ్చిన బట్టల్ని ప్రేమగా అందుకున్నాడు. తానే వెళ్లి మాలలు కట్టుకుని బతికే సుధాముడి తలుపుతట్టాడు. కుబ్జ పూసిన మంచిగంధాలకు మురిసిపోయాడు. భక్తి, ముక్తి, అనురక్తి...ఎవరికి ఇవ్వాల్సింది వాళ్లకు ఇచ్చాడు. ఎవర్నుంచి అందుకోవాల్సిన ప్రేమను వాళ్ల నుంచి అందుకున్నాడు.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">పరమ రాక్షసుడైన కంసుడు కూడా తనకు తెలియకుండానే కృష్ణప్రేమలో పడిపోయాడు. కృష్ణుడు మధురలో కాలుపెట్టాడని తెలిసిన మరుక్షణమే.భయంతో సగం చచ్చిపోయాడు. అడుగుల సవ్వడి వినిపిస్తే చాలు, కృష్ణుడొస్తున్నట్టు అనిపించేది. పూల సువాసనలు నాసికాన్ని తాకగానే...వైజయంతీమాల పరిమళమేమో అన్న భ్రమ కలిగేది. ఎవర్ని ఎవరు పిలిచినా, ‘కృష్ణా’ అన్నట్టు చెవినపడేంత చిత్త చాంచల్యం. బాలకృష్ణుడు రానేవచ్చాడు. ముద్దుగారే బాలుడు గుండెల మీద కూర్చుని పిడిగుద్దులు గుద్దుతుంటే, ‘చంపొద్దు కృష్ణా..వదిలిపెట్టు కృష్ణా...’ అంటూ మృత్యుభయంతో మెలికలు తిరిగిపోయాడు. కలవర పాటులో అయితేనేం, తలుచుకున్నాడు కదా! ఆ కాస్త స్మరణకే పొంగిపోయి, మేనమామకు ముక్తినిచ్చేశాడు కృష్ణస్వామి.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">ఇన్ని విధాలుగా చెబుతూ మనలను భగవంతుని గూర్చి తెలుసుకోమని భగవంతుడే చెబుతున్నాడు. </span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">కాని భగవంతుని మాయ లో చిక్కిన మనం మాత్రం మాయామోహితులయ దుర్లభమైన మానవ జన్మను వృథాచేసుకొంటున్నాం.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">కనుక ఇక నుంచైనా భగవంతుని చింతన చేద్దాం..🙏</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"> కృష్ణం వందే జగద్గురుమ్🙏</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p></p><div class="separator" style="clear: both; text-align: center;"><a href="https://blogger.googleusercontent.com/img/a/AVvXsEh_I7AvVRNfBwH1gn7iSlSuO-mbVc8JQMy08X04F9stZN_JTsVErfhJv77rhz-0f0Ga23XgkmtqjMeYNr3o0w7PMxgzBs6bSa6rfmhNuwQ3sRhTQRKBq80JzlmUdhRh2jHbYw0lvcDNbs6TFgYVCMXYjPvDEpn39h64LYujgtXWau4Hcjz-duR-WOd6=s1600" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="1600" data-original-width="898" height="320" src="https://blogger.googleusercontent.com/img/a/AVvXsEh_I7AvVRNfBwH1gn7iSlSuO-mbVc8JQMy08X04F9stZN_JTsVErfhJv77rhz-0f0Ga23XgkmtqjMeYNr3o0w7PMxgzBs6bSa6rfmhNuwQ3sRhTQRKBq80JzlmUdhRh2jHbYw0lvcDNbs6TFgYVCMXYjPvDEpn39h64LYujgtXWau4Hcjz-duR-WOd6=s320" width="180" /></a></div><div style="text-align: justify;"><br /></div><span style="color: #ff00fe;"><div style="text-align: justify;"><br /></div></span><p></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"> *** జయ జనార్ధన కృష్ణా రాధికా పతే ....***</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">జయ జనార్ధన కృష్ణా రాధికా పతే… జన విమోచనా కృష్ణా జన్మ మోచనా</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">జయ జనార్ధన కృష్ణా రాధికా పతే… జన విమోచనా కృష్ణా జన్మ మోచనా</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">గరుడ వాహనా కృష్ణా గోపికా పతే…</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">నయన మోహనా కృష్ణా నీరజేక్షణా…</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">జయ జనార్ధన కృష్ణా రాధికా పతే…</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">జన విమోచనా కృష్ణా జన్మ మోచనా…</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">సుజన బాంధవా కృష్ణా సుందరాకృతే… మదన కోమలా కృష్ణా మాధవా హరే</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">వసుమతీ పతే కృష్ణా వాసవానుజా… వరగుణాకర కృష్ణా వైష్ణవాక్రుతే…</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">సురుచిరానన కృష్ణా శౌర్యవారిదే… మురహరా విభో కృష్ణా ముక్తిదాయకా</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">విమలపాలక కృష్ణా వల్లభీపతే… కమలలోచన కృష్ణా కామ్యదాయకా…</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">జయ జనార్ధన కృష్ణా రాధికా పతే…</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">జన విమోచనా కృష్ణా జన్మ మోచనా…</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">విమల గాత్రనే కృష్ణా భక్తవత్సలా… చరణ పల్లవం కృష్ణా కరుణ కోమలం</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">కువల ఏక్షణా కృష్ణా కోమలాకృతే… తవ పదాంబుజం కృష్ణా శరణామాశ్రయే…</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">భువన నాయకా కృష్ణా పావనాకృతే… గుణగణోజ్వల కృష్ణా నళినలోచనా</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">ప్రణయ వారిధే కృష్ణా గుణగణాకరా… దామసోదర కృష్ణా దీన వత్సలా</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">జయ జనార్ధన కృష్ణా రాధికా పతే…</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">జన విమోచనా కృష్ణా జన్మ మోచనా…</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">కామసుందరా కృష్ణా పాహి సర్వదా… నరక నాశనా కృష్ణా నరసహాయకా</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">దేవకీ సుతా కృష్ణ కారుణ్యమ్భుదే… కంస నాశనా కృష్ణ ద్వారకాస్థితా…</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">పావనాత్మక కృష్ణా దేహి మంగళం… త్వత్పదామ్బుజం కృష్ణా శ్యామ కోమలం</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">భక్తవత్సలా కృష్ణా కామ్యదాయకా… పాలిసెన్నను కృష్ణా శ్రీహరి నమో</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">జయ జనార్ధన కృష్ణా రాధికా పతే…</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">జన విమోచనా కృష్ణా జన్మ మోచనా…</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">భక్తదాసనా కృష్ణా హరసు నీ సదా… కాదు నింటెనా కృష్ణా శలహెయ విభో</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">గరుడ వాహనా కృష్ణ గోపిక పతే… నయన మోహనా కృష్ణ నీరజేక్షణా…</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"> </span><span style="color: #ff00fe;">జయ జనార్ధన కృష్ణా రాధికా పతే… జన విమోచనా కృష్ణా జన్మ మోచనా</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">గరుడ వాహనా కృష్ణా గోపికా పతే…</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">నయన మోహనా కృష్ణా నీరజేక్షణా…</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">జయ జనార్ధన కృష్ణ రాధికా పతే…</span></p><p><span style="color: #ff00fe;"></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">జన విమోచనా కృష్ణ జన్మ మోచనా...</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"> *** ....సర్వం శ్రీ సాయి కృష్ణార్పణ మస్తు...***</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p></div>visalakshihttp://www.blogger.com/profile/12353866459824269934noreply@blogger.com3tag:blogger.com,1999:blog-2640908686154358505.post-90561887283382656862022-02-15T22:17:00.001+05:302022-02-15T22:24:57.022+05:30సంకల్పశక్తి...<p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: medium;"> ఓం శ్రీ నారాయణాయ నమో నమః</span></p><table align="center" cellpadding="0" cellspacing="0" class="tr-caption-container" style="margin-left: auto; margin-right: auto;"><tbody><tr><td style="text-align: center;"><img border="0" data-original-height="215" data-original-width="235" height="215" src="https://blogger.googleusercontent.com/img/a/AVvXsEgCZ9L9WifzsOcwX07n2rYw589FDinn_B7JmPc5sIca_MApRvi4Dw2bigwO1IxgSw64skaGri-Qf-RcRs0Ncbkm0Ms6gdGvMQOE746m6OdXKYRC7z6Ru675ANQLU-98PTrzbfi2tLWpc7T-Wb_B6u3GbWvS7Per7b8390urCn64imhNCOeUrfuHyg3o" style="margin-left: auto; margin-right: auto;" width="235" /></td></tr><tr><td class="tr-caption" style="text-align: center;"><br /></td></tr></tbody></table><div class="separator" style="clear: both; text-align: center;"><a href="https://blogger.googleusercontent.com/img/a/AVvXsEgCZ9L9WifzsOcwX07n2rYw589FDinn_B7JmPc5sIca_MApRvi4Dw2bigwO1IxgSw64skaGri-Qf-RcRs0Ncbkm0Ms6gdGvMQOE746m6OdXKYRC7z6Ru675ANQLU-98PTrzbfi2tLWpc7T-Wb_B6u3GbWvS7Per7b8390urCn64imhNCOeUrfuHyg3o=s235" style="margin-left: 1em; margin-right: 1em;"><span style="color: #ff00fe; font-size: medium;"></span></a></div><span style="color: #ff00fe; font-size: medium;"><div style="text-align: justify;">శ్లోకం: కిం నామ రోదిషి సఖే త్వయి సర్వ శక్తిః</div></span><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: medium;"> ఆమంత్రయస్వ భగవన్ భగదం స్వరూపం!</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: medium;"> త్రైలోక్యమేతదఖిలం తవపాదమూలే</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: medium;"> ఆత్మైవ హి ప్రభవతి న జఢః కదాచిత్ !!</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: medium;">భావం:-" ఓ స్నేహితుడా! ఎందుకు ఏడుస్తున్నావు? శక్తి అంతా నీలోనే ఉంది. నీ సహజ స్వభావమైన దివ్యత్వాన్ని ఎలుగెత్తి పిలువు. ముల్లోకాలూ నీ పాదాల ముందు సాగిలపడతాయి.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: medium;">ఎందుకంటే ఆత్మ అన్నదే శాశ్వతంగా నిలబడుతుంది కానీ జడపదార్ధమైన ఈ శరీరం కాదు సుమా!"</span></p><div class="separator" style="clear: both; text-align: justify;"><a href="https://blogger.googleusercontent.com/img/a/AVvXsEgQu7CEXT-aLa93LS9Yg3TCpcN2SmIO0N06WPeVJOD4-_L9WgVGjmdiJ36PGDrmNovFIM6gi-xS6cOkqnrZGyYDDeLt4rBRZH9CTNxhEv_jpUCbqxa_otxZDMxVpCJacd7Somzow7XijHQFWU8AUAtmnWPbvS_RFd5YfwP9rsbNE4xWlHQ3YfaPw3QH=s294" style="margin-left: 1em; margin-right: 1em;"><span style="color: #ff00fe; font-size: medium;"><img border="0" data-original-height="294" data-original-width="171" height="400" src="https://blogger.googleusercontent.com/img/a/AVvXsEgQu7CEXT-aLa93LS9Yg3TCpcN2SmIO0N06WPeVJOD4-_L9WgVGjmdiJ36PGDrmNovFIM6gi-xS6cOkqnrZGyYDDeLt4rBRZH9CTNxhEv_jpUCbqxa_otxZDMxVpCJacd7Somzow7XijHQFWU8AUAtmnWPbvS_RFd5YfwP9rsbNE4xWlHQ3YfaPw3QH=w233-h400" width="233" /></span></a></div><div style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: medium;"><br /></span></div><span style="color: #ff00fe; font-size: medium;"><div style="text-align: justify;">సంకల్పశక్తి అనేది ఆత్మ, మనస్సుల కలయికతో ఏర్పడిన సమ్మేళనం. పని చేయడానికి క్రమశిక్షణ కావాలి. క్రమశిక్షణ సంకల్పశక్తి ని పెంచుతుంది. ఆత్మ శక్తే సంకల్పశక్తి. అభ్యాసం ద్వారా సంకల్పశక్తి ని పెంచుకోవడం సాధ్యపడుతుంది. మన అపజయాలు భౌతిక స్థాయి లో ఉండేవే! అవి తాత్కాలికమైనవి.</div></span><div><div style="text-align: justify;"><span style="color: #ff00fe;"><span style="font-size: medium;">ఆత్మయొక్క స్థాయిలో దివ్యత్వం ఎల్లవేళలా కాంతివంతంగా ప్రకాశిస్తూ ఉంటుంది.</span></span></div><div style="text-align: justify;"><span style="color: #ff00fe;"><span style="font-size: medium;"><br /></span></span></div><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: medium;"> ***సంకల్ప బలం....***</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: medium;">సంకల్పబలం జ్ఞాన శుధ్ధతతో వచ్చేది. మనం అనుకున్నవి సాధించాలి అంటే సంకల్పబలం అనివార్యం.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: medium;">ఈ సంకల్పశక్తిని దేవాలయ నిర్మాణంకై జ్ఞాన శుధ్ధతతో ఆత్మ విశ్వాసంతో 2010నుండి అనేక విధాలుగా ప్రయత్నించాం...అనివార్య కారణాల రీత్యా ప్రయత్నం విరమించాం.ఎందుకంటే వికల్పశక్తి ఆపేసింది..అంటే అనుమానం... సందిగ్దత గల వ్యక్తిత్వం...గల శక్తులు మా..మా అహంభావాలు.. ఇత్యాది కారణాలు...</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: medium;"></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: medium;">మన సంకల్పశక్తి పెరగాలంటే మనకన్నా ఎక్కువ సంకల్పబలం ఉన్నవారితో మన సాంగత్యం పెరగాలి. ఆత్మ శక్తిని వినియోగించుకోమని పలు సందర్భాలలో బాబాగారు చెప్పారు.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: medium;">యాంత్రిక జీవితానికి సంబంధించిన విషయాలు లో లీనమై సంకల్పం ను పక్కన పెట్టాము.మా సంకల్పం నెరవేరాలంటే దాని తీరు తెన్నులను ఆకళింపు చేసుకుని.కారణ...కార్య సిధ్ధాంత అనుభవాన్ని సంపాదించుకోవాలి.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: medium;"></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: medium;">అచిర కాలంలో సంకల్పసిధ్ధి కై పూనుకోవాలి.అవరోధాలను సంకల్పబలం తో అధిగమించడానికి బాబా దివ్య ఆశీస్సులు కూడా మాకు ఉండాలి అని వారికి నమస్సులతో విన్నవించుకుంటున్నాను.</span></p><p style="text-align: justify;"></p><div class="separator" style="clear: both; text-align: center;"><a href="https://blogger.googleusercontent.com/img/a/AVvXsEh_837hcz93Ozd1NijZ_eMnIo6jRAseX-O1RjOra-5O_Y5gkOBZxwnwUpCC-7XL_MqVaHGyVPk6Y6XBM-TK3kLj41hERSJ1Is8Z5U7k7LLO1t_njQuIlIOxho51ofIsxwlpEuaRwvR_YgM5shRwJPmIN7L1bZj9FrUFaxMjV2nepKoPfQn2AUjPJB7L=s687" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="687" data-original-width="469" height="320" src="https://blogger.googleusercontent.com/img/a/AVvXsEh_837hcz93Ozd1NijZ_eMnIo6jRAseX-O1RjOra-5O_Y5gkOBZxwnwUpCC-7XL_MqVaHGyVPk6Y6XBM-TK3kLj41hERSJ1Is8Z5U7k7LLO1t_njQuIlIOxho51ofIsxwlpEuaRwvR_YgM5shRwJPmIN7L1bZj9FrUFaxMjV2nepKoPfQn2AUjPJB7L=s320" width="218" /></a></div><br /><span style="color: #ff00fe; font-size: medium;"><br /></span><p></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: medium;">*"కల్పించుకునే ఆనంద దుఃఖాల కన్నా..పరమాత్మ సన్నిధిలో ఆత్మమయ సంతృప్తి తో లీలాగానముతో మైమరిచి తానైక్యమవడం..అద్భుతంగా ఉంటుంది.."**</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: medium;"></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: medium;"> **ఓం శ్రీ సాయి నాధాయ నమః**</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: medium;"><br /></span></p><p style="text-align: justify;"></p><table align="center" cellpadding="0" cellspacing="0" class="tr-caption-container" style="margin-left: auto; margin-right: auto; text-align: center;"><tbody><tr><td style="text-align: center;"><a href="https://blogger.googleusercontent.com/img/a/AVvXsEhgiyMPSX6K17OLcrm3-wIxC27pA4T03G951-AmVHbIWzwJtlHY7trAdvHS7vswbSiWwgMvAsYWi6WJTdwXFYj0swsItyr1qGy1bHEKUaRGgN2S1Hbg4JmsVMTIVImLfRGDaEKIsNK_8e5QCg7MSOtOWDuj70P91vHHnt49Bu0ixP2G0oPRQAQONicT=s225" style="margin-left: auto; margin-right: auto;"><img border="0" data-original-height="225" data-original-width="225" height="295" src="https://blogger.googleusercontent.com/img/a/AVvXsEhgiyMPSX6K17OLcrm3-wIxC27pA4T03G951-AmVHbIWzwJtlHY7trAdvHS7vswbSiWwgMvAsYWi6WJTdwXFYj0swsItyr1qGy1bHEKUaRGgN2S1Hbg4JmsVMTIVImLfRGDaEKIsNK_8e5QCg7MSOtOWDuj70P91vHHnt49Bu0ixP2G0oPRQAQONicT=w295-h295" width="295" /></a></td></tr><tr><td class="tr-caption" style="text-align: center;"><br /></td></tr></tbody></table><br /><span style="color: #ff00fe; font-size: medium;"><br /></span><p></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><span style="font-size: medium;">రామానుజుల వారు జీవించి ఉన్నకాలంలో, విజయనగరంలో ఒక ముసలి బిచ్చగత్తె ఉండేది. ఆమె అసలు పేరు ఏంటో ఎవ్వరికీ తెలీదు కానీ, ఆమె ఎప్పుడూ సంతోషంగాఉండటం చూసి అందరూ ఆమెను ‘కళావతి’ అని పిలిచేవాళ్ళు.</span></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: medium;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: medium;">ఒకనాడు కళావతి నగర వీధుల్లో అడుక్కుంటుంటే వినబడింది- "భగవానుడైన రామానుజుల వారు త్వరలోనే నగరానికి రానున్నాడు" అని. ఆమె పెద్దగా చదువుకున్నదీ కాదు, ఏమంత తెలివితేటలు ఉన్నదీ కాదు. రామానుజుల గురించి ఆమె అంతవరకూ ఏనాడు విని ఉండలేదు కూడా. అయినా 'రామానుజులు రావటం' అనే సంగతి మటుకు ఆమెకు ఎందుకో చాలా నచ్చింది.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: medium;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: medium;">తర్వాతి రోజుల్లో ఆమె రామానుజుల గురించి అనేక విషయాలు విన్నది- నగర పెద్దల నుండి, పెద్ద పెద్ద వర్తకులనుండి, అతి సామాన్యుల వరకూ- అందరూ ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నారు! ఆయన కోసం ఎవరి తాహతుకు తగినట్లు వాళ్ళు ఏవేవో బహుమతులు తీసుకు వెళ్తారు. ఆయన మటుకు ఎవ్వరు ఏది ఇచ్చినా తీసుకుంటాడు. అసలైతే ఆయనకు భక్తి తప్ప మరేమీ అక్కర్లేదట.." ఇట్లా ఏవేవో చెప్పుకుంటున్నారు జనం.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: medium;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: medium;">కళావతి తనకు తెలియకుండానే రామానుజుల రాక కోసం ఎదురు చూడటం మొదలు పెట్టింది.ప్రతిరోజూ అడుక్కుంటూ నగర శివార్ల వరకూ పోయి, అక్కడే సాయంత్రం వరకూ ఉండి, వెనక్కి తిరిగి వచ్చేది. </span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: medium;">కొన్ని రోజుల తర్వాత రామానుజులు వచ్చాడు. కళావతి ఆ సమయానికి నగరం శివారులోనే ఉన్నది. రామానుజుని వెంట అనేకమంది భక్తులు- అందరూ చకచకా నడచుకొంటూ కళావతిని దాటుకొని పోయారు. రామానుజుడు తనని చూసి చిరునవ్వు నవ్వినట్లు, "నా వెంట రా" అని చెప్పినట్లు అనిపించింది కళావతికి. ఆమె మనసు పులకరించి, ఆయన వెంటే పోయింది. ఆమె కాళ్ళు మటుకు ఆయన్ని అనుసరించలేక వెనుక పడ్డాయి.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: medium;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: medium;">తెలివి వచ్చి చూసుకునేసరికి కళావతి నగరంలో ఉన్నది. సాయంత్రపు చీకట్లు ముసురుకుంటున్నాయి. రామానుజుని దర్శించుకునేందుకు వచ్చిన వాళ్ళతో నగర వీధులన్నీ కిటకిటలాడుతున్నాయి.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: medium;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: medium;">ఎక్కడ చూసినా స్వాగత తోరణాలు, సందడి. అందరి చేతుల్లోనూ పూలు, పళ్ళు, ధూపాలు, వస్త్రాలు, రక రకాల తినుబండారాలు- అన్నీబుద్ధునికి-అతని అనుచరులకు బహుమానంగా ఇచ్చేందుకు!</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: medium;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: medium;">వాటిని చూసేసరికి కళావతికి అకస్మాత్తుగా తను ఏమీ తేలేదని గుర్తుకొచ్చింది. 'అంత గొప్ప భగవానుడిని ఒట్టి చేతుల్తో దర్శించటం ఏం బాగుంటుంది' అనిపించింది. తన దగ్గర ఏమున్నదో వెతుక్కున్నది. ఒక చిన్న నాణెం మాత్రం ఉంది. ఆ నాణాన్ని పట్టుకొని ప్రక్కనే కనబడ్డ శెట్టి దుకాణానికి పోయింది. నాణానికి సరిపడ నూనె ఇమ్మన్నది.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: medium;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: medium;">ఆ నాణెం ధరకు అసలు ఏ కొంచెం నూనె కూడా రాదు. కళావతి తన కొంగును కొంచెం చింపి ఇచ్చింది- "ఇదిగో, ఈ పీలిక తడిసేంత నూనె ఇవ్వు చాలు. భగవానుడి ముందు దీపం వెలిగిస్తాను" అని ప్రాధేయపడ్డది.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: medium;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: medium;">'భగవానుడికోసం' అనేటప్పటికి శెట్టి మెత్తబడ్డాడు. పీలికని నూనెలో తడిపి ఇచ్చాడు. కళావతి దాన్నిపట్టుకొని పోయి, రామానుజుడు బస చేసిన మందిరానికి చేరుకున్నది. అక్కడ ఇసకేస్తే రాలనంత మంది జనం. అక్కడ ఓ మూలగా మట్టి ప్రమిద ఒకటి కనబడితే, దానిలో ఈ ఒత్తిని వేసి వెలిగించింది ఈమె.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: medium;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: medium;">దానిముందు మోకరిల్లి, "స్వామి! నీకిచ్చేందుకు నా దగ్గర ఈ చిన్న దీపం తప్ప వేరే ఏదీ లేదు. అయినా నేను వెలిగించిన ఈ దీపం చీకట్లను ప్రారద్రోలాలి. ఇక్కడున్న వీళ్లందరికీ అంతులేని జ్ఞానం లభించేందుకు ఇది సాయపడాలి. అజ్ఞానపు పొరలన్నీ నశించి, అంతటా వెలుగు పరచుకోవాలి" అనుకున్నది.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: medium;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: medium;">ఆరోజు రాత్రి ఆలయంలోని దీపాలన్నీ ఒక్కటొక్కటిగా కొడిగట్టాయి. కానీ బిక్షగత్తె వెలిగించిన దీపం మటుకు తెల్లవారవచ్చినా ఇంకా వెలుగుతూనే ఉన్నది.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: medium;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: medium;">తెల్లవారు జామున దీపపు ప్రమిదలనన్నిటినీ సేకరించి ఒకచోట పేర్చేందుకు వచ్చిన ఒక శిష్యుడు దాన్ని చూసి "దీపంలోఒత్తి ఇంకా కొత్తగానే ఉన్నది. ఉదయంపూట దీనితో పనిలేదు. ఇవాల్టి రాత్రికి మళ్ళీ వెలిగించుకోవచ్చు" అని దాన్ని ఆర్పివేయబోయాడు. అతను ఎన్ని సార్లు ఆర్పివేసినా ఆ దీపం మళ్ళీ మళ్ళీ వెలుగు అంటుకున్నది! దీన్ని గమనించిన స్వామి నవ్వి, అతన్ని వారిస్తూ "ఇది ఇప్పట్లో ఆరదు. కళావతి వెలిగించిన ఈ జ్ఞాన దీపం ఆమెకే కాదు, అనేకమందికి ఆసరా అవుతుంది. ఈ జ్ఞానాగ్నిలో అనేక జీవుల కర్మలు సమూలంగా నశించనున్నాయి. పవిత్రమైన హృదయంతో, బలమైన సంకల్పంతో వెలిగించిన ఈ దీపంవల్ల ఆమె ఈ సరికే పరిశుద్ధురాలైంది. తన సొంత తపస్సు ఫలితంగా ఆమె రానున్న కాలంలో 'దీపకాంతి' అనే పేరు గల మహా భక్తురాలు అవుతుంది" అన్నాడు.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: medium;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: medium;">మనం చేసే పనులకు బలాన్ని చేకూర్చేది మన మనసులోని పవిత్రతే!</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: medium;">ఈ పై కధ FB నుండి సేకరణ...</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: medium;"> #ఓం నమో నారాయణాయ🙏</span></p></div>visalakshihttp://www.blogger.com/profile/12353866459824269934noreply@blogger.com1tag:blogger.com,1999:blog-2640908686154358505.post-46210633311045248602021-11-27T11:27:00.000+05:302021-11-27T11:27:59.649+05:30నాడీ వ్యవస్థ...<p><span style="color: #ff00fe;"> </span></p><p></p><div class="separator" style="clear: both; text-align: center;"><a href="https://1.bp.blogspot.com/-rDO0qji-_58/YaHHtqOyiCI/AAAAAAAACLw/Vb8Rh0TGx6oEu80-RIn1iSzvsvKmkD9BgCLcBGAsYHQ/s275/images%2B%25281%2529.jpeg" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="275" data-original-width="183" height="275" src="https://1.bp.blogspot.com/-rDO0qji-_58/YaHHtqOyiCI/AAAAAAAACLw/Vb8Rh0TGx6oEu80-RIn1iSzvsvKmkD9BgCLcBGAsYHQ/s0/images%2B%25281%2529.jpeg" width="183" /></a></div><br /><span style="color: #ff00fe;"><br /></span><p></p><p><span style="color: #ff00fe;">#కళ్ళల్లో మందు వేస్తే ఊపిరితిత్తులకు ఎలా వెళ్తుంది ? ఆయుర్వేదంలో పరిశోధనలు మొదలుపెట్టండి... అద్బుత సత్యాలు సాంకేతికతలు వెలుగు చూస్తాయి.</span></p><p><span style="color: #ff00fe;">కళ్ళల్లో మందు వేస్తే ఊపిరితిత్తులకు ఎలా వెళ్తుంది?</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి గుండె కొట్టుకోవడం ఆగినంత మాత్రానా లేదా శ్వాస ఆడనంత మాత్రాన అంటే ప్రాణవాయువు సంచరించనంత మాత్రాన శ్వాసకోశ వ్యవస్థ పనిచేయనంత మాత్రాన చనిపోయినట్లు కాదు.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">నాడి పరీక్షించాలి. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">నాడి ఆడుతున్నట్లయితే కొన ఊపిరితో ఉన్నట్లు.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ఈ నాడీ వ్యవస్థ కు ఉదానవాయువు ప్రధాన ఆధారం. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ఈ వాయువు కు అత్యవసర ద్వారాలు కళ్ళు. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">కళ్ళ ద్వారా సరైన ఔషధం తో ప్రాణవాయువు ను అందించగలిగితే అది నాడీమండలం ను చైతన్యపరచును.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">నాడీ మండలము శరీరమంతా వ్యాపించి యుండును కావున శరీరమంతటా వ్యాపించి యున్న వ్యాన వాయువును చైతన్యపరచును. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ఈ వ్యాన వాయువు స్తంభించిన అపాన, సమాన, ప్రాణవాయువు లను చైతన్య పరచును.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> అపాన వాయువు చైతన్యం వల్ల విసర్జక వ్యవస్థ,సమానవాయువు చైతన్యం వల్ల జీర్ణవ్యవస్థ, ప్రాణవాయువు చైతన్యం వల్ల శ్వాసకోశ వ్యవస్థ చైతన్యం పొందుతాయి. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ఈ విధంగా ఊపిరితిత్తులకు మళ్ళీ చలనం వస్తుంది. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">పంచప్రాణాలు పంచేంద్రియాలనబడు అత్యవసర ద్వారాలతో అనుసంధానించబడి ఉంటాయి</span></p><p><span style="color: #ff00fe;">1.ప్రాణవాయువు - ముక్కు</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">2.సమాన వాయువు - నాలుక</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">3.అపాన వాయువు - చెవులు</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">4.వ్యాన వాయువు - చర్మం</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">5.ఉదాన వాయువు - కళ్ళు</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">అలాగే పంచప్రాణాలు వాటి కేంద్ర స్థానాలు</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">1.ప్రాణవాయువు - గుండె</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">2.సమానవాయువు - నాభి</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">3.అపానవాయువు - పాయువు</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">4.వ్యాపనవాయువు - శరీరమంతటా</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">5.ఉదానవాయువు - కంఠం</span></p><p><span style="color: #ff00fe;">ఉదానవాయువు అనబడు పంచమప్రాణం గాలిలో కలవనంతవరకు పంచప్రాణాలు ఉన్నట్లే.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">దీన్నిబట్టి అర్థంచేసుకోవచ్చు "నా కంఠంలో ప్రాణమున్నంత వరకు" అని ఎందుకు అంటారో మరియు మరణశిక్షను ఉరిశిక్ష తో ఎందుకు అమలు చేస్తారో.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ఇది సామాన్య మానవులకు సైతం అర్థమయ్యే సంక్షిప్త సంగ్రహణ వివరణ మాత్రమే.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ఇందులో మళ్ళీ పంచ ఉప ప్రాణవాయువులు వాటి స్థానాలు,విధులు, పంచ కర్మేంద్రియాలు, పంచకోశాలు, షడ్చక్రాలు,షడ్రసాలు,త్రిగుణాలు, త్రిదోషాలు,ద్వైతము,అద్వైతము </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ఇలా ప్రతీ ఆధ్యాత్మిక అంశం కూడా ఆరోగ్య సంబంధమే.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ఆయుర్వేదం ఆయుః ఆరోగ్య ఆధ్యాత్మిక ఆనంద రస మొదలగు సకలశాస్త్ర విజ్ఞానం.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">కళ్ళతో శ్వాసక్రియ ఎలా అనే సందేహం కలగవచ్చు కొంతమంది విజ్ఞానులకు. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">దానికి సమాధానం విజ్ఞానం లో కూడా ఉంది.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">అది ఏమిటంటే కప్ప చర్మం ద్వారా శ్వాసక్రియ జరుపుకుంటుంది కదా? </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">అలాగే అత్యవసర పరిస్థితుల్లో మనిషికి పంచేంద్రియాలు శ్వాసేంద్రియాలు/ventilators అవుతాయి.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ఈతరాక నీటిలో మునిగిపోయిన వారిని రక్షించిన తరువాత వారి పొట్ట పై నొక్కుతారు.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">నోటిలో నుండి నీళ్ళు బయటకు వచ్చిన తర్వాత అరికాళ్ళు అరిచేతులు బాగా రుద్దుతారు.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">తలను గుడ్డ తో తుడిచి బట్టలు మార్చి చలిమంట దగ్గర కూర్చోబెడతారు.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ఈ ప్రథమ చికిత్స ఇంగ్లీష్ వైద్యం రాక ముందు లేదా? మరి దాన్ని నాటు చికిత్స అందామా ? </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">దాని శాస్త్రీయత కూడా ఇదే. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">శరీరమంతా వ్యాపించి ఉన్న నాడీమండల వ్యవస్థ ను చైతన్య పరచడం ద్వారా వ్యాన వాయువును తద్వారా అపాన, సమాన, ప్రాణవాయువు లను చైతన్య పరచడం.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ఇక్కడ ventilator గా చర్మం (అరికాళ్ళు, అరిచేతులు, తల, ఒళ్ళు రుద్దడం తుడవడం) ద్వారా చికిత్స చేస్తాం.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">పాము కరచినప్పుడు కొంతమంది ఆయుర్వేద వైద్యులు రావి ఆకుల కొనలను రెండు చెవుల్లో ఉంచడం ద్వారా బ్రతికిస్తారు. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ఎలాగంటే పైన చెప్పినట్లు అపానవాయువు/విసర్జక వ్యవస్థ(విషాన్ని బయటకు విసర్జింపచేయడం) పనిచేయనప్పుడు చెవులు అత్యవసర ద్వారాలు.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">చెవుల ద్వారా శ్వాసక్రియ జరిపించి పాము విష ప్రభావమును వికటింపచేసి మనిషిని కాపాడుతారు. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ఇప్పుడు ఆ నైపుణ్యం కల వైద్యులు లేనంత మాత్రాన ఇది అసత్యం కాదు. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ఉపయోగాలు ఆయుర్వేదం లో ఉన్నాయి.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">కానీ ప్రయోగాలు అల్లోపతి లో చేస్తున్నారు.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">మరి సత్యం ఎలా ఆవిష్కరించబడుతుంది? </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">అందుకే ఆయుర్వేదంలో పరిశోధనలు మొదలుపెట్టండి.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">అద్భుత సత్యాలు సాంకేతికతలు వెలుగు చూస్తాయి.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">అవి ఉచిత పథకాలకు కూడా ఉపయోగపడి సామాన్యులకు ఉపయోగపడతాయి.</span></p><p><span style="color: #ff00fe;">సేకరణ.....</span></p>visalakshihttp://www.blogger.com/profile/12353866459824269934noreply@blogger.com1tag:blogger.com,1999:blog-2640908686154358505.post-66589123601037809322021-11-26T19:25:00.003+05:302021-11-26T19:25:55.414+05:30తండ్రి ఆశీర్వాద శక్తి....<p><span style="color: #ff00fe;"> </span></p><div class="separator" style="clear: both; text-align: center;"><span style="color: #ff00fe;"><a href="https://1.bp.blogspot.com/-hsrZb_pTjSk/YZx-Ivn-7LI/AAAAAAAACLo/jmRnCXM5C_4T77i1JZRbNo6CMZncBruGACLcBGAsYHQ/s1080/FB_IMG_1637645725807.jpg" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="808" data-original-width="1080" height="239" src="https://1.bp.blogspot.com/-hsrZb_pTjSk/YZx-Ivn-7LI/AAAAAAAACLo/jmRnCXM5C_4T77i1JZRbNo6CMZncBruGACLcBGAsYHQ/s320/FB_IMG_1637645725807.jpg" width="320" /></a></span></div><span style="color: #ff00fe;"><br /></span><p></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">#తండ్రి ఆశీర్వాదం* </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> అవసానదశలో ఉన్న ఒక తండ్రి తన ఏకైక కుమారుడైన ధరమ్ పాల్ ని పిలిచి, “ప్రియమైన కుమారా, నీకు వారసత్వంగా వదిలివెళ్ళడానికి నేను ఏ సంపదను కూడగట్టలేకపోయాను. కానీ జీవితాంతం నా పని యెడల ఎల్లప్పుడూ నిజాయితీగా, ప్రామాణికంగా ఉన్నానని నీకు నమ్మకం ఇవ్వగలను. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">కాబట్టి, నీకు ఆశీర్వాదం ఇస్తున్నాను, నీవు జీవితంలో ఎల్లప్పుడూ సంతోషంగా, విజయవంతంగా ఉంటావు. నువ్వు ఏది తాకినా అది బంగారం అవుతుంది నాయనా! ", అని చెప్పాడు. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ధరమ్ పాల్ కృతజ్ఞతతో నమస్కరించి, భక్తితో తన తండ్రి పాదాలను తాకాడు. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">తండ్రి ప్రేమగా కుమారుడి తలపై చేయి వేసి, సంతృప్తిగా, ప్రశాంతంగా తుది శ్వాస విడిచాడు.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ఇంటి ఖర్చులు చూసుకోవడం ఇప్పుడు కొడుకు ధరమ్ పాల్ బాధ్యత. అతను తోపుడు బండిపై చిన్న వ్యాపారం ప్రారంభించాడు. వ్యాపారం సమయంతో క్రమంగా అందుకున్న తర్వాత, ఒక చిన్న దుకాణాన్ని కొన్నాడు.</span></p><p><span style="color: #ff00fe;">క్రమంగా, వ్యాపారం మరింత విస్తరించింది. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">త్వరలోనే నగరంలోని సంపన్నులలో , ఐశ్వర్యవంతులలో అతను లెక్కించబడ్డాడు. ఇదంతా తన తండ్రి దీవెనల ఫలితమని అతను నిజంగా విశ్వసించాడు. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">తన తండ్రి ఎన్ని కష్టాలు పడినా సహనాన్ని విడిచిపెట్టలేదు, విశ్వాసం కానీ, ప్రామాణ్యతను కానీ కోల్పోలేదు, అందువల్లనే ఆయన మాటలకు అలాంటి శక్తి ఉండి, ఆయన ఆశీర్వాదాలు ఫలించాయి. </span></p><p><span style="color: #ff00fe;">ధరమ్ పాల్ ఎప్పుడూ అందరికీ ఇలా చెప్తూ, తన విజయానికి తన తండ్రి ఆశీస్సులే కారణమని చెబుతూ ఉండేవాడు.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ఒకరోజు ఒక స్నేహితుడు అడిగాడు, “మీ నాన్న అంత శక్తిమంతుడైతే, ఆయన ఎందుకు వృద్ధి చెందలేదు, ఎందుకు సంతోషంగా జీవించలేకపోయాడు?” </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ధరమ్ పాల్ మాట్లాడుతూ, "మా నాన్న శక్తివంతమైన వ్యక్తి అని నేను చెప్పడం లేదు, ఆయన ఆశీస్సులు చాలా శక్తివంతమైనవని నేను చెబుతున్నాను." </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ఎప్పుడూ తన తండ్రి ఆశీర్వాదం గురించి మాట్లాడటం వలన, అందరూ అతనికి 'తండ్రి ఆశీర్వాదం' అని పేరు పెట్టారు. ధరమ్ పాల్ దీన్ని పట్టించుకోలేదు, తన తండ్రి ఆశీర్వాదాలకు అర్హుడిగా మారగలిగితే అదే తనకు గౌరవంగా ఉంటుందని చెప్పాడు.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">సంవత్సరాలు గడిచిపోయాయి, ఇప్పుడు తన వ్యాపారాన్ని విదేశాలకు కూడా విస్తరించాడు. ఎక్కడ వ్యాపారం చేసినా పెద్ద లాభాలు వచ్చేవి. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">నేను ఎప్పుడూ లాభాలను ఆర్జిస్తున్నాను, నేను ఒక్కసారి నష్టాన్ని అనుభవించాలి అని ఒకసారి ధరమ్ పాల్ కుతూహలపడ్డాడు. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ఒక నష్టపోయే వ్యాపారాన్ని సూచించమని తన స్నేహితుడిని అడిగాడు. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ధరమ్ పాల్ విజయాన్ని, డబ్బుని చూసుకొని చాలా గర్వపడుతున్నాడని, ఆ స్నేహితుడు ఖచ్చితంగా నష్టపోయే వ్యాపారాన్ని సూచించాలి అని అనుకున్నాడు . </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">భారతదేశం నుండి లవంగాలను కొనుగోలు చేసి, వాటిని ఆఫ్రికాలోని జాంజిబార్కు రవాణా చేసి, అక్కడ విక్రయించమని సలహా ఇచ్చాడు.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ధరమ్ పాల్ కు ఈ ఆలోచన నచ్చింది. జాంజిబార్ లవంగాలకు చాలా ప్రసిద్ధి చెందింది. అవి అక్కడ నుండి భారతదేశంలోకి దిగుమతి చేయబడతాయి, ధర కూడా 10-12 రెట్లు అమ్ముడవుతుంది. వాటిని ఇక్కడ కొనుగోలు చేసి అక్కడ విక్రయిస్తే కచ్చితంగా నష్టమే. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">తన తండ్రి ఆశీర్వాదాలు అతనికి ఎంతవరకు సహాయపడతాయో చూడడానికి ధరమ్ పాల్ దీనిని ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాడు. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">నష్టాన్ని అనుభవించడానికి, అతను భారతదేశంలో లవంగాలను కొని, వాటిని ఓడలో నింపి, స్వయంగా జాంజిబార్ ద్వీపానికి తీసుకెళ్లాడు.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">జాంజిబార్ ఒక సల్తనత్. ధరమ్ పాల్ ఓడ దిగి, వ్యాపారులను కలవడానికి పొడవైన ఇసుక దారి పై నడవడం ప్రారంభించాడు. అవతలి వైపు నుండి సైనికులతో పాటు కాలినడకన వస్తూ, సుల్తాన్ లాగా కనపడుతున్న వ్యక్తిని చూశాడు.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ఎవరని వాకబు చేయగా ఆయన స్వయంగా సుల్తాన్ అని చెప్పారు. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">వారు ఒకరినొకరు ఎదురుపడ్డప్పుడు, ధరమ్ పాల్ ను పరిచయం చేసుకోమని సుల్తాన్ అన్నాడు. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">అప్పుడు ధరమ్ పాల్ ఇలా చెప్పాడు, "నేను భారతదేశంలోని గుజరాత్లోని ఖంభాట్ నుండి వ్యాపారిని, వ్యాపారనిమిత్తం ఇక్కడకు వచ్చాను." </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">సుల్తాన్ అతన్ని వ్యాపారవేత్తగా భావించి తగిన గౌరవంతో మాట్లాడటం ప్రారంభించాడు.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">సుల్తాన్తో పాటు వందలాది మంది సైనికులు ఉన్నారు కానీ, ఎవరి వద్దా కత్తులు కానీ తుపాకులు లేకపోవడం ధరమ్ పాల్ గమనించాడు. బదులుగా,వారందరూ తమతో పాటు భారీ జల్లెడలను తీసుకువెళ్తున్నారు. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">అతనికి చాలా ఆశ్చర్యంగా, ఆసక్తిగా అనిపించింది. వినయంగా సుల్తాన్ను, “మీ సైనికులు జల్లెడలను ఎందుకు మోస్తున్నారు?” అని అడిగాడు.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">సుల్తాన్ నవ్వుతూ ఇలా అన్నాడు, “ నేను ఈ ఉదయం సముద్రతీరాన్ని సందర్శించడానికి వచ్చాను, ఇక్కడ ఎక్కడో నా వేలి నుండి ఉంగరం జారిపడిపోయింది. ఇప్పుడు, ఈ ఇసుకలో సరిగ్గా ఎక్కడ పడిందో గుర్తించడం కష్టం, కాబట్టి నేను నా సైనికులను వెంట తెచ్చుకున్నాను. వారు ఇసుకను జల్లించి నా ఉంగరాన్ని వెతుకుతారు.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ఆ ఉంగరం చాలా ఖరీదైనదని అయ్యుండాలి ధరమ్ పాల్ అన్నాడు. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">అలా కాదని సుల్తాన్ ఇలా చెప్పాడు, “నా దగ్గర దానికంటే చాలా విలువైన, లెక్కలేనన్ని ఉంగరాలు ఉన్నాయి, కానీ ఆ ఉంగరం ఒక సాధువు యొక్క ఆశీర్వాదం.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ఆ సాధువు ఆశీర్వాదం వల్ల నా సల్తనత్ చాలా ధృడంగా, సంతోషంగా ఉందని నేను నమ్ముతున్నాను, కాబట్టి నా మనస్సులో ఆ ఉంగరం విలువ నా సల్తనత్ కంటే ఎక్కువ!”.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> అప్పుడు, సుల్తాన్ మళ్ళీ వ్యాపారం గురించి మాట్లాడటం ప్రారంభించి, “అయితే, ఈసారి ఏ వస్తువులు తెచ్చావు?” అని అడిగాడు.</span></p><p><span style="color: #ff00fe;">" లవంగాలు", అన్నాడు ధరమ్ పాల్. </span></p><p><span style="color: #ff00fe;">అది విని సుల్తాన్ ఆశ్చర్యపోయాడు.</span></p><p><span style="color: #ff00fe;">“ ఇది లవంగాల దేశం, మీరు ఇక్కడ లవంగాలు అమ్మడానికి వచ్చారా? మీకు అలాంటి సలహా ఎవరు ఇచ్చారు? ఖచ్చితంగా, ఆ వ్యక్తి మీ శత్రువు అయి ఉండాలి! ఇక్కడ, మీరు ఒక పైసాతో గుప్పెడు లవంగాలను కొనుక్కోవచ్చు. ఇక్కడ మీ నుండి లవంగాలు ఎవరు కొంటారు, ఇంక మీరు ఏం సంపాదిస్తారు? ”</span></p><p><span style="color: #ff00fe;">ధరమ్ పాల్, “ నేను అదే పరీక్షించాలనుకుంటున్నాను ప్రభూ ! నేను ఇక్కడ ఏమైనా లాభం పొందగలనో లేదో చూడాలి. నాన్నగారి ఆశీర్వాదంతో ఇప్పటి వరకు నేను ఏ వ్యాపారం చేసినా లాభసాటిగా సాగింది. కాబట్టి, ఇప్పుడు ఆయన ఆశీస్సులు ఇక్కడ కూడా పనిచేస్తాయో లేదో చూడాలనుకుంటున్నాను.”</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">సుల్తాన్ ఇలా అడిగాడు, “తండ్రి ఆశీస్సులా ! అంటే దాని అర్థం ఏమిటి?!" </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">అప్పుడు ధరమ్ పాల్ అతనికి వివరించాడు, “మా తండ్రి ఆయన జీవితమంతా నిజాయితీ, చిత్తశుద్ధితో పనిచేశారు, కానీ డబ్బు సంపాదించలేకపోయారు. మరణ సమయంలో నా చేతిపై చేయివేసి, నీ చేతిలోని ధూళి కూడా బంగారంగా మారాలని ఆశీర్వదించారు", అని ఆ మాటలు మాట్లాడుతూ , ధర్మపాల్ వంగి నేల నుండి గుప్పెడు ఇసుక తీసుకున్నాడు.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ఇసుకను తన వేళ్ళ మధ్య జారిపోనిస్తూ, సుల్తాన్ ముందు గుప్పిటను తెరిచేసరికి, ధర్మపాల్, సుల్తాన్ ఇద్దరి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ఇసుక మొత్తం జారిపోయిన తర్వాత ధరమ్ పాల్ చేతిలో వజ్రం పొదిగిన ఉంగరం మిగిలిఉంది.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">సుల్తాన్ వెతుకుతున్న ఉంగరం ఇదే. అతను ఉంగరాన్ని చూసి చాలా సంతోషించాడు. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">“ఇది మహాద్భుతం ! ఓ అల్లా , చాలా కృతజ్ఞతలు, మీరు ఒక తండ్రి ఆశీస్సులను నిజం చేసారు! ” .</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">అదే భగవంతుడు సాధువు ఆశీస్సులకు కూడా శక్తిని ప్రసాదిస్తాడని ధరమ్ పాల్ అన్నాడు. </span></p><p><span style="color: #ff00fe;">అది విన్న సుల్తాన్ మరింత సంతోషించాడు. అతను ధరమ్ పాల్ ని కౌగిలించుకొని, " ఇవాళ నువ్వు ఏది కోరుకుంటే అది ఇస్తాను" అన్నాడు. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ధరమ్ పాల్ ఇలా అన్నాడు, “నువ్వు 100 ఏళ్లు జీవించి, నీ ప్రజలను బాగా చూసుకోగాక ! ప్రజలు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను, నాకు మరేమీ అక్కర్లేదు."</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">సుల్తాన్ అది విని ఉప్పొంగిపోయి, “నేను ఈరోజు మీ వస్తువులన్నీ కొంటాను. మీరు కోరుకున్నంత ధర ఇస్తాను”, అన్నాడు.</span></p><p><span style="color: #ff00fe;">కాబట్టి, ధరమ్ పాల్ తండ్రి ఆశీర్వాదం అక్కడ కూడా అతనిని విఫలం చేయలేదు.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">తల్లిదండ్రుల ఆశీస్సులకు అపారమైన శక్తి ఉందని, వారి ఆశీస్సుల కంటే గొప్ప సంపద మరొకటి లేదన్నది వాస్తవ సత్యం. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">వారి సేవలో గడిపిన ప్రతి క్షణం ఫలాన్ని ఇస్తుంది. మన పెద్దలను గౌరవించడమే భగవంతునికి మనం చేసే ఉత్తమమైన సేవ.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ఈ ప్రపంచం అంతా అనేకమైన అవకాశాలుతో నిండిఉంది. సాధ్యమయ్యే సంఘటనకు అవకాశం ఎలాగూ ఉంటుంది, కానీ అత్యద్భుతమైన విషయం ఏమిటంటే, అసాధ్యమైన సంఘటన సాధ్యమయ్యే అవకాశం కూడా ఉంది.</span></p><p><span style="color: #ff00fe;">సేకరణ...... From FB...</span></p>visalakshihttp://www.blogger.com/profile/12353866459824269934noreply@blogger.com2tag:blogger.com,1999:blog-2640908686154358505.post-90000088553991024442021-11-13T19:37:00.000+05:302021-11-13T19:37:04.446+05:30కుండలినీ శక్తి..<p><span style="color: #ff00fe;"> </span></p><div class="separator" style="clear: both; text-align: center;"><span style="color: #ff00fe;"><a href="https://1.bp.blogspot.com/-zuupA5WiCo8/YY_F1L34UvI/AAAAAAAACLQ/BfTMsodrcZQ1Y2C_tUkzyJRwnIpB6wSHACLcBGAsYHQ/s260/images%2B%25281%2529.jpeg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="260" data-original-width="194" height="400" src="https://1.bp.blogspot.com/-zuupA5WiCo8/YY_F1L34UvI/AAAAAAAACLQ/BfTMsodrcZQ1Y2C_tUkzyJRwnIpB6wSHACLcBGAsYHQ/w298-h400/images%2B%25281%2529.jpeg" width="298" /></a></span></div><span style="color: #ff00fe;"><br /></span><p></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">#కుండలినీ శక్తి - శ్రీ సుబ్రహ్మణ్య స్వామి*</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">కుండలినీ = పాము వంటి ఆకారము గలది,</span></p><p><span style="color: #ff00fe;">కుండలినీ = మూడున్నర చుట్లు చుట్టుకొని సర్పాకారమున నిద్రించునది.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> చెవులకు పెట్టుకునే ఆభరణాల్లో కుండలాలు ప్రధానమైనవి. అవి చూడటానికి మండలాకారంలో పాము చుట్ట వలె వుంటుంది.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> కాబట్టి - "కుండలము అంటారు. జీవశక్తి - మూలాధార చక్రం దగ్గర మూడున్నర చుట్లు చుట్టుకొన్న పాములాగా, తోకచేత ముఖాన్ని కప్పుకొని ఉన్నట్టు వుంటుంది కుండలిని అందువలన ఈ జీవశక్తిని గూడా “కుండలినీ శక్తి” అన్నారు.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">అమ్మవారు కుండలినీ అనే శక్తిరూపంలో మన శరీరంలో ఉంటుంది.కుండలాలు కలది కుండలిని. కుండలం అనగా చుట్ట.అమ్మవారు మూలాధారచక్రంలో గుండ్రంగా ఉండి,మూడున్నర చుట్టలు చుట్టుకొని, తోకను నోట కరిచిపట్టుకొని పడుకొని మంచి గాఢనిద్రపోతున్న పాములాగా ఉండే శక్తిస్వరూపిణి.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">బాలా మంత్రంలోని మూడు బీజాక్షరాలే ముక్కోణాలనీ, అవి కలిస్తే కుండలిని అనీ, లేదా జ్ఞాన, ఇచ్ఛా, క్రియా శక్తుల కలయికే కుండలిని అని యోగినీ హృదయంలో చెప్పారు.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ఇడా,పింగళా మధ్యలో సుషుమ్నా అనబడే నాడి ఉంటుంది.ఈ నాడికి మధ్యలో ఉన్న శక్తిని కుండలినీ అంటారని యోగశాస్త్ర నిర్వచనం.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">జీవశక్తిః కుండలాఖ్యా-అనగా జీవశక్తిని కుండలినీ అంటారు.మనస్సుని జీవింపజేస్తూ పుర్యష్టకం అనే పేరుతో చక్కని సంపంగి పూలవాసనతో ఉండే దివ్యశక్తి కుండలిని అని చెప్పబడింది.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ఈ కుండలినీ శక్తి సమస్త జ్ఞానానికి, సమస్త శక్తి మహిమలకు ఆధారభూతమైన కేంద్రము. దీని వినియోగము తెలియనంత కాలం - ఆది మూడున్నర చుట్లు చుట్టుకొని మూలాధారం దగ్గర నిద్రావస్థలో వుంటుంది.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> వినియోగం తెలిసి, సాధన జరుగుచున్నపుడు - ఇది మేల్కాంచి, సుషుమ్నా మార్గం ద్వారా, ఊర్ద్వ గతిని చరించి, అన్నింటికన్న పైన వున్న సహస్రార కమలాన్ని చేరి, అక్కడ వున్న సదాశివునితో జేరి, సాధకునికి జీవన్ముక్తిని ప్రసాదిస్తుంది.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">వ్యక్తిలోని కుండలినీ శక్తిని 'వృష్టి కుండలినీ' అంటారు. ఈ వ్యష్టి కుండలినికి - సర్వదేవత అయిన 'సుబ్రహ్మణ్యస్వామి' లేదా 'కుమారస్వామి'ని అధిపతిగా చెబుతారు.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> వలయాకారంలో వుండే ఈ కుండలినికి అధిపతి కాబట్టి వల్లీనాధునిగా సుబ్రహ్మణ్య స్వామిని సంకేతిస్తారు.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">కుండలినీ శక్తి బుద్దికి జ్ఞానంకి కేంద్రం కుమారస్వామి జ్ఞానానికి అధిపది అలాగే ఏదైనా పరిస్థితులు ఆటంకంగా ఉన్నాయి అనుకూలించడం లేదు అని అనుకున్నప్పుడు ఈ సుబ్రహ్మణ్యం స్వామినే ఆరాధించమని చెప్తారు.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ఎందుకంటే ఈ కుమార స్వామి బుద్దిని తేజోవంతము చేసే కుండలినికి అధిపతి కనుక మనలో కుండలినీ శక్తిని మనకు ఉపయోగ పడేలా చేయమని వేడుకోవడం </span></p><p><span style="color: #ff00fe;">అలాగే సంతానం కోసం గర్భం నిలవడం కోసం కూడా కుండలినికి అధిపతి అయిన సుబ్రహ్మణ్యం స్వామినే ఆరాధిస్తారు.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> అందరూ గురు ముఖంగా చక్రాలు చేదించి ఉపయోగం పొందలేరు అటువంటి వారికి సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన పద్ధతుల ద్వారా ఆ పదాల ఉచ్చారణ ద్వారా కుండలినీ లో కదలికలు మొదలై మూలాధారంలో జీవుడికి శక్తి ప్రసరిస్తుంది.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> మంత్రం అనేది మనలోని నాడులు మనలోని కుండలినీలో చలనం స్పందన కలిగించే విధంగా అమార్చబడి ఉంటాయి అందుకే ఏది ఎందుకోసమో తెలుసుకొని ఉచ్చారణ చేయాలి.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ఇక బ్రహ్మాండానికి వుండే కుండలినీ శక్తిని సమిష్టి కుండలినీ' అంటారు. ఈ సమిష్టి కుండలినికి 'అనంతుడు' లేదా 'ఆదిశేషువు'ను అధిపతిగా చెబుతారు.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">మనలో కుండలినీ శక్తిని ఎలా కుమారస్వామి అధిపతిగా ఉండి రక్షిస్తున్నాడో అలాగే సృష్టి యొక్క సమిష్టి కుండలినీని ఆదిశేషుడు రక్షణగా ఉంటూ కాపాడతాడు అంటే ఆయనకు అధిపతి అయిన మహా విష్ణువు రక్షణకుడిగా ఉంది కపాడుతుంటాడు సృష్టికి ఆపద వాటిల్లి నప్పుడు మహావిష్ణువు రక్షిస్తాడు.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">కుండలినీ శక్తి సహజంగా వేడిగా అగ్నితత్వం కలిగినది. ఇడానాడి - చంద్రతత్త్వం, పింగళా నాడి సూర్యతత్త్వం, సుషుమ్నానాడి అగ్నితత్వం కలిగినవి. ఈ మూడింటిని వరుసగా గంగ, యమున, సరస్వతీ నదులతో సమన్వయిస్తారు.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">అంటే సరస్వతి అగ్నితత్వం కలిగినదన్నమాట! దీనిని బట్టి సరస్వతి (వాగ్దేవత), కుండలినీశక్తి - ఒకే తత్వం కలిగినవి. కాబట్టి, కుండలినీ శక్తి ప్రధానంగా వాక్కుకు సంబంధించిన శక్తి ఔతుంది.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ఈ వాక్కు కూడా జ్ఞానానికి సంబందించినది కుండలినీ సాధకులు యొక్క వాక్కు ఆమోగం వారి మాట వరంగా శాపంగా కూడా మారుతుంది ఎందుకంటే వాగ్దేవత వారికి సాధన ద్వారా వాకేసుద్ది ని ప్రసాధిస్తుంది.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> నిత్యం సంస్కృత శ్లోకాలు పఠించే వారికి కూడా వాకేసుద్ది లభిస్తుంది సంస్కృతం లోని ప్రతి అక్షరం బీజమే వాటికి అధిపది సరస్వతి రూపం లో ఉన్న అమ్మవారు ఈ సరస్వతి అగ్నితత్వం తో కుండలినిలో నివసిస్తుంది.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ఈ సంస్కృత శ్లోకాలు పఠనం వల్ల ఆ శక్తి మనలోని మలినాన్ని తొలగించి పాసిటివ్ ఎనర్జీ ని కాస్మిక్ ఎనర్జీ ని ఆకర్షిస్తుంది దానివల్ల పఠించే వారికి వాక్ శుద్ది పుష్కలంగా లభిస్తుంది.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">*ఓం నమః శివాయ*:</span></p><p><span style="color: #ff00fe;">ఈ వాక్కుకు సంబంధించిన బీజాక్షరం “ఐం', దీన్ని 'వాగ్భవబీజం' అంటారు. ఈ బీజాక్షరంలో వున్న అక్షరాలను విడదీస్తే 'ఐం=అ+ఏ+మ్' అవుతుంది. 'ఏ' అనే అచ్బును మళ్ళీ విడదీస్తే 'ఏ=అ+ఇ' అవుతుంది.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">కాబట్టి 'ఐం' లో 'అ,ఇ,ఆ,మ్' అక్షరాలు వుంటాయి. వీటిలో మూడు అక్షరాలు పూర్తిగా వున్నాయి కాబట్టి - మూడు పూర్తి చుట్లను, చివరిదైన 'మ్' (మవర్ణము) సగమే వుంది కాబట్టి - సగం చుట్టును సూచిస్తుంది.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> 'ఐం' అనే కుండలినీ శక్తిలో మూడున్నర చుట్లు వున్నాయి అనడంలో ఔచిత్యం ఇదే! ఇది మంత్ర శాస్త్రపరమైన సమన్వయం.</span></p><p><span style="color: #ff00fe;">ఇట్లు మూడున్నర చుట్లు గలది "కుండలినీ" అగును. ఈ కుండలినీ శక్తికి, కుటిలాంగీ - భుజంగీ - శక్తి - ఈశ్వరీ - అరుంధతీ - కుండలీ అనే నామాంతరాలు కలవు.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">జీవి మానవ జన్మను పొందకపూర్వం- ఖనిజస్థితి (Mineral state), వృక్షస్థితి (Plant state), జంతుస్థితి (Animal state)కి సంబంధించిన కక్ష్యలను - దాటడం జరిగింది.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> కాబట్టి మూడు పూర్తి కక్ష్యలు పూర్తయినట్లు లెక్క ఇక మానవ జన్మను పొందినందుకు మాత్రం సగం చుట్టు గూడా పూర్తవుతుంది. మానవ జన్మను పొందినంత మాత్రాన పూర్తి చుట్టు పూర్తవదు.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ఆ జన్మను పొంది, తన సాధన ద్వారా మిగిలిన సగం చుట్టును గూడా పూర్తి చేసుకుంటే - నాలుగు రకాల కక్ష్యలను దాటి జీవన్ముక్తుడౌతాడు. అంటే పూర్తికావలసిన సగం చుట్టు - యోగ సాధన ద్వారా పూర్తి కావాలి.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ఈ విషయాన్ని తెలియచెయ్యడం కోసమే జీవశక్తి అయిన కుండలిని - మానవులందరిలో ‘మూడున్నర చుట్లు చుట్టుకొని వుంటుంది' అనడం. ఇది జీవపరిణామ శాస్త్రసమన్వయం. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">కుండలినీ కి మరో పేర్లు</span></p><p><span style="color: #ff00fe;">1. కుటిలాంగి</span></p><p><span style="color: #ff00fe;">2. శక్తి</span></p><p><span style="color: #ff00fe;">3. కుండలిని</span></p><p><span style="color: #ff00fe;">4. కుండలి</span></p><p><span style="color: #ff00fe;">5. భుజంగి</span></p><p><span style="color: #ff00fe;">6. ఈశ్వరి</span></p><p><span style="color: #ff00fe;">7. అరుంధతి.</span></p><p><span style="color: #ff00fe;">ఈ ఏడు పేర్లు కుండలినికి నామాంతరాలు.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">వివిధ పురాణాలలో కుండలినీ గురించి..</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">తంత్రరాజంలో కుండలిని గురించి ఈ విధంగా ఉంది.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">మూలాధారంలో అగ్ని తేజస్సు మధ్యన ఉన్నదై జీవశక్తి తేజోరూపమైన ప్రాణాకారము కలది, సర్పాకారంలో మూడు చుట్టలు చుట్టుకుని నిద్రిస్తూ ఉంటుంది.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">సుషుమ్న మధ్యలో మాయాశీర్షముపై నుండి బుసకొడుతూ ఉంటుంది. చెవులు మూసుకుని ఎవరు ఆ ధ్వనిని వినలేడో, అతడికి త్వరలో మృత్యువు ప్రాప్తిస్తుంది, అని ఉన్నది. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">దేవీపురాణంలో కుండలినీ శక్తిని గురించి చెబుతూ</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">యత శృృంగాటకాకారా కుండలి న్యుచ్యతే తతః</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">అన్నారు అంటే - కుండలినీ శక్తి శృంగాటకాకారము గలది. శృంగాటకము అంటే త్రికోణము అని అర్ధం. ఇచ్చా జ్ఞానక్రియాశక్తులే శృంగాటకము అని యోగినీ</span></p><p><span style="color: #ff00fe;">హృదయం చెబుతోంది.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">మూలాధారంలో భుజంగాకారంలో చుట్టలు చుట్టుకుని తేజోరూపంలో ప్రకాశించేదే కుండలిని. పంచదశీ మంత్రానికి వాగ్బీజమే కుండలిని.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">మేరుదండానికి చివర</span></p><p><span style="color: #ff00fe;">మూలాధారానికి దగ్గరగా యోనికమునందు అగ్ని తేజస్సుతో ప్రకాశించే జీవశక్తికి కుండలిని అని పేరు. ఇది సర్వశక్తులకు, సమస్త జ్ఞానాలకు మూలమైనది. అజ్ఞానదశలో ఈ శక్తి నిద్రాణమై ఉంటుంది. జ్ఞానదశలో అది జాగృతమై సాధకుడికి సర్వశక్తులు ప్రసాదిస్తుంది.</span></p><p><span style="color: #ff00fe;">సాధన ద్వారా ఈ శక్తిని సహస్రారానికి చేర్చాలి. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">మూలాధారమందు ఆత్మ తేజస్సు వహ్నిరూపమై ఉండును. ఆ తేజోమధ్యమందు కుండలమను జీవశక్తి గలదు. అది తేజోమయము, ప్రాణాధారము అయినది. మూడున్నర చుట్టలు చుట్టుకొని పరుండిన పామువలె ఉండి, మిక్కిలి కాంతిగలదై యుండును. దానికి మాయయే శిరస్సు. అది ఎల్లప్పుడు ధ్వనించుచుండును.కుండలినీ శక్తి సుషుమ్నా నాడీ మధ్యప్రదేశమందు ఉండును. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">రుద్రయామళంలో కుండలినీ స్తుతి చేస్తూ...</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">జన్మోద్ధార విరక్షిణీ హ తరుణీ వేదాది బీజాదిమా</span></p><p><span style="color: #ff00fe;">నిత్యం చేతసి భావ్యతే భువి కదా సద్వాక్య సంచారిణీ</span></p><p><span style="color: #ff00fe;">మాంపాతు ప్రియదాస భావకపదం సంఘాతయే శ్రీధరే</span></p><p><span style="color: #ff00fe;">ధాత్రి ! త్వం స్వయ మాదిదేవవనితా దీనాతిదీనం పశుమ్ ॥</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ఓ పరత్పరీ ! శివుని అర్థాంగి అయిన ఓ పార్వతీ ! నువ్వు సర్వకాల సర్వావస్థల యందు ఉపనిషద్వాక్యముల యందు సంచరిస్తుంటావు. నీవు నిత్యయవ్వనవు. మమ్ములను ఉద్ధరించటానికి సదా మెలకువతో ఉంటావు. అట్టి నిన్నునేను ఎల్లప్పుడూ ధ్యానం చేస్తాను.</span></p><p><span style="color: #ff00fe;"> </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">కుండలిని వ్యక్తిలోనిది కావడం చేత "వ్యష్టికుండలిని" అంటారు. ఈ వ్యష్టికుండలినికి అధిదేవత జగన్మాత. </span></p><p><span style="color: #ff00fe;">బ్రహ్మాండానికి ఉండే కుండలినీ శక్తిని "సమిష్టికుండలిని" అంటారు. దీనికి అధిదేవత ఆదిశేషువు లేదా అనంతుడు.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">కుండలిని (సుబ్రహ్మణ్యేశ్వరుని స్వరూపం) సర్పాకారంలో మూలాధారంన ఉంటుంది. పృథ్వీతత్వము గలది. అధిదేవత గణపతి.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">అమ్మ (కుండలినీ శక్తి) అక్కడకు వెళుతుంది. అయ్యవారితో ఉంటుంది, తన అగ్నితత్వంతో అక్కడ చల్లదనానికి ఘనీభవించిన సుధా ధారలను కరిగించి సాధకునిపై కురిపించి, సాధకుని జన్మచరితార్థము చేయుచున్నది.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> అంతటితో ఆ సాధకుడు తనకు కావలసింది తనకు లభించిందని అన్ని ఆనందములకూ పరాకాష్ఠ అయిన బ్రహ్మానందాన్ని పొందుతాడు.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">సిద్దార్థీ నిజదోషవిత్ స్థలగతి ర్వ్యాయీయతే విద్యయా</span></p><p><span style="color: #ff00fe;">కుండల్యా కులమార్గ ముక్తనగరీ మాయా కుమార్గా శ్రియా</span></p><p><span style="color: #ff00fe;">య ద్యేవం భజతి ప్రభాతసమయే మధ్యాహ్నకాలే థవా</span></p><p><span style="color: #ff00fe;">నిత్యం యః కులకుండలీ జప పదాంభోజం స సిద్ధో భవేత్ ॥</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">దేవీ ! కుండలినీ శక్తిగా ఉన్న నీ పాదాలను త్రిసంధ్యలయందు ధ్యానించేవారు సిద్దులవుతారు.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">పాము ఆకారము గలది. వాగ్భవ బీజ స్వరూపురాలు - అని ఈ నామానికి అర్ధాలు చెప్పుకోవచ్చును.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ఈ కుండలినియే ప్రాణశక్తి రూపిణియై సర్పాకారంగా సహస్రారం నుండి మూలాధారం వరకు అనగా యోని కందం వరకు తలక్రిందులుగా మూడున్నర మెలికలి తిరిగి ఉన్నది అనియు, సుబ్ధావస్థలో ఉన్నది అనియు, మేరు దండమును (వెన్నెముక) ఆశ్రయించి ఉన్నది అనియు మొదలైన విషయాలు వెనుక వివరింప బడినవి. "కుండలినీ” సిద్దులై శ్రీదేవి కరుణను పొంది తరింతురు గాక!</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">బిందువు కాంతితో ప్రకాశ అంశగా , సదాశివుడుగా, కాంతి నాద అస్తిత్వమై , మిశ్రమ అవ్యక్త బిందువు వ్యక్త ప్రకృతిగా ప్రకటమైన ఆ తల్లి తిరిగి ఊర్ధ్వ ప్రయాణంలో సదాశివుడిని ఐక్యం చేసుకొని బిందువు గా మారుతున్నది. జీవితం అంతా శక్తి రూపాంతరమే అనే సత్యం తెలుసుకోకపోతే అంతా మాయగానే కనపడుతుంది. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ఆ తల్లి ఈ శరీరంలో జీవ శక్తిగా కుండలిని రూపంగా నాడు లలో ప్రవహిస్తూ నిత్యం మనను శాసిస్తూ ఉంది. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ఆ తల్లి ఒడిలో చేరితే సమస్త శక్తులు మన అధీనం లోనికి వస్తాయి. లేకపోతె అవే శక్తులు మనలను సాధిస్తాయి. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ఈ అంతర్యాగం లేకపోతె సదాశివునితో మొదలైన ఆమె ప్రకృతి వికృతిగా మారి విశ్వ పదార్థ పరిణామ చక్రంలో ప్రవేశిస్తుంది. ఇదే జీవికి మరణం. అది వచ్చే లోపు మనం సాధనతో ఆ తల్లి ఒడిలో చేరాలి. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">మరణం ఎప్పుడొస్తుందో తెలియదు కనుక మనం ఎప్పుడూ ఆ తల్లి ఆరాధనలోనే ఉండాలి!</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">గోళాకారముగా సృష్టి నిర్మాణము గావించి, అందుండి అండాకారములుగా బ్రహ్మాండము నుండి పిండాండము వరకు సృష్టి నిర్మాణము చేయునది శ్రీలలిత అని అర్థము. మూలాధారమందలి అగ్ని తేజస్సు యందు ఉన్న జీవశక్తి కుండలినే.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">తేజోరూపమైన ప్రాణాకారము కలిగి సర్పమువలె మూలమున స్థితిగొని యుండి, సుషుమ్న మార్గమున సహస్రారము వరకు వ్యాపింపగల తేజస్విని కుండలిని. ప్రాణుల యందలి జీవచైతన్యమే కుండలిని. ఈ కుండలినీ మార్గము సృష్టియందు సత్యలోకము నుండి భూలోకము వరకు తీగవలె చుట్టలు చుట్టలుగా వ్యాపించి యుండును. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">భూమండలము, సూర్యమండలము, సవితృ మండలము, భర్గోదేవ మండలము వ్యాపించి సర్వమును నిర్వర్తించుచు నుండును. వాక్కు రూపమున ఉద్భవించునది కనుక వాగ్భవ అని కూడ కుండలినీ చైతన్యమును పిలుతురు. జీవ చైతన్యము ఏ లోకమున స్థితి గొనినదో ఆ లోకము వరకు వ్యాపించి కుండలిని యుండును. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">మానవునియందు భౌతిక, ప్రాణమయ, మనోమయ కోశముల యందు వ్యాపించి, విజ్ఞానమయపు అంచుల వరకు కుండలినీ చైతన్యమున్నదని తెలుపుదురు. కారణము ఏమనగా మానవునికి భౌతికము, ప్రాణమయము, మనోమయము అగు లోకములు అవగతమై ఉండుటయే. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">కొంత బుద్ధికూడ ప్రతిమానవునియందును ఉండుటచే, మూడున్నర చుట్టలుగా కుండలినీ చైతన్యమున్నదని అందురు. బుద్ధిలోకమున ప్రవేశించిన వారికి కుండలిని నాలుగు చుట్టలుగా ఉండును.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">అట్లే ఆనందమయ లోకమున ఐదుగను, అనుపాదక లోకమున ఆరుగను, ఆదిలోకమున ఏడుగను చుట్టలు గలిగి యుండును. ఏడు చుట్టల కుండలినీ చైతన్యము వ్యాపించినపుడు, సహస్రారమందలి శివతత్త్వముతో చేరినప్పుడు, సుస్థిరురాలై యుండును. కుండలినీ చైతన్యము ఊర్ధ్వగతి చెందుట యనగా జీవుడు పరిణతి చెందుటయే.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">#కుండలినీ పూర్తి సంపూర్ణ వివరణ:-</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">కుండలిని అనేది ఒక అనిర్వచనీయమైన శక్తి. ఇది మానవ శరీరంలో వెన్నుపాములో దాగి ఉంటుంది. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">మూలాధారంలో దాగివున్న ఈ కుండలినీ శక్తిని సుషుమ్నా నాడి ద్వారా పైకి సహస్రారం వరకు తీసుకొనివెళ్లే పద్ధతిని వివరించేది కుండలినీ యోగ.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> కుండలినీ యోగలో కుండలినిని జాగృతం చేయడానికి ప్రాణాయామ సాధన ఒక ముఖ్యమైన మార్గము. కుండలినీ శక్తి సహస్రారం చేరినప్పుడు యోగసాధకుడు ఒక అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవిస్తాడు.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">శక్తి రెండు రకాలుగా ఉంటుంది....</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> ఒకటి స్థితి శక్తి (Potential Energy), </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">రెండవది గతి శక్తి(Dynamic or Kinetic Energy).</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> శరీరంలోని ప్రాణశక్తి గతి శక్తి రూపంలో ఉంటుంది. మానవ దేహంలోని స్థితి శక్తి పాము వలే చుట్ట చుట్టుకొని మూలాధారం వద్ద నిద్రాణంగా ఉంటుంది. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">యోగ సాధన ద్వారా నిద్రాణంగా ఉన్న కుండలినీ శక్తిని జాగృతం చేసుకోవచ్చును.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">కామ, </span></p><p><span style="color: #ff00fe;">క్రోధ, </span></p><p><span style="color: #ff00fe;">లోభ, </span></p><p><span style="color: #ff00fe;">మోహ, </span></p><p><span style="color: #ff00fe;">మద, </span></p><p><span style="color: #ff00fe;">మాత్సర్యాలనే " అరిషడ్వర్గాలను " జయించినప్పుడే ఇది సాధ్యమవుతుంది. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">కుండలినీ శక్తిని జాగృతం చేయడానికి ముందు ....</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">దేహ శుద్ధి (purification of body), </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">నాడీ శుద్ధి (purification of nadis/nervous system),</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> మనో శుద్ధి (purification of mind), </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">బుద్ధి శుద్ధి (purification of intellect) జరగాలి.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> నిద్రాణంగా ఉన్న కుండలినీ శక్తిని యోగ క్రియల ద్వారా జాగృతం చేసినప్పుడు అది ఊర్ధ్వ ముఖంగా పయనించి, షట్చక్రాల్లోని ఒక్కొక్క చక్రాన్నీ దాటుతూ తల మాడు భాగాన ఉండే సహస్రార చక్రాన్ని చేరుతుంది. ఈ స్థితినే అష్టాంగ యోగలోని అత్యున్నత దశ అయిన "సమాధి స్థితి"గా కూడా పేర్కొంటారు. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ఈ స్థితిలో సాధకునికి ఒక అనిర్వచనీయమైన ఆనందం కలుగుతుంది. అన్ని రకాల క్లేశాలూ తొలగిపోతాయి. శరీరం, మనస్సుల నుండి పూర్తిగా విడిపోతాడు.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">#చక్రాలు </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">వెన్నెముక లో ఉండే చక్రాలు</span></p><p><span style="color: #ff00fe;">ప్రధాన వ్యాసము : సప్తచక్రాలు</span></p><p><span style="color: #ff00fe;">షడ్చక్రాలు లేదా సప్తచక్రాలు మన శరీరంలోని వెన్నుపూస లోనున్న ప్రదేశాలు.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">1)మూలాధార చక్రము (Mooladhara) :-</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">గుద స్థానమునకు పైన, లింగ స్థానమును క్రిందుగా నున్నది. నాలుగు దళములతో అరుణ వర్ణము కలిగిన కమలమిది. ఇందే కుండలినీ శక్తి యుండును. దీని బీజ మంత్రం "లం".</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> మూలాధార చక్రమున గల కమలకర్ణికయందు దివ్య సుందరమైన త్రికోణము, దాని మధ్య తటిత్కోటి సమప్రభమగు స్వయంభూలింగము కలదనియు, ఆ లింగము చుట్టును తామరతూడులోని దారము వంటి ఆకారము గల కుండలినీ శక్తి మూడున్నర చుట్లు చుట్టుకొనియున్నదనియు, వివిధ తంత్రములు వర్ణించుచున్నవి.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">2)స్వాధిష్ఠాన చక్రము (Swadhisthana) :-</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> లింగమూలమున గలదు. ఆరు దళములతో సిందూరవర్ణము గల జలతత్వ కమలము గలది. దీని బీజ మంత్రం "వం".</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">3)మణిపూరక చక్రము (Manipura) :-</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> నాభి మూలమందు గలదు. పది దళములు గలిగి, నీల వర్ణము గల అగ్ని తత్వ కమలము. దీని బీజ మంత్రం రం.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">4) అనాహత చక్రము (Anahatha) :-</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">హృదయ స్థానమునందున్నది. పండ్రెండు దళములు గలిగి, హేమవర్ణము గల వాయుతత్వ కమలము. దీని బీజ మంత్రం "యం".</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">5) విశుద్ధి చక్రము (Vishuddha) :-</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">కంఠ స్థానమందున్నది. పదునారు దళములు గలిగి, శ్వేత వర్ణము గల ఆకాశతత్వ కమలము. దీని బీజ మంత్రం "హం".</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">6)ఆజ్ఞా చక్రము (Ajna) :-</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">భ్రూ (కనుబొమల) మధ్యమందున్నది. రెండు వర్ణములతో గూడిన రెండు దళములు కలిగిన కమలము. దీని బీజ మంత్రం ఓం.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">7) సహస్రార చక్రము (Sahasrara) :-</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> బ్రహ్మ రంధ్రమునకు అధోముఖముగ సహస్ర దళములతో వికసించియున్న పద్మము. బీజాక్షరం "ఓం".</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">సహస్రార కమల కర్ణిక యందు ప్రకృతి పురుషుల సమైక్య స్థితి యగు పరబిందువు చుట్టును మాయ గలదు. ఆత్మజ్ఞానమును సాధించిన పరమ హంసలు మాత్రమే పొందగలిగిన స్థానమిది.</span></p><p><span style="color: #ff00fe;">దీనిని శైవులు శివస్థానమనియు, వైష్ణవులు పరమ పురుష స్థానమనియు, ఇతరులు హరిహర స్థానమనియు, దేవీభక్తులు దేవీస్థానమనియు చెప్పుదురు. ఈ స్థానమునెరిగిన నరునకు పునర్జన్మ లేదు.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">#సప్తచక్రాలు </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">శ్రీ విద్య లోను, వివిధ తంత్రముల లోను చెప్పిన ప్రకారము మానవునియందు ఏడు చక్రము లుండును.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> మూలాధార చక్రము :-</span></p><p><span style="color: #ff00fe;">********</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">పిరుదుల స్థానమునకు పైన, లింగ స్థానమును క్రిందుగా నున్నది. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">నాలుగు దళములతో అరుణ వర్ణము కలిగిన కమలమిది.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> ఇందే కుండలినీ శక్తి యుండును. మూలాధార చక్రమున గల కమలకర్ణికయందు దివ్య సుందరమైన త్రికోణము, దాని మధ్య తటిత్కోటి సమప్రభమగు స్వయంభూలింగము కలదనియు, ఆలింగము చుట్టును తామరతూడులోని దారము వంటి ఆకారము గల కుండలినీ శక్తి మూడున్నర చుట్లు చుట్టుకొనియున్నదనియు వివిధ తంత్రములు వర్ణించుచున్నవి.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">మూలాధారచక్ర అధిష్టాన దేవత “సిద్ధవిద్యాదేవి” సాకిణీ రూపములో ఉంటుంది. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ఈ దేవతకు సంబధించిన బీజ, కీలక, న్యాస మంత్రాలన్నీ “స” కార సంబంధముగా ఉంటాయి. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">514 నుండి 519 వరకూ గల నామములు “సాకిన్యంబ”ను వర్ణిస్తాయి. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> నామములు :-</span></p><p><span style="color: #ff00fe;">""'''''"'''''''''''''''''''''''''""</span></p><p><span style="color: #ff00fe;"> మూలాధారామ్భుజారూఢ,</span></p><p><span style="color: #ff00fe;"> పంచవక్తాృయ,</span></p><p><span style="color: #ff00fe;"> ఆస్ధిసంసితాయ, </span></p><p><span style="color: #ff00fe;">అంకుశాది ప్రహరణాయ,</span></p><p><span style="color: #ff00fe;"> వరదాది నిషేవితాయ,</span></p><p><span style="color: #ff00fe;"> ముద్గౌదనాసక్తాయ.</span></p><p><span style="color: #ff00fe;"> మూలాధారస్ధపద్మే, </span></p><p><span style="color: #ff00fe;"> శృతి దళలసితే, </span></p><p><span style="color: #ff00fe;"> పంచవక్త్రాం త్రినేత్రాం,</span></p><p><span style="color: #ff00fe;"> ధూమ్రాభా, </span></p><p><span style="color: #ff00fe;"> మస్ది సంస్దాం </span></p><p><span style="color: #ff00fe;"> సృణి మపి </span></p><p><span style="color: #ff00fe;"> కమలం పుస్తకం </span></p><p><span style="color: #ff00fe;"> జ్ఞానముద్రాం</span></p><p><span style="color: #ff00fe;"> బిభ్రాణం బాహుదండైస్సులలిత వరదా</span></p><p><span style="color: #ff00fe;"> పూర్వ శక్త్యన్వితాoతం</span></p><p><span style="color: #ff00fe;">ముద్గాన్నాసక్త చిత్తాం</span></p><p><span style="color: #ff00fe;"> మధుమదముదితాం </span></p><p><span style="color: #ff00fe;">సాకినీ భావయామి.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">మనలోని భౌతిక శక్తిని నియంత్రించేది మూలాధార చక్రము. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ఇది షట్చక్రాలలో మొదటిది. ఇది నాలుగు దళాల పద్మము. ఈ మూలాధార చక్రములో ‘సాకిన్యాంబ’ నివసిస్తుంది.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> ఈమెకు ఐదు ముఖములు....</span></p><p><span style="color: #ff00fe;"> శబ్దము, </span></p><p><span style="color: #ff00fe;"> స్పర్శ, </span></p><p><span style="color: #ff00fe;"> రూపము, </span></p><p><span style="color: #ff00fe;"> రసము, </span></p><p><span style="color: #ff00fe;"> గంధము అనబడే ఐదు తన్మాత్రలు ఈ మూలాధారం వద్దే పనిచేస్తాయి. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">గర్బస్ధ శిశువుకి ఐదవ మాసములో చర్మం ఏర్పడి పంచ జ్ఞానేంద్రియ జ్ఞానము కలుగుతుంది. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ఈమె ఆస్ధి సంస్దిత అనగా ఎముకలను అంటిపెట్టుకుని ఉంటుంది. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> వజ్రేశ్వరి :-</span></p><p><span style="color: #ff00fe;">""""""""""""""</span></p><p><span style="color: #ff00fe;">ఈ దేవతకి నాలుగు చేతులు...</span></p><p><span style="color: #ff00fe;"> అంకుశము, </span></p><p><span style="color: #ff00fe;"> కమలం, </span></p><p><span style="color: #ff00fe;"> పుస్తకము, </span></p><p><span style="color: #ff00fe;"> జ్ఞానముద్ర కలిగి ఉంటుంది.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">సాకిన్యాంబ వరదాది దేవతలు :-</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> 1. వరద </span></p><p><span style="color: #ff00fe;"> 2. శ్రియ </span></p><p><span style="color: #ff00fe;"> 3. షండా </span></p><p><span style="color: #ff00fe;"> 4. సరస్వతి </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">( వo, శo, షo, సo అను మూలాక్షరాల ) దేవతలచే కొలువబడుతూ ఉంటుంది. ఈమెకు పెసరపప్పుతో చేసిన పులగం అంటే ఇష్టము.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> స్వాధిష్ఠాన చక్రము :-</span></p><p><span style="color: #ff00fe;">*********</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">లింగమూలమున గలదు. ఆరు దళములతో సింధూరవర్ణము గల జలతత్వ కమలము గలది.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ఐం హ్రీం శ్రీం కాం సోహం స్వాధిష్టానదేవతాయై కాకినీ సహిత బ్రహ్మస్వరూపిణ్యై నమః </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ఈ స్వాధిష్ఠాన కమలం ఆరు దళాలుగల జలతత్త్వం కలది. అధిదేవత "కాకిని".</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> ఈమె బం, భం, మం, యం, రం, లం అను యోగినులచే సేవించబడుతున్నది. వాహనం మొసలి.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">'మేధోనిష్టా మధుప్రీతా బందిన్యాది సమన్వితా దధ్యాన్నాసక్త హృదయా కాకినీ రూపధారిణీ మేధో దాతువునకు అధిష్టానదేవతయైన ఈమెకు పెరుగన్నం ప్రీతి. </span></p><p><span style="color: #ff00fe;">స్వాధిష్టానం</span></p><p><span style="color: #ff00fe;"> (స్వ + అధిష్టానం) తనను తానుగా సమాజంలో నిరూపించుకోవడానికి అవసరమైన శక్తిని ఇది సమకూరుస్తుంది. అనేకజన్మలనుండి వెంటతెచ్చుకునే పాపపుణ్యాలను అనుభవమునకు తీసుకొచ్చే చక్రమిది. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">జననేంద్రియము వెనుకభాగమున వెన్నెముకలో విలసిల్లే ఈ చక్రం మనలో 11,664 నాడులతో అనుసంధానింపబడి వుంటుంది. ఇది స్త్రీలల్లో ఓవరీస్ కు, పురుషులలో టెస్టిస్ కు ప్రాణశక్తినిస్తుంది. గర్భస్థశిశువుకు ప్రాణశక్తినిచ్చే చక్రమిదే. జీవునకు తల్లి గర్భమునందు స్థానమేర్పడుటకు మూలాధారచక్రం కారణం కాగా, అటు తర్వాత పిండం భౌతిక శరీరంగా ఏర్పడుటకు కావాల్సిన ప్రాణశక్తిని ఈ చక్రమే ఇచ్చుచున్నది. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ఈ ప్రాణశక్తి వలనే శరీరవ్యాపారాదులు నడుచుచున్నవి. శరీరంలోని ఉష్ణోగ్రత ఈ చక్రంనకు సంబంధించినదే. జీర్ణశక్తి అధికమవ్వడానికి తోడ్పడుతుంది. ప్రాణవాయువు ఊపిరితిత్తులనిండా వ్యాపించటానికి ఈ చక్రం సహాయకారి అవుతుంది. ఈ చక్రంకు పంచకోశాలలో ప్రాణమయకోశంతో సంబంధం. శారీరక వ్యవస్థలోని విసర్జక వ్యవస్థతో సంబంధం.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> జ్ఞానేంద్రియం కన్ను. రాజస తామస గుణాలతో వుంటుంది. పునరుత్పత్తి కి సహాయకారి. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> దీనిలోశక్తి చైతన్య రూపంలో మనిషిలో ప్రవహిస్తూ ప్రాణమయ కోశానికి శక్తినందిస్తుంది.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> మణిపూరక చక్రము :-</span></p><p><span style="color: #ff00fe;">*********</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">నాభి మూలమందు గలదు. పది దళములు గలిగి నీల వర్ణము గల అగ్ని తత్వ కమలము.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> లాకిన్యంబాస్వరూపిణి :-</span></p><p><span style="color: #ff00fe;">"""""""""""""""""""""""""""</span></p><p><span style="color: #ff00fe;">6 నామాములు / 3 వ చక్రము . </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">(495) నుండి (502) వరకూ నామములు :-</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> మణిపూరాబ్జనిలయ,</span></p><p><span style="color: #ff00fe;"> వదనత్రయసంయుతా,</span></p><p><span style="color: #ff00fe;"> వజ్రాధికాయుధోపేతాయ,</span></p><p><span style="color: #ff00fe;"> డామర్యాదిభిరావృతాయ,</span></p><p><span style="color: #ff00fe;"> రక్తవర్ణాయ, </span></p><p><span style="color: #ff00fe;"> మాంసనిష్టాయ,</span></p><p><span style="color: #ff00fe;"> గుడాన్నప్రీతాయ, </span></p><p><span style="color: #ff00fe;"> సమస్తభక్త సుఖదాయ ,</span></p><p><span style="color: #ff00fe;"> దిక్పత్రే, </span></p><p><span style="color: #ff00fe;"> నాభిపద్మే, </span></p><p><span style="color: #ff00fe;"> త్రివదన విలస ద్దంష్ట్రిణీం,</span></p><p><span style="color: #ff00fe;"> రక్తవర్ణాం,</span></p><p><span style="color: #ff00fe;"> శక్తిం ,</span></p><p><span style="color: #ff00fe;"> దంభోళి ,</span></p><p><span style="color: #ff00fe;"> దండావ భయమపి,</span></p><p><span style="color: #ff00fe;"> భుజైర్దారయంతీo ,</span></p><p><span style="color: #ff00fe;"> మహోగ్రాం ,</span></p><p><span style="color: #ff00fe;"> డామర్యాద్త్యై: ,</span></p><p><span style="color: #ff00fe;"> పరీతాం ,</span></p><p><span style="color: #ff00fe;"> పశుజన భయదాం,</span></p><p><span style="color: #ff00fe;"> మాంసధాత్వేక నిష్టాం,</span></p><p><span style="color: #ff00fe;"> గౌడన్నసక్త చిత్తాం ,</span></p><p><span style="color: #ff00fe;"> సకల సుఖకరీం ,</span></p><p><span style="color: #ff00fe;"> లాకినీమ్ ,</span></p><p><span style="color: #ff00fe;"> భావయామి:</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">నాభిస్తానము వద్ద గల మణిపూరచక్రమున వసించునది. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">పది దళముల పద్మము, బీజాక్షరాలు సంస్కృతములోని “డ” నుండి “ఫ” వరకు గల అక్షరాలు. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">గర్భస్తశిశువు మూడవ మాసములో కాళ్ళు, చేతులు ఏర్పడడం జరుగును. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">మూడు ముఖములు కలది....</span></p><p><span style="color: #ff00fe;"> గర్భస్ధ శిశువుకి నోరు, ముక్కు, కళ్ళు ఏర్పడతాయి. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">నాలుగు చేతులు కలది.....</span></p><p><span style="color: #ff00fe;">వజ్రం,</span></p><p><span style="color: #ff00fe;">శక్తి, </span></p><p><span style="color: #ff00fe;">దండము, </span></p><p><span style="color: #ff00fe;">అభయ ముద్రలు ధరించింది.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> డామరము ఆది దేవతలచే పరివేష్టించబడింది. ఈ సమయములోనే శిశువు శబ్దాలకి ప్రతిస్పందన చూపిస్తాడు. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ఎరుపు వర్ణము కలది. మాంస ధాతువుని ఆశ్రయించేది. బెల్లంతో చేసిన పాయసం, చక్రపొంగలి లాటి వానిపై ఇష్టం కలది. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">అన్నిరకముల భక్తులకీ సుఖసంతోషములు కలిగించేది ఈ లాకిన్యాంబ రూపిణి.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> మణిపూరక చక్రం మంత్రం :-</span></p><p><span style="color: #ff00fe;">"""""""""""""""""""""""""""</span></p><p><span style="color: #ff00fe;"> ‘ఐం హ్రీం శ్రీం వాం హం సస్సోహం మణిపూరాధిష్టానదేవతాయై లాకినీ సహిత వైష్ణవ స్వరూపిణ్యాంబాయై నమః”</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> మణిపూరకచక్రం :-</span></p><p><span style="color: #ff00fe;">"""'"""""""""""""""""""""""</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ఈ కమలం పది దళములు గల జలతత్త్వం కలది. అధిదేవత "లాకిని". </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ఈమె .....</span></p><p><span style="color: #ff00fe;">డo, ఢo, ణo, తo, థo, దo, ధo, నo, పo, ఫo అను యోగినులచే ఆరాధింపబడుచున్నది.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> వాహనం పొట్టేలు.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> 'గుడాన్నప్రీతిమానసా /సమస్త భక్తసుఖదా లాకిన్యాంబ స్వరూపిణీ/ సర్వజనులకు సుఖాలు ఇచ్చే ఈ అధిదేవతకు బెల్లపు పొంగలి ప్రీతి.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">బొడ్డునకు మూలంలో వెన్నెముకలో విలసిల్లే ఈ చక్రం మనలో 4,536 నాడులతో అనుసంధానింపబడి వుంటుంది.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ఈ చక్రమందు ఉద్భవించే శక్తి మనం తీసుకునే ఆహారాన్ని జీర్ణం చేసి సారాన్ని శరీరంనకు అందిస్తుంది. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ఈ చక్రంనకు పంచకోశాలలో ప్రాణామయకోశంతో సంబంధం. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">శారీరకవ్యవస్థలోని జీర్ణవ్యవస్థతో సంబంధం. జ్ఞానేంద్రియం నాలుక. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">పుట్టుట, </span></p><p><span style="color: #ff00fe;">జీవించుట, </span></p><p><span style="color: #ff00fe;">మరణించుట అను మూడు బిందువులతో కూడిన త్రికోణమే జీవసృష్టి. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">అట్లే మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం అను మూడు కేంద్రాలతో ఒక త్రికోణం ఏర్పడుచున్నది. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ఈ త్రికోణమే భౌతికసృష్టికాధారం. ఈ మూడు చక్రాలు భౌతిక జీవితం సజావుగా సాగడానికి సహకరిస్తాయి. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ఈ చక్రం శక్తివంతంగా లేకపోతే ...</span></p><p><span style="color: #ff00fe;"> అవయవములయందు నీరు చేరుట, నోటికి సంబందినవ్యాధులుకు కారణమౌతుంది. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">నియమాలు లేని ఆహారపు అలవాట్లువలన జీర్ణశక్తి మందగించి అజీర్తి, గాస్ట్రిక్ సమస్యలు కల్గుతాయి.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> </span></p><p><span style="color: #ff00fe;">తన గురించి తాను తక్కువగా ఆలోచిస్తూ కుంగిపోవడం.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> తెరుచుకుంటే .....</span></p><p><span style="color: #ff00fe;"> లక్ష్యసాధన, </span></p><p><span style="color: #ff00fe;"> ఆశయసిద్ధి, </span></p><p><span style="color: #ff00fe;"> వ్యవహార దక్షత, </span></p><p><span style="color: #ff00fe;"> ఉత్సాహం, </span></p><p><span style="color: #ff00fe;"> ధనాపేక్ష, </span></p><p><span style="color: #ff00fe;"> తన్ను తాను గౌరవించుకోవడం,</span></p><p><span style="color: #ff00fe;"> ఆత్మవిశ్వాసం కల్గివుండడం,</span></p><p><span style="color: #ff00fe;"> జీవితంలో అన్నింటా ముందడుగు. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ఇక్కడే మనిషికి ఆలోచన ఏర్పడుతుంది. అనుమానాల్ని నివృత్తి చేసుకుంటూ, చక్కగా ఆలోచిస్తూ, అన్నింటినీ అవగాహనతో విశ్లేషించుకుంటూ, విశ్వాస, వివేక జ్ఞానంలను అలవర్చుకుంటూ ముందుకు సాగాలి. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">మనలో విశ్వాసం, అవిశ్వాసం, నమ్మకం, అపనమ్మకం రెండూ ఏర్పడేది దీనివలనే.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">లక్ష్యసాధనకు ఉపయోగపడే చక్రం. లక్ష్యసాధనలో ఎన్నో ఆటంకాలు ఎదురవుతూ వుంటాయి. పరాజయాలు పలకరిస్తుంటాయి. ఇది సహజం. సాధిస్తాం, తప్పకుండా విజయం సాధిస్తాం అన్న ఆశావాదం పెంచుకొని, నిరాశావాదాన్ని మదినుండి తరిమివెయ్యాలి, చిన్న చిన్న అనారోగ్యాలని, అవరోధాల్ని, అవమానాల్ని కుంటిసాకులుగా చెప్పుకొని ఆగిపోక ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేయాలి. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ఓటమి అన్నది గుణపాఠమే గానీ, అంతిమతీర్పు కాదని గ్రహించాలి.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">మరి ఈ చక్రాన్ని ఎలా శుద్ధి చేసుకోవడం? </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ఈ చక్రమునకు "లాకిని" దేవత.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> సర్వజనులకు సుఖాలునిచ్చే ఈ దేవతకు బెల్లపు పులగం ప్రీతి. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ఈ చక్రం బలహీనంగా వుంటే బెల్లపు పులగాన్ని స్వీకరిస్తూ, వ్యాధులబట్టి అవసరమైనచో తగు ఔషదములను వినియోగిస్తూ, బీజాక్షరం "రం" ధ్యానించువారికి ఈ నాడీకేంద్రం వలన వచ్చే బాధలు నివారణ కాగలవు. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ఈ చక్రంలో జాగృతి తీసుకురావాలంటే అనుభూతులను ( ఆనందంగానీ, విచారం గానీ, దుఃఖం గానీ, ఆవేశం గానీ... ) లోపల దాచుకోకుండా సహజంగా బయటకు వెళ్లనీయాలి. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">దీర్ఘంగా శ్వాసించడం చేయాలి. అలాగే ఈ చక్రానికి అధిపతి గురుడు. ఆరోగ్యంగా వుండాలన్న, సంపదలు కలిగి వుండాలన్న, సుఖంగా వుండాలన్నా, ఈ చక్రం బలంగా వుండాలి.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> సప్తచక్రాలలో ఈ చక్రం ప్రత్యేకంగా ప్రతిపత్తి కలది. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">అదే మాదిరిగా నవగ్రహాలలో ....</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> గురుగ్రహం ఓ ప్రత్యేకమైన శుభగ్రహం. చెడు అలవాట్లు జోలికి పోకుండా, ముందొకటి వెనుకొకటి మాట్లాడక, నాస్తికత్వం వదిలి, చక్కటి వ్యక్తిత్త్వాన్ని అలవర్చుకుంటే ఈ గ్రహం, చక్రం సక్రమంగా పనిచేస్తాయి.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">శ్రీ శంకరాచార్యులవారు సౌందర్యలహరిలో చెప్పిన వర్ణన బట్టి ఇది జలతత్త్వం గలది.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">తటిత్వం తం శక్త్యాతిమిర పరిపంథి స్పురణయా!</span></p><p><span style="color: #ff00fe;">స్పురన్నానారత్నాభరణ పరినద్ధేంద్రధనుషమ్! </span></p><p><span style="color: #ff00fe;">తమశ్యామం మేఘం కమపి మణిపూరైక శరణమ్!</span></p><p><span style="color: #ff00fe;">నిషేవే వర్షంతం హరమిహిరతప్తం త్రిభువనం!!</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">మణిపూరకమందున్న మేఘం శ్యామవర్ణము కలది. అనిర్వాచ్యమైనది. అంధకారాన్ని పోగొట్టు మెరుపుతో గూడినది.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> నానావిధ రత్నాభరణములచేత చేయబడిన ఇంద్రధనస్సు కలది. ప్రళయాగ్నిచే తప్తంలైన ముల్లోకములను చల్లపరుచును.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> </span></p><p><span style="color: #ff00fe;">అనాహత చక్రము :-</span></p><p><span style="color: #ff00fe;">********</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">హృదయ స్థానమునందున్నది. పండ్రెండు దళములు గలిగి హేమవర్ణము గల వాయుతత్వ కమలము.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">రాకిన్యాంబస్వరూపిణి</span></p><p><span style="color: #ff00fe;">- (494) (9 నామములు) (4 వ చక్రము)</span></p><p><span style="color: #ff00fe;">అనాహతాబ్జనిలయ, శ్యామాభాయ, వదనద్వయ, దంష్ట్రోజ్జ్వలాయ, అక్షమాలాదిధరాయ, రుధిరసంస్దితాయ, కాళరాత్ర్యాదిశక్త్యౌఘవృతాయ, స్నిగ్ధౌదనప్రియాయ, మహావీరేంద్రవరదాయ. (485 నుండి 493 వరకూ గల నామములు)</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">హృత్పద్మే, భానుపత్రే, ద్వివదన లసితాం, దంష్ట్రిణీం, శ్యామవర్ణామ్</span></p><p><span style="color: #ff00fe;">చక్రం, శూలం, కపాలం, డమరుపి – భుజైర్ధారయంతీ త్రినేత్రాం</span></p><p><span style="color: #ff00fe;">రక్తస్దాం కాళరాత్రి ప్రభ్రుతి పరివృతాం, స్ధిగ్న భక్తైక సక్తాం </span></p><p><span style="color: #ff00fe;">శ్రీమద్వీరేంద్ర వంద్యా మభిమత ఫలదాం, రాకినీ, భావయామః</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ఈమె నలుపురంగులో ఉన్నది, రెండు వదనములు ఉన్నాయి. ప్రాణము, అపానము అనే వాయువులు నియంత్రించు రెండు ముఖములు కలది. శిశువు 2 వ మాసములో రెండవ రంధ్రము ఏర్పడుతుంది. రెండు కోరలతో ప్రకాశించునది. ‘అ’ కారాది, ‘క్ష’ కారము వరకూ గల అక్షరాలని మాలగా ధరించింది. నాలుగు చేతులలో అక్షమాలా, శూలము, కపాలము, డమరుకము, దరించునది. అనాహత చక్రము హృదయమునకు సంబంధించినది, కావున ఆమె రక్త ధాతువుని ఆశ్రయించి ఉంటుంది. అనాహతమునకు 12 దళములు. వీటిని ‘క’ కారమునుండి ‘ ఠ ‘ కారము వరకూ గల 12 అక్షరాలతో ప్రారంభమయే 12 దేవతలచే కొలవబడింది. కాళరాత్రి మొదలగు దేవతలు. నేతితో తడిసిన అన్నము అనిన ప్రీతి కలది. మహావీరుల కోరికలు తీర్చేది. రాకిణీ దేవత సంబంది బీజాక్షరములు, కీలక, న్యాస మంత్రములు అన్నీ ‘ర’ కారము సంబంధమైనవి.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">క’ కారమునుండి ‘ ఠ ‘ కారము వరకూ గల 12 అక్షరాలతో ప్రారంభమయే 12 దేవతలు "ద్వాదశ శక్తులు". అవి...</span></p><p><span style="color: #ff00fe;">కo,ఖo,గo, ఘo,ఙo, చo,ఛo,జం'ఝం'ఞం'టo,ఠo.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">1. కాళరాత్రి</span></p><p><span style="color: #ff00fe;">2. ఖాతీత,</span></p><p><span style="color: #ff00fe;">3. గాయత్రి</span></p><p><span style="color: #ff00fe;">4. ఘంటాధారిణి</span></p><p><span style="color: #ff00fe;">5. జామిని</span></p><p><span style="color: #ff00fe;">6. చంద్రా</span></p><p><span style="color: #ff00fe;">7. ఛాయా</span></p><p><span style="color: #ff00fe;">8. జయా</span></p><p><span style="color: #ff00fe;">9. ఝుంకారి</span></p><p><span style="color: #ff00fe;">10. జ్ఞానరూప</span></p><p><span style="color: #ff00fe;">11. టంకహస్తా</span></p><p><span style="color: #ff00fe;">12. ఠంకారిణి</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> విశుద్ధి చక్రము :-</span></p><p><span style="color: #ff00fe;">*****</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">కంఠ స్థానమందున్నది. పదునారు దళములు గలిగి శ్వేత వర్ణము గల ఆకాశతత్వ కమలము.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> డాకినేశ్వరి :-</span></p><p><span style="color: #ff00fe;">""""""""""""""""""</span></p><p><span style="color: #ff00fe;"> (5 వ చక్రము) విశుద్ధి చక్ర అధిష్టానదేవత “డాకిని”. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">(475 నుండి 483 వరకూ డాకిని దేవత లక్షణాలు వర్ణించబడినవి.)</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> ఆరక్తవర్ణాయ,</span></p><p><span style="color: #ff00fe;"> త్రిలోచనాయ,</span></p><p><span style="color: #ff00fe;"> ఖట్వాంగాది ప్రహరణాయ,</span></p><p><span style="color: #ff00fe;"> వదనైకసమన్వితాయ,</span></p><p><span style="color: #ff00fe;"> పాయసాన్నప్రియాయ, </span></p><p><span style="color: #ff00fe;"> త్వక్ స్ధాయ,</span></p><p><span style="color: #ff00fe;"> పశులోకభయంకరాయ,</span></p><p><span style="color: #ff00fe;"> అమృతాధి , </span></p><p><span style="color: #ff00fe;">మహాశక్తిసంవృతాయ. </span></p><p><span style="color: #ff00fe;">(8 నామములు)</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">గ్రీవాకూపే, </span></p><p><span style="color: #ff00fe;">విశుద్దే, </span></p><p><span style="color: #ff00fe;">నృపదళకమలే, </span></p><p><span style="color: #ff00fe;">శ్వేతరక్తాం, </span></p><p><span style="color: #ff00fe;">త్రినేత్రాం</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">హస్తే :-</span></p><p><span style="color: #ff00fe;">"""""""""</span></p><p><span style="color: #ff00fe;">ఖట్వాంగ, </span></p><p><span style="color: #ff00fe;">ఖడ్గౌ, </span></p><p><span style="color: #ff00fe;">త్రిశిఖమపి, </span></p><p><span style="color: #ff00fe;">మహాచర్మ </span></p><p><span style="color: #ff00fe;">సంధారయంతీమ్</span></p><p><span style="color: #ff00fe;">వక్త్రేణేకేనయుక్తాం,</span></p><p><span style="color: #ff00fe;"> పశుజనభయదాం,</span></p><p><span style="color: #ff00fe;"> పాయసాన్యైక సక్తాం</span></p><p><span style="color: #ff00fe;">త్వక్ద్సా వందేహమృతాద్యై:</span></p><p><span style="color: #ff00fe;"> పరివృతవపుషాం, </span></p><p><span style="color: #ff00fe;">డాకినీo, </span></p><p><span style="color: #ff00fe;">వీరవంద్యామ్.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">డాకినీ దేవత బీజాక్షరాలు, కీలక, న్యాస మంత్రాలు అన్నీ “డ” కార సంభందమైనవి.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> డాకినీ వర్ణము ఎఱుపు.ఈమె ఎఱ్ఱని ఎఱుపు కాదు. తెలుపు కలసిన ఎరుపు.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">జీవి పిండ దశలో ‘శుక్ల + రక్త “ సమ్మేళనంతో బిందురూపముగా ఉండును. పదిహేను రోజుల పిదప బుడగ రూపము చెంది, నెలాఖరుకి గట్టిపడి, 45 రోజులకి పిండాకృతి పొందుతుంది. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ఈ పిండ స్థితి డాకినీ స్థితి. ఈమె త్రిలోచన .....</span></p><p><span style="color: #ff00fe;">భూత, </span></p><p><span style="color: #ff00fe;">భవిష్యత్, </span></p><p><span style="color: #ff00fe;">వర్తమానాలు చూడగలది.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> ఖట్వాంగము, </span></p><p><span style="color: #ff00fe;">ఖడ్గము, </span></p><p><span style="color: #ff00fe;">త్రిశూలము, </span></p><p><span style="color: #ff00fe;">చర్మము ఆయుధములుగా గల దేవత. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> బీజాక్షరములు :-</span></p><p><span style="color: #ff00fe;">"""""""""""""""""""""""</span></p><p><span style="color: #ff00fe;">అం,ఆం,ఇం,ఈం,ఉం,ఊం,ఋం,ౠం,ఎం,ఏం,ఐం,ఒం,ఓం,ఔం,అం,అఃం....</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> హాకినీరూపధారిణి :-</span></p><p><span style="color: #ff00fe;">""""""""""""""""""""""""""""</span></p><p><span style="color: #ff00fe;"> 6 నామములు / 6 వ చక్రము...</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> 521 నుండి 526 వరకూ గల నామములు ఈమెను వివరిస్తాయి.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> ఆజ్ఞాచక్రాబ్జనిలయా, </span></p><p><span style="color: #ff00fe;">శుక్లవర్ణా, </span></p><p><span style="color: #ff00fe;">షడాననా, </span></p><p><span style="color: #ff00fe;">మజ్జాసంస్దాయ, </span></p><p><span style="color: #ff00fe;">హంసవతీ </span></p><p><span style="color: #ff00fe;">ముఖ్యశక్తి </span></p><p><span style="color: #ff00fe;">సమన్విత, </span></p><p><span style="color: #ff00fe;">హరిద్రాన్నైకరసిక.</span></p><p><span style="color: #ff00fe;">భ్రూమధ్యే </span></p><p><span style="color: #ff00fe;">బిందుపద్మే </span></p><p><span style="color: #ff00fe;">దళయుగ కలితే, </span></p><p><span style="color: #ff00fe;">శుక్లవర్ణాం, </span></p><p><span style="color: #ff00fe;">కరాబ్జైమ్</span></p><p><span style="color: #ff00fe;">విభ్రాణాo </span></p><p><span style="color: #ff00fe;">జ్ఞానముద్రాం, </span></p><p><span style="color: #ff00fe;">డమరుకమలా, </span></p><p><span style="color: #ff00fe;">మక్షమాలాం, </span></p><p><span style="color: #ff00fe;">కపాలం </span></p><p><span style="color: #ff00fe;">షట్చక్రాధారమధ్యామ్,</span></p><p><span style="color: #ff00fe;"> త్రినయన లసితాం, </span></p><p><span style="color: #ff00fe;"> హంస వత్యాది యుక్తాం,</span></p><p><span style="color: #ff00fe;">హరిద్రాన్త్యైక సక్తాం,</span></p><p><span style="color: #ff00fe;"> సకలశుభకరీం, </span></p><p><span style="color: #ff00fe;"> హాకినీం భావయామః</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> ఆజ్ఞా చక్రము :-</span></p><p><span style="color: #ff00fe;">***</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> భ్రూ మధ్యలో అనగా రెండు కనుబొమ్మలు కలిసే ప్రాంతములో ఉంటుంది. వివేక సూర్యుని ఉదయం జరిగే ప్రదేశము. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">దీనికి అధిష్టానదేవత హాకిణీ. ఈమె తెలుపు రంగులో ఉంటుంది. ఈమె త్రికాలజ్ఞాని.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> ఈ దేవతకి ఆరు ముఖములు. ఆరు కృతికలు, కుమారస్వామి ఆరు ముఖములు ఈమె రూపములే. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ఆజ్ఞాచక్రం మనస్సుకి స్ధానం. గర్భస్ధ శిశువు ఆరవ మాసములో పంచేద్రియాలతో బాటు మనస్సు కూడా ఏర్పడుతుంది. ఈమె ఎములకలోని మజ్జ అనగా మూలగను ఆశ్రయించి ఉంటుంది. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> ఆజ్ఞా చక్రము :-</span></p><p><span style="color: #ff00fe;">"""""""""""""""""""""""""</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">భ్రూ (కనుబొమల) మధ్యమందున్నది. రెండు వర్ణములతో గూడిన రెండు దళములు కలిగిన కమలము.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">హాకినీరూపధారిణి :- </span></p><p><span style="color: #ff00fe;">""'""""""""""""""""""""""""""""</span></p><p><span style="color: #ff00fe;">6 నామములు / 6 వ చక్రము....</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">521 నుండి 526 వరకూ గల నామములు ఈమెను వివరిస్తాయి.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> ఆజ్ఞాచక్రాబ్జనిలయా, </span></p><p><span style="color: #ff00fe;">శుక్లవర్ణా, </span></p><p><span style="color: #ff00fe;">షడాననా, </span></p><p><span style="color: #ff00fe;">మజ్జాసంస్దాయ, </span></p><p><span style="color: #ff00fe;">హంసవతీ </span></p><p><span style="color: #ff00fe;">ముఖ్యశక్తి </span></p><p><span style="color: #ff00fe;">సమన్విత, </span></p><p><span style="color: #ff00fe;">హరిద్రాన్నైకరసిక.</span></p><p><span style="color: #ff00fe;">భ్రూమధ్యే బిందుపద్మే దళయుగ కలితే, </span></p><p><span style="color: #ff00fe;">శుక్లవర్ణాం, </span></p><p><span style="color: #ff00fe;">కరాబ్జైమ్ ,</span></p><p><span style="color: #ff00fe;">విభ్రాణాo జ్ఞానముద్రాం,</span></p><p><span style="color: #ff00fe;"> డమరుకమలా, </span></p><p><span style="color: #ff00fe;">మక్షమాలాం, </span></p><p><span style="color: #ff00fe;">కపాలం </span></p><p><span style="color: #ff00fe;">షట్చక్రాధారమధ్యామ్,</span></p><p><span style="color: #ff00fe;"> త్రినయన లసితాం, </span></p><p><span style="color: #ff00fe;">హంస వత్యాది యుక్తాం,</span></p><p><span style="color: #ff00fe;">హరిద్రాన్త్యైక సక్తాం,</span></p><p><span style="color: #ff00fe;"> సకలశుభకరీం, </span></p><p><span style="color: #ff00fe;">హాకినీం భావయామః</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ఆజ్ఞాచక్రం మనస్సుకి స్ధానం. గర్భస్ధ శిశువు ఆరవ మాసములో పంచేద్రియాలతో బాటు మనస్సు కూడా ఏర్పడుతుంది. ఈమె ఎములకలోని మజ్జ అనగా మూలగను ఆశ్రయించి ఉంటుంది. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ఇది రెండు దళముల పద్మము.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> బీజాక్షరములు :-</span></p><p><span style="color: #ff00fe;">"""""""""""""""'""""""""""</span></p><p><span style="color: #ff00fe;"> ‘హo’ ‘క్షo’ .</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> హంసవతీ, ‘క్షమావతీ; అనే దేవతలు ఈ పద్మము ని ఆశ్రయించారు. </span></p><p><span style="color: #ff00fe;">పసుపు పచ్చని అన్నమును ఇష్టపడుతుంది.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> సహస్రార చక్రము :-</span></p><p><span style="color: #ff00fe;">*******</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">బ్రహ్మ రంధ్రమునకు అధోముఖముగ సహస్ర దళములతో వికసించియున్న పద్మము. బీజాక్షరం "ఓం ".</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">సహస్రార కమల కర్ణిక యందు ప్రకృతి పురుషుల సమైక్య స్థితి యగు పరబిందువు చుట్టును మాయ గలదు.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> ఆత్మజ్ఞానమును సాధించిన పరమ హంసలు మాత్రమే పొందగలిగిన స్థానమిది. దీనిని శైవులు శివస్థానమనియు, వైష్ణవులు పరమ పురుష స్థానమనియు, ఇతరులు హరిహర స్థానమనియు, దేవీభక్తులు దేవీస్థానమనియు చెప్పుదురు. ఈస్థానమునెరిగిన నరునకు పునర్జన్మ లేదు.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> యాకిన్యంబస్వరూపిణి :-</span></p><p><span style="color: #ff00fe;">"""""""""""""""""""""""""""""""""""""</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> 6 నామములు / 7 వ చక్రము ...</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">528 నుండి 533 వరకూ నామములు ఈమెను తెలెయ చేస్తాయి. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">(సహస్త్రదళ పద్మస్ద, స్వర్ణవర్ణోపశోభిత, సర్వాయుధధర, శుక్లసంస్దితా, సర్వతోముఖ, సర్వోదనపీతిచిత్తాయ)</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ముండవ్యోమస్ధ పద్మే దశశతదళకే కర్ణికా చంద్రసంస్దామ్</span></p><p><span style="color: #ff00fe;">రేతో నిష్టాం, సమస్తాయుధ కలితకరాం, సర్వతోవక్త్రపద్మాం</span></p><p><span style="color: #ff00fe;">ఆది క్షాన్తార్ణశక్తి ప్రకట పరివృతామ్ స్వర్ణవర్ణాం భవానీం</span></p><p><span style="color: #ff00fe;">సర్వాన్నాసక్తచిత్తామ్, పరశివరసికాం యాకినీ భావయామః!!</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">శిరస్సు మధ్యభాగములో సహస్త్రాకార చక్రము ఉంటుంది. ఇది వేయి దళములు కలది.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> యశస్వనీ దేవత ఈ చక్ర అధిష్టానదేవత. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ఈ 7వ మాసములోనే గర్భస్ధ శిశువులో జీవుడు ప్రవేశించేది. ఇందు విశ్వంలోని సకల....</span></p><p><span style="color: #ff00fe;"> వర్ణములు, </span></p><p><span style="color: #ff00fe;"> రంగులు,</span></p><p><span style="color: #ff00fe;"> అక్షరములు, </span></p><p><span style="color: #ff00fe;"> విద్యలు,</span></p><p><span style="color: #ff00fe;"> ధ్వనులు,</span></p><p><span style="color: #ff00fe;"> బీజాక్షరములు ఉంటాయి. యశస్వినీ దేవతకు లెక్కలేనన్ని చేతులు, అన్ని చేతులలో సకల ఆయుధములు ధరించునది.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> ఈమె సృష్టికి ఆధారభూతమైన శుక్ర ధాతువుని ఆశ్రయించునది.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> ఈమె సర్వతోముఖ అభివృద్ధి చేయునది. ఈమె అన్ని రకముల అన్నమునూ ఇష్టపడుతుంది.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ఇంతవరకు 'స్మరణ' యందు వివరించిన ఆరు చక్రాలను షట్చక్రములుగా పేర్కొంటారు.</span></p><p><span style="color: #ff00fe;">ఏడవది సహస్రారంగా వర్ణిస్తారు. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ఇందు మొదటి ఆరింటి యందును ప్రజ్ఞ మేల్కొని పరిపూర్ణత చెంది, ఏడవది యగు సహస్రారమందు లయము చెందుటయే యోగం. ఇదియే మోక్షం. ఇదియే నిర్వాణం. ఇదియే "అద్వైతస్థితి".</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ఆజ్ఞా విశుద్ధి చక్రములు సత్వగుణమునూ..., </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">అనాహతం మణిపూరక చక్రములు రజోగుణమునూ...,</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> స్వాధిష్టానం, మూలాధార చక్రములు తమోగుణమును... వ్యక్తం చేయును.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">తమోగుణం దేహధాతువుల నిర్మాణమునకు, వానియందలి రసాయనిక మార్పులకు ఆధిపత్యం వహించడమే కాకుండా భౌతికదేహ నిర్మాణం కూడా దీని ప్రవృత్తియే.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">రజస్సు వలన శరీరం లోని వివిధ అవయములు పనిచేయుచున్నవి. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">సత్వం వలన గ్రహణశక్తి, వివేకం, విచక్షణ, విమర్శన మున్నగు లక్షణములు మేల్కొనును. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ఈ మూడును మూడు లోకములుగా అంటే .....</span></p><p><span style="color: #ff00fe;">భూలోకం (తమస్సు),</span></p><p><span style="color: #ff00fe;">భువర్లోకం (రజస్సు),</span></p><p><span style="color: #ff00fe;">సువర్లోకం (సత్వం)లుగా మనదేహంనందునూ, సౌరమండలం నందునూ ఏర్పడుచున్నవి.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> సహస్రారచక్రం :-</span></p><p><span style="color: #ff00fe;">"""""""""""""""""""""""</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">సహస్రదళపద్మస్థా సర్వవర్ణోపశోభితా సర్వాయుధధరా శుక్లసంస్థితా సర్వతోముఖా సర్వౌదన ప్రీతచిత్తా యాకిన్యంబా స్వరూపిణీ!!</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ఈ కమలం వేయిదళాలతో వికసించి యుంటుంది.</span></p><p><span style="color: #ff00fe;">అధిదేవత యాకిని. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">అ కారాది క్ష కారంత వర్ణమాల యోగినీ గణం చేత సేవించబడుచున్నది. ఈమెకు సర్వాన్నం ప్రీతి.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">మస్తిష్కం పైన బ్రహ్మరంధ్రం క్రిందిభాగమున విలసిల్లే ఈ చక్రం "విశ్వాత్మ" నివాస స్థానం. "పరమాత్మ స్థానం". </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ఇది మానసికంగా సంపూర్ణ ఆధ్యాత్మిక చక్రం. ఆత్మ సాక్షాత్కారానికి దోహదం చేసే చక్రం. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ఆత్మశక్తి అలరారే సుందర సుదర్శన చక్రం. విశ్వచైతన్యం వ్యక్తిచైతన్యంగా పరిఢవిల్లే కమలం ఈ సహస్రారం. పరిపూర్ణ జ్ఞానానికి ప్రతీక. ఆనందమయకోశంతో సంబంధం.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ఈ చక్రం శక్తివంతంగా లేకపోతే - షట్చక్రాలు బలహీనపడతాయి. </span></p><p><span style="color: #ff00fe;">గ్రహణశక్తి లోపిస్తుంది. </span></p><p><span style="color: #ff00fe;">భూత వర్తమానాలోనికి పయనిస్తూ అలసిపోతుంటారు.</span></p><p><span style="color: #ff00fe;"> కష్టదుఃఖాలు పొందుతుంటారు. </span></p><p><span style="color: #ff00fe;">పునర్జన్మలు తప్పవు. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> ఈ చక్ర మానసిక స్వభావం :-</span></p><p><span style="color: #ff00fe;">"""""""""""""""""""""""""""</span></p><p><span style="color: #ff00fe;"> ఈ చక్రం జాగృతయితే....</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">సాధకుడు అమరుడౌతాడు.</span></p><p><span style="color: #ff00fe;">పరమాత్మగా వ్యక్తమౌతాడు.</span></p><p><span style="color: #ff00fe;">తనను తాను తెలుసుకుంటాడు.</span></p><p><span style="color: #ff00fe;">ఇది ఈశ్వరీయత స్థితి. "ఈశ్వరత్వం" పొందుతారు. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ఈ చక్రమును శుద్ధిచేసుకోవాలంటే :-</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">తలపు, </span></p><p><span style="color: #ff00fe;">మాట, </span></p><p><span style="color: #ff00fe;">చేత యోగ్యంగా త్రికరణ శుద్ధి వుండాలి.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">క్రమశిక్షణ, </span></p><p><span style="color: #ff00fe;">ఆచరణ, </span></p><p><span style="color: #ff00fe;">విశ్వాసం కలిగియుండాలి.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ధ్యానం, </span></p><p><span style="color: #ff00fe;">బ్రహ్మతత్త్వజ్ఞానం, </span></p><p><span style="color: #ff00fe;">స్థితప్రజ్ఞ (గతాన్ని తలవక, భవిష్యత్తు ఊహించక, వర్తమానంలో వర్తించడం అంటే ఏ క్షణానికి ఆ క్షణంలో జీవించడం) </span></p><p><span style="color: #ff00fe;">ప్రశాంత వాతావరణం ఏర్పరచుకోవడం చేయాలి. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ఇక ఈ చక్రంనకు అధిపతి గ్రహం 'సూర్యుడు'. ఋజువర్తన, నాయకత్వలక్షణాలు, అందర్నీ ఆకట్టుకునే ఆకర్షణీయశక్తి, సునిశితమైన చూపులు, విశాలమైన నుదురు, ఎందులోనూ ఓటమిని పొందని, మాటపడని తత్త్వం, విభిన్నమైన ఆలోచనావిధానంతో విజయమును సాధించే కార్యదక్షత సూర్యుని లక్షణాలు. సాధన ద్వారా ఈ లక్షణాలను పెంపొందించుకుంటే సహస్రారం శక్తివంతమై, తద్వారా ఈ చక్రంతో అనుసంధానింపబడియున్న షట్చక్రాలు శక్తిసామర్ధ్యాలు కలిగియుండి మనజీవితములు ఆనంద నందనవనములు అవుతాయి.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ప్రతీరోజూ సూర్యోదయ సమయానికి స్నానపానాదులు ముగించుకొని సూర్యునికి ఎదురుగా కూర్చొని, సూర్యోపాసన చెయ్యాలి.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> అంటే సూర్యకిరణాలు తాకిడిని అనుభవిస్తూ, సూర్యభగవానుని శక్తి మన సహస్రారం గుండా అన్ని చక్రాలయందు నిబిడీకృతమవుతున్నట్లు భావిస్తూ, ప్రశాంతచిత్తంతో కాసేపు ధ్యానించాలి. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">క్రమం తప్పని ఈ ఆచరణ వలన సూర్యభగవానుని శక్తి, గాయత్రి శక్తి మనకు లభించి తేజోమూర్తులవుతాం.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> కుండలినీశక్తి స్థూల శరీరం నుండి ప్రజ్ఞామయ శరీరం వరకు వ్యాపించియున్నది. ఈ శక్తిని చైతన్యవంతం చేయాలి. ఆయా చక్ర దేవతలను ప్రార్థించాలి.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ప్రార్థన అంటే... దైవస్మరణ మాత్రమే కాదు, మన మనస్సును "ఇహం" నుండి "పరం" వైపు త్రిప్పడానికే అన్న నిజాన్ని అర్ధం చేసుకొని, "దేహమే దేవాలయమని", "అంతరాన్నే అంతర్యామి" కొలువై వున్నాడని గ్రహించి అందుకు తగ్గ ప్రార్థన, సాధనలు చేయాలి. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ప్రకృతి సహజంగానే ప్రతీ మనిషికి కొంతశక్తి వస్తుంది. కొన్ని అవకాశాలు కల్పిస్తుంది. వచ్చిన అవకాశాలను అందుకుని, వున్నశక్తిని ఉపయోగించుకుంటూ ఆత్మశక్తిని పెంపొందించు కోగలగాలి. ఈ విధమైన సాధనే ఆధ్యాత్మిక ఉన్నతికి మార్గం సుగమం చేస్తుంది.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ఈ కుండలిని సాధన వలన ఆలోచనల్లో స్పష్టత, నడవడికలో సరళత, దృక్పదంలో విశాలత, అందర్నీ ప్రేమించగల సౌశీల్యత, ఆదరించగల సేవాతత్పరత, అన్ని పరిస్థితులలోనూ సంయమనం, స్థితప్రజ్ఞత అలవడతాయి. నేను అనెడి అహం నశిస్తుంది. 'నేను' అనెడి సంకుచిత స్వాభిమానమదృశ్యమైనచో అనంతమగు "'అహంబ్రహ్మాస్మి'" అనెడి ఉత్తమస్థితి తనంతటదియే సాక్షాత్కారమగును. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">అప్పుడు ఆనందం ఓ స్రవంతిలా ప్రవహిస్తుంది. సహజత్వానికి దగ్గరగా ఉండటమే. ఈవిధంగా సరైన రీతిలో సప్తచక్రాలను సాధన చేస్తే, సంసారంలో తిరిగి జన్మింపరు. మనలో వున్న సప్తచక్రాలను చైతన్యవంతం చేస్తే సాధనతో... స్థలం నుండి సూక్ష్మము, ప్రజ్ఞామయం వరకు పయనించి '"అహం బ్రహ్మస్మి"' అన్న స్థితిని పొందడమే మానవ జీవన పరమావధి.</span></p><p><span style="color: #ff00fe;">సేకరణ.... </span></p>visalakshihttp://www.blogger.com/profile/12353866459824269934noreply@blogger.com1tag:blogger.com,1999:blog-2640908686154358505.post-81405363374619183352021-11-12T16:57:00.002+05:302021-11-12T16:57:30.357+05:30అయ్యప్పస్వామి దీక్ష..<p><span style="color: #ff00fe;"> </span></p><div class="separator" style="clear: both; text-align: center;"><a href="https://1.bp.blogspot.com/-Xf1v-KkEUPE/YXlwUw5WVlI/AAAAAAAACK8/9gEG2_DmHy0PRqV1zCUxKTbDlSO4BlZ-gCLcBGAsYHQ/s1104/FB_IMG_1635348473816.jpg" style="margin-left: 1em; margin-right: 1em;"><span style="color: #ff00fe;"><img border="0" data-original-height="1104" data-original-width="736" height="320" src="https://1.bp.blogspot.com/-Xf1v-KkEUPE/YXlwUw5WVlI/AAAAAAAACK8/9gEG2_DmHy0PRqV1zCUxKTbDlSO4BlZ-gCLcBGAsYHQ/s320/FB_IMG_1635348473816.jpg" width="213" /></span></a></div><span style="color: #ff00fe;"><br /></span><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">#అయ్యప్పదీక్షలో ఆధ్యాత్మిక రహస్యాలు*</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">⚜️ అయ్యప్ప దీక్షలోని భాగాలైన నల్లని వస్త్ర ధారణ, మాల ధారణ, చన్నీటి స్నానం, విభూతి, చందనాలతో అలంకరించుకోవడం మొదలైన ఆచారాలన్నింటిలోను అనంతమైన ఆధ్యాత్మిక, ఆరోగ్య, వేదాంత పరమైన రహస్యాలున్నాయి. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">⚜️ ఒంటిమీద భస్మధారణ ఈశ్వర సంకేతంగా భాసిస్తుంటే, నుదుటపై మెరిసే తిరునామం విష్ణుమూర్తిని నుతించేలా చేస్తుంది. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> ⚜️ఈశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీకమాసం దక్షిణాయనంలో ప్రారంభమయ్యే అయ్యప్పపూజ విష్ణువుకు ఇష్టమైన ఉత్తరాయణం మార్గశిరంతో ముగుస్తుంది.</span></p><p><span style="color: #ff00fe;"> </span></p><p><span style="color: #ff00fe;">⚜️అయ్యప్పస్వామి వారి పద్దెనిమిది మెట్లను ‘పదునెట్టాంబడి’ అని అంటారు. ఈ పదునెనిమిది మెట్లలో ఒక్కో మెట్టుకూ ఒక్కో దేవత వుంటుంది. మోక్ష సామ్రాజ్య కైవసానికి ఈ మెట్లు ఉపకరణాలు అని శాస్త్రం. ఈ సోపానాలపై పద్దెనిమిదిమంది దేవతలను ఆవాహన చేశారు. "ఎనిమిది మంది దిక్పాలకులు, నాలుగు వేదాలు, రెండు శాస్త్రాలు, అవిద్య, విద్య, జ్ఞానం, అజ్ఞానం" అన్నీ కలిపి మొత్తం పద్దెనిమిది మెట్లుగా ఇక్కడ వున్నాయి. వీటన్నింటిని దాటుకొని వెళితేనే జ్ఞానస్వరూపుడైన ఆ భగవంతుని దర్శనం సులభం అవుతుంది.</span></p><p><span style="color: #ff00fe;"> </span></p><p><span style="color: #ff00fe;">⚜️ ఈ ఆలయంలో స్వామి ప్రతిష్టుడైన సందర్భంగా, మృదంగ, భేరీ, కాహళ, దుంధుబి, తుంబుర, మద్దెల, వీణ, వేణువు, నూపుర, మట్టుక, డిండిమ, ఢమరుక, ఢక్క, ధవళ, శంఖ, పరుహ, జజ్జరి, జంత్ర అనే పద్దెనిమిది వాద్యాలు మోగించారు. ఇదీ ఈ మెట్లకున్న నియమ ప్రాముఖ్యం. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">⚜️ నలభై రోజులు దీక్ష చేసినవారు మాత్రమే ఈ మెట్లు ఎక్కడానికి అర్హులు. ఎంతో నిష్ఠలతో ఈ మెట్లు దాటాలి. అప్పుడే ఆ ఆనందరూపుని దర్శించుకోగలం. ఈ మెట్ల క్రింద ఎంతో మహిమాన్వితమైన, పవిత్రమైన యంత్రస్థాపన జరిగింది. యంత్ర ప్రతిష్ట ఎంతో పునీతమూ, శక్తిమంతమూ కాబట్టే వాటిని ఎంతో భక్తి విశ్వాసాలతో, నియమ నిష్టలతో దాటాలి.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">⚜️ అయ్యప్ప దీక్షకు చన్నీటి స్నానం, భూశయనం, పాదచారులై నడవడం, ఒంటిపూట భోజనం, బ్రహ్మచర్యం, మద్యమాంసాదులు, మసాల దినుసులు వంటి తామసకారకాలైన పదార్థాలను త్యజించడం వంటి నియమాలు పాటించాలి.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">⚜️ ఆ స్వామి దీక్షను చేపట్టే వారు గురుస్వామి ద్వారా తులసి, రుద్రాక్ష మాలలను ధరిస్తారు. రెండుపూటలా చన్నీళ్ళ స్నానం ఆరోగ్యాన్ని చేకూర్చడమే కాక, మనసును ప్రశాంతంగా ఉంచి భగవధ్యానానికి తోడ్పడుతుంది. తులసి, రుద్రాక్షల లోని స్వాభావిక ఔషధ గుణాలు అనారోగ్యానికి గురికాకుండా కాపాడుతాయి మరియు రక్తపోటు, మధుమేహం మొదలైన ఎన్నో రోగాల అదుపుకు ఉపకరిస్తాయి.</span></p><p><span style="color: #ff00fe;"> </span></p><p><span style="color: #ff00fe;">⚜️ దీక్షా సమయంలో పాటించే ఆహారనియమం శరీరాన్ని అదుపులో ఉంచి, చెడు కోరికలను దూరం చేస్తుంది. మనోనిశ్చలత, జ్ఞానశక్తి దేహానికి బలాన్ని ఇస్తాయి కాబట్టే ఆ అయ్యప్ప భక్తులకు కఠినమైన బ్రహ్మచర్యాన్ని దీక్షలో ఓ భాగంగా విధించారు. చెప్పులు తొడగరాదనే నియమం వెనుక ఎన్నో ఉద్దేశాలు ఉన్నాయి. ఇందువల్ల భక్తులకు కష్టాలను సహించే శక్తి కలుగుతుంది. నలభై ఒక్క రోజులు పాదరక్షలు లేకుండా నడిస్తే పాదాల క్రింద చర్మం మొద్దుబారి అడవులలో సునాయాసంగా నడిచే వీలు వుంటుంది. అయ్యప్ప దీక్షలో నలుపు రంగు వస్త్రాలను ధరిస్తారు. నలుపు తమోగుణాన్ని సూచిస్తుంది. అన్ని వర్ణాలను తనలో లీనం చేసుకునే నలుపు పరమాత్ముని లయకారక తత్వం. నల్లరాళ్ళను కూడా కరిగించగలిగే నరదృష్టి దోషాన్ని హరిస్తుంది. రంగురంగుల బట్టలపై మమకారం ఉండకూడదనటానికే నలుపు దుస్తుల ధారణ ముఖ్యోద్దేశం.</span></p><p><span style="color: #ff00fe;"> </span></p><p><span style="color: #ff00fe;">⚜️ అయ్యప్ప భక్తులు నొసటన తప్పనిసరిగా చందనం, విభూతి ధరిస్తారు. అయ్యప్ప విభూతి అన్నిటినీ మించిన దివ్యఔషధం. పంబా తీరంలో వంట చేసిన 108 పొయ్యిల నుంచి భస్మాన్ని సేకరిస్తారు. ఇలా సేకరించిన బూడిదను జల్లించి స్వామికి అభిషేకించగానే దానికి ఎనలేని శక్తి కలిగి సర్వరోగ నివారిణిగా తయారై ప్రాణదాతగా ఉపయోగపడుతుంది. అటువంటి మహిమాన్వితమైన విభూతి, గంధం ధరించడం వల్ల చక్కటి వర్చస్సు, మనోబలం కలుగుతాయి. అంతేకాక వాత, పిత్త, కఫం వంటి రోగాలు దరిచేరవు.</span></p><p><span style="color: #ff00fe;"> </span></p><p><span style="color: #ff00fe;">⚜️ 40 రోజుల అయ్యప్ప దీక్షను ముగించుకొన్న స్వాములు శబరిమల యాత్రకు ఇరుముడిలో బయలుదేరతారు. ఇరుముడిలో రెండు భాగాలు వుంటాయి. ముందు భాగంలో పూజాసామాగ్రి, వెనుక భక్తునకు కావలసిన వస్తువులు, తినుబండారాలు ఉంటాయి. ముందు భాగంలో ఉండే ఆవునెయ్యి భక్తుని ఆత్మతో సమానం. కొబ్బరికాయ దేహంతో సమానం. అనగా భక్తులైన వారు ఆత్మతో సమానమైన నేతితో స్వామికి అభిషేకం చేసి (ఆత్మార్పణ గావించి) దేహం వంటి కొబ్బరికాయను స్వామి సన్నిధిలోగల హోమగుండంలో వేయాలి. </span></p><p><span style="color: #ff00fe;"> </span></p><p><span style="color: #ff00fe;"> ⚜️కామ క్రోధాలను వీడి, కొబ్బరికాయలో ఉన్న మోహమనే నీళ్ళను త్రోసి, జ్ఞానమనే నెయ్యిని పోసి, భక్తి నిష్ఠలనే ఇరుముడులను వేసి నలభై ఒక్క రోజులు స్వామి తలపులతోనే కఠినమైన జపం చేయాలి. అంటే శరీరం మీద మోహాన్ని విడిచి భగవంతునికే అంకితం చేయాలని అర్ధం.* </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">⚜️ వెనుక భాగంలో ఉన్న తినుబండారాలు మానవుని ప్రారబ్దకర్మలు. ఎవరి ప్రారబ్ధాన్ని వారే మోసుకొని పోవాలి, వారే అనుభవించాలి. స్వామి సన్నిధికి చేరుకొనేసరికి తినుబండారాలు అయిపోవాలి. అంటే స్వామి సన్నిధికి చేరుకున్న భక్తుడు ప్రారబ్ధకర్మను వదిలివేయాలని అర్ధం.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">⚜️ ఆవునెయ్యి శక్తికి సంకేతం. స్వామి వారికి అభిషేకించిన నేతిని సర్వరోగ నివారిణిగా సేవిస్తే తప్పనిసరిగా సత్ఫలితం చేకూరుతుంది. ఆవునెయ్యి సహజంగానే చాల పవిత్రమైంది, ఆరోగ్యమైంది. ఆవునేతిని కొబ్బరికాయలో నింపి స్వామివారిని అభిషేకించగానే దానికి ఎనలేని మహిమ వస్తుందని భక్తుల నమ్మకం.</span></p><p><span style="color: #ff00fe;"> </span></p><p><span style="color: #ff00fe;">⚜️శబరి సన్నిధానంలో వెలిగించే కర్పూరం మన చుట్టూ ఉండి హాని కలిగించే సూక్ష్మక్రిములను నాశనం చేసి, వాతావరణం కలుషితం కాకుండా కాపాడి అయ్యప్పలకు కవచంగా తోడ్పడుతుంది. శబరిమల భక్తులకు ఏ వ్యాధులు సోకవు. వీరి నియమనిష్ఠలే వారిని సర్వరోగాల నుండి రక్షించి కాపాడుతాయి. ఎరుమేలి నుండి ఒంటిమీద ఆచ్చాదన లేకుండా ఇరుముడిని తలపై దాల్చి అడవుల్లో నడిచి వెళుతుంటే అక్కడ వుండే ఎన్నో రకాల ఔషధవృక్షాల నుంచి వచ్చే మలయ మారుతాలు శరీరాన్ని తాకి రోగనిరోధక శక్తిని కలిగిస్తాయి. అక్కడ పారే సెలయేళ్ళు, అళుదానది, పంబానది కూడా ఎన్నో వనమూలికల మీదుగా ప్రవహించడం వల్ల వాటిలో స్నానం చేస్తే శరీర రుగ్మతలు తొలగుతాయి.</span></p><p><span style="color: #ff00fe;"> </span></p><p><span style="color: #ff00fe;">⚜️ యోగపట్టం ధరించిన దివ్యాసనాలతో వుంటాడు అయ్యప్ప స్వామి. అన్ని యోగరహస్యాలు స్వామి మూర్తిలోను, తత్సన్నిధి కోసం జీవుడు చేసే యాత్రలోనూ ప్రస్ఫుటమవుతాయి. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">⚜️పూర్ణ సంఖ్య అయిన 18, పరిపూర్ణతను సాధించిన జ్ఞానానికి సంకేతం. అటువంటి జ్ఞానాన్ని సాధించడమే 18 మెట్లు ఎక్కడం.మాల ధరించిన రోజు నుంచి భక్తులు ప్రతిరోజు రెండు పూటలా స్వామిని అర్చించి, నలభై ఒక్క రోజులు అయ్యప్ప వ్రతదీక్షాపరులై నియమనిష్ఠలతో తలపై ఇరుముడిని ధరించి అడవిలో ప్రయాణించి శబరిమలై చేరుకొని అష్టాదశ సోపానాలు అధిరోహించి, హరిహర పుత్రుని దర్శించి సాయుజ్యాన్ని పొందుతారు.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">#శబరిమలలో స్వామికి జరిగే నిత్య కైంకర్యాలు*</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">హరిహరసుతుడు అయ్యప్పస్వామికి భక్తిశ్రద్ధలతో శాస్త్ర ప్రకారం నిర్వహించే పూజలు, అర్చనలు హైందవ సంప్రదాయానికి ప్రతీకలు. మండలం, మకరం, ఓణం సందర్భాల్లో సన్నిధానంలో ఘనంగా పూజలు నిర్వహిస్తారు.</span></p><p><span style="color: #ff00fe;"> </span></p><p><span style="color: #ff00fe;">హరిహరసుతుడు అయ్యప్పస్వామికి భక్తిశ్రద్ధలతో శాస్త్ర ప్రకారం నిర్వహించే పూజలు, అర్చనలు హైందవ సంప్రదాయానికి ప్రతీకలు. మండలం, మకరం, ఓణం సందర్భాల్లో సన్నిధానంలో ఘనంగా నిర్వహించే పూజాదికాలతో పాటూ పంప, ఎరుమేలిల్లోని ఉత్సవాలూ భక్తులకు కనువిందు చేస్తాయి. మండలం, మకర విలక్కు సందర్భాల్లో ఉదయం 7.30 గంటలకు నిర్వహించేది ఉషపూజ. ఈ పూజను మేల్సంతి నిర్వహిస్తారు. ఈ సందర్భంలోనే ‘ఉష పాయసాన్ని’ స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు. మధ్యాహ్న సమయంలో తంత్రి ఆధ్వర్యంలో జరిగే పూజ ఉచపూజ. ఈ పూజలో ప్రత్యేకంగా తయారు చేసిన 25 కలశాలను ఉంచి, ఎలనైవేద్యం, ఆరవణ పాయసాలను స్వామివారికి నివేదిస్తారు. రాత్రిపూట అదాజ పూజను మేల్సంతి చేస్తారు. ఈ సమయంలో ఎలనైవేద్యం, అప్పంలను నైవేద్యంగా సమర్పిస్తారు.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">సన్నిధానానికి దీక్షతీసుకున్న భక్తుల్ని చేర్చే పద్దెనిమిది మెట్లకు పడి పూజ చేస్తారు. మండలం, మకర విలక్కు సందర్భాల్లో భక్తుల రద్దీని బట్టి పూజను చేసేదీ లేనిదీ నిర్ణయిస్తారు. అయితే మలయాళ మాసాల్లో ఆలయాన్ని తెరిచిన ప్రతి సందర్భంలోనూ పడి పూజ చేస్తారు. ఈ పూజ తంత్రి ఆధ్వర్యంలో, మేల్సంతి సహకారంతో జరుగుతుంది. మకరజ్యోతి దర్శనం తర్వాత, ఆలయాన్ని మూసివేసే ముందు పడిపూజ నిర్వహిస్తుంటారు.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">మండల పూజ సమయంలో పదిరోజులపాటు ‘ఉల్సవం’ పేరుతో ఓ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ముందు తంత్రి ఆధ్వర్యంలో ‘కొడిమరం’ అనే ఆచారం ప్రకారం ధ్వజస్తంభం దగ్గర జెండాను ఎగురవేస్తారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలూ, అభిషేకాలూ ఉంటాయి. చివరి రోజున ఉత్సవమూర్తిని గజారోహణంపై ఊరేగించి, పంపకు తీసుకొస్తారు. అక్కడ పవిత్ర స్నానం చేయించి ‘ఆరాట్టు’ వేడుక జరుపుతారు. ఈ కార్యక్రమానికి మేల్సంతి ఆధ్వర్యం వహిస్తారు.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">మాలికాపురత్తమ్మ శబరిమల నుంచి శరంగుత్తి వరకూ గజారోహం ద్వారా సాగించే యాత్రే ఎజున్నెలిప్పు. అలంకరించిన ఏనుగు మీద అమ్మవారి ప్రతిమను ఉంచి, స్వామి సన్నిధి మీదుగా శరంగుత్తికి తోడ్కొనివస్తారు. అక్కడ కన్నెస్వాములు గుచ్చిన శరాలను చూసి వెనుదిరిగి పదునెట్టాంబడి మీదుగా మాలికాపురత్తమ్మ ఆలయానికి ఈ ఊరేగింపు సాగుతుంది. శరాలను చూసిన ఏనుగు విషణ్ణవదనంతో వెనక్కి వస్తుందని భక్తులు చెబుతారు.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">మకర విలక్కు తర్వాత సన్నిధానాన్ని మూసే ముందు రోజు అమ్మవారి ఆలయంలో పందళరాజు నిర్వహించే కార్యక్రమమే గురుథి. ఆ రోజు రాత్రంతా రాజు ఆలయంలోనే ఉంటారు. ఈ సందర్భంలో అక్కడ ఎవరికీ ప్రవేశం ఉండదు.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">జ్యోతి దర్శనానికి ముందు రోజు పంపానది తీరంలో భారీ ఎత్తున జరిగే అన్నదాన కార్యక్రమమే పంప సద్య. ఇతిహాసాల ప్రకారం వేటకు వెళ్లిన అయ్యప్ప ఇక్కడే తన సన్నిహితులకు అన్నదానం చేశారనీ, దానికి సంబంధించిందే ఈ కార్యక్రమమనీ అంటారు. అనంతరం పంప విలక్కు పేరుతో దీపాలు వెలిగించిన ఓ పడవను నదిలో వదులుతారు.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ఎరుమేలిలోని వావర్ మసీదు దగ్గర ముస్లింలు చేసే వేడుక చందనకుడం. మకర విలక్కు సమయంలోనే ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. అలంకరించిన ఏనుగుల మీద చందన కలశాలు ఉంచి మేళతాళాలతో మసీదుకు వచ్చి అయ్యప్ప స్నేహితుడైన వావర్కు నైవేద్యంగా ఇస్తారు.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"></span></p><p><span style="color: #ff00fe;">అంబళ్పుజ-అలంగత్ పేటతుల్లాల్ : సందళ్పేట తరువాత అంబళ్పుజ, అలంగత్ అనే ప్రాంతాల ప్రజలు ఎరుమేలిలో భారీయెత్తున పేటతుల్లాల్ అనే వేడుకను జరుపుతారు. వీరంతా వావర్ దర్శనం చేసుకుని ఎరుమేలిలో స్నానం చేసే సమయంలో ఓ గరుడ పక్షి వచ్చి అక్కడ తిరుగుతుంది. వీటితోపాటు ఆలయం తెరిచిన సమయంలో నిత్యం సుప్రభాత సేవ, ఘృతాభిషేకాలు, చందనాభిషేకం, పుష్పాభిషేకం, కలశభిషేకం, భస్మాభిషేకం, గణపతి హోమం, హరిహరాసనం లాంటి ధార్మిక విధులను తప్పకుండా నిర్వర్తిస్తారు.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;"> #స్వామియే శరణమయ్యప్పా🙏🏻🙏🏻</span></p><p><span style="color: #ff00fe;">సేకరణ.....</span></p>visalakshihttp://www.blogger.com/profile/12353866459824269934noreply@blogger.com1tag:blogger.com,1999:blog-2640908686154358505.post-48240260167011371402021-11-10T09:17:00.000+05:302021-11-10T09:17:05.357+05:30భావదాస్యం..<p><span style="color: #ff00fe;"> #దయచేసి ఈ వ్యాసాన్ని అందరూ చదవండి...🙏🙏🙏 #ప్రస్తుత కాలానికి ఎంతో అవసరమైనది.... </span></p><p><span style="color: #ff00fe;">#వీలైనంత మందికి కూడా షేర్ చేయండి... </span></p><p><span style="color: #ff00fe;">#ఇంత గొప్ప వ్యాసాన్ని ప్రచురించిన ఋషిపీఠం వారికి నమో నమః🙏🙏</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">బొట్టు జారిపోతోంది...</span></p><p><span style="color: #ff00fe;">'కట్టు' మారిపోతోంది!</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">కూరుచున్న కొమ్మలను </span></p><p><span style="color: #ff00fe;">కూలదోయుచున్న దెవరు? </span></p><p><span style="color: #ff00fe;">మూలం తెలియక మాయల </span></p><p><span style="color: #ff00fe;">జాలంలో పడినవారు.... </span></p><p><span style="color: #ff00fe;">మారీచుని భూతం కని </span></p><p><span style="color: #ff00fe;">మదనుడన్న వారెవరు? </span></p><p><span style="color: #ff00fe;">ఎంగిలి చదువుల ముంగిట </span></p><p><span style="color: #ff00fe;">చతికిల పడి ఉన్న వారు! </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">గలగలా కబుర్లు చెప్పుకుంటూ వారు నలుగురూ బస్ స్టాప్ వద్దకు నడచి వచ్చారు. బహుశా ఆ నలుగురూ ఒక జట్టు కావచ్చు! పసితనం ఇంకా తొలగని మిసిమితనం వారి వదనారవిందాలలో ప్రస్ఫుటిస్తోంది. సందేహం లేదు, వారంతా ఇంటర్మీడియట్ విద్యార్ధినులే. ఇలాంటి జట్లు బస్ స్టాప్ సమీపంలో చాలా కనిపిస్తున్నాయి. కళాశాలల నుంచి ఇళ్లకు బయలుదేరిన వారంతా అక్కడ చేరిపోయారు. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ఆ నలుగురూ ఒక 'శీతల పానీయశాల' వద్దకు వచ్చి నిలబడినారు. కొట్టువాడు రెండు పెద్ద గ్లాసులు నిండా 'పెప్సీ' పానీయం పోశాడు. ఇద్దరు అమ్మాయిలకు అందించాడు. ఇద్దరు బాలికలే కొన్నారు. మిగిలిన ఇద్దరి వద్ద పైసలు లేవేమో? ఉన్న డబ్బు 'పానీపూరీ' కొనడానికో 'బేల్పూరీ' తినడానికో ఖర్చు పెట్టేశారేమో? లేదా 'పెప్సీ' కొనడం వారిద్దరికీ ఇష్టం లేదేమో.... 'పెప్సీ' గ్లాసులు అందుకున్న అమ్మాయిలిద్దరూ నిలబడినారు. అందుకోని పిల్లలు ఇద్దరూ బెంచిమీద కూచున్నారు. ఒక అమ్మాయి గ్లాసులోని పానీయం కొంచెం తాగింది. ఆ తరువాత చాలా జాగ్రత్తగా ఆ గ్లాసును కూర్చున్న బాలికకు అందించింది. ఆమె కూడ కొంచెం తాగి, పక్కనున్న నాలుగవ అమ్మాయికి అందించింది. ఆ నాలుగవ బాలిక కూడ తాగి మళ్లీ మొదటి అమ్మాయికి ఇచ్చింది. అలాగే పానీయం కొన్న రెండవ అమ్మాయి కూడ కొనని ఇద్దరికీ తన ఎంగిలి పానీయం రుచి చూపింది. వారు తాగిన దాన్ని మళ్లీ తాను తాగుతోంది.... </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ఇలా ఒకరి ఎంగిలి మరొకరు తాగడం, తినడం ఇప్పుడు భలే ఫ్యాషనైపోయింది. ఇలా చేయడం "ఆత్మీయత"కు చిహ్నంగా, స్నేహానికి పరాకాష్ఠగా ప్రచారం జరిగిపోతోంది. "అయినా! ఎంగిలి ఏమిటి?? ఎక్కడుంది?? " అని ఎదురు ప్రశ్నలు కూడ దూసుకొని వస్తున్నాయి. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">"రెండు గ్లాసుల పానీయాన్ని నాలుగింటిలో పంచుకొని తాగవచ్చు కదా?" అని అడిగి చూడండి "అదంతా పూర్వ కాలం నాటి మూఢాచారం. ఇది కంప్యూటర్ యుగం..." అన్న సమాధానం కూడ వచ్చేస్తుంది! </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">బస్సు ఎక్కిన వారంతా 'ఎంగిలి టిక్కెట్లు' కొనడం తప్పని సరి. మొదట నోటిలో వేలుపెట్టుకున్న తరువాత మాత్రమే కండక్టర్ గారు మనకు టిక్కెట్టు చింపి ఇస్తాడు. ఘరానా హోటళ్ళలో 'సాంబారు'ను 'సీజనింగ్' చేసే 'కిచెన్ మాస్టర్' (వంటవాడు అనడం అవమానకరం) గరిటెలో పులుసును తీసుకొని చేతిలో పోసుకొని నాకుతాడు. చెయ్యి కడగడు. ఒక్కొక్కసారి, మిగిలిన ఎంగిలి సాంబారును 'స్టైల్' గా పొయ్యిమీద ఉన్న పులుసు గిన్నెలోకి విదిలించి పారేస్తాడు! కళాశాలల హాస్టల్ల మెస్లలోకి సైతం ఇప్పుడిప్పుడే ఈ 'ఎంగిలి సాంబార్' దిగుమతి అవుతోంది మరి. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ఇతర దేశాల నుంచి దిగుమతి అయిన మతాలవారు. ఆ విదేశీయ మతాలను స్వీకరించిన మనవారు శతాబ్దుల పాటు ఇలా "సామూహిక ఉచ్ఛిష్ట" పద్ధతులను పాటించారు. పాటిస్తే పాటిస్తారు. కానీ స్వజాతీయ మతాలవారికి సైతం 'ఎంగిలి పద్ధతి అంటురోగంలా వ్యాపించి పోతోంది. సనాతన ధర్మ నిబద్ధులు విజాతీయ మ్లేచ్ఛ సంప్రదాయాల పట్ల ఎందుకు మోహం పెంచుకుంటున్నారు?</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">"వేలుపులటె నాకంటెను</span></p><p><span style="color: #ff00fe;">వేలుపు మరి ఎవ్వడంచు వికవిక నగి, మా </span></p><p><span style="color: #ff00fe;">వేలుపుల గోడపై ఓ </span></p><p><span style="color: #ff00fe;">హేలావతి! నీతనూజు డెంగిలిపూసెన్!" </span></p><p><span style="color: #ff00fe;">అంటూ ఆనాడు, ద్వాపర యుగంలో గోపకాంతలు యశోదమ్మ దగ్గర వాపోయారు. చిన్ని కృష్ణుని 'ఆగడాల' లో ఇలా 'ఎంగిలి పూయడం' ఒకటి. "పసిపిల్ల వాడు కదా. ఎంగిలి పూస్తే పూశాడులే!" అని గోపెమ్మలు ఎందుకు ఊరుకోలేదు? ఎందుకంటే, 'ఎంగిలి' ని 'మంగళం'గా స్వీకరించడం భారతీయతకు వ్యతిరేకం కాబట్టి! తండ్రీ కొడుకులు, తల్లీ కూతుళ్లు సైతం ఒకరి 'ఎంగిలి' మరొకరు తినడం, తాగడం భారతదేశంలో అనాదిగా నిషిద్ధం! </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ఒక పల్లె నుండి కొంత మంది జానపదులు ఒక పట్టణానికి వెళ్లారు. మధ్యాహ్నమైంది. ఆ గ్రామీణులు భోజనం చేయడానికై ఒక 'హోటల్' కు వెళ్లారు. ఒక 'టేబిల్' చుట్టూ కూచున్నారు. భోజనం చేయడం ఆరంభించారు. కానీ పక్కన ఉన్న మరో బల్ల వద్ద కనిపించిన దృశ్యం చూసి వాళ్ళకు డోకు వచ్చిందట. వాంతి అవుతుందేమోనని భయపడినారు. వారంతా అర్ధాంతరంగా లేచివచ్చేశారట - బిల్లు చెల్లించి! </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">పక్క టేబిల్ వద్ద వారికి కన్పించిన దృశ్యం ఏమిటి? నలుగురు వ్యక్తులు ఆ టేబిల్ వద్ద కూర్చున్నారు. వారంతా విదేశీయ మతం స్వీకరించిన వారు. ఆ విధర్మీయులు నలుగురూ తమ కంచంలోనుండి తింటున్నారు. ఒకరు, మిగిలిన ముగ్గురి కంచాలలోని పదార్థాలను సైతం తింటున్నారు. ఒకరి ఎంగిలి కంచంలో నుండి మరొకరు మెక్కుతున్నారు. బల్లమీదంతా ఈ 'సామూహిక ఉచ్ఛిష్ట భక్షణ అవశేషాలు' నిండిపోయాయట. అది వారి మతం, వారి పద్ధతి. ఈ విదేశీయ మ్లేచ్ఛ ఆచారం ఆ జానపదులకు నచ్చలేదు. అసహ్యం వేసింది. ఎందుకంటే, ఆ గ్రామీణులంతా హిందువులు.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ఆ జానపదులలోని ఒక వృద్ధుడు ఇంకా ఇలా వివరించాడు ".....మనం ఒకరి ఎంగిలి మరొకరు తినము. అంతేకాదు ఒకరి ఎంగిలిని మరొకరు తింటూ ఉంటే చూడలేం కూడ! బిచ్చగాడికి సైతం మనం ఎంగిలి అన్నం పెట్టం, కుక్కకు కూడా ఎంగిలి కూడు వెయ్యం...." ఇలా 'ఎంగిలి'ని నిరసించిన వారు వేద పండితులు కాదు, విదేశీయమైన 'ఎంగిలి' చదువులు వంట బట్టని సామాన్య గ్రామీణులు, సాదా సీదా హిందువులు!</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">దేవుడికి నైవేద్యం పెట్టిన తరువాత భూత యజ్ఞం చేయడం కూడ హిందూ జీవన పద్ధతి. సనాతన ధర్మం నిర్దేశిస్తున్న పంచయజ్ఞాలలో భూతయజ్ఞం ఒకటి. ఇది నిత్యవిధి. 'బలిహరణం' పెట్టడం కూడ భూతయజ్ఞమే. ఈ 'బలిహరణం' కుక్కకు, అవుకు, జలచరాలకు, పక్షులకు వేయవచ్చు. ఇప్పుడు ఇలా భూతతృప్తి చేసిన తరువాతనే మనం భోజనం చేయాలన్న సనాతన ఆచారాన్ని నగరాలలోని అత్యధిక హిందువులు మరచిపోయారు. కొంతమంది కేవలం పండుగలప్పుడు మాత్రం 'బలిహరణం' పెడుతున్నారు. బూట్లు కట్టుకొని టేబుల్ ముందు కూచోని నడుము వంగకుండా చెంచాలతో ఆరగించే నవ నాగరికులు మనవన్నీ మరచిపోతున్నారు.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">విదేశీయమైన ఎంగిలి సంప్రదాయాలను 'కల్చర్' అనుకొని మురిసి పోతున్నారు. అలా 'బలిహరణం' వేయడం మనం తినక పూర్వం జరిగే నిత్యవిధి. ఈ 'బలిహరణ' ఓదనం 'ఎంగిలి ముద్ద' కాదు, కారాదు. అన్నం పెట్టలేక పోతే గోధుమలను బియ్యపు గింజలను సైతం ఒక గుప్పెడు పక్షులకు బలిహరణం పెట్టవచ్చు. పొలాలలో బువ్వతినే రైతన్నలు, గ్రామీణులు మాత్రం నిత్యం భూతయజ్ఞం చేస్తున్నారు. చూసివస్తే తెలుస్తుంది. మొదటి ముద్దను తుంచి (ఎంగిలి కాకపూర్వం) ఎదురుగా ఉండే కుక్క ముందుకు విసురుతారు. లేదా దూరంగా పక్షులకు విసిరివేస్తున్నారు. మరోసారి కుక్కకు పెట్టాలనుకుంటే 'బుట్ట' లోని 'ఎంగిలికాని' ముద్దలను పెడతారు కానీ, తాము తింటున్న 'తట్ట'లోని ఎంగిలి ముద్దలు వేయరు. ఇలా 'ఉచ్ఛిష్ట భోజన' నిషేధం అక్షరాలురాని జానపదులలో సైతం అనాదిగా అభివ్యాప్తమై ఉంది. కానీ అక్షరాలు నేర్చిన వారు ఈ సనాతన పద్ధతులకు దూరమైపోతున్నారు. ఇదంతా చెబితే చాలా మందికి బ్రహ్మాండమైన కోపం కూడ వచ్చేస్తుంది. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ఒకే 'టిఫిన్' డబ్బాలోని అన్నాన్ని ఒకరి తరువాత మరొకరు తింటున్నవారు ఆగ్రహించక ఏం చేయగలరు?</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">మంగళకర భావాలను పరస్పరం పంచుకోవడం, మంచి సంస్కారాలను సమష్టిగా ఆచరించడం సనాతన ధార్మిక జీవన రీతి. కాని ఎంగిలి తినడం కాదు! ఒక వ్యక్తి తన ఎంగిలి అన్నాన్ని సైతం మరోసారి తినరాదని వేద శాస్త్ర పురాణాలు చెబుతున్నాయి. "సహ నౌ భునక్తు" "ఇద్దరం కలిసి తిందాం" అన్న ఆత్మీయతను నేర్పించిన సంస్కృతికి "సకల లోకాల సుఖం కోరిన" జాతీయ రీతికి స్నేహం గురించి, మమకారం గురించి విదేశీయులు నేర్పించాలా? మ్లేచ్చుల 'ఎంగిలి'ని, ఎంగిలి పద్ధతిని మనం స్వీకరించాలా? నీరు లేక శౌచక్రియలు జరుపుకోలేని ఎడారులలో పుట్టిన మతం, నీళ్ళు ఉన్నా చలికి భయపడి శౌచక్రియలు జరుపని ప్రాంతాలలో పుట్టిన మతం ఇలాంటి విదేశీయ మతాలవారు ఎంగిలి తిన్నారు. తింటున్నారు. స్వజాతీయ మతాల వారికి అదంతా 'ఫ్యాషన్' కావడం ఈ దేశపు దౌర్భాగ్యం. </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">"యదుచ్ఛిష్టం, అభోజ్యం యద్వాదుశ్చరితం మమ సర్వం పునంతు మాం ఆపః...." అనేది భారతీయుని జీవన పద్ధతి. "ఎంగిలి తిన్నందువల్ల, తినకూడనిది తిన్నందువల్ల, తెలియక చేసిన ఇతర చెడ్డ పనుల వల్ల వచ్చిన పాపం నుంచి నీరు నన్ను విముక్తిణ్ని చేయుగాక...." </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">బాలుడికి ఉపనయనం చేసేటప్పుడు తల్లి, కుమారుడు ఒకే పళ్లెంలో భుజిస్తారు. పిల్లవాడు తల్లి ఎంగిలి తినడం కూడా అదే చివరి సారి. రజస్వల అయిన బాలికలు, పెళ్లయిన బాలికలు తల్లి ఎంగిలిని సైతం తినరు. పది పదిహేనులోపు వయసున్న బడిపిల్లలు సైతం ఒకరి ఎంగిలి మరొకరు తినరు. నిన్న మొన్నటి వరకు సజీవంగా ఉండిన ఈ సనాతన తత్వం నేడు పాశ్చాత్య నాగరికతా గ్రస్తమైపోతోంది. 'పదార్థ మోహం'తో బాల్య చాపల్యంతో పిల్లలు 'కాకెంగిలి' తినేవారు. ఒక మిఠాయిని కాని, తిను బండారాన్ని కాని పిల్లలు చేతితో తుంచలేనప్పుడు ఆ పదార్ధం చుట్టూ గుడ్డ చుట్టి కొరకడం, ముక్కలు చేయడం "కాకి ఎంగిలి". అది చిన్న పిల్లలు మాత్రమే ఈ పని చేసేవారు. ప్రస్తుతం కాకిని తోలేసి పెద్దలంతా 'ఎంగిలి'ని తినేస్తున్నారు. వారిని చూసి పిల్లలు కూడ నేర్చుకుంటున్నారు. మళ్లీ ఎప్పుడో.... "ఎంగిలి తినడం, తాగడం ప్రమాదకరం, రోగాలు వ్యాపిస్తాయి సుమా!" అంటూ పాశ్చాత్య దేశాలలో శాస్త్రీయ ప్రచారం మొదలైపోతుంది. అప్పుడు కానీ మన విద్యావంతులు ఎంగిలి తినడం మానరేమో! మన ఉత్కృష్ట సంస్కృతిని ఉచ్ఛిష్ట నాగరికత మింగివేస్తోంది! </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">రైల్లో బస్సుల్లో ఆసీనులైన వారు 'ఉర్లగడ్డ ఉప్పేరి' (పొటాటో చిప్స్) ప్లాస్టిక్ పాకెట్లను నోటితో కొరికి చింపుతున్నారు. తరువాత ఆ ఎంగిలిని అందరికీ పంచుతున్నారు. సంప్రదాయ భోజన పదార్ధాలను మరచి "బ్రెడ్ బటర్ జామ్, పఫ్, వేఫర్స్" లను మరిగినవారు ఇళ్లలోనే చాలా 'స్టైల్'గా "బ్రేక్ఫాస్టు"లు చేస్తున్నారు. ఈ "బ్రేక్ఫాస్ట్"ల సమయంలో కొందరు మహిళలు "బ్రెడ్డుకు బట్టర్" రాస్తూ మధ్యలో వెన్నను నాలుకలకు సైతం రాసుకుంటున్నారు. ఆ ఎంగిలి వేళ్ళతోనే బ్రెడ్డును అందరికీ 'సర్వ్' చేస్తారు.</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ఎవడైన పల్లెటూరి అతిథి వచ్చాడనుకోండి వాడికి అక్కడ 'నరకం' కనిపిస్తుంది. నగరాలలో నిగనిగలాడిపోతున్న నాగరికత ఇది!</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">అదిగో అక్కడ చూడండి! అల్ట్రా మోడరన్ టీ కొట్టువాడు, బహిరంగంగానే పాల పాకెట్టులను నోటితో కొరికి చింపి పాలను గిన్నెలోకి పట్టిస్తున్నాడు....</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ఎంగిలి తినడమే కాదు, ఎంగిలి పద్ధతులెన్నో మన జాతీయ జీవనంలో తిష్టవేసుకొని ఉన్నాయి. బ్రిటిష్ దుండగుల పెత్తనం ద్వారా సంక్రమించిన 'ఎంగిలి' పద్ధతులు ఎన్నెన్నో ఉన్నాయి. మన విద్యా విధానం, రాజ్యాంగ వ్యవస్థ, సామాజిక మరో వ్యవహారాలు - ఇవన్నీ బ్రిటిష్ వారి ఉచ్ఛిష్టా వశేషాలే. గుడి ముందు రోడ్డు పై నడచి వెళుతున్నవారు, బస్సులో వెళుతున్నవారు, ఇతర వాహనాలనెక్కి వెళుతున్న వారు భక్తిని ప్రకటిస్తున్నారు. ఎలా? చేతిని పెదవులకు ఆనించి ఎంగిలి చేయడం ద్వారా మాత్రమే తమ భక్తిని వారు వెల్లడిస్తారు. రెండు చేతులు జోడించడం లజ్జాకరమట!! </span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ఈ ఎంగిలి భక్తి ఎక్కడిది?? సీమల ఆవల నుండి మన దేశంలోకి చొరబడి వచ్చిన మ్లేచ్ఛుల ఆచారమిది! ఇప్పుడు మరో 'ఫ్యాషన్' వచ్చింది. అబ్బాయిలు ఎప్పుడో బొట్టు పెట్టడం మానేశారు. బొట్టు పెట్టుకుంటే మగపిల్లలు పిరికి వారై పోతారని కొంతమంది తల్లులు సైతం నిర్ధారించారట. ఇప్పుడు విద్యాలయాలకు వెళుతున్న ఆడపిల్లలు సైతం నుదుట బొట్టు పెట్టుకొనడం మానేస్తున్నారు. కనుబొమ్మల మధ్య కనిపించకుండా అతిచిన్న చుక్కను పెట్టుకుంటున్నారు "అస్తినాస్తి విచికిత్సా హేతువులు" ఇప్పుడు ఆడపిల్లల బొట్టులు. నుదుట నుంచి జారిపోయి ఆ బొట్టు కనుబొమల మధ్యకు చేరింది. వేద ధర్మం నుండి జారిపోయినవారు, దిగజారిపోయినవారు మ్లేచ్ఛులు. మరి సనాతన ధర్మ నిబద్ధమైన బొట్టు జారిపోతూ ఉంది, కట్టు మారిపోతూ ఉంది. మనమంతా హిందూ పేర్లు మాత్రమే కలిగిన మ్లేచ్ఛులుగా జీవిస్తున్నామా?</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">ప్రముఖ సంస్కృత పండితుడు బ్రహ్మశ్రీ తెలకపల్లె విశ్వనాథశర్మ ఇలా వివరించారు. "ఫాలభాగం మధ్యలో - నుదుటి మధ్యలో - చర్మం వెనుక అతి సన్నని బెజ్జం ఉంది. ప్రతి వ్యక్తికీ ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ రంధ్రం అతి సున్నితమైనది, సూక్ష్మమైనది. బయటి వాతావరణ దుష్ప్రభావానికి ఆ రంధ్రం గురికారాదు. అందువల్ల నుదుటి మధ్యలో చందనంతో కాని కస్తూరితో కాని కుంకుమతో కాని బొట్టు పెట్టుకోవాలి." కానీ ఆ బొట్టు ఉండవలసిన చోట ఉండడం లేదు జారిపోయింది....</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">మన సంప్రదాయాలు సశాస్త్రీయమా? ఆశాస్త్రీయమా? తర్కబద్ధమా? అంధవిశ్వాస బద్ధమా? అన్న ప్రశ్నలు వేరే శాస్త్రం. కానీ హిందువులు - ఈ దేశంలో అనాదిగా జాతీయులైన సనాతనులు - విదేశీయ 'ఎంగిలి' సంప్రదాయాలను ఎందుకు స్వీకరించాలి. ఆ విదేశీయ పద్ధతులు తర్కబద్ధమా? శాస్త్రీయమైనవా? అని చర్చ చేసి స్వీకరిస్తున్నమా? భావ దాస్యంతో 'స్వ'భావాన్ని కోల్పోతున్నామా?</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">'తరం' తప్పితే చాలు</span></p><p><span style="color: #ff00fe;">చతికిల పడు ఆచారం,</span></p><p><span style="color: #ff00fe;">సదాచార ధ్వంసంతో</span></p><p><span style="color: #ff00fe;">అధః పతనమౌ చిత్తం!</span></p><p><span style="color: #ff00fe;">చిత్తవృత్తి చెడిపోయిన </span></p><p><span style="color: #ff00fe;">జాతికి తప్పదు దాస్యం,</span></p><p><span style="color: #ff00fe;">దాస్యభావ 'గ్రహణం'పై</span></p><p><span style="color: #ff00fe;">దాడిచేయుటే ధర్మం....!</span></p><p><span style="color: #ff00fe;"><br /></span></p><p><span style="color: #ff00fe;">#అక్టోబర్ 2007 ఋషిపీఠం మాస పత్రికలో 'హెబ్బార్ నాగేశ్వరరావు' గారు రచించిన ప్రత్యేక రచన".From..FB..</span></p>visalakshihttp://www.blogger.com/profile/12353866459824269934noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2640908686154358505.post-73003806040482754322021-10-21T12:24:00.000+05:302021-10-21T12:24:23.710+05:30అమ్మవారి..ఆదిశంకరుల అద్భుత లీల<p></p><div style="text-align: justify;"><span style="color: #800180; font-size: large;"> ,</span></div><span style="color: #800180; font-size: medium;"><div class="separator" style="clear: both; text-align: center;"><a href="https://1.bp.blogspot.com/-K6LgGOaiW_4/YW6qaTL69gI/AAAAAAAACKs/WCSY8_YKb0EIzAPc27UlgtTF4KixiPmzQCLcBGAsYHQ/s292/20211019_160412.jpg" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="292" data-original-width="172" height="400" src="https://1.bp.blogspot.com/-K6LgGOaiW_4/YW6qaTL69gI/AAAAAAAACKs/WCSY8_YKb0EIzAPc27UlgtTF4KixiPmzQCLcBGAsYHQ/w236-h400/20211019_160412.jpg" width="236" /></a></div><br /><div style="text-align: justify;"><br /></div></span><p></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;">#అమ్మవారితోనే పాచికలాడి #శ్రీచక్రంలో అమ్మవారిని కూర్చోబెట్టిన ఘనుడు.. ఈ కథ విన్నా, వినిపించినా కోటిజన్మల పుణ్యఫలం*</span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;">#మధుర #మీనాక్షి అమ్మవారి ఆలయంలో శ్రీ #ఆదిశంకరులు #శ్రీచక్రం ప్రతిష్ఠించిన ఉదంతం:</span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;">🍁 పంచశత శక్తిపీఠాల్లో మధురమీనాక్షి ఆలయ పీఠము ప్రముఖమైనది. మీనములవంటి చక్కని విశాలనేత్రాలతో ఒకేఒక మరకతశిలతో అమ్మవారి విగ్రహము చెక్కబడినది. ఆకుపచ్చ, నీలం కలగలిపిన మరకతమణి శరీరకాంతి ఆ తల్లి యొక్క ప్రత్యేకత.</span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;">🍁 మధురనుపాలించే పాండ్యరాజులంతా ఆ తల్లిని ఆడపడుచుగా, కులదేవతగా, జగజ్జననిగా ఆరాధిస్తారు. "దేవీ భాగవతపురాణము" లో మణిద్వీపవర్ణనలా ఆ ఆలయాన్ని పాండ్యరాజులు రూపొందించారు. అంతటి సౌందర్యరాశి, చతుష్షష్టి కళానిలయమైన "మీనాక్షి" గూడా రాత్రివేళ తామస శక్తిస్వరూపిణిగా మారి ప్రాణిహింసకు పాల్పడుతుంది. ఆమెను శాంతింపచేయడానికి యావద్భారతంలోని మూలమూలలనుండి వేదపండితులను, ఋత్విక్కులను పిలిపించి యజ్ఞాలు, యాగాలు, క్రతువులు పూజలు, జపహోమాలు అన్నీ చేయించారు. వారు పూజలు చేస్తుండగా వారినీ కబళించేసింది మీనాక్షి.</span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;">🍁 పాండ్యరాజు నిస్సహాయంగా ఉండిపోయి తమ రాచరికపు కర్తవ్యంగా రాత్రివేళ నగరంలో "నర సంచారం" లేకుండా నిషేధాజ్ఞలు విధించారు. సంధ్యా సమయానికల్లా ప్రజలంతా తమతమ పనులన్నీ పూర్తిచేసుకుని రాత్రికాగానే ఎవరిగృహాల్లోవారు బందీలుగా మారిపోయారు. ఆపదొచ్చినా, అపాయం వచ్చినా, వారికి బైటకొచ్చేవీలులేదు. వచ్చారో నగర సంచారానికి బయలుదేరిన అమ్మవారి కోపాగ్నికి ఆహుతైపోవాల్సిందే!</span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;">🍁 క్షేత్రపాలకుడూ, మీనాక్షీ హృదయేశ్వరుడూ అయిన సుందరేశ్వరుడు కూడా ఈ జరుగుతున్నది అంతా సాక్షీభూతునిలా చూస్తుండిపోయారు. తన దేవేరియొక్క తామస ప్రవృత్తిని మాన్పించటానికి తనఅంశతో ఒక అవతారపురుషుడు జన్మించాలి. అప్పటిదాకా మౌనంవహించి తీరాల్సిందేతప్ప మరేమీ చేయటానికిలేదని నిర్ణయించుకున్నారు భోళాశంకరుడు.</span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;">🍁 తన శరీరంలోని అర్ధభాగమైన ఈశ్వరిని అవమానపరిస్తే , తననుతాను అవమాన పరచుకోడమే అవుతుంది. బాహ్యలోకానికి ఆమెను చులకన చేసినట్లవుతుంది. ఎలా? కాలము విచిత్రమైంది. ఏ సమయంలో, ఏప్రాణికి, ఏశిక్ష, ఏ పరీక్ష, ఏదీక్ష, ఏసమీక్ష ప్రసాదించాలో ఒక్క మహా కాలుడికే ఎరుక. ఎవరివంతుకు ఏదివస్తే అది మంచైనా, చెడైనా, జయమైనా, పరాజయమైనా అనుభవించి తీరాల్సిందే. </span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;">🍁 ఆదిశంకరాచార్యులు మధురలో అడుగుపెట్టే నాటికి పరిస్థితలాఉంది. పాండ్యరాజు ఆది శంకరులను అత్యంత భక్తిశ్రద్ధలతో స్వాగతంపలికి తనఅంతఃపురంలో సకలసేవలుచేసాడు. అద్భుత తేజస్సుతో వెలిగిపోతున్న యువబ్రహ్మచారయిన ఆదిశంకరాచార్యులు "నేను మధురమీనాక్షి ఆలయంలో ఈరాత్రికి ధ్యానం చేసుకుంటాను" అని చెప్పాడు. ఆ మాటలువిన్న పాండ్యరాజు పాదాల కింద భూకంపమొచ్చినంతగా కంపించిపోయాడు. </span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;">🍁 "వద్దుస్వామీ! మేము చేసుకున్న ఏపాపమో, ఏ శాపఫలితమో చల్లనితల్లి కరుణారస సౌందర్యలహరి అయిన మా మీనాక్షితల్లి రాత్రిసమయాల్లో తామస శక్తిగామారి కంటికి కనిపించిన ప్రాణినల్లా బలి తీసుకుంటున్నది. అందుచేత అంతఃపురంలోనే మీ ధ్యానానికి ఏ భంగంరానివిధంగా సకలఏర్పాట్లు చేయిస్తాను. మీరు ఆలయంలోకి రాత్రివేళ అడుగుపెట్టద్దు .అసలు అంతఃపురంనుండి బయటకు ఎవరూవెళ్ళరు. పొరపాటుగా బయటకొస్తే వారు మరునాటికి లేనట్టే లెక్క" అని పాండ్యరాజు వేడుకున్నాడు. </span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;">🍁 ఆదిశంకరాచార్యులు పాండ్యరాజును శతవిధాల సమాధానపరచాడు. "సన్యాసులకు గృహస్తులభిక్ష స్వీకరించేవరకే ఉండాలికానీ తర్వాత వారు గృహస్తుల యింట ఉండరాదు. మేము ఆలయంలోనే ఉంటాము. జగన్మాత అయిన మీనాక్షి అమ్మవారిని మనసారా ధ్యానం చేసుకుంటేతప్ప నాకు సంతృప్తి కలగదు. అడ్డుచెప్పద్దు" అన్నారు. పాండ్యరాజు హతాశుడైయ్యాడు.</span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;">🍁 దైవీతేజస్సుతో వెలిగిపోతున్న ఈ యువ బ్రహ్మచారిని "ఇకచూడనేమో?!" అని పాండ్యరాజు ఆవేదనచెందాడు. ఆదిశంకరాచార్యను ఆలయంలోకి తీసుకువెళ్లి తిరిగి అంత:పురానికెళ్ళాడు. పాండ్య రాజుకు ఆరాత్రి నిద్రలేదు. "ఈ యువసన్యాసిని అమ్మవారు బలితీసుకుంటుదేమో ఆపాపం తన తరతరాలను పట్టిపీడిస్తుందేమో" అని నిద్రరాక అటుఇటూ పచార్లు చేయసాగాడు. </span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;">🍁 రాత్రయింది. గర్భగుడికి ఎదురుగాఉన్న విశాలమైన మండపంలో పద్మాసనం వేసుకొని ఆదిశంకరాచార్య ధ్యానంలో కూర్చున్నాడు. మరకతశ్యామ అయిన ఆతల్లి ఆయన మనో నేత్రాలముందు ప్రత్యక్షమై భ్రుకుటిమధ్య నిలచి సహస్రారంలో ఆశీనురాలై చంద్రకాంతివంటి వెలుగులతో సుధావర్షదార కురిపిస్తోంది.</span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;">🍁 ఆ సమయంలోనే ఆలయంలోని గంటలన్నీ వాటంతటవే మోగసాగాయి. ఆలయంలో అన్ని వైపులా దీపారాధనలోని వెలుగులు దేదీప్యమానంగా వెలగసాగాయి. గర్భగుడిలో మరకతశిల అర్చనామూర్తిలో చైతన్యమొచ్చి అమ్మవారు మెల్లగా పీఠమునుండి లేచి నిల్చుంది. </span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;">🍁 పాదమంజీరాలు ఘల్లుమన్నాయి. సుందరేశ్వరుని వైపు తిరిగి వినమ్రంగా నమస్కరించినది. కర్ణతాటంకాలు ధగ,ధగ మెరుస్తుండగా, ఆమె ధరించిఉన్న ఎర్రనినిరంగు పట్టుచీర, బంగారు జరీఅంచులకుచ్చెళ్ళు నేలపై జీరాడుతూ, పుడమితల్లికి స్వాంతన చెప్తున్నట్టుగా, కోటివెన్నెలలు రాసిబోసినట్టున్న చిరునవ్వుతో ఆ తల్లి గర్భగుడి ద్వారంవద్దకొచ్చి లిప్తకాలమాగింది.</span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;">🍁 ఎదురుగా విశాలమైన మండపములో ధ్యాన సమాధిలోఉన్న యువయోగి ఆమె విశాలనయన దృష్టిపథంలోకొచ్చాడు. "ఎవరితడు? ఈ అద్భుత తేజస్సేమిటి? నుదుట విభూదిరేఖలు, అందులో కుంకుమబొట్టు, మెడలో రుద్రాక్షమాలలతో "బాల శివుని"లా ఉన్న ఆయోగిని చూస్తుంటే తనలో మాతృ మమత, పెల్లుబుకుతున్నదేమిటి? ఈ వేళప్పుడు ఆలయములో ఉన్నాడేమిటి?" అని ఆశ్చర్యం కలిగింది.</span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;">🍁 క్షణకాలమే ఇదంతా! గర్భగుడి "గడప" దాటిన ఆతల్లిపై ఒకానొక ఛాయారూప "తమస్సు" ఆవరించుకుంది. ఆమెలో సాత్త్వికరూపం అంతరించి తామసికరూపం ప్రాణం పోసుకుంటోంది. మరకత శ్యామ కాస్తా కారుమబ్బు రంగులోకిమారి భయంకర దంష్ట్రాకరాళవదనంతో, దిక్కులనుసైతం మ్రింగివేసే భయంకరమైనచూపులతో అడుగుముందుకేస్తోంది మహాకాళీ స్వరూపంలా. </span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;">🍁 ఇందాక తల్లి ఆకారం గర్భగుడిలో సాక్షాత్కరించిన సమయంలోనే ఆదిశంకరులు ధ్యాన సమాధినుండి మేల్కొని "మహాలావణ్య శేవధి" ని కళ్లారాచూసాడు. ఆయన హృదయంలో స్తోత్రం కవిత్వంరూపంలో సురగంగలా ఉరకలు వేసింది. ఆమె తామసరూపంగా మారినప్పటికీ ఆయనకు ఆ తల్లి మనోఙ్ఞరూపంగానే కన్పిస్తోంది. కన్నతల్లి అందమైనదా? కాదా?అనుకోరుకదా! కన్నతల్లి కన్నతల్లే ! అంతే !</span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;">🍁 అప్రయత్నంగా ఆయన స్తోత్రంచేసాడు. అడుగు ముందుకేస్తూ ఆయనని కబళించాలనివస్తున్న ఆ తామసమూర్తికి ఆస్తోత్రం అమృతపుజల్లులా చెవులకుసోకింది. దంష్ట్రాకరాళవదనంలో రేఖా మాత్రపు చిరునవ్వు ఉదయించింది. స్తుతిస్తున్న డింభకుని భక్తిపారవశ్యానికి ఆశ్చర్యపోయింది. అతని ఆత్మ స్థైర్యానికి, తపశ్శక్తికి ఆశ్చర్యంగా చూచింది. నిజానికీసమయంలో తనవదనంలోకి శలభంలా వెళ్లిపోవాల్సినవాడు, మ్రింగటానికి బుద్ధి పుట్టడం లేదేమిటి? </span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;">🍁 అర్ధనిమీళితాలైన కన్నులతో భక్తిపారవశ్యంతో వజ్రాసనంవేసి కూర్చుని స్తోత్రంచేశాడా యువయోగి పుంగవుడు. "భవానీ భుజంగ ప్రయాత స్తోత్రం" ఆ యువయోగిలోంచి కవిత్వ గంగాఝురిగా పొంగి పొరలివస్తోంది. జగజ్జనని తృళ్లిపడింది. తామస భావంతో నిండిపోయిన ఆమెహృదయంలో ఒకానొక సాత్త్వికతేజ: కిరణం తటిల్లతలా తటాలున మెరిసింది.</span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;">🌺 ఆహా! తన శక్తిపీఠస్థానము ఎంత అద్భుతంగా చెప్పాడీ యువకుడు? అవునుతాను "త్రికోణ బిందురూపిణి. శ్రీ చక్రరాజనిలయ". సహస్రారమనే మహాపద్మములో శివ, శక్తిరూపిణిగా, పరాశక్తిగా ఉండే తనఉనికిని ఎంతచిన్న శ్లోకంలో ఎంత చక్కగావర్ణించి గుర్తుచేశాడు. మరితనలో ఈ తామస భావాలేమిటి? తనసృష్టినితానే కిరాతకంగా హింసించే ఈ భావనలేమిటి? ఆలోచనలోపడింది అమ్మవారు. </span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;">🍁 ఆదిశంకరుల ముఖకమలంనుండి, సురగంగలా వచ్చిన స్తోత్రము తరంగాలుగా ఆమె కర్ణ తాటంకాలను దాటి, కర్ణపుటలనుదాటి, ఆమె ఆలోచనల్లో సుడులు తిరుగుతుంది. "ఏమిటిది? ఇతడు వసిన్యాది వాగ్దేవతలకు మరోరూపమా! ఏమి పదలాలిత్యము! ఏమా కవిత్వము! ఏమా కంఠస్వరం! ఏమి భక్తితత్పరత! ఏమివర్ణన? శ్రీచక్ర రాజంలోని నవావరణల్లోని దేవతాశక్తి బృందాలు, అణిమాది అష్టసిద్ధులు ఈ యువయోగికి కరతలా మలకము!" ఆనుకుంది అమ్మవారు.</span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;">🍁 "ఎవరు నాయనా నీవు ? నాదారికడ్డుగా కూర్చున్నావేమిటి? నేనీ సమయంలో సంహార కార్యక్రమం చేపట్టాను. నిన్నుచూచి నీస్తోత్రానికి ముగ్ధురాలినై క్షణకాలమాగానంతే. నీవుతొలగు. నిజానికి నీవీపాటికి నాకాహారం కావలసినవాడివి. నీవాక్కు నన్ను ఆకట్టుకొన్నది"అన్నది జగజ్జనని వాత్సల్యపూరిత సుధాదృక్కులతో ఆదిశంకరాచార్య వైపుచూస్తూ.</span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;">🍁 ఆదిశంకరులు సాష్టాంగ దండప్రణామము చేసాడు. "అంబా శంభవి! చంద్ర మౌళి రబలా, కాత్యాయినీ సుందరి..." గంగాఝురిలా సాగిందా స్తోత్రం. తల్లి తలపంకించింది. "నవవిద్రుమ బింబశ్రీ శ్రీన్యక్కారి రదనచ్చదా" పగడము, దొండపండు కలగలిపిన ఎర్రనిరంగును గుర్తుకుతెచ్చే ఆమె పెదవులపై వెన్నెలలాంటి నవ్వు వెల్లివిరిసి "శుద్ధ విద్యామ్ కురాకార ద్విజపంక్తి ద్వయోజ్వలా " అన్నట్లుగా ఆ తల్లి పలువరస ఆ నవ్వులో తళుక్కుమని మెరిసింది. </span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;">🍁 "కర్పూరవీటికామోద సమాకర్షద్దిగంతరా" అన్నట్లుగా తాంబూలసేవనంతో ఆ సువాసన దిగంతాలకు వ్యాపించింది. సరస్వతీదేవి వీణ అయిన "కచ్ఛపి" మధురనాదాన్ని మించే సుస్వర, సుమధురనాదంతో జగన్మాత ఇలా అన్నది. "నీ స్తోత్రాలకు, నీ భక్తికీ మెచ్చాను. నీవు, నీకవిత్వం చిరస్తాయిఅయ్యేలా ఆశీర్వదిస్తున్నాను. నీనుంచి వచ్చిన ఈ స్తోత్రాలు నిత్యము పారాయణ చేయ గలిగినవారు శ్రీచక్రార్చన చేసినంతటిఫలం పొందుతారు". </span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;">🍁 " నీకు ఏవరం కావాలోకోరుకో. ఆ వరమును ఇచ్చి నేను నాసంహార కార్యక్రమాన్ని యధావిధిగా కొనసాగిస్తాను. నిన్ను సంహరించక అనుగ్రహించడమే నీకు ఇచ్చే పెద్దవరముగా భావించు" అన్నది కించిత్ "అహం" ప్రదర్శిస్తూ తామసభావ ప్రభావంతో ఉన్న అమ్మవారు. ఆదిశంకరులు క్షణము జాగుచేయలేదు. </span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;">🍁 "బాల్యంలో తెలిసీతెలియని వయసులోనే నేను సన్యసించానుతల్లీ, నాపేరు శంకరుడు. దేశాటనం తోనూ, వేదాంతాలకు భాష్యాలు వ్రాయడంలోనూ ఇన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. బాల్యావస్త దాటిపోయి యవ్వనం వచ్చేసింది. ఇదిగూడా ఎంత కాలం తల్లీ!"</span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;">🍁 "కానీ నా హృదయంలో నా బాల్యకోరికొకటి మిగిలిపోయింది. అది శల్యంలా నన్ను అప్పుడప్పుడూ బాధిస్తుంటుంది" అన్నాడు వినమ్రంగా ఆదిశంకరాచార్య. ముల్లోక జనని ముగ్ధ మనోహరంగా నవ్వింది. "ఏ కోరికైనా తీర్చగల సమర్థురాలిని, నీ తల్లిని, జగజ్జననిని, నేనుండగా నీకేమికొరత నాయనా! అడుగు నీ కోరికతీర్చి, నేను నా సంహారకార్యక్రమానికి వెళ్లిపోతాను" అన్నది. ఇంకాఆమెలో తామసికవాసనాబలం తగ్గలేదు.</span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;">🍁 పసితనపు అమాయకత్వం వదలని ఆ యువకుని కోరికకు "మందస్మితప్రభాపూర మజ్జత్కామేశమానసా" అన్నట్టుగా ఫక్కున నవ్వింది. సౌందర్యలహరికే సౌందర్యలహరిగా భాసిస్తున్నదా నవ్వు. "అమ్మా ! నాతో పాచికలాడతావా ?" అని పసి పిల్లాడు అడిగినట్టుగా అడిగాడు బాలశంకరుడు. "తప్పక ఆడతాను నాయనా! నీ స్తోత్రంతో, నీ భక్తితో, నీ వినయంతో, నీపట్ల అపార మాతృవాత్సల్యము పెల్లుబికేలా చేసావు" .</span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;">🍁 "మరి ఆట అన్నాక పందెమంటూ ఉండాలిగా! నీకు తెలుసోతెలీదో, పశుపతితో ఆడేటప్పుడు నేను ఒక నిబంధనపెడతాను. నేనుఓడిపోతే ఆయన ఆజ్ఞమేరకు సంవత్సరకాలం నడచుకుంటాను. నేనెప్పుడూ ఓడిపోలేదనుకో! ఈశ్వరుడు ఓడిపోతే నేనువేసే ప్రశ్నలకు వివరంగా, విసుక్కోకుండా సమాధానం చెప్పాలి. ఆప్రశ్నలు లౌకికమైనవికావు. ఎన్నో వేదాంతరహస్యాలు, ప్రాణికోటికి సులభతరం కావాలన్న పరోపకారధ్యేయంతో ప్రశ్నిస్తాను". </span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;">🍁 "అట్లా ఏర్పడినవే, ఎన్నో దేవీ,దేవతాస్తోత్రాలు, కవచాలు, సహస్ర, అష్టోత్తర శతనామస్తోత్రాలు. మరి నీపందేమేమిటి నాయనా! అన్నది జగజ్జనని. ఆమెలో పశుపతినే పాచికలాటలో ఓడించే తన నైపుణ్యం తాలూకు కించిత్తు అహం తొణికిసలాడుతోంది. ఇదంతా గమనిస్తున్న సుందరేశ్వరుడు నిశ్శబ్దముగా లోలోపల నవ్వుకున్నాడు. ఆమె గెలుపు, తన ఓటమి ఎవరికోసం?లోకకల్యాణం కోసం. మౌన ముద్రలో ఉన్న సుందరేశ్వరుని జటాభాగంనుండి ఒకానొక కాంతికిరణము మెరుపులా వచ్చి ఆది శంకరునిలో ప్రవేశించడం ఆతల్లి గమనించలేదు. </span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;">🍁 ఆదిశంకరుల శరీరము, హృదయం క్షణకాలం దివ్యానుభూతికిలోనైంది. "శివా, పరమశివా! తల్లితో ఆడేఆటలో పందెంగా ఏమికోరాలో వాక్కుప్రసాదించు సుందరేశ్వరా!" అనుకున్నాడు లోలోపల. అది భావనారూపంగా పరమశివునినుండి అందింది. "పందెమేమిటి నాయనా?" అని మళ్ళీ అడిగింది అమ్మవారు. "ఈ యువకునితో పాచికలాడి అతన్ని ఓడించి తననైపుణ్యాన్ని సుందరీశ్వరునికికూడా తెలియచేయాలి" అనే ఉబలాటము ఆమెలో వచ్చేసింది.</span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;">🍁 "తల్లీ నేను సన్యాసిని. నాకు ధన, కనక, వస్తు, వాహనాలేవీ నాకు అక్కరలేదు. ఒకవాగ్దానాన్ని పందెపుపణంగా నేనుపెడితే నీకు అభ్యంతరమా తల్లీ?" అన్నాడు శంకరాచార్య. "తప్పకుండా, నీ వాగ్దానము ఏమిటో చెప్పేసేయ్" అన్నది వాత్సల్యము నిండిన చిరునవ్వుతో జగన్మాత. బహుశా మరింత కవితాశక్తి ప్రసాదించమని, అది మహారాజులుమెచ్చి మహాత్కీర్తి రావాలనే కోర్కెకోరుతాడని ఉహించింది" </span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;">🍁 "తల్లీ, నీవు కరుణామయివి. నీవు తామసశక్తివై ఈ సంహారకార్యక్రమం చేయడం నాకు బాధగాఉంది. ఆటలోనీవు ఓడిపోతే ఈ సంహారకార్యక్రమం ఆపేసి అందరినీకాపాడాలి. నేనుఓడితే మొదటగా నేనే నీకు ఆహారవుతాను". అన్నాడు దృఢచిత్తముతో ఆదిశంకరాచార్య. </span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;">🍁 జగన్మాత నవ్వింది. "నిన్ను ఆహారంగా తీసుకోను నాయనా! నేను ఓడిపోతే, నీమాటప్రకారాం నేను ఈ సంహారకార్యక్రమం ఆపేస్తాను, సరేనా!" అన్నది. ఆమెలో తానెన్నడూ ఓడిపోననే దృఢవిశ్వాసము నిండుగాఉంది. పశుపతినే ఓడించే తనకు ఓటమి రాదు, రాకూడదు. ఈ యువకుని నిరుత్సాహ పరచకూడదు. గెలుపు అతడికే లభిస్తుంది అనిపించేలా మెల్లిగా ఆడుతూ చివరలో ఓడించి, తన సంహారకార్యక్రమం కొనసాగించాలని ఆలోచించింది. </span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;">🍁 ఆదిశంకరాచార్య భక్తితో మొక్కాడు. "తల్లీ! దివ్య మహిమలుగల పాచికలు నీవే సృష్టించు. నీవు కోరిన పందెం నీకు, నేను కోరిన పందెం నాకుపడేలా ఆ పాచికలలో నీ మహత్యంనింపు. నేను ఆటలో అన్యాయమాడను, అసత్యం పలకను. నీవునాతో పాటు ఈ విశాలమండపంలో కూర్చోనవసరంలేదు. నీ గర్భగుడిలోని ఉన్నతాసనంమీద కూర్చోమ్మా!" అన్నాడు.</span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;">🍁 "ఏమిటి నాయనా ఆలోచిస్తున్నావు? ఆట మొదలుపెట్టు. పాచికలు నీవే మొదటవేయి. చిన్నవాడివి. నీవు మొదట ఆడడమే న్యాయం" అన్నది మీనాక్షి అమ్మవారు. ఆమె హృదయంలో మాత్రము "సుందరేశ్వరా! నీఅర్ధాంగిని. నాకు ఓటమి ఉండకూడదు. నీ దగ్గరే నేను ఓటమినేనాడూ చూడలేదు. ఈబిడ్డ దగ్గర ఓడిపోతే నాకు చిన్నతనంగా ఉంటుంది. మరి మీఇష్టము!" అన్నది. సుందరేశ్వరుడు చిరునవ్వుతో ఆశీర్వదించాడు. </span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;">🍁 ఆదిశంకరులు "తల్లీ నీవు సృష్టించిన దివ్య పాచికలు ఈక్షణాన నాచేతిలో ఉన్నాయి? నీలోని దివ్యత్వము నాలోకి వచ్చినట్టేకదా! ఈ భావనే నన్ను పులకింప చేస్తోంది. అమ్మా! జగన్మాతా! ఇంతటి అదృష్టము ఎంతటి యోగులకు దక్కతుంది? మళ్లీ మళ్లీ ఈ అవకాశం రాదునాకు. పశుపతితో తప్ప మరెవరితోను పాచికలాడని తల్లివి, సాధారణ మానవుడినైన నాతో ఆడడానికి అంగీకరించావు. అందుకని ఈ రాత్రి జరుగుతున్న వర్తమానకాలం చాలా విలువైంది, మహత్తరమైంది.</span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;">🍁 నీ లలితాసహస్రనామంలోని కొన్ని నామాలు, వాటిఅర్ధాలు ఆలోచిస్తూ ఈక్షణాలకు ఒక అద్భుతమైన పవిత్రత, ప్రయోజకత కూడా చేకూర్చుకుంటాను. నీనామాలు పలుకుతూనే ఆటాడతాను. అభ్యంతరమా తల్లీ! అలాగని ఆటలో ఏమరుపాటు చూపను. సాక్షాత్తూ గురురూపిణివైన నీవు, నీవు తోపింపచేసే అర్ధాలతో ఆ స్తోత్రం మరింత మహత్వపూర్ణమవుతుంది". అన్నాడు భక్తితో పాచికలు చేతబట్టుకొని నమస్కరిస్తూ. తన్మయురాలైనది ఆతల్లి.</span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;">🍁 సంఖ్యాశాస్త్రప్రకారము పావులు కదులుతూ ఉన్నాయి. సంఖ్యలకు, అక్షరాలకు అవినాభావ సంభందముంది. అమ్మవారికి ఆటలో ఆసక్తి పెరిగింది. ఇరువురి పావులు న్యాయబద్ధంగా కదులుతున్నాయి. "తాటంక యుగళీభూత తపనోడుపమండలా" అన్నట్టు అమ్మవారు అతని న్యాయమైన ఆటకు తలూపుతోంది. </span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;">🍁 ఆ తల్లి తాటంకాలకాంతి సూర్యచంద్రుల తేజో వలయాల్లాగా కనిపిస్తుండగా ఆదిశంకరాచార్య అమ్మవారిని స్తోత్రము చేస్తున్నాడు. "విజయావిమలా వంద్యా వందారు జనవత్సలా"! అన్నాడు. తల్లి నవ్వింది. "విజయమంటే విజయం నాదేకదా నాయనా!" అన్నది. ఆటమధ్యలో ఆపి, కించిత్ గర్వంగా.. విజయపరంపర మనిషిలో అహం పెరిగేంతటి మత్తును కలిగిస్తుంది. సృష్టి, స్థితి, లయాలను నేను నిర్వహించగలనన్న గర్వంతో ఉన్న ఆ తల్లి నయనాల్లో, చూపుల్లో ఎరుపుదనం, అహం కనిపించాయి. </span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;">🍁 "విజయం నాదయినా, నీదయినా రెండూఒకటే తల్లీ.! నీలోనుండి నేను ఉద్భవించాను. నాలో నీవున్నావు. ఒకనాణేనికి బొమ్మా బొరుసులాగా జీవుడు, దేవుడు ఉన్నారనుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందమ్మా! విజయపుఅంచుకు చేరుకున్నవ్యక్తి లిప్తపాటులో అపజయాన్ని చవిచూస్తాడు. విజయ లక్ష్మి చివరిక్షణంలో ఎవరిని ఉద్ధరిస్తుందో? అదే విజయరహస్యం. అందుకే నీవు గుప్తయోగినివి, గుప్తతరయోగినివి. ఆ గోప్యాన్ని తెలుసుకోగల్గిన వారికి విజయమైనా, పరాజయమైనా ఒకటేకదమ్మా.</span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;">🍁 పరాజయము నీ శక్తిస్వరూపమే. ఆ పరాజయం ఎంతటి నిరాశనిస్తుందో అంతటి పట్టుదలనిస్తుంది. ఆ పరాజయంద్వారా పొందిన అవమానం, దైన్యం, దైవంయొక్క పాదాలను పట్టుకొనేలాచేస్తుంది. ఇది మాత్రం విజయంకాదా తల్లీ!" అన్నాడు ఆది శంకరాచార్య భక్తి పారవశ్యంతో అమ్మవారికి మ్రొక్కుతూ. అమ్మవారు దిగ్భ్రాంతి చెందినది. </span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;">🍁 "గెలుపోటములు, ద్వంద్వాలు. సర్వమొకటిగా చూడగల దివ్య అద్వైతస్థితికి చేరుకున్న ఈ యువకుడు కారణజన్ముడు. సర్వము బోధించగల సమర్ధగురువుగా రూపొందుతాడు భవిష్యత్తులో". లోలోపల అనుకోబోయిన అమ్మవారు వాత్సల్యము పెల్లుబికిరాగా పైకనేసింది. "నాయనా! నీ ప్రతిఅక్షరం ఒక కవిత్వమై, ఆ ప్రతి కవితా స్తోత్రమై, ఆ స్తోత్రం ప్రతీదీ శృతిసమ్మతమై, వేదమై, వేదవాణి అయి అలరారుగాక. నీవు వేసే పందెం నీవు వేయి. ఇద్దరి పావుల్ని న్యాయబద్ధంగా నేను కదుపుతాను. ఆ సుందరేశ్వరునిసాక్షిగా నేను కపటం, మోసంచేయను" అన్నది అమ్మ.. "గెలుపోటములు జగన్మాతవైన నీ అధీనం కదాతల్లీ!" అన్నాడు ఆదిశంకరాచార్యులు.</span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;">🍁 ఆలయములో ఉన్న బంగారు గిన్నెలలోని పసుపు, కుంకుమ, చందనపుపొడులతో అష్టరేఖల గడులు చిత్రించాడు. అమ్మవారిపాదాలవద్దున్న పుష్పాలను తన పావులుగాను, అమ్మవారి అలంకరణ సామాగ్రిలోని మంచిముత్యాలను అమ్మవారి పావులుగాను సిద్ధముచేసాడు. జగన్మాత సంతోషించింది. దివ్యపాచికలను సృష్టించింది. ఆ యువకునితో ఆటపూర్తయ్యేవరకు "నీకోరిక మేరకు నేను నాస్థానములో కూర్చుంటాను", అంటూ గర్భగుడిలోకి వెనక్కివెనక్కి నడిచింది. ఆ సమయంలో సర్వచరాచరకోటికి తల్లి అయిన ఆమెలో యువయోగీశ్వరునిపై మాతృమమత పెల్లుబికింది. "ఎంతచిన్న కోరిక కోరాడీడింభకుడు. ఓడించకూడదు" అనే జాలికూడా కలిగినది. </span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;">🍁 పీఠంమీద ఆసీనురాలైన మరుక్షణంలో ఆమెలో ఇందాకున్న తామసభావము మాయమై నిర్మలత్వం వచ్చేసినది. ఆదిశంకరులు ఆమెలో కోరుకున్న మొదటిమార్పుఇదే. తన స్తోత్రశక్తితో అది సాధించాడాయన. మనసులో సుందరేశ్వరునికి మ్రొక్కాడు. "పరమశివా! జగన్మాతతో ఆడుతున్న ఆట పర్యవసానం లోకకళ్యాణముగా మారేలా అనుగ్రహించు. గెలుపోటములు రెండూ నీదృష్టిలో సమానమైనవి. నీవు నిర్వికారమూర్తివి. ఈ ప్రాణికోటి హింస, అమ్మవారి తామసశక్తి అన్నదాగాలి. అది ఆమె మాతృత్వానికే కళంకం. ఇది అర్ధముచేసుకొని నీవు సాక్షీభూతునిగా వుండి ఈఆట నడిపించు" అని మనసారా ప్రార్ధించాడు. </span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;">🍁 వెంటనే అతని హృదయానికి చందనశీతలస్పర్శ లాంటి అనుభూతి కలిగినది. అది ఈశ్వరకటాక్షమని అర్ధమయింది. "ధన్యుడిని తల్లీ! ధన్యుడిని. నా ప్రతి స్తోత్రములో నీవు, నీశక్తి అంతర్లీనమై నిలిస్తేచాలు. "ఆ బ్రహ్మకీటజననీ!" ఈక్షణములో "నిర్వాణ షట్కము" అనే కవితనాలో శ్లోకరూపంలో పెల్లుబికి వస్తోంది. నీ ఆశీస్సులతో అదికవిత్వంగా నా హృదయంలో రూపుదిద్దుకుంటుంది. అంటూనే నిర్వాణషట్కoలోని 5 శ్లోకాలు ఆశువుగా చెప్పేసాడు. ఆ "అహంనిర్వికల్పో! నిరాకార రూపో , విభుత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రియాణే , నచా సంగతం నైవముక్తిర్న బంధం, చిదానంద రూపమ్ శివోహం, శివోహం" రాచనగరులో తెల్లవారుఝాము అయింది. ఆ గుర్తుగా మేలుకొల్పు నగారా మోగింది. </span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;">🍁 అమ్మవారు తృళ్ళిపడింది. ఈ యువయోగి మధురవాక్కుల్లో కాలమాగిపోయి, త్వరగా ఝాము గడిచింది. "తల్లీ! ఇంకాకొద్దిగా ఆట ఉంది. నీవు "విశ్వాసాక్షిణివి, సాక్షివర్జితవు" కూడా అని అన్నాడు. "విశ్వానికి సాక్షిణిని నేను. సాక్షివర్జితను ఎలా అవుతున్నానో చెప్పగలవా?!" అని అడిగింది. జగన్మాత అతని నోటివెంట ఆనామాలకు అర్ధాలు వినాలనే కుతూహలంతో. "తల్లీ! రెప్పపాటు లేనపుడు సృష్టిని కాపాడడం, రెప్పపాటు జరిగినపుడు లయం జరగడము రెండూ నీ ప్రక్రియలేగదమ్మా! సర్వవిశ్వానికి సాక్షిణివైన నీవు ప్రాణులకు కాలంతీరినపుడు, నీ సువిశాల నయనాల నల్లని కనురెప్పలను క్షణకాలం రెప్పపాటుసాకుతో మూసుకుని సాక్షివర్జితవవుతావు. అలాచేయకపోతే నీసృష్టిలో నియమోల్లంఘన జరిగిపోతుంది. అవునా తల్లీ!"అన్నాడు.</span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;">🍁 "ఎక్కడో కదలాడుతున్న ఒక మధురానుభూతి, ఒక మాతృమమత ఈయువకుని చూసినప్పటి నుంచి తనలో కలుగుతూనే ఉంది. తనతో మూడు ఝాములు ఆడిన ఆట కేవలం వినోదమా!కాదు, కాదు. ఇంకేదో కారణముంది. విఘ్నేశ్వరుడు, షణ్ముఖునిలాగా ఏ జన్మలోనో తన బిడ్డా?" ఆట పూర్తి కాలేధీరోజు. సంహార కార్యక్రమం ఆగిపోయింది. తనలో తామసశక్తి మరుగై సాత్వికశక్తి నిండిపోయి, అపారకరుణ జాలువారుతుంది. ఇక బ్రహ్మముహూర్త కాలమొస్తుంది. ఆలయ పూజారులొస్తారు. అభిషేకాలు, పూజావిధులు నిర్వర్తిస్తారు. మరి కాసేపట్లో కాలాన్ని కచ్చితంగా అమలుపరిచే సూర్య భగవానుడొస్తాడు. "భానుమండల మధ్యస్థా" తన స్థానం. ఎంతమార్పు ఒక్కరాత్రిలో! ఈ యువకుడు ఏ మంత్రమేశాడో! అమాయకత్వంతోనే ఆకట్టుకున్నాడు. </span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;">🍁 "తన ఆట కట్టేసాడా! తీరాతను ఆట ఓడిపోదు కదా! పశుపతినే ఓడించగలిగినతాను ఈ యువకుని చేతిలో ఓడిపోతే ఈ సంహారశక్తి ఆపెయ్యాలి". అని మనసులో అనుకుంటూ ఇక ఆటమీద దృష్టి కేంద్రీకరించింది. క్షణకాలం భయ విహ్వలతతో చలించిన ఆమె యొక్క విశాల నయనాలు చూస్తూ ఆదిశంకరులు భక్తి పూర్వకముగా నమస్కరించాడు. అమ్మవారి కుండలినీ యోగశ్లోకాలు సహస్రనామ స్తోత్రంలోనివి ("పాయసాన్న ప్రియా త్వక్ స్థా పశులోక భయాంకరీ") గానంచేస్తూ పావులు చకచకా పాచికలు కదిపాడు. అమ్మవారిలో పట్టుదలపెరిగి త్వరత్వరగా పెద్దపెద్ద పందేలుపడేలా పాచికలను వేస్తోంది. దూరంగా శివభక్తులు వచిస్తున్న నమక, చమకాలు, అమ్మవారి సుప్రభాతగానాలు ప్రారంభమయ్యాయి. ప్రతిపనికి ఒక నిర్దిష్టసమయం, సమయపాలన ఉండి తీరాలి. అదే ముక్తిపధానికి మొదటిమెట్టు. </span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;">🍁 "నాయనా! చివరి పందెం నాది. నా పావులన్నీ మధ్య గడిలోకొచ్చాయి. నేను గెలిచాను" అంది అమ్మవారు సంతోషతరంగాలలో తేలిపోతూ. "అవునుతల్లీ! భూపురత్రయం, 4 ద్వారాల్లోకి వచ్చేశాను నేనుకూడా. 9వ ఆవరణ చేరాముతల్లీ, నీవు బిందువులో యధాస్థానంలో జగన్మాతగా కూర్చున్నావు. నీవే గెలిచావు తల్లీ! నీచేతిలో ఓటమి కంటే నీబిడ్డకు కావాల్సిన కైవల్యమేముందమ్మా! జగన్మాతచేతిలో ఓటమికూడా గెలుపేతల్లీ, ఇలాంటి ప్రత్యక్ష ఆట ఎవరికి దక్కుతుంది?" అన్నాడు దివ్యపాచికలు అమ్మవారిముందు పెడుతూ.</span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;">🍁 "నేను గెలిచాను. మరిమన ఒప్పందంప్రకారం నా సంహారకార్యక్రమం నేనుకొనసాగిస్తాను. జగన్మాతనైన నాతోపాచికలాడి నీ కోర్కెతీర్చుకొని, పునర్జన్మలేని మోక్షాన్ని సాధించుకున్నావు నాయనా!"అంది అమ్మవారు. "అవును తల్లీ! ఆటపరంగా విజయం నీది. కానీతల్లీ, ఆటవైపు ఒక్కసారి తేరిపారి చూడమ్మా! సంఖ్యాశాస్త్రపరంగా, అక్షరసంఖ్యాశాస్త్ర పరంగా, మంత్రశాస్త్రపరంగా గెలుపునాది" అన్నాడు దృఢస్వరముతో. అమ్మవారు "ఏమిటి? సంఖ్యాశాస్త్ర పరంగానా!" అన్నది, ఏదీ స్ఫురించని అయోమయ స్థితిలో.</span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;">🍁 *"నవావరణలతో కూడిన శ్రీచక్రరూపం. శ్రీ చక్రంలోని ఉగ్రబీజాలు మాయమై నీలో తాత్కాలికంగా ఆవహించిన తామసశక్తి మాయమైంది. శ్రీచక్రము నీదేహమైతే, సహస్ర నామావళి నీ నామము. నీ అపారకరుణతో, ఈ రాత్రంతా నాతపస్సు ధారపోసి నేను ఏర్పరిచిన ఈ శ్రీచక్రరాజాన్ని నీవు తిరస్కరిస్తావా! నీవు చేసిన ఈ సృష్టినీ, నీఉనికిని, నీవేఅర్ధరహితమని నిరూపిస్తావా! అలాచేస్తే ఆస్తికత ఉండక, నాస్తికత ప్రబలి, సర్వసృష్టి జడత్వములోకి, తమస్సులోకి జారిపోదా!"* అంటూ క్షణకాలమాగాడు ఆదిశంకరాచార్యులు. </span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;">🍁 దిగ్భ్రాంతిపొందిన అమ్మవారు మండపంలోకి దృష్టిసారించింది. కోటిసూర్యప్రభలతో శ్రీచక్రము అక్కడ ప్రతిష్ఠితమై ఉన్నది. తాను చతుష్షష్టికళలతో, షోడశకళలతో బిందుత్రికోణరూపిణిగా కొలువైవుంది. అద్భుతంగా తనని శ్రీచక్రంలో బంధించాడు. కాదు, కాదు కొలువు చేయించాడు. గెలుపుతనదా! కాదు కాదు ఆ యువయోగిదే. ఆదిశంకరుడు "అమ్మా! నా మీద ఆగ్రహించకు. ఆగ్రహమొస్తే నన్నొక్కడినే బలి తీసుకో. నాకు, నీకు సాక్షీభూతుడు సుందరేశ్వరుడు ఉన్నాడు. ఆ పరమశివునిగూడా పిలుద్దాము. న్యాయనిర్ణయము ఆస్వామి చేస్తారు. </span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;">🍁 అప్పుడు చూసింది అమ్మవారు సుందరేశ్వరుని వైపు. పశుపతినే పాచికలాటలో ఓడించిన జగజ్జనని నేడు ఒకబిడ్డ చేతిలో ఓడిపోయింది. "ఒక్కసారి నీ పాదాలవద్దనుండి మండపంలో చిత్రించిన ఈఆట చిత్రంవరకు నీ విశాలనయనాల చల్లనిదృష్టి సారించుతల్లీ! తొమ్మిది "నవం"తో ఆట ప్రారంభించాను గుర్తుందా తల్లీ! నీవు నాకు ప్రసాదించిన "ధారణ" శక్తితో మన ఇద్దరి పందేలు ఒక్కటికూడా తప్పుపోకుండా ఏకరువుపెడతాను తల్లీ, ఒక్కసంఖ్య, ఒక్కఅక్షరం పొల్లుపోదు. తప్పు, తడబాటు నాకురాదు. సంఖ్యలకు సరైన బీజాక్షరాలను చూడుతల్లీ!"</span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;">🍁 44కోణాలు, 9ఆవరణలు కలిగిన శ్రీచక్రరాజ చిత్రాన్ని, ప్రతిష్టను, ఈ ఆటచిత్రంలో చూడమ్మా, "మాతృకావర్ణరూపిణి" అయిన నీవు ఒక్కసారి పరికించిచూడు. పందెపుసంఖ్య సరిగ్గా సరిపోయేలా, సాత్వికబీజాక్షరాలను సంఖ్యాశాస్త్రపరంగా మలచి, ఏపొరపాటు రానీకుండా న్యాయబద్దంగా పావుల్ని కదిపాను. ఆటలో అన్యాయము చేయలేదు. అందుకు సుందరేశ్వరుడే సాక్షి. పంచభూతాలు, సర్వదేవతా గణాలు సాక్షి. బిందువు మొదలు, భూపురత్రయంవరకు, ప్రతి ఆవరణకు ఒక ప్రత్యేక అధిష్టానదేవత, ఆ దేవతాశక్తులు పరివేష్టించి ఉన్నాయి. </span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;">🍁 "అకారాది క్షకారాంత" దేవతాశక్తి స్వరూపాలకు వారివారి ఆహార్యాలు,ఆయుధాలు, శరీరపు రంగుతో సహా, ఆయా ఆవరణలలో పరివేష్టితులైనవారిని, ఆయా ముద్రాదేవతలను, నవరసాధిష్టాన దేవీస్వరూపాలను, యోగినీదేవతలను, చక్రీశ్వరులను, సంఖ్యాపరంగా బీజాక్షరాలతో నిలిపాను. ఒక్కసారి పరిశీలించి చూడమ్మా! షట్చక్రాల ప్రత్యక్ష, పరోక్షభోధే శ్రీచక్రార్చనగదా తల్లీ!నీ శక్తిపీఠాల్లో ప్రతిష్ఠితమైన యంత్రాల్లోని ఉగ్రబీజాలు తొలగించి, క్రొత్తగా సాత్విక బీజాక్షరాలసహిత శ్రీచక్ర ప్రతిష్ఠ చేస్తూవస్తున్నాను".</span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;">🍁 "ఆకార్యక్రమంలో భాగంగా తల్లీ, నీతో పాచికలాడాను. సంఖ్యాశాస్త్రపరంగా అక్షరాలను సమీకరించి, నిన్ను స్తోత్రముచేస్తూ, నీ ఆశీస్సులతో వాటిని ప్రాణప్రతిష్ట చేసాను. అదే నీముందున్న "బిందు, త్రికోణ, వసుకోణ, దశారయుగ్మ మన్వస్ర, నాగదళ, షోడశ పత్ర యుక్తం, వృత్తత్రయంచ, ధరణీ సదన త్రయంచ శ్రీ చక్రరాజ ఉదిత : పరదేవతాయా:" "ఏమిటీ వింత స్వామీ!" అంటూ భర్తవైపు కించిత్ లజ్జ, కించిత్ వేదనతో బేలగా చూసింది. మధుర మీనాక్షి. ఈయువకుడు అద్భుతరీతిలో సంఖ్యల అక్షరాలనుసంధించి యంత్రప్రతిష్ఠ చేసాడు. శ్రీచక్ర యంత్రాన్ని సర్వమానవాళికి శ్రేయోదాయకంగా ప్రసాదించాడు. </span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;">🍁 "స్వామీ సుందరేశ్వరా! ఏది కర్తవ్యం?" అమ్మవారు ఆర్తిగాపిలిచింది. "సుందరేశా! నా యుక్తిని నీవు సమర్ధిస్తావో, క్షమిస్తావో నీఇష్టం!" అంటూ ప్రార్ధించాడు ఆది శంకరాచార్య. ఆయన హృదయంలో "సౌందర్యలహరిగా" తాను కీర్తించిన రూపము తల్లిగానూ, "శివానందలహరిగా" తాను కీర్తించిన ఈశ్వరునిరూపం తండ్రిగానూ, తనతప్పుకు క్షమాపణవేడుకుంటూ "శివ అపరాధ క్షమాపణ స్తోత్రము" గంగాఝురిలా ఉరకలేసిందాక్షణంలో. అందాకా మౌనంగా ఉన్న నిర్వికారమూర్తి సుందరేశ్వరుడు అప్పుడు కళ్ళు తెరిచాడు. </span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;">🍁 ఒకవైపు అహం తగ్గిపోయిన ఆర్తితో దేవేరి పిలుస్తోంది. మరోవైపు భక్తుడు కర్తవ్యము తెలుపమంటూ ప్రార్ధిస్తున్నాడు. సర్వదేవీ, దేవ గణాలు ఆస్వామి తీర్పుకోసం ఎదురుచూస్తున్నాయి. శివుడు కళ్ళుతెరిచాడు. చిరునవ్వునవ్వాడు. నందీశ్వరుడు ఒక్కసారి తలవిదిలించి రంకెవేసాడు. మధురాపట్టణమంతా మారుమ్రోగిందా రంకె. ప్రమధ గణమంతా అప్రమత్తులై స్వామివెంట కదలడానికి సిద్ధమయ్యారు. ఒక్కసారి కైలాసమే కదిలివచ్చింది. ఆలయగంటలు అదేపనిగా మోగాయి. </span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;"> భక్త్యావేశంతో ఈశ్వరుని నక్షత్రమాలికా స్తోత్రంతో ఆదిశంకరులు స్తోత్రంచేయసాగాడు. ఆయన నోటి వెంట సురగంగ మహోధృత జలపాతంలా స్తోత్రాలు వస్తున్నాయి. ఈశ్వరుడు సర్వదేవతా ప్రమధగణ సమేతంగా మీనాక్షి ఆలయమండపంలో సాక్షాత్కరించాడు. "దేవీ!" అన్నాడు పరమశివుడు. </span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;">మధురమీనాక్షి వినమ్రంగా లేచినిల్చుని చేతులు జోడించింది. ఇప్పుడామె "మందస్మితప్రభాపూర మజ్జత్ కామేశమానసా". తామసం మచ్చుకైనాలేని మమతాపూర్ణ. భర్తఆజ్ఞ, తీర్పు శిరోధార్యంగా భావించే సాధ్వి. సదాశివ కుటుంబిని, సదాశివ పతివ్రత. </span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;">🍁 పరమశివుడు ఇలాఅన్నాడు. "దేవీ! నీఅహాన్ని, నీ తామసస్వభావాన్ని అదుపుచేయలేకపోయాను. ఎందరో నిర్దాక్షిణ్యముగా బలైపోయారు. ఈప్రాణి కోటిని రక్షించేదెవరు? నీ తామసశక్తినెవరూ జయించలేరు. నేను ప్రయత్నంచేస్తే నాఅర్ధశరీరాన్ని అవమానపరచటమే అవుతుంది. అందుకని సకల దేవతలు, నేనూ సాక్షీ భూతాలుగా ఉండిపోయాము. నీ తామసశక్తిని అదుపుచేయగల యంత్రాన్ని, మంత్ర పూతంగా సిద్ధముచేయాలి. అందుకు ఒక కారణ జన్ముడు దిగిరావాలి. అతడు ముక్తసంగునిగా జన్మించి, ఏ మలినమంటని బాల్యంలో సన్యసించి, సర్వదేవతా సాక్షాత్కారంపొంది, మంత్రద్రష్టగా మారాలి. నీ అనుగ్రహానికి పాత్రుడై నిన్ను తన మాతృప్రేమతోనే జయించగల్గాలి.</span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;">🍁 అందుకే ఆ సమయంకోసం వేచిఉన్నాను. ఇతడు నాఅంశంతో జన్మించిన అపర బాల శంకరుడు. అతడి సర్వశాస్త్ర పరిజ్ఞానం, అతడి కవితాశక్తి, అతడిని ఆసేతుహిమాచలం పర్యటన సలిపేలాచేసింది. అతినిరాడంబముగా సాగించిన అతని పర్యటనయొక్క ఉద్దేశం అతని హృదయానికి, పరమశివుడనైన నాకు మాత్రమే తెల్సు. </span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;">🍁 కాలక్రమేణా మహామంత్రద్రష్టలైన కొందరు తమ స్వార్ధపూరిత ఆలోచనలతో తామే సర్వలోకాలకు అధిపతులు కావాలనే కోరికతో నీ పీఠాలలోని యంత్రాలకు మరింతఉగ్రరూపము సంతరించు కునేలా పూజలు, యజ్ఞాలు, హోమాలు, బలులు నిర్వహించి నీలో తామసికశక్తిని ప్రేరేపించి, ప్రోత్సహించారు. వారుచేసిన పూజలన్నీ నిశా సమయంలోనే కావడంతో నీలో రాత్రిపూట తామస శక్తి పెరిగి పోయింది. వారు పతనమైపోయారు. బ్రష్టులయ్యారు. కానీ నీలో తామసికరూపం స్థిరపడిపోయింది. లోకకల్యాణం తప్ప మరోటికోరని ఈ శంకరాచార్య నీలో ఈ తామసికశక్తిని రూపు మాపి, నీవు మాతృమూర్తిగా సర్వప్రాణికోటిని రక్షించాలితప్ప, భక్షించకూడదని ప్రతిజ్ఞ బూనాడు. శక్తిపీఠాలలో ఉన్న శ్రీచక్రాలలో సాత్విక కళలను ప్రతిష్టించాడు. నీవు ఆటలో గెలిచినా, నైతికంగా ఓడిపోయావు. ఈ శ్రీచక్రము సర్వగృహస్తులకు శ్రేయోదాయకమైంది". అని సుందరేశ్వరుడు అన్నాడు. </span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;">🍁 అమ్మవారు దిగ్భ్రాంతి పొందింది. "ఈ యువకుడు నిస్సందేహముగా అపరబాలశంకరుడే. భర్త శంకరునివైపు, బిడ్డలాంటి బాలశంకరునివైపు మార్చి,మార్చి చూసింది. ఆఇద్దరిలో కనిపిస్తున్న ఈశ్వరశక్తి దర్శనమైంది. అమ్మవారి ముఖంలో ప్రశాంతత చోటుచేసుకుంది. అమ్మవారు భక్తిగా పరమశివునికి శిరసా నమస్కరించి, శంకరాచార్యను మనసారా ఆశీర్వదించి చిరునవ్వులు చిందించింది. ఆసమయంలోనే పాండ్యరాజు అంత:పురములో నందీశ్వరునిరంకె విన్నాడు. మధురమీనాక్షి ఆలయ ఘంటారావాలు విన్నాడు. తెల్లవార్లు నిద్రపోక ఆందోళనగా ఉన్న ఆరాజు అమ్మవారి తామసానికి శంకరాచార్య భలైఉంటాడని భయబ్రాంతుడయ్యాడు.</span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;">🍁 రాజుతోపాటు పరివారం, అంత:పుర కాంతలు ఆలయంవైపు పరుగులుతీశారు. ఆ యువయోగి మరణిస్తే, తాను జీవించి ఉండడం అనవసరం అనుకున్నాడు. ఆ నిర్ణయానికొచ్చి, కత్తిదూసి ఆత్మాహుతికిసిద్ధమై, ఆలయప్రవేశం చేసిన మహారాజుకు, ఆదిదంపతులైన పార్వతీ పరమేశ్వరులు క్రొత్త శ్రీచక్రానికి కాస్తదూరంలో నిల్చుని ఉన్నారు. వారిని స్తోత్రముచేస్తూ తన్మయత్వంలో మునిగిఉన్న ఆదిశంకరులు కనిపించారు. పాండ్య రాజు "స్వామీ! నీవు జీవించేవున్నావా! నన్ను ఘోర నరకములో పడకుండాచేశావా!" అంటూ శంకరునికి, ఆదిదంపతులకు మ్రొక్కాడు. "తల్లీ! మరల నీసాత్వికరూపాన్ని కళ్లారా చూస్తున్నాను" అని వారి పాదాలను అభిషేకించాడు. </span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;">🍁 సుందరేశ్వరుడన్నాడు "నాయనా పాండ్యరాజా! ఇకనీవు ఆవేదనపడద్దు. ఆదిశంకరుల శ్రీచక్రప్రతిష్ఠతో మీఇంటి ఆడపడుచైన మీనాక్షి ఇక రాత్రివేళ తామస శక్తిగామారదు. శ్రీచక్రమును దర్శించినా, స్పర్శించినా, న్యాయబద్ధమైన, యోగ్యమైన, అర్హతున్నవారికి సర్వకోరికలు నెరవేరుతాయి. ఈ తెల్లవారినుండే శ్రీచక్రార్చనకు నాందిపలుకుదాం. అమ్మవారి శ్రీచక్రము అమ్మవారి ప్రతిబింబం. శ్రీచక్రము ఎక్కడఉంటే అక్కడ అమ్మవారు కొలువైఉన్నట్టే. గృహాల్లో పవిత్రముగా ఉంచుకొని, నియమనిష్టలతోఉంటే ఫలితం కలుగుతుంది సుమా!" అన్నారు స్వామి.. పాండ్యరాజును అమ్మవారు ఆశీర్వదించినది. </span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;">🍁 ఆదిశంకరులు చిత్రించి, ప్రాణప్రతిష్ఠచేసిన శ్రీచక్రము మధురమీనాక్షి ఆలయములో భూమిలోకి వెళ్లి ప్రతిష్ఠితమైపోయింది. ఆ యంత్రప్రభావం కోటానుకోట్ల రెట్లు పెరిగిపోయి అదృశ్యంగా నిక్షిప్తమైంది. అర్హులైన భక్తులు ఆ యంత్రప్రాంతంలో మోకరిల్లి, నమస్కరిస్తే వారిహృదయంలో ప్రకంపనలుకల్పించి ఆశీర్వదిస్తుంది ఈయంత్రం. పాండ్యరాజు తన జన్మసార్ధకమైందని ఆనందించాడు. "నాయనా! శంకరాచార్యా, నీజన్మ ధన్యమైంది, నీవు కారణజన్ముడవు. మరేదైనా వరముకోరుకో!" అన్నది అమ్మవారు. "ఏ వరమూ వద్దుతల్లీ! నా నోటివెంట నీవుపలికించే ప్రతిస్తోత్రం లోనూ, మీస్మరణ ఎడతెగకుండా అక్షరరూపమై విరాజిల్లేటట్టుగా, ఆశ్లోకాలు భక్తి శ్రద్ధలతో పఠించే వారి జీవితాలు ధన్యమయేట్టుగా, నాకు ఈ వైరాగ్యం అచంచలముగా కొనసాగి, నా శరీరపతనం ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరిగేదీ, ఎవరికీ అంతుబట్టని విధముగాఉండాలి". </span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;">🍁 "నన్ను నీ పాదాలలో ఐక్యము అయిపోయేటట్లు ఆశీర్వదించు తల్లీ! అన్నాడు."అలాగే నాయనా! తథాస్తు" అన్నది అమ్మవారు. తెల్లవారింది. ఆలయంలో అమ్మవారు, స్వామివారు యధా స్థానాల్లో అర్చక మూర్తులుగా వెలిశారు. శంకరులు చేసిన శ్రీచక్ర నమూనాలు విశ్వకర్మలకు అందాయి.</span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;">సేకరణ...</span></p><p style="text-align: justify;"><span style="color: #800180; font-size: medium;"> 🍁🍁🍁🍁</span></p>visalakshihttp://www.blogger.com/profile/12353866459824269934noreply@blogger.com3tag:blogger.com,1999:blog-2640908686154358505.post-64370472519871306732021-10-14T23:06:00.008+05:302021-10-15T23:32:05.579+05:30నవనాధుల బోధ<p style="text-align: justify;"><span style="color: #ff00fe;">***భాగవతం లో నవనాధుల బోధ***</span></p><p style="text-align: justify;"></p><div class="separator" style="clear: both; text-align: center;"><a href="https://1.bp.blogspot.com/-qf2_QJtOTU0/YWhp9Ho7ooI/AAAAAAAACKY/JifAAh1eqPYLDBGUjkhKRSECaKnjDxc6QCLcBGAsYHQ/s394/20211005_181342.jpg" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="394" data-original-width="394" height="320" src="https://1.bp.blogspot.com/-qf2_QJtOTU0/YWhp9Ho7ooI/AAAAAAAACKY/JifAAh1eqPYLDBGUjkhKRSECaKnjDxc6QCLcBGAsYHQ/s320/20211005_181342.jpg" width="320" /></a></div><br /><span style="color: #ff00fe;"><br /></span><p></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">కవి, హరి, అంతరిక్షుడు , ప్రబుద్ధుడు , పిప్పలాయనుడు, అవిర్హోత్రుడు , ద్రమీళుడు , చమసుడు, కరభాజనుడు. వీరు తొమ్మిదిమంది </span><span style="color: #ff00fe;">బ్రహ్మవిద్యావిశారదులయ్యారు.వీరే నవనాధులు.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"> నవనారాయణాంశ సంభూతులే ఈ నవనాధులు . ఋషభ చక్రవర్తికి గల 100 మంది కుమారులలో నారాయణాంశ కలిగిన తొమ్మిది మందే ఈ నవనాథులు. సృష్టి అంతా పరమాత్మ స్వరూపమని ఎరిగి ముక్తులై అన్ని లోకాలలో సంచరిస్తుంటారు.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">వీరు భాగవతము ఏకాదశ స్కందము లో చేసిన బోధ..</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">ఈ తొమ్మిది మంది ఒకసారి జనకుని యజ్ఞం చూడడానికి వచ్చారు. జనకుడు వారిని పూజించి, ఉచితాసనాలిచ్చి గౌరవించాడు. తర్వాత '</span><span style="color: #ff00fe;">మీరు విష్ణుమూర్తిని ఎంతో భక్తిశ్రద్ధలతో భజించే గొప్ప తపోనిధులు,జీవన్ముక్తులు.' ఈ సంసారాలు పరమ సారం లేనివి. సామాన్య సంసారులకు ఆత్మజ్ఞానం ఎలా లభిస్తుంది?ముక్తి ఎలా పొందుతారు?అని ప్రశ్నించాడు. అప్పుడు జనక భూపాలునికి కవి ఇలా చెప్పాడు.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">కవి సంభాషణ ..</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">అంతేకాదు సకల రకాల జంతువుల జన్మల కంటే మానవ జన్మ శ్రేష్ఠమైనది, అది ప్రాప్తించటం కష్ట సాధ్యం. అందులోనూ శ్రీమన్నారాయణుని చరణయుగళ స్మరణంమీద ఆసక్తి కలగటం మరీ కష్టం. అందువలన, శాశ్వతమైన క్షేమాన్ని గురించి అడుగ వలసి వచ్చింది. ప్రపత్తి యందు నిష్ఠగల భక్తులకు పరమేశ్వరుడు శ్రీమహావిష్ణువు సారూప్యం ఎలా ఇస్తాడు, ఈ విషయం చెప్పండి.” అని అడిగిన విదేహరాజుతో శ్రీహరి కథామృతాన్ని త్రాగి పరవశులు ఐన ఆ మునులలో కవి అనే మహానుభావుడు ఈ విధంగా చెప్పటం మొదలుపెట్టాడు.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">“(1) అరిషడ్వర్గం అనే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు ఆరింటిలోను; ఈషణత్రయం అనే దారేషణ ధనేషణ పుత్రేషణ మూడింటిలోనూ; చిక్కుకుని మాత్సర్యంతో కూడిన మనసు కల మానవుడికి శ్రీహరి పాదపద్మాలను భజించే భాగ్యం ఎలా ప్రాప్తిస్తుంది?</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">(2) విశ్వము వేరు, ఆత్మ వేరు అని భావించే వాడికి భయం ఎలా లేకుండా పోతుంది?</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">(3) అట్లు అవిద్యాంధకారంలో మునిగితేలే వాడికి విష్ణుభక్తి ఎలా అలవడుతుంది?</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">(4) అటువంటి నరుడు మొదట శరీరాన్ని త్యజించి పరతత్వాన్ని ఏ విధంగా చేరుతాడు?</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">(5) కండ్లు మూసుకుని నడిచే మనిషి దోవలో తడబాటులు పడుతూ పోతున్నట్లుగా, విజ్ఞానంతో శుద్ధమైన హృదయంలో భక్తిభావన లేకుండా పోతే పరమపదం ఎలా సిద్ధిస్తుంది” అని అడిగావు. సమాధానాలు చెప్తాను శ్రద్ధగా విను. త్రికరణశుద్ధిగా అనగా మనసుతో, వాక్కుతో, కాయంతో చేసే ప్రతీ కర్మా “కృష్ణార్పణం” అని మనస్ఫూర్తిగా పలకటమే సుజ్ఞానము అని మహామునీశ్వరులు అంటారు. జ్ఞాన, అజ్ఞానాలలో కలత చెందుతుంటే స్మృతి వ్యత్యస్తమవుతుంది. కాబట్టి, గురువునకు దేవుడికి అనుగుణంగా నడచే బుద్ధిమంతుడైన నరుడు లక్ష్మీపతి ఐన విష్ణుమూర్తిని ఉత్తమోత్తముడైన పురుషోత్తముడిగా చిత్తంలో చేర్చి సేవించాలి. కలల యందు, కోరికల యందు, వాంఛల యందు సర్వసంకల్పాలు నాశనం అవుతాయి. కనుక, ఎట్టి పూనిక గట్టిగా నిలుబడదు. అందుచేత, వాటిని అణచుకుని ఎప్పుడూ శ్రీహరిని ధ్యానిస్తూ ఉండే వాడికి కైవల్యం చేతిలో ఉసిరికాయలాగ సులభంగా ప్రాప్తిస్తుంది. ఓ రాజా! సదా శ్రీకృష్ణ సంకీర్తనలు వీనులవిందుగా వినాలి; హరినామ కథనాన్ని సంతోషంతో ఆడుతూ పాడుతూ చెయ్యాలి; నారాయణుని దివ్యమైన నామాలను హృదయంలో సదా స్మరిస్తూ ఉండాలి; కమలనయనుని లీలలను అడవులలో చరిస్తున్నా భక్తియుక్తంగా పాడాలి; విశ్వమయుడిని వెఱ్ఱిగా కీర్తిస్తూ లోకానికి అంటీ అంటకుండా ఉండాలి; ఈ సృష్టి మొత్తం విష్ణుమయ మని తెలుసుకోవాలి; భేదబుద్ధి ఏ మాత్రమూ చూపరాదు.”అని మహాముని కవి చెప్పాడు</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">హరిమునిసంభాషణ ..</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">అంత, విదేహ (జనకమహారాజు)రాజు ఇలా అడిగాడు. “భాగవతధర్మ మేది? అది ఏ ప్రకారంగా ప్రవర్తిస్తుంది? భాగవతుల గుర్తు లేమిటి? ఇవి చెప్పటానికి మీరే తగినవారు.” దానికి వారిలో హరి అనే మహాముని ఇలా చెప్పసాగాడు. “భాగవతుడు అంటే ఆ హరి యందు భక్తీ ఆసక్తీ కలవాడు; సర్వభూతమయుడైన పద్మలోచనుడు శంఖం చక్రం దాల్చి తన ఆత్మలో ఉన్నాడనే విశ్వాసం కలవాడు. ఓ మహా రాజా విదేహ! భాగవతుడు చతుర్వర్ణాలు చతురాశ్రమాలు వాటి ధర్మాలు కర్మలు అంటూ వీటిలో మునిగిపోకుండా, భక్తిమార్గాన్ని ఆశ్రయించి, శ్రీహరి విశ్వం అంతా నిండి ఉన్నాడు అంటాడు. భాగవతోత్తముడు ఈ విధంగా సకల బంధాలను త్రెంపుకుని అన్నింటిలో పరమాత్మను గుర్తించినవాడై మెలగుతాడు. మహాప్రభువైన సూర్యుడు తన సహస్ర కిరణాలచేత ముల్లోకాలనూ పావనం చేయునట్లు, తన పాదధూళి చేత జగత్రయాన్నీ పవిత్రం చేస్తూ ఉంటాడు. దేవదానవులకు కూడా సేవింపదగిన జనార్ధునుని చరణారవిందాలకు నమస్కరించా లనే అభిలాష కలిగి ఉంటాడు. తన భక్తిని రవ్వంత కూడ చలించనీయక చంద్రుడు ఉదయించడంతో ఎండ బాధ పోయినట్లు నారాయణుని చరణకాంతుల వెన్నెలలచే భాగవతుడు హృదయతాపం పోగొట్టుకుంటాడు. ఉత్తమ భాగవతుడు తన భక్తి అనే బంధాలతో వాసుదేవుని చరణపద్మాలకు బంధించుకుని ధ్యానానందంలో పరవశిస్తూ ఉంటాడు.” ఈ విధంగా మహాముని తెలుపగా రాజు విదేహుడు ఇలా అన్నాడు. మహాత్ములారా! మీరు ఇంద్రియాలను జయించిన మహానుభావులు. మూడులోకాలను పరమ పవిత్రం చేసే, గజరాజవరదుడు శ్రీహరి గుణవిశేషాలను మనోరంజకంగా మీనుండి వినాలని నాకు వేడుక పుట్టింది.”</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">అంతరిక్షుసంభాషణ </span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">ఇలా పలికిన విదేహుని(జనకుని)తో అంతరిక్షుడు అనే మహర్షి ఇలా అన్నాడు.“పరబ్రహ్మ అన్నా; పరతత్వము అన్నా; పరమపదము అన్నా; ఈశ్వరుడు అన్నా; శ్రీకృష్ణుడు అన్నా; శ్రీమన్నారాయణుడే. ఆయనే జగద్భరితుడై ప్రకాశిస్తూ ఉంటాడు.అవ్యక్తమైన నిర్గుణ పరబ్రహ్మంనుండి తనకు ఇతరంగా కలిగే జ్ఞానాన్ని విష్ణుమాయ అంటారు. ఆ మాయ చేతనే ప్రపంచాన్ని నిర్మించి భగవంతుడు ఏ చింతా లేకుండా ఉంటాడు. ఇంద్రియాల వెంట తిరిగే చెడుబుద్ధి గలవారికి నిద్ర, స్వప్నం, మెలకువ అని మూడు అవస్థలతోపాటు పరమేశ్వరుని పొందలేకపోవటం అనే నాలుగో అవస్థ కూడ కలుగుతుంది. కలలో గ్రహింపదగినదీ గ్రహించేవాడూ గ్రహించటం అనే మూడు భేదాలుంటాయి. ఈ విధంగా అవిద్య అనే చీకటిచే చుట్టుకోబడి మూడువిధాలయ్యే కోరిక స్వప్నంలో అణిగిన విధంగా మూడువిధాలైన మాయ కూడా ఆత్మలో విలీనమవుతుంది.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">పరమేశ్వరుడు మొదట పృథివి, అగ్ని, జలం , వాయువు ఆకాశం అనే పంచభూతాలతో నిండిన సృష్టిని కలిగించాడు. అందులో పంచభూతాత్మకమైన ఆత్మకు పదకొండు ఇంద్రియములతో భేదం పుట్టిస్తూ గుణాలచేత గుణాలను అంగీకరిస్తూ ఆత్మ యందు వ్యక్తమైన గుణాలవల్ల గుణాలను అనుభవిస్తూ ఉంటాడు. సృష్టిని తనదిగా భావిస్తాడు. శరీరధారి పూర్వకర్మ మూలంగా నైమిత్తికాలైన కర్మలు చేస్తూ వాటి ఫలితాన్ని అంగీకరించి దుఃఖానికే వశుడై వర్తిస్తుంటాడు. అనేక దుఃఖాలలో మునిగిన ఆ దేహి కర్మఫలాన్ని పొందుతూ ప్రపంచానికి జలప్రళయం వచ్చే దాకా స్వేచ్ఛను కోల్పోయి, చావుపుట్టుకలలో పడి పొరలుతుంటాడు. కల్పాంత సమయంలో ద్రవ్యగుణాల స్వరూపమైన జగత్తును ఆద్యంతాలు లేని కాలం ప్రకృతిని పొందిస్తుంది.ఆ పైన నూరేండ్లు వానలులేక భయంకరమైన ఎండల వల్ల అన్నిలోకాలు తగలబడుతాయి. అటుపిమ్మట, అధోలోకంనుండి ఆదిశేషుని ముఖం నుంచి ఆవిర్భవించిన అగ్నిజ్వాలలు వాయు సహాయంతో లేచి దిక్కులంతటా వ్యాపిస్తాయి. ఆ తరువాత సంవర్తకాలనే మేఘాలు నూరేండ్లు ధారాపాతంగా వర్షం కురుస్తాయి. వానిలో విరాడ్రూపం విలీనమవుతుంది. అప్పుడు ఈశ్వరుడు కట్టెలలో అగ్నివలె అవ్యక్తాన్ని ప్రవేశిస్తాడు. అనంతరం భూమండలం తన గంధ గుణాన్ని కోల్పోయి జలరూపాన్ని ధరిస్తుంది. ఆ జలం రసాన్ని కోల్పోయి తేజో రూపాన్ని పొందుతుంది. ఆ తేజస్సు అంధకార నిరస్తమై రూపం పోయి వాయువులో అణుగుతుంది. ఆ వాయువు స్పర్శను పోగొట్టుకుని ఆకాశ మందు సంక్రమిస్తుంది. ఆకాశం శబ్దగుణాన్నిపోగొట్టుకుని ఆత్మ యందు అణగిపోతుంది. ఇంద్రియాలు మనస్సు బుద్ధి వికారాలతో అహంకారాన్ని ప్రవేశిస్తాయి. ఆ అహంకారం తన గుణములతో కలసి పరమాత్మను చేరుతుంది. ఈ విధంగా మూడువర్ణాలు కలిగిన సృష్టి స్థితి లయాలకు కారణమైన మాయ ఇటువంటిది” అని దాని స్వరూపమూ మాహత్య్మమూ వివరించగా విని విదేహరాజు ఇలా అన్నాడు. “మీరు లోకోత్తములు. సత్యవాక్య పరిపాలకులు. కనరాని మాయను లోపల అణచివేసి అజ్ఞానులు ఏ విధంగా వైకుంఠాన్ని చేరగలుగుతారు? ఈ విషయాన్ని దయతో చెప్పండి.” ఇలా అన్న విదేహునితో ప్రబుద్ధుడు అనే మహముని ఆదర పూర్వకంగా ఇలా అన్నాడు.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">ప్రబుద్ధునిసంభాషణ ..</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">ప్రతిదినము మానవుల ఆయువు, సూర్యుడు ఉదయించడం అస్తమించటంతో, క్షీణిస్తుంటుంది. దేహంపైనా, భార్యపైనా, స్నేహితులపైనా, సోదరులపైనా నాది, నావారు అనే మమకారంతో కట్టుబడిపోతారు. ఆ బంధం నుంచి విడివడే ఉపాయం కనపడక సంసార మనే చీకటిలో మునిగి భూత భవిష్యత్తులు తెలియక గుడ్లగూబల లాగా మానవులు పుట్టుక ముసలితనం రోగాలు ఆపదలు చావు పొందుతూ కూడ శరీరమే మేలనుకుంటూ ఉంటారు. మోహాన్ని కలిగించే మద్యపానంతో మత్తులై ఇంద్రియవిషయ ఆసక్తులై తమ్ము తాము తెలుసుకోలేక విరక్తిమార్గం తెలియక నడయాడుతుంటారు అటువంటి మూఢులైన మానవుల సమీపానికి పోవలదు. కేవలం నారాయణుని పైన భక్తిభావం గల సద్గురువును నిత్యము భజించి ఉత్తమమైన భాగవతధర్మాలను అనుష్టించాలి. ఆ ధర్మాలు ఏవంటే:</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">1. మూఢుల పొంతల పోకపోవుట; 2, సద్గురు ప్రతిదిన భజనము; 3. సత్త్వగుణము కలిగి ఉండటం; 4. భూతదయ; 5. హరికథామృత పానం; 6. బ్రహ్మచర్య వ్రతం; 7. ఇంద్రియ సుఖాలందు మనస్సును చేరనీయ కుండటం; 8. సాధుసంగమం; 9. సజ్జనులతో స్నేహం; 10 వినయ సంపద; 11. శుచిగా ఉండటం; 12. తపస్సు; 13 క్షమ; 14. మౌనవ్రతం; 15. వేదశాస్త్రాలను చదవటం వాటి అర్ధాన్ని అనుష్ఠించటం; 16. అహింస; 17. సుఖాన్నిగాని దుఃఖాన్నిగానీ సహించటం; 18. ఈశ్వరుడు అంతటా ఉన్నట్లు భావించటం; 19. మోక్షం పొందాలనే కోరిక; 20. కుజనుల సంగతి వదలటం; 21. వల్కలాలు మొదలైనవి కట్టడం; 22. దానంతట అది లభించిన దానితో సంతుష్టి చెందటం; 23. వేదాంతశాస్త్రాల అర్ధాలను తెలుసుకోవా లనే కుతూహలం; 24. ఇతర దేవతలను నిందించకుండా ఉండటం; 25. త్రికరణసుద్ధి; 26. సత్యమే పలకటం; 27. శమం దమం మొదలైన గుణవిశేషాలు; 28. ఇల్లు తోటలు పొలాలు భార్య సంతానం ధనం మొదలైనవాటిని పరమేశ్వరార్పణం గాభావించటం; 29. భక్తులు కాని వారిని ఆశ్రయించకుండా ఉండటం.” అని చెప్పి పిమ్మట... మహారాజ! హరిభక్తులతో స్నేహంచేస్తూ హరిలీలలను తలచుకుంటూ కన్నులలో ఆనందబాష్పాలు నిండగా ఒళ్ళు పులకరిస్తుండగా మానవుడు హరిమాయను గెలుస్తాడు.”అనగా ఆ విదేహచక్రవర్తి వాళ్ళతోఇలాఅన్నాడు. “భాగవతులారా! సమస్త లోకాలకూ ప్రభువై నారాయణుడనే నామంతో అలరారే పరమాత్ముని ప్రభావాన్ని వినాలనుకుంటున్నాను ఆనతీయండి.” అంటే పిప్పలాయను డనే మునీంద్రుడు ఇలా అన్నాడు.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">పిప్పలాయనభాషణ </span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">“రాజా! విను నీకింపు కలిగే విధంగా లోకేశ్వరుని చరిత్ర చెబుతాను. సృష్టి స్థితి లయలకు కారణమైన పరంజ్యోతి స్వరూపం దేహేంద్రియాలలో స్థిరంగా ప్రవేశిస్తుంది మంటలు అగ్నిలోపల ప్రవేశింపలేనట్లు, ఇంద్రియాలు ఆత్మను ఆక్రమించలేవు. నాదం పిల్లనగ్రోవిని లోగొన లేదు కదా. సత్త్వము రజస్సు తమస్సు అనే గుణత్రయం మహదహంకార రూపమై చైతన్యంతో కలిస్తే జీవమంటారు. ఇదే సత్తు అసత్తు స్వరూపంగా ఎన్నబడుతుంది. ఇందుకు అతీతమైన దాన్ని పరమాత్మగా తెలుసుకుని బ్రహ్మ మొదలైనవారు స్తుతిస్తారు. ఇటువంటి పరమాత్మ స్థావరజంగమాలను అధిష్టించి వృద్ధిక్షయాలు పొందక నిమిత్రమాత్రంగా చెట్లు తీగలు మొదలైనవాని లోపల వర్తిస్తుంటాడు. సర్వేంద్రియాలచే ఆవరించబడిన ఆకారము పోగా మనస్సును వదలి శ్రుతి విరహితుడై తిరుగుతుంటాడు. నిర్మలమైన జ్ఞానదృష్టి కలవాడు సూర్యుని కాంతి పుంజం దర్శించినట్లు. సుజ్ఞాని అయినవాడు హరిభక్తిచేత గుణకర్మార్థములైన చిత్త దోషాలను నశింపజేసి ఈశ్వరుని చేరుకోగలుగుతాడు.” అంటే విని విదేహుడు ఇలా అన్నాడు. “మహర్షిపుంగవ! పురుషుడు ఏయే కర్మలను ఆచరిస్తే పుణ్యుడై పాపాలను పోగొట్టుకుని మురారి పాదాలను చేరుకోగలుగుతాడో చెప్పండి.”</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">ఆవిర్హోత్రుని భాషణ ..</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">అలా అడుగగా ఆవిర్హోత్రుడనే మహాముని విదేహప్రభువుతో ఈ విధంగా చెప్పసాగాడు. “కర్మ అకర్మ వికర్మ వీటిని ప్రతిపాదించే శ్రుతివాదులు లౌకికులు చెప్పినవి కాదు. అటువంటి వేదాలు సర్వేశుని స్వరూపాలు వాటిని పండితులు కూడ తెలుసుకోలేరు. వాటిని కర్మాచారాలు అంటారు. మోక్షంకోసం నారాయణ భజనం అన్నిటి కంటే పవిత్రమైనది. వేదం చెప్పినట్లు చేయక ఫలాలు కోరేవారు ఎన్నో జన్మలు ఎత్తుతారు. మోక్షాన్ని కోరేవారు శాస్త్రం చెప్పినవిధంగా హరిని పూజించాలి. ఆ పూజావిధానం ఎటువంటిదంటే పరిశుద్ధమైన దేహంతో భగవంతుని సన్నిధిలో పవిత్రచిత్తుడై ప్రవర్తించాలి. షోడశోపచారాలతో చక్రధరుని ఆరాధించాలి. గంథం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం అర్పించి సాష్టాంగదండప్రణామాలు చేయాలి. విశేషమైన భక్తిభావం మనసున నింపుకోవాలి. అట్టివాడు పరమాత్మను జేరుతాడు.” అని వివరించగా విని విదేహమహారాజు ఇలా అన్నాడు. “ఈశ్వరుడు ఏ లీలలు ఆచరించాడు. ఆ వివరం అంతా తెలుపవలసింది.” అనగా ద్రమిళుడనే మునివర్యుడు ఇలా అన్నాడు. రాజా ఆకాశంలోని చుక్కలను లెక్కపెట్టవచ్చు. భూమిపై గల ఇసుక రేణువులను కూడ లెక్కపెట్టవచ్చును. కానీ నారాయణుని గుణములు చరిత్రలను మాత్రం శివుడు బ్రహ్మ మొదలైనవారు కూడ వర్ణించ లేరు.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">భగవంతుడు తాను సృష్టించిన పంచభూతాలతో సంభూతమైన పురమును చేసి, దానిలో తన అంశతో ప్రవేశించి పిమ్మట సగుణనిష్ఠుడై నారాయణుడు అను పేరు కల ఋషీశ్వరుడుగా విరాజిల్లాడు. ఆయన పది ఇంద్రియాలతో నిర్మితాలైన శరీరాలను దాల్చి జగత్తును సృష్టించటం రక్షించటం సంహరించటం మొదలైన కార్యాలు చేయటం వలన రజస్సత్త్వతమోగుణాలతో బ్రహ్మ, విష్ణు, రుద్రుడు అనే పేర్లతో ఒప్పుతుంటాడు. త్రిగుణాత్మకుడు అనబడే ఆ నారాయణుని చరిత్ర చెబుతాను విను.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">నారయణఋషి భాషణ ..</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">బదరీకాశ్రమంలో ధర్ముడు దక్షపుత్రికను పెండ్లాడాడు. ఆ దంపతులకు సత్కర్ముడు పరిశుద్ధుడు ఐన నారాయణఋషి జన్మించాడు. ఆ నారాయణముని బదరికాశ్రమంలో అపారమైన నిష్ఠతో తపస్సు చేయసాగాడు ఆయన తపస్సుకు ఇంద్రుడు భయపడి తపోభంగం నిమిత్తం మన్మథుడిని అప్సరసలను పంపించాడు. ఆ ప్రకారం వారు నారాయణాశ్రమానికి అతని తపస్సును భగ్నంచేయడానికి వచ్చారు. ఆ తపోవనం మామిడి, మద్ది, మారేడు, అరటి, ఖర్జూరం, నేరేడు, నిమ్మ, చందనం, సురపొన్న, మందారం మొదలైన అనేక వృక్షాలతో నిండి ఉన్నది. పూలతో, పండ్లతో కొమ్మలు క్రిందికి వంగి ఉన్నాయి. గురువింద పొదల పూలగుత్తుల మకరందం త్రాగి మదించిన తుమ్మెదలు చేసే ఝంకారాలతో దిక్కులు నిండిపోతున్నాయి. బంగారు పద్మాలు, కలువలు, ప్రకాశించే సరస్సులలో జక్కవలు, కొంగలు, క్రౌంచ పక్షులు, హంసలు జంటజంటలుగా విహరిస్తున్నాయి. తామరతూళ్ళను తినుటం కోసం సారసపక్షులు ముక్కులతో చీల్చబడిన తామర మొగ్గలలోని కేసరాలతో సరోవరాలు భాసిస్తూ ఉన్నాయి. అటువంటి తపోవనంలో ఆ చంద్రముఖులైన అప్సరసలు నెమ్మదిగా నడుస్తూ చెమట బిందువులను కొనగోళ్ళతో చిమ్ముకుంటూ నారాయణమహర్షిని సమీపించారు. ఆ సమయంలో నారాయణఋషి మన్మథుని బాణాలకు లొంగ లేదు. ధైర్యము విడువలేదు. ఆ కాంతల వాడి చూపులకు మోహము పొంద లేదు. ఏమాత్రం చలించక తన హృదయంలో అచ్యుతుడు, అనంతుడు, జగన్నివాసుడు, రమేశుడు అయిన శ్రీహరిని నిశ్చలభక్తితో మనసున నిలుపుకుని ఉన్నాడు. ఆయన వారితో ఇలా అన్నాడు. “పద్మముఖులార! ఇంద్రుడు పంపగా మీరు వచ్చారు. ఇక్కడ విహరించాలనే కోరిక ఉంటే మీ ఇష్టంవచ్చినట్లు తిరగండి.” అనేటప్పటికి వాళ్ళంతా సిగ్గుపడి ఆ మహర్షితో ఇలా అన్నారు. “దేవమునీంద్రా! నీ దివ్యమైన చరిత్ర గ్రహించి స్తుతించటానికి ఎవరికి సాధ్యం అవుతుంది. పుత్రులు, మిత్రులు, భార్యలు మొదలైన భోగాలను వదలి తపస్సు చేసే సద్ధర్మ పరులకు విఘ్నాలు కలుగుతాయా? జగదీశ్వరుడిని కొలిచేవారికి ఆటంకాలు ఉంటాయా? కామం క్రోధం కలిగిన తాపసుల తపస్సు బురదగుంటలోని నీటి వంటిది కదా. ఓ నిర్మలాత్మా! నిన్ను వర్ణించడం మాతరం కాదు. మా తప్పులు క్షమించు.” అని నుతించారు. అంత నారాయణమహర్షి ప్రసన్నుడై తన సామర్ధ్యాన్ని తెలియజేయాలని అనుకున్నాడు.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">ఆ మునిశ్రేష్ఠుడు అందరూ ఆశ్చర్యపోయేలా తన రోమకూపాల నుండి మూడుకోట్ల కన్యకలను పుట్టించాడు. అది చూసిన ఆ అప్సరసలు అత్యంత ఆశ్చర్యంతో భయంతో ఆ మహర్షిని స్తుతించారు. ఆ అందగత్తెలలో నుండి ఊర్వశి అనే ఒక సుందరాంగిని తీసుకుని వెళ్ళి జరిగినదంతా ఇంద్రునికి చెప్పారు. మునిశక్తికి వెరగుపడిన ఇంద్రుడు మిన్నకున్నాడు. అటువంటి నారాయణముని చరిత్ర వినే వాళ్ళు మిక్కిలి శుభకరమైన గుణాలను పొందుతారు.”</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">ఋషభునకు ఆత్మయోగాన్ని ఈవిధంగా ఉపదేశించిన అచ్యుతుడు విష్ణువు భూభారాన్ని అణచుటకు ఎన్నోఅవతారాలెత్తి పట్టుదలతో దుర్మార్గులు అయిన రాక్షసులను సంహరించాడు.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">అటువంటి పరమేశ్వరుడు లీలావిలాసంగా గ్రహించిన అవతారాలు మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ రఘురామ బలరామ బుద్ధ కల్కి అనే దశావతారాలే కాదు ఇంకా ఎన్నో ఉన్నాయి. వాటిని తెలిసి స్తుతించటం బ్రహ్మదేవుడికైనా, ఆదిశేషునికైనా అలవి కాదు.” అని పలికి శ్రీహరిని ఇలా స్తుతించాడు. “నవవికసిత పద్మములవంటి కన్నుల జంట కలవాడ! హరి! పాదము మూలము లందు ఆకాశగంగ పుట్టినవాడ! వేదములచేత పొగడబడు వాడ! లక్ష్మీదేవి యొక్క కలశముల వంటి వక్షోజాలకు అలరుతుండెడి కస్తూరి పరిమళాలు అంటిన హృదయం కలవాడ! భూమిని మోసిన వాడ! బ్రహ్మదేవుడు మున్నగు దేవతలు సంస్తుతించు వాడ! నడుము నందు బంగారచేలము ధరించినవాడ! గరుత్మంతుడు వాహనముగా కలవాడ! కైలాసపతి శంకరునిచే నుతింపబడు వాడ! నిరంతర జపం చేసే వారి యందు ఆసక్తి కలవాడ! నియమబద్ధమైన చరిత్ర కలవాడ! మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ బలరామ రామ కృష్ణ కల్కి అను దశావతారములను దాల్చినవాడ! గజేంద్రవరదా! మునులు నరులు సురలు గరుడులు మున్నగు వారిచే పొగడబడు వాడ!” ఇలా హరిస్తుతి చేసి ఇలా అన్నాడు. “ఈ విధంగా ప్రవర్తిల్లిన శ్రీమన్నారాయణమూర్తి లీలావిలాసములు లెక్కపెట్టలేనన్ని ఉన్నాయి. మనోవాక్కాయకర్మలా హరిపూజ చేయకుండా విపరీత మార్గాలలో తిరుగుతూ ఉండే మూఢులకు ఏవిధంగానూ సద్గతి కలుగదు.” అని మహాముని అనగా ఆ మహారాజు ఆ పరమపురుషులతో “అటువంటి మూర్ఖులు ముక్తిపొందే ఉపాయం తెలియ జెప్పండి.” అని అడిగాడు. వారిలో చమసు డనే మునిముఖ్యుడు విదేహుడితో ఇలా అన్నాడు.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">విష్ణుమూర్తి ముఖం బాహువులు తొడలు పదములు వీటి యందు వరుసగా నాలుగువర్ణాలు పుట్టాయి. అందులో స్త్రీలు శూద్రులు హరిని తలుస్తారు. కలికాలంలో విప్రులు వేద శాస్త్ర పురాణాలందు ప్రసిద్ధులై, కర్మలుచేస్తూ గర్వంతో హరిభక్తులను అపహాస్యం చేస్తారు. వారు నరకానికి పోవటం ఖాయం. స్వచ్ఛమైన పక్వాన్నం భుజించుట మాని మాంసాహారులై జీవహింసకు పాల్పడేవాడికి పాపం తగులుతుంది. శ్రీహరిని నుతింపక స్త్రీలోలు డైనవాడికి ఎప్పుడూ నరకమే నివాసం. అందుచేత, ఇండ్లు పొలాలు, సంతానం, భార్య, ధనం, ధాన్యం మున్నగు వాటిమీద వ్యామోహంతో మోక్షం కంటికి కనపడేదికాదు. కనుక లేదని నిందించే వారు; హరిభక్తి లేనివారు దుర్గతిలో కూలిపోతారు.” అని మునిశ్రేష్ఠుడు అనగా విదేహుడు ఇలా అడిగాడు.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">“అవ్యయుడు, జగన్నాథుడు అయిన విష్ణుమూర్తి ఏ యుగంలో ఏ రీతిగా ఉన్నాడు? ఏ రూపం ధరించాడు? ఏ విధంగా మునులచేత, దేవతలచేత కీర్తించబడ్డాడు?”అని అడుగగా విని వారిలో కరభాజనుడనే ఋషి విదేహరాజుతో ఇలా అన్నాడు. ఎన్నో అవతారాలు; ఎన్నెన్నో రూపాలు; అనేక రకాల వర్ణాలు ధరించి రాక్షసులను సంహరించి; దుష్టశిక్షణం శిష్టరక్షణం కావించే శ్రీ మహవిష్ణువు…</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">కృతయుగంలో తెల్లని రంగుతో నాలుగుచేతులు కలిగి ఉంటాడు; జడలు నారచీరలు జింకచర్మం జపమాలిక దండం కమండలము దాల్చి నిర్మలమైన తపస్సు ధ్యానము అనుష్టానము గల మునిశ్రేష్ఠులచేత హంసుడు, సుపర్ణుడు, వైకుంఠుడు, ధర్ముడు, అమలుడు, యోగీశ్వరుడు, ఈశ్వరుడు, పురుషుడు, అవ్యక్తుడు, పరమాత్ముడు అనే దివ్య నామాలతో ప్రశంసింపబడుతూ ప్రసిద్ధి చెందుతాడు.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">త్రేతాయుగంలో ఎఱ్ఱనిరంగుతో, నాలుగుచేతులు బంగరురంగు జుట్టు కలిగి, మూడు పేటల మేఖలలు ధరించి, మూడువేదాల ఆకృతి ధరించి, స్రుక్కు స్రువము మొదలైన ఉపలక్షణాలతో శోభిల్లుతూ; విష్ణువు, యజ్ఞుడు, పృశ్నిగర్భుడు, సర్వదేవుడు, ఉరుక్రముడు, వృషాకపి, జయంతుడు, ఉరుగాయుడు అనే పేర్లతో బ్రహ్మవాదులచేత నుతింపబడతాడు.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">ద్వాపరయుగంలో నీలవర్ణంతో, పసుపుపచ్చని బట్టలు కట్టుకుని, రెండు చేతులతో, దివ్యమైన ఆయుధాలు పట్టుకుని, శ్రీవత్సం కౌస్తుభం వనమాలికల ప్రకాశిస్తూ; మహారాజ లక్షణాలు కలిగి జనార్ధునుడు, వాసుదేవుడు, సంకర్షుణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, నారాయణుడు, విశ్వరూపుడు, సర్వభూతాత్మకుడు మున్నగు పేర్లతో వెలసి చక్రవర్తులచేత సన్నుతించబడతాడు.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">కలియుగంలో నల్లనిరంగుతో కృష్ణుడు అనుపేరు కలిగి, భక్తులను రక్షించడానికి పుండరీకాక్షుడు యజ్ఞములందు కీర్తించబడతాడు. అప్పుడు ఆయనను హరి, రాముడు, నారాయణుడు, నృసింహుడు, కంసారి, నళినోదరుడు మున్నగు పేర్లతో బ్రహ్మవాదులైన మునీంద్రులు స్తుతిస్తూంటారు. ద్రావిడదేశంలో తామ్రపర్ణి, కావేరి, కృతమాల మొదలైన నదులలో భక్తితో స్నానంచేసి తర్పణంచేస్తే మానవులకు పుణ్యం కలుగుతుంది.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">ఈవిధంగా ప్రశంసించదగిన కావేరి మున్నగు మహనదుల పావనజలాలలో స్నానం చేయటంలోను, దానాలు చేయటంలోను, విష్ణుధ్యానంలోను, హరికథామృత రసానుభవంలోను నిష్ణాతులైన భాగవతోత్తములు చెడని పరమపదాన్ని పొందుతారు” అని చెప్పారు. భగవంతుని ప్రతిబింబాలయిన పరమపురుషుల వంటి వారైన ఋషభకుమారులు, విదేహమహారాజుకి మోక్షపదంపొందే భగవద్భక్తి ధర్మాలను ఉపదేశించి అంతర్ధానమైపోయారు. మిథిలాపతి విదేహుడు జ్ఞానయోగాన్ని అంగీకరించి నిర్వాణపదాన్నిపొందాడు. ఈ విదేహ ఋషభ ఉపాఖ్యానాన్ని వ్రాసినా చదివినా విన్నా ఆయువు ఆరోగ్యము ఐశ్వర్యమూ కలిగి, పుత్రపౌత్రాభివృద్ధి కలిగి సమస్తమైన కలికల్మషాలు నశించి విష్ణులోకంలో నివసిస్తారు.” అని నారదుడు వసుదేవుడికి చెప్పి ఇంకా ఇలా అన్నాడు. “వసుదేవా! కమలలోచనుని కథలు విన్నావు కనుక, నీ పాపాలు తొలగిపోయాయి. లోకంలో నీ యశస్సు ప్రఖ్యాత మౌతుంది. అనంతరం నీకు కైవల్యం సిద్ధిస్తుంది. శ్రీకృష్ణుడు నీ కుమారుడనే మోహాన్ని విడిచిపెట్టి విష్ణువుగా తెలిసి సేవించు. అతడు నీ కొడుకై అవతరించటం వలన నీవు పరిశుద్ధుడవు అయ్యావు. అతనితో సరససల్లాపాలు జరుపుతూ చక్కని అనురాగం పెంచుకోవటంవలన నీవు పవిత్రుడవు అయ్యావు. శిశుపాలుడు, పౌండ్రకుడు, నరకుడు, మురాసురుడు, జరాసంధుడు, కాలయవనుడు వాసుదేవునితో వైరం పెట్టుకుని కూడ ముక్తిని పొందారు. బ్రహ్మదేవుడు మొదలగు దేవతలు ప్రార్థించగా, దుష్టజనులను శిక్షించడానికి; శిష్టజనులను రక్షించడానికి; శ్రీహరి భూమిమీద అవతరించాడు. ఈ విధంగా జగత్తును రక్షించటం కోసమే భగవంతుడు కృష్ణుడుగా అవతరించాడు.” అని హరిభక్తి పరాలైన ఉపాఖ్యానాలను నారదుడు చెప్పగా విని దేవకీ వసుదేవులు విస్మయం చెందారు. శ్రీకృష్ణుని పరమాత్మగా భావించారు.......సేకరణ......</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"> సర్వం శ్రీ సాయి నాధార్పణ మస్తు....</span></p>visalakshihttp://www.blogger.com/profile/12353866459824269934noreply@blogger.com2tag:blogger.com,1999:blog-2640908686154358505.post-84761164121611572182021-09-27T22:39:00.000+05:302021-09-27T22:39:38.053+05:30మృత్యుంజయుడు - శ్రీ సాయి బాబా<p></p><div style="text-align: center;"><span style="color: #ff00fe; font-size: large;">ఓం శ్రీ ద్వారకామాయి యే నమో నమః</span></div><div style="text-align: center;"><span style="color: #ff00fe; font-size: large;"><br /></span></div><div style="text-align: center;"><a href="https://1.bp.blogspot.com/-3iYbUn4uKzs/YVFYxCjp_-I/AAAAAAAACJk/oxbd1-gkXAAZyMIPHFWyPluIQs8Tm3f9QCLcBGAsYHQ/s496/25665.jpg"><span style="color: #ff00fe; font-size: large;"><img border="0" data-original-height="496" data-original-width="240" src="https://1.bp.blogspot.com/-3iYbUn4uKzs/YVFYxCjp_-I/AAAAAAAACJk/oxbd1-gkXAAZyMIPHFWyPluIQs8Tm3f9QCLcBGAsYHQ/s16000/25665.jpg" /></span></a></div><div style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;"><br /></span></div><div style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;">"నీ ఆలోచనలకు, లక్ష్యాలకు నన్నే ముఖ్య కేంద్రంగా చేసుకో! పరమార్థం లభిస్తుంది. అచంచల విశ్వాసంతో గురువును ఎప్పుడూ అంటిపెట్టుకొనిఉండు..అదిచాలు!"...శ్రీసాయిబాబా.</span></div><div style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;"><br /></span></div><div style="text-align: justify;"><span style="font-size: large;"><span style="color: #ff00fe;">మానవునిలో సమతను, మమతను పెంపొందించి మనిషిని దివ్యునిగా రూపొందించగల మార్గమైన 'మతమే' తద్విరుధ్ధమైన పాశవిక పైశాచిక ప్రయోజనాలకు సాధనం కావడమే నిజమైన 'ధర్మగ్లాని'! అంటే ధర్మానికి పట్టిన జబ్బు! </span><span style="color: #ff00fe;">సమాజంలో ఈ ధర్మగ్లాని ముదిరి శృతిమించి రాగాన పడే సమయంలో మానవాళికి సన్మార్గాన్ని చూపటానికి </span></span></div><div style="text-align: justify;"><span style="font-size: large;"><span style="color: #ff00fe;">అవతార పురుషులుదయిస్తారు. </span><span style="color: #ff00fe;">ధర్మగ్లాని ని మాన్పి లక్షలాది మందిని శుభమార్గంలో నడిపించడానికి ఈ యుగంలో అవతరించిన యుగపురుషుడు </span><span style="color: #ff00fe;">శ్రీ సాయి బాబా.</span></span></div><div style="text-align: justify;"><div><span style="color: #ff00fe; font-size: large;"><br /></span></div><div><span style="color: #ff00fe; font-size: large;">శ్రీ రామకృష్ణ పరమహంస, శ్రీ రమణ మహర్షి మొదలైన మహాత్ములు సర్వ మతాల సారం ఒక్కటేనని అన్ని భేదాలకు అతీతమైన ఆధ్యాత్మికానుభూతే పరమ సత్యమని బోధించేవారు. వారు 'జన్మతః' ఒక మతానికి చెందిన వారు అని తెలియటం చేత, ఇతర మతస్తులకు వారి హితవు అంతగా చెవికెక్కకపోవడం చూస్తాం. ఆ మహాత్ముల దివ్యసందేశాన్ని ఆచరించడానికి బదులు వారు మా మతానికి చెందినవారని చాటుకొని గర్వించడానికి మాత్రమే ఆ మత అనుయాయులు ఉపయోగించుకోవడం కూడా చూస్తున్నాం. </span></div><div><span style="color: #ff00fe; font-size: large;"><br /></span></div><div><span style="color: #ff00fe; font-size: large;">అందుకే శ్రీ సాయి తమ జన్మ వివరాలను ఒక 'దేవరహస్యంగా'ఉంచారు. సర్వమతాలలోని శ్రేష్ఠ లక్షణాలు ఆయనలో మూర్తీభవించి గోచరిస్తాయి.</span></div><div><span style="color: #ff00fe; font-size: large;"><br /></span></div><div><span style="color: #ff00fe; font-size: large;">ఈ సామరస్యం ఎంత అద్భుతంగా ఆయనలో ఇమిడిందంటే..,వివిధ మతాల ఛాందసవాదులు కూడా ఏమాత్రం సంకోచం లేకుండా ఆయనను 'తనవాడిగా' అనుకునేంత కనిపిస్తుంది. "ఇది మానవాళి ఆధ్యాత్మిక చరిత్రలోనే అపూర్వం." మతవిద్వేషాగ్నిలో సమిధలవుతున్న మనలోని అరిషడ్వర్గాలను , స్వార్ధపరత్వాన్నీ తమ జ్ఞానాగ్ని అనే 'ధుని'లో భస్మం చేసి ,దానికి ఫలమైన మహిమాన్వితమైన "ఊదీ"ని మనకు ప్రసాదిస్తున్నారు శ్రీ సాయి. శ్రీ సాయి అద్భుత తత్వమిది..</span></div><div><span style="color: #ff00fe; font-size: large;"><br /></span></div><div><span style="color: #ff00fe; font-size: large;">శ్రీ సాయి బాబా అవతార కార్యంలో ప్రధాన అంశమైన ఈ సర్వమత సమరస భావాన్ని త్రికరణశుధ్ధిగా ఆచరించనిదే ఎప్పటికీ మనం సాయి భక్తులవలేము.</span></div><div><div class="separator" style="clear: both; text-align: center;"><a href="https://1.bp.blogspot.com/-ZHThcw_qhe4/YVH3vNPvHTI/AAAAAAAACJs/lfdbYvGKEwAgeG_o9lGjtocq5cOvpXezACLcBGAsYHQ/s2048/20210630_074847.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><span style="color: #ff00fe; font-size: large;"><img border="0" data-original-height="2048" data-original-width="1310" height="320" src="https://1.bp.blogspot.com/-ZHThcw_qhe4/YVH3vNPvHTI/AAAAAAAACJs/lfdbYvGKEwAgeG_o9lGjtocq5cOvpXezACLcBGAsYHQ/s320/20210630_074847.jpg" width="205" /></span></a></div><span style="color: #ff00fe; font-size: large;"><br /><span><br /></span></span></div><div><span style="color: #ff00fe; font-size: large;"><br /></span></div><div><span style="color: #ff00fe; font-size: large;"><span>ఈశ్వరుడు తప్ప తక్కి</span>నదంతయు మృతమే. మృతమనగా చచ్చినది అని అర్ధం . మరణం మరు జన్మకు బీజకారణం. మరుజన్మ లేక పోవుటకు అమృతమని పేరు. దుఃఖించుచూ చనిపోయిన మనకు దుఃఖించెడి జన్మమే కలుగును. ఆనందంగా ప్రాణత్యాగం కావించిన ఆ స్థితికి అమృతమని పేరు.మృతము గాక అమృతము నొసగునది ఈశ్వరుడు.</span></div><div><span style="color: #ff00fe; font-size: large;"><br /></span></div><div><span style="color: #ff00fe; font-size: large;">మోక్షం అనగా విడివడుట.</span></div><div><span style="color: #ff00fe; font-size: large;">తగులుకున్నవాడు దాని నుండి</span></div><div><span style="color: #ff00fe; font-size: large;">తప్పించుకొనుటయే మోక్షం.. </span></div><div><span style="color: #ff00fe; font-size: large;"><br /></span></div><div><span style="color: #ff00fe; font-size: large;">"నా గురువు నన్ను ఈ దేహంనుండి ఏనాడో విడుదల చేసాడు." అని శ్రీ సాయి బాబా చెప్పింది ఇటువంటి జీవన్ముక్తి గురించే.</span></div><div><span style="color: #ff00fe; font-size: large;"><br /></span></div><div><span style="color: #ff00fe; font-size: large;">ఒక సందర్భంలో బాబా "నన్ను ప్రసవించినప్పుడు తనకు కుమారుడు కలిగి నందుకు నా తల్లి ఎంతో ఉప్పొంగిపోయింది. నా మటుకు నాకు ఆమె సంతోషం చూసి ఆశ్చర్యం వేసింది. నిజానికి నన్ను ఆమె కన్నదెప్పుడు? అసలు నాకు పుట్టుక ఉన్నదా? అంతకు ముందు మాత్రం నేను లేనా? అని అన్నారు. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు. "జాతస్యహి మరణం ధృవం". అయితే జననమే లేని శ్రీ సాయికి మరణం మాత్రం ఎక్కడిది?</span></div><div><span style="color: #ff00fe; font-size: large;"><br /></span></div><div><span style="color: #ff00fe; font-size: large;">1886 లో శ్రీ సాయి "భగత్ !నేను అల్లా వద్దకు వెళుతున్నాను. నీవు నిర్జీవమైన ఈ దేహాన్ని భద్రపరచమని మహల్సాపతికి చెప్పి దేహత్యాగం చేసి అనగా వారు సూక్ష్మ శరీరాన్ని వేరు చేయడం ద్వారా 72గంటలపాటు అనగా 3రోజులు నిర్వికల్ప సమాధి స్థితిలో ఉన్నారు. 3రోజుల తరువాత తిరిగి తన దేహంలో ప్రవేశించి ,ఆ తరువాత సుమారు 32 సం"లు అదే దేహంతో సంచరించిన శ్రీసాయికన్నా మృత్యుంజయుడెవరు?</span></div><div><span style="color: #ff00fe; font-size: large;"><br /></span></div><div><span style="color: #ff00fe; font-size: large;">సాయి అంటే ఒక శరీరం కాదు అని, శరీరాన్ని ధరించిన దివ్యశక్తి..ఆత్మజ్యోతి అనిమనం గ్రహించాలి.బాబాయొక్క మృత్యుంజయత్వం కేవలం తన దేహానికే పరిమితం కాదు. అన్ని విధాలా ఆశలు పూర్తిగా వదులుకొని ఇక జీవించడం అసంభవం అనుకున్న ఎందరో భక్తులను మృత్యుముఖం నుండి బాబా రక్షించారు. తన భక్తులను మృత్యువు నుండి రక్షించే సందర్భాలలో ఏదో అదృశ్యశక్తితో ఘర్షణ పడుతున్నట్లు తిడుతూ, బెదిరిస్తూ , అదిలిస్తూ..బాబా చేసే చర్యలు....తన భక్తుడయిన మార్కండేయుని ప్రాణం రక్షించడానికి ఆ ముక్కంటి మృత్యుదేవతతో పోరాటానికి సిధ్ధమయ్యాడని చెప్పే పురాణకధలను స్మృతికి తేక మానవు.</span></div><div><span style="color: #ff00fe; font-size: large;"><br /></span></div><div><span style="color: #ff00fe; font-size: large;">బాబా మృత్యుంజయుడు కనుకనే "నా సమాధి నుండి కూడా నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాను. నా నామం పలుకుతుంది. నా మట్టి సమాధానమిస్తుంది." అని హామీ ఇచ్చి ఆ హామీని ఇప్పటికీ నెరవేరుస్తున్నారు. అందుకే శ్రీ సాయినాధుని కన్నా మృత్యుంజయుడెవరు? సాయినామాన్ని మించిన మృత్యుంజయ మంత్రమేమున్నది? </span></div><div><span style="color: #ff00fe; font-size: large;"><br /></span></div><div><span style="color: #ff00fe; font-size: large;">శ్రీ సాయి మహత్యాలు భక్తులు దర్శించి అనుగ్రహముతో తెలుసుకున్నవే..వారు ఏ చమత్కారాలు చేయలేదు.. మంత్రోపదేశాలు చేయలేదు.</span></div><div><span style="color: #ff00fe; font-size: large;"><br /></span></div><div><span style="color: #ff00fe; font-size: large;">'నా భక్తులు అడిగినవన్నీ ఇస్తూనే ఉంటాను!</span></div><div><span style="color: #ff00fe; font-size: large;">నేను ఇవ్వదలచినది వారు అడిగేంతవరకూ!</span></div><div><span style="color: #ff00fe; font-size: large;">కోరికలను తీర్చి దిద్దుటయే శ్రీ సాయి విధానము...</span></div><div><span style="color: #ff00fe; font-size: large;"><br /></span></div><div><span style="color: #ff00fe; font-size: large;"> సర్వం శ్రీ సాయి నాధార్పణ మస్తు..</span></div><div><span style="color: #ff00fe; font-size: large;"><br /></span></div><div><span style="color: #ff00fe; font-size: large;"><br /></span></div><div><span style="color: #ff00fe; font-size: large;"><br /></span></div><div><span style="color: #ff00fe; font-size: large;"><br /></span></div><div><span style="color: #ff00fe; font-size: large;"><br /></span></div><div><span style="color: #ff00fe; font-size: large;"><br /></span></div></div><p></p>visalakshihttp://www.blogger.com/profile/12353866459824269934noreply@blogger.com12tag:blogger.com,1999:blog-2640908686154358505.post-22924929159247010152021-06-09T12:49:00.002+05:302021-06-09T12:49:32.957+05:30త్రయంబకేశ్వరం - నాసిక్<p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;"></span></p><div class="separator" style="clear: both; text-align: center;"><span style="color: #ff00fe; font-size: large;"><a href="https://1.bp.blogspot.com/-m3e2bXnaIng/YMBrAI-DK5I/AAAAAAAACI8/WiG0H22G8k4nO9Ixeb_0jLeI4YtL3YTQgCLcBGAsYHQ/s227/20210609_124554.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="176" data-original-width="227" src="https://1.bp.blogspot.com/-m3e2bXnaIng/YMBrAI-DK5I/AAAAAAAACI8/WiG0H22G8k4nO9Ixeb_0jLeI4YtL3YTQgCLcBGAsYHQ/s0/20210609_124554.jpg" /></a></span></div><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;"> *త్రయంబకేశ్వర క్షేత్రం- నాసిక్*</span></p><p></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;">గోదావరి తల్లి అడుగుల సవ్వడితో, త్రయంబకేశ్వరుని దివ్య చరణాలతో పునీతమైన పరమ పునీతధామం త్రయంబకేశ్వరం. ఈ అపురూప ఆధ్యాత్మిక క్షేత్రం ఎన్నో అందాలకు, మరెన్నో విశిష్ట ఆలయాలకు నెలవు. </span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;">ద్వాదశ జ్యోతిర్లింగాలలో ప్రముఖమైన త్రయంబకేశ్వర లింగానికి ఎంతో విశిష్టత ఉంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ముగ్గురు కొలువైన క్షేత్రం కనుకనే దీనిని త్రయంబకం అంటారు. వీరితో పాటుగా సాక్షాత్తు ఆ ఆదిపరాశక్తి కూడా ఇక్కడ కొలువై ఉందని ప్రశస్తి. అలాగే 33 కోట్ల దేవతలు కొలువై ఉన్నారని నమ్మకం.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;">స్థల పురాణం:</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;">కొన్ని యుగాలకు పూర్వం ఈ ప్రదేశం అంతా రుషులు, సాధువులకు నివాస ప్రాంతంగా ఉండేది. సప్తరుషులలో ఒకరైన గౌతమ మహర్షి తన ధర్మపత్ని అహల్యతో కలిసి ఇక్కడ జీవించేవారు. ఒకానొక సమయంలో ఈ ప్రదేశం కరవుకాటకాలతో అల్లాడింది.. ఆ సమయంలో గౌతమ మహర్షి తన తపోశక్తిని ధారపోసి ఓ సరస్సును సృష్టించారు. అహల్యతో పాటు మిగిలిన రుషి పత్నులు ఆ సరస్సులోని నీటిని ఉపయోగించుకునేవారు. కానీ వారిలో గౌతమ మహర్షిపట్ల, అహల్య పట్ల అసూయా ద్వేషాలు పెరిగి, తమ భర్తలను కూడా అలాంటి సరస్సులను నిర్మించమని వారు పోరు పెట్టారు. అప్పుడు రుషులందరు కలిసి గణేశుడి గురించి తపస్సు చేయగా ప్రత్యక్షమైన వినాయకుడు వరంగా ఏమి కావాలి అని అడగగా, వారు గౌతమ మహర్షి వద్ద ఉన్న గోవు చనిపోయేటట్లు చేయమంటారు. అది పాపం అని చెప్పినా వారు వినకుండా, అదే వరం కావాలని పట్టుపడతారు. దాంతో ఏమి చేయలేని స్థితిలో వినాయకుడు ఆ వరాన్ని ప్రసాదిస్తాడు.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;"> ఒకనాడు పంట చేలో మేస్తున్న గోవును దర్భపుల్లతో అదిలించగా, అది గాయపడి మరణిస్తుంది. ఇదే అదునుగా భావించిన రుషులందరూ గో హత్య మహాపాపమని ఈ ప్రదేశంలో గంగను పారేట్లు చేస్తే ఆ హత్యకు పరిహారం అవుతుందని తెలుపుతారు. దాంతో గౌతముడు, అహల్య చాలా సంవత్సరాలు శివుని కోసం తపస్సు చేయగా పరమశివుడు, బ్రహ్మ, విష్ణు, ఆదిపరాశక్తిలతో కలిసి ప్రత్యక్షమవుతాడు.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;">ఏం వరం కావాలని అడగగా గంగను విడుదల చేయమని కోరుతారు. అప్పుడు శివుడు తన జటను విసరగా అది వెళ్లి బ్రహ్మగిరి పర్వతం మీద పడగా, గంగా నది అక్కడి నుంచి ప్రవహిస్తూ కిందకి వస్తుంది. దానినే గౌతమి లేదా గోదావరి అనే పేరుతో పిలుస్తున్నారు.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;">ఈ ప్రదేశంలో శివుడు, బ్రహ్మ, విష్ణువు ముగ్గురు పానవట్టం లోపల మూడు లింగాకారాలలో ఉంటారు. అందువలనే దీనిని త్రయంబకం అంటారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగా, అత్యంత ప్రాముఖ్యాన్ని పొందిన ఈ మహా లింగం త్రయంబకం.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;">ఆలయ విశిష్టత: </span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;">సాధారణంగా శివలింగానికి ఎదురుగా నందీశ్వరుడు కొలువై ఉంటాడు. కానీ ఇక్కడ మాత్రం నందీశ్వరునికి ప్రత్యేకమైన మందిరం ఉంటుంది. మొదటగా నందీశ్వరున్ని దర్శించుకున్న అనంతరం దేవదేవుణ్ని దర్శించుకుంటాం. భక్తులకు ముందుగా ఆ నందీశ్వరుడి దర్శన భాగ్యం కలుగుతుంది. ఆలయ ప్రాంగణంలో ఓ కోనేరు ఉంటుంది. అది ఎప్పుడూ గోదావరి నదీ జలాలతో నిండి ఉంటుంది. గుడి ప్రాంగణం విశాలమైంది. గుడి మొత్తాన్ని నల్లరాతితో నిర్మించారు. ఆలయ ప్రాకారంలో చిన్న చిన్న శివలింగాలు, చిన్న చిన్న ఆలయాలు అమర్చి ఉంటాయి. గుడి ప్రాకారాలను చాలా ఎత్తులో నిర్మించడం జరిగింది. గుడిలోని కలశాలను బంగారంతో నిర్మించారు. అప్పట్లోనే ఈ కలశాలను నిర్మించడానికి 16 లక్షల రూపాయలు ఖర్చు అయినట్లు, వీటన్నింటిని కూడా 16వ శతాబ్దంలోనే నిర్మించినట్లు చరిత్ర ఆధారాలు చెబుతున్నాయి.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;"> ఇది స్వయంభూ జ్యోతిర్లింగం. గర్భగుడి లోపల మూడు లింగాలు కలిపి ఒకే పానవట్టంలో ఉంటాయి. </span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;">ఈ మూడు లింగాలను కూడా త్రిమూర్తులకు ప్రతీకలుగా భావిస్తారు. పానవట్టం లోపల నుంచి ఎప్పుడూ జలం వస్తూనే ఉంటుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఇప్పటికీ అంతు చిక్కని విషయమే . ఆ జలం నిత్యం శివలింగాన్ని అభిషేకం చేస్తుంది. అయితే గర్భగుడిలోనికి అందరికీ అనుమతి లేకపోవడంతో 5 మీటర్ల దూరం నుంచే స్వామి వార్ల దర్శన భాగ్యం కల్పిస్తారు.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;">పాండవులు ఇక్కడ ఒక కోనేటిని నిర్మించారని పురాణాలు చెబుతున్నాయి. ఆ కోనేరు ఎప్పుడు కూడా గోదావరి జలాలతో నిండి ఉంటుంది. ఆ కోనేట్లోకి నేరుగా బ్రహ్మగిరి పర్వత శ్రేణుల నుంచి వచ్చే నీరు ప్రవహిస్తుంది అని చెబుతారు. ఈ కోనేట్లో స్నానమాచరిస్తే సకల పాపాలు తొలగిపోతాయని నమ్మకం. </span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;">కుంభమేళా నిర్వహించే సమయంలో సాధువులు, హిమాలయాల నుంచి వచ్చే రుషులు, అఘోరాలు ఈ కోనేటిలో స్నానాలు ఆచరిస్తారు. ఈ కోనేరు చుట్టూ అనేక లింగాలూ, వివిధ దేవతా మూర్తుల విగ్రహాలూ కొలువై ఉంటాయి.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;">పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళాను నిర్వహిస్తారు. సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి మూడు కూడా ఒకేసారి సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు ఇక్కడ సింహస్థ కుంభమేళా నిర్వహిస్తారు. కుంభమేళా సమయంలో కోనేటిలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని ప్రశస్థి.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;"> ఓం నమః శివాయ 🙏🙏</span></p>visalakshihttp://www.blogger.com/profile/12353866459824269934noreply@blogger.com1tag:blogger.com,1999:blog-2640908686154358505.post-70896735801947245162021-06-03T14:55:00.000+05:302021-06-03T14:55:10.840+05:30కదంబ వృక్షం - ప్రత్యేకత<p><span style="color: #ff00fe; font-size: medium;"> . *కదంబ వృక్షం*</span></p><div class="separator" style="clear: both; text-align: center;"><a href="https://1.bp.blogspot.com/-KH5UbBtxBy0/YLieY-INMTI/AAAAAAAACIY/Fb_8KV7O0rITmkJ4PuacIEkSpdoBjyNawCLcBGAsYHQ/s640/FB_IMG_1622711741405.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><span style="color: #ff00fe; font-size: medium;"><img border="0" data-original-height="640" data-original-width="480" height="320" src="https://1.bp.blogspot.com/-KH5UbBtxBy0/YLieY-INMTI/AAAAAAAACIY/Fb_8KV7O0rITmkJ4PuacIEkSpdoBjyNawCLcBGAsYHQ/s320/FB_IMG_1622711741405.jpg" /></span></a></div><span style="color: #ff00fe; font-size: medium;"><br /></span><p><span style="color: #ff00fe; font-size: large;">హనుమంతుడి పుట్టుకకు మూలం ఈ వృక్షం:</span></p><p><span style="color: #ff00fe; font-size: medium;">క్రిష్ణుడు గోపికల చీరలను దాచిన చెట్టు :</span></p><p><span style="color: #ff00fe; font-size: medium;">ప్రకృతిలో రాధాకృష్ణుల ముచ్చట్లన్నీ ఈ చెట్టు నీడలోనే:.</span></p><p><span style="color: #ff00fe; font-size: medium;"><br /></span></p><p><span style="color: #ff00fe; font-size: medium;"> పలు రకాల బొమ్మల తయారీకి కూడా ఈ చెట్టు చెక్క పనికివస్తుంది. భగవద్గీతలో కూడా దీని గురించి ప్రస్తావించారు. రాధాకృష్ణులకు నచ్చే మొక్క ఇది... ఈ చెట్టు నీడలో పరిమళాలను ఆస్వాదిస్తూ వారి ప్రేమాయణం కొనసాగిందని, అందుకే దీనిని హిందువులు పవిత్రమొక్కగా భావిస్తారని సమాచారం. గోపికల చీరలను కృష్ణుడు తీసుకెళ్లి ఈ రుద్రాక్షాంబ చెట్టు మీదే ఉంచినట్టు కూడా మహాభారతంలో ఉందట. ఈ చెట్టు 45 మీటర్ల వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ మొక్క పెరిగేందుకు ఓ మోస్తరు నీరే సరిపోతుంది. ఉష్ణ మండల ప్రాంతంలో బాగా పెరిగే లక్షణాలను కలిగి ఉంటుంది.</span></p><p><span style="color: #ff00fe; font-size: medium;"><br /></span></p><p><span style="color: #ff00fe; font-size: medium;">ఇది ఆకురాల్చదు. ఎప్పటికీ ఆకుపచ్చగా ఉంటుంది. నీడను బాగా ఇస్తుంది. అడవులలో ఎక్కువగా పెరుగుతుంది. దీని పూలు గుండ్రంగా ఉంటాయి. దీని పుష్పాల నుంచి అత్తర్లు కూడా తయారు చేస్తుంటారు. దీని కలపను బొమ్మల తయారీకి ఉపయోగిస్తారు.</span></p><p><span style="color: #ff00fe; font-size: medium;"><br /></span></p><p><span style="color: #ff00fe; font-size: medium;">ఈ మొక్క పెరిగేందుకు ఓ మోస్తరు నీరే సరిపోతుంది అంటున్నారు. ఉష్ణ మండల ప్రాంతంలో విరివిగా లభిస్తుందంటున్నారు బయాలజిస్టులు.</span></p><p><span style="color: #ff00fe; font-size: medium;"><br /></span></p><p><span style="color: #ff00fe; font-size: medium;">పురాణాల్లో కదంబ వృక్షం :</span></p><p><span style="color: #ff00fe; font-size: medium;"><br /></span></p><p><span style="color: #ff00fe; font-size: medium;">ఈ కదంబవృక్షానికి పురాణాల్లో రెండు రకాల పేర్లు ఉన్నాయి ఉత్తరభారతం లో దీన్ని కృష్ణవృక్షమనీ, దక్షిణభారతం లో పార్వతీవృక్షమనీ అంటారు.</span></p><p><span style="color: #ff00fe; font-size: medium;"><br /></span></p><p><span style="color: #ff00fe; font-size: medium;">ఈ వృక్షానికి, కృష్ణుడికీ చాలా సంబంధం ఉంది. రాధాకృష్ణుల ముచ్చటలు ఈ వృక్షం నీడలోనే జరిగాయంటారు. అందుకే కృష్ణవృక్షం అంటారని పురాణాలు చెబుతున్నాయి</span></p><p><span style="color: #ff00fe; font-size: medium;"><br /></span></p><p><span style="color: #ff00fe; font-size: medium;">దక్షిణాదిలో అమ్మవారిని ‘కదంబవనవాసిని’ అంటారు. కదంబ వృక్షానికి ‘ఓం శక్తిరూపిణ్యై నమః’ అనే మంత్రంతో పూజ చేసినట్లైతే రోగనివారణ జరుగుతుందని చెబుతారు పండితులు</span></p><p><span style="color: #ff00fe; font-size: medium;"><br /></span></p><p><span style="color: #ff00fe; font-size: medium;">గ్రహదోషాలు తొలగించు కోవడానికి అమ్మవారి స్వరూపమైన కదంబవృక్షానికి పసుపు, కుంకుమలు, పూలతో అర్చన చేయాలని, అలా పూజ చేసిన తర్వాత పెరుగన్నాన్ని పార్వతీదేవికి నివేదించాలి</span></p><p><span style="color: #ff00fe; font-size: medium;"><br /></span></p><p><span style="color: #ff00fe; font-size: medium;">హనుమంతుడి పుట్టుకకు మూలం కదంబం.. అంతేకాదు, సాక్షాత్తు పార్వతీ స్వరూపం ఈ వృక్షం.</span></p><p><span style="color: #ff00fe; font-size: medium;"><br /></span></p><p><span style="color: #ff00fe; font-size: medium;">దక్షిణాదిలో అమ్మవారిని ‘కదంబవనవాసిని’.. అలాగే నేటి మీనాక్షి అమ్మవారి ఆలయం ఉన్న ప్రాంతమే కదంబవనం అంటారు. ఏది ఏమైనా అన్నాచెల్లెళ్ళు ‘నారాయణా నారాయణి’ లకూ, ఈ వృక్షానికీ చాలా సంబంధం ఉందని చెబుతారు.</span></p><p><span style="color: #ff00fe; font-size: medium;"><br /></span></p><p><span style="color: #ff00fe; font-size: medium;">హనుమంతుడి పుట్టుకకు మూలం కదంబం :</span></p><p><span style="color: #ff00fe; font-size: medium;"><br /></span></p><p><span style="color: #ff00fe; font-size: medium;">అమ్మవారిని కదంబ వనవాసిని అంటారు. సాక్షాత్తు పార్వతీ స్వరూపం ఈ వృక్షం. గార్దబాసురుడు అనే రాక్షసుడు పరమేశ్వరుని గురించి తపస్సు చేసి భూమిమీద, మనుషులతో, జంతువులతో మరణంలేకుండా ఉండాలని వరం కోరతాడు. శివయ్య తథాస్సు అని అంతర్థానమవుతాడు.</span></p><p><span style="color: #ff00fe; font-size: medium;"><br /></span></p><p><span style="color: #ff00fe; font-size: medium;">వరగర్వంతో దేవలోకం చేరి ఇంద్రున్ని తరిమికొడతాడు గార్దబుడు. దీంతో దేవేంద్రుడు విష్ణుమూర్తిని వెంట పెట్టుకుని పరమేశ్వరుని చేరతాడు. గార్దబాసురుని చంపమని కోరతాడు శ్రీమహావిష్ణువు.</span></p><p><span style="color: #ff00fe; font-size: large;"> అయితే తాను వరమిచ్చిన విషయం చెబుతాడు శివయ్య. ఆ సమయంలో శ్రీమహావిష్ణువు ఓ సరదా మాట అంటాడు. నువ్వు గార్దబాసురుని చంపితే నేను దాసుడిగా ఉంటానంటాడు. దానికి శివయ్య నువ్వు గనుక గార్దబాసురుని చంపినట్టైతే నేనే దాసుడిగా మారతానని దానికి మరో మాట కలుపుతాడు. అయితే మోహినీ రూపంలోకి మారతాడు విష్ణుమూర్తి.</span></p><p><span style="color: #ff00fe; font-size: medium;"><br /></span></p><p><span style="color: #ff00fe; font-size: medium;">దక్షిణాన ఉన్న గార్దబాసురుని రాజ్యానికి సమీపంలోని వనానికి చేరతాడు. అదే సమయంలో విష్ణువుకి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఆ వనానికే అందమైన కన్యరూపంలో వస్తుంది పార్వతీదేవి.</span></p><p><span style="color: #ff00fe; font-size: medium;"><br /></span></p><p><span style="color: #ff00fe; font-size: medium;"> అమ్మవారి అందానికి ముగ్దులైన రాక్షసులు ఆమె దగ్గరకు చేరతారు. మరోవైపు మోహినీ అవతారంలో ఉన్న విష్ణుమూర్తికి ఆకర్షితుడై వెంటపడతాడు కదంబాసురుడు. దీంతో కదంబాసురున్ని ఆకాశంలోకి ఎగరేసి.. తోడేలు రూపంలోకి మారి సంహరిస్తాడు.</span></p><p><span style="color: #ff00fe; font-size: medium;"><br /></span></p><p><span style="color: #ff00fe; font-size: medium;"> ముఖం తోడేలు.. మొండెం మనిషి రూపంలో ఉండి… పరమేశ్వరుని వరానికి భంగం కలగకుండా చంపుతాడు. అలా సంహరిస్తున్న తరుణంలో అంతమొందించడానికి కదంబ వృక్షంగా మారి అగ్నిజ్వాలలతో రాక్షసులందరిని సంహరిస్తుంది అమ్మవారు. దీంతో గార్దబాసురుని సంహారం జరిగిపోయింది. అయితే సరదాగా అన్న మాట మాటే కాబట్టి… రామావతారంలో హనుమంతుడిగా మారి శ్రీరామబంటుగా సేవలు అందించాడు శివుడు.</span></p><p><span style="color: #ff00fe; font-size: medium;"><br /></span></p><p><span style="color: #ff00fe; font-size: medium;">జ్యోతిష్య శాస్త్రంలో కదంబం :</span></p><p><span style="color: #ff00fe; font-size: medium;"><br /></span></p><p><span style="color: #ff00fe; font-size: medium;">ఈ కదంబ వృక్షానికి పూజ చేసినట్లైతే రోగనివారణ జరుగుతుందని చెబుతారు పండితులు.</span></p><p><span style="color: #ff00fe; font-size: medium;"><br /></span></p><p><span style="color: #ff00fe; font-size: medium;"> జ్యోతిష శాస్త్రం లో నక్షత్రాలు ఒక్కొక్క దానికి ఒక వృక్షాన్ని గుర్తించారు అందు చేత నక్షత్రవనం లో కదంబ వృక్షాన్నిశతభిష నక్షత్ర స్థానంలో పెంచుతారు.</span></p><p><span style="color: #ff00fe; font-size: medium;"><br /></span></p><p><span style="color: #ff00fe; font-size: medium;">గ్రహదోషాలు తొలగించుకోవడానికి అమ్మవారి స్వరూపమైన కదంబ వృక్షానికి పూజ చేయాలి అంటారు. పసుపు, కుంకమలు పూలతో అర్చన చేయాలని చెబుతారు.</span></p><p><span style="color: #ff00fe; font-size: medium;"><br /></span></p><p><span style="color: #ff00fe; font-size: medium;"> గ్రహదోషాలు ఉన్నవాళ్లు… కదంబ వృక్షానికి పూజ చేసిన తర్వాత పెరుగన్నాన్ని పార్వతీదేవికి నివేదించాలి.🌸 కదంబ వృక్షం మంచి సువాసనతో మత్తెక్కించేటట్లు గా ఉంటాయి కదంబ పూలు.</span></p><p><span style="color: #ff00fe; font-size: medium;"><br /></span></p><p><span style="color: #ff00fe; font-size: medium;">గుండ్రని టెన్నిస్ బంతుల ఆకారంలో మొదట్లో ఆకుపచ్చగా తర్వాత పసుపు బంగారు వర్ణంలో తర్వాత తెల్లగాను మారతాయి.</span></p><p><span style="color: #ff00fe; font-size: medium;"><br /></span></p><p><span style="color: #ff00fe; font-size: medium;"> ఈ పువ్వులు పార్వతి దేవి పూజలు జరిగే చైత్ర, ఆషాడ,శ్రావణ ఆశ్వీజ మాసాల్లోనే కడిమి పూలు ఎక్కువ పూస్తాయి. ఆద్యాత్మిక పరంగానే కాక వాణిజ్య పరంగాను కడిమి చెట్టు ప్రత్యేకమే.</span></p><p><span style="color: #ff00fe; font-size: medium;"><br /></span></p><p><span style="color: #ff00fe; font-size: medium;">👌ఔషధ పరంగా ఈ కదంబ వృక్షం మనుషులకు ప్రకృతి ప్రసాదించిన వరం అంటారు ఆయుర్వేద వైద్యులు. ఈ చెట్టు ఆకులు షుగర్ వ్యాది నివారణకు ఉపయోగిస్తారు.</span></p><p><span style="color: #ff00fe; font-size: medium;">సేకరణ......From Face Book....</span></p>visalakshihttp://www.blogger.com/profile/12353866459824269934noreply@blogger.com1tag:blogger.com,1999:blog-2640908686154358505.post-35240109271946487732021-05-31T12:58:00.000+05:302021-05-31T12:58:18.731+05:30కాలభైరవ స్వామి-కాశీ క్షేత్ర పాలకుడు<p></p><div class="separator" style="clear: both; text-align: center;"><a href="https://1.bp.blogspot.com/-bQejLHco4ek/YLSOx5WZYsI/AAAAAAAACIQ/7NAUPmPPVyw0wAT-uTBUqnW-o96XWZEwACLcBGAsYHQ/s2000/Swarna-Akarshana-Bhairava-Images.jpg" style="margin-left: 1em; margin-right: 1em;"><span style="color: #ff00fe;"><img border="0" data-original-height="2000" data-original-width="1615" height="320" src="https://1.bp.blogspot.com/-bQejLHco4ek/YLSOx5WZYsI/AAAAAAAACIQ/7NAUPmPPVyw0wAT-uTBUqnW-o96XWZEwACLcBGAsYHQ/s320/Swarna-Akarshana-Bhairava-Images.jpg" /></span></a></div><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><div style="text-align: justify;"><span style="color: #ff00fe;">ఈయన అనుగ్రహం ఉంటేనే గానీ కాశీ మహాక్షేత్రంలో అడుగు పెట్టలేము. ఈయనే కాశీ క్షేత్ర పాలకుడు. కాపాలమాల ధారణలో మహాకాలభైరవుడు. అత్యంత అరుదైన దర్శనం. కోట్లజన్మల పుణ్యఫలం ఈ అపూర్వమైన దర్శనం. మహా కాలభైరవ స్వామివారి ఆవిర్భావ వృత్తాంతం. మహామహిమాన్వితమైన కాలభైరవాష్టకం*</span></div><p></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">"కాలభైరవా నమోస్తుతే – కాశీ విశ్వేశ్వరా నమోస్తుతే”</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">ఈ కాలభైరవ స్వామి పుట్టుకకు సంబంధించిన ఆసక్తికరమైన కథ శివపురాణం ద్వారా తెలుస్తోంది.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"> 🙏కాలభైరవ ఆవిర్భావం🙏</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">ఒకసారి శివుడు బ్రహ్మలు మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు కాస్తా వాదోపవాదాలుగా మారాయి. బ్రహ్మదేవుడు ‘నేను సృష్టికర్తను… పరబ్రహ్మ స్వరూపుడను… నేను చెప్పినట్లుగానే మీరంతా నడుచుకోవాలి’ అన్నాడు. దానికి శివుడు సమ్మతించలేదు.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">దాంతో వారి మధ్య వాదం పెరిగింది. బ్రహ్మదేవుడు శివుని తూలనాడడం ప్రారంభించాడు. శివుడు కోపం పట్టలేక హుంకరించాడు. ఆ హుంకారం నుంచి ఒక భయంకర రూపం ఆవిర్భవించింది. మహోన్నత కాయముతో, మూడు నేత్రాలతో, త్రిశూలము, గద, డమరుకం వంటి ఆయుధాలను చేతులతో ధరించి కనిపించిన ఆ మహోన్నత రూపమే శ్రీకాలభైరవుడు.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">హుంకారంతో జన్మించిన కాలభైరవుడు తన జననానికి కారణం చెప్పమని శివుని కోరాడు. శివుని ఆజ్ఞమేరకు కారభైరవుడు బ్రహ్మదేవుని ఐదు శిరస్సులలో మధ్యన ఉన్న ఐదవ శిరస్సును ఖండించాడు. దీనితో బ్రహ్మదేవుని గర్వం అణిగిపోయింది. తిరిగి కాలభైరవుడు శివుని చెంత నిలిచాడు.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">‘నీవు బ్రహ్మదేవుని శిరస్సును ఖండించడం వల్ల నీకు బ్రహ్మహత్యాపాతకం సోకింది. కనుక నీవు బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి తీర్థయాత్రలు చేయి..’ అని శివుడు సలహా ఇచ్చాడు.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">#కాలభైరవుడు కాశీ క్షేత్రపాలకుడు</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">కాలభైరవుడు బ్రహ్మహత్యాపాతకాన్ని తొలగించుకోవడం కోసం బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి క్షేత్ర పర్యటన ప్రారంభించాడు. ఎన్ని క్షేత్రాలు పర్యటించినా తనకు సోకిన పాతకం విడవనందున మహావిష్ణువు వద్దకు వెళ్లి ఆయన్ను ప్రార్థించుతాడు.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">అందుకు ‘‘కాలభైరవా! నీవు శివుని పుత్రుడివి. కనుక శివునితో సమానం. బ్రహ్మదేవుని గర్వం అణచడానికి జన్మించిన వాడవు. నీవు ఎన్ని యాత్రలు చేసినా ఉపయోగం ఉండదు. నీవు కాశీ క్షేత్రానికి వెళ్లు. కాశీక్షేత్రంలో అడుగు పెట్టినంతనే నీ బ్రహ్మహత్యాపాతకం భస్మమై పోతుంది ’అని సలహా మహావిష్ణువు ఇచ్చాడు.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">దీనితో కాలభైరవుడు కాశీచేరుకున్నాడు. ఆయనబ్రహ్మహత్యాదోషం పోయింది. బ్రహ్మ కపాలాన్ని కాశిలో పూడ్చి పెట్డాడు. బ్రహ్మ కపాలం పూడ్చి పెట్టిన చోట ఏర్పడిన తీర్థమే నేటి కాశీలోని ‘కపాల మోక్ష తీర్థం’</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">తర్వాత కాలభైరవుని చూసి శివుడు ‘కాలభైరవా! నీవు ఇక్కడే కొలుదీరి క్షేత్రపాలకుడుగా బాధ్యతలు చేపట్టు. ముందుగా నీకే పూజలు జరుగుతాయి. నీ తరువాతనే నాకు పూజలు జరుగుతాయి.’ శివుడు పలికాడు. దీనితో కాలభైరవుడు కాశీక్షేత్రంలో కొలువు దీరి క్షేత్రపాలకునిగా పూజలందుకొంటున్నాడు.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"> కాలభైరవ ఆరాధన</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">కాశీక్షేత్రాన్ని దర్శించినవారు శ్రీకాలభైరవ స్వామిని దర్శించడంతో పాటుగా కాశీనుంచి వచ్చిన వారు కాశీసమారాధన చేయడం ఆచారం అయింది.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">కాశీక్షేత్రానికి వెళ్లి వచ్చిన వారు కాశీ విశ్వేశ్వర స్వామి వారిని పూజించడంతోపాటు మినప వడలతో మాలను తయారు చేసి పూజానంతరం ఒక శునకమును కాలభైరవస్వామిగా భావించి పసుపుకుంకుమలు పెట్టి ఆ మాలను దాని మెడలో వేసి నమస్కారం చేస్తారు.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">ఈ ఏడాది డిసెంబరు 15వ తేదీన కాలభైరవాష్టమి నాడు శ్రీకాలభైరవ స్వామి విగ్రహం లేదా చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని గణపతిని పూజించిన తరువాత షోడశోపచారాలతోను, అష్టోత్తరాలతోను శ్రీకాలభైరవ స్వామిని పూజిస్తారు. మినపవడలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఒకపూట ఉపవాసం చేస్తారు. భైరవుని రూపాలు:</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"> భైరవుని రూపాలు</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">కాల భైరవ, అసితాంగ భైరవ, సంహార భైరవ, రురు భైరవ, క్రోధ భైరవ, కపాల భైరవ, రుద్ర భైరవ, ఉన్మత్త భైరవ ... </span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">ఇవే కాక భీష్మ భైరవ, స్వర్ణాకర్షణ భైరవ, శంబర భైరవ, మహా భైరవ, చండ భైరవ అనే రూపాలు కుడా ఉన్నాయి. స్వర్ణాకర్షణ భైరవుని పై సహస్రనామాలు కూడా ఉండడం విశేషం…. ఉత్తరప్రదేశ్ లోని వారణాసి లో ఉన్న కాలభైరవ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">కాలభైరవాష్టకం పఠించడం పుణ్యప్రదం</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు రాసిన శ్రీ ‘కాలభైరవాష్టకం’ కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇలా కారభైరవాష్టమి నాడు శ్రీకాలభైరవ స్వామిని స్మరించడం, పూజించడం వల్ల సకల పుణ్యఫలాలు కలుగుతాయి. శ్రీకాలభైరవ స్వామిని పూజించడం వల్ల స్వప్నభయాలు దూరమవుతాయి. గ్రహదోషాలు తొలగిపోతాయి.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"> మహామహిమాన్వితమైన కాలభైరవాష్టకం*</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">దేవరాజసేవ్యమానపావనాంఘ్రిపంకజం వ్యాలయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరమ్ |</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">నారదాదియోగిబృందవందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౧ ||</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">భానుకోటిభాస్వరం భవాబ్ధితారకం పరం నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనమ్ |</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౨ ||</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">శూలటంకపాశదండపాణిమాదికారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయమ్ |</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౩ ||</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం భక్తవత్సలం స్థిరం సమస్తలోకవిగ్రహమ్ |</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">నిక్వణన్మనోజ్ఞహేమకింకిణీలసత్కటిం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౪ ||</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుమ్ |</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">స్వర్ణవర్ణకేశపాశశోభితాంగనిర్మలం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౫ ||</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">రత్నపాదుకాప్రభాభిరామపాదయుగ్మకం నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనమ్ |</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">మృత్యుదర్పనాశనం కరాలదంష్ట్రభూషణం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౬ ||</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">అట్టహాసభిన్నపద్మజాండకోశసంతతిం దృష్టిపాత్తనష్టపాపజాలముగ్రశాసనమ్ |</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౭ ||</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">భూతసంఘనాయకం విశాలకీర్తిదాయకం కాశివాసిలోకపుణ్యపాపశోధకం విభుమ్ |</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౮ ||</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం జ్ఞానముక్తిసాధకం విచిత్రపుణ్యవర్ధనమ్ |</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">శోకమోహలోభదైన్యకోపతాపనాశనం తే ప్రయాంతి కాలభైరవాంఘ్రిసన్నిధిం ధ్రువమ్ ||</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">కాల భైరవుడు అనగానే చాలామంది కుక్క అని తేలిగ్గా అనేస్తారు. కాని ఆయనకు చాలా విశిష్ఠత ఉంది. కాలాన్ని జయించడం సాధ్యం కాకున్నా దాన్ని అనుకూలంగా మార్చుకోవచ్చు.గ్రహ బలాలను అధిగమించి అదృష్ట జీవితాన్ని సంకల్ప సిద్ధిని పొందడం భైరవ ఉపసానతో సాధ్యమని శాస్త్రాలు చెబుతున్నయి.కాల భైరవుడిని కాశి క్షేత్ర పాలకుడిగా కీర్తించారు.ఏది సాదించాలన్నా ముందుగా అయన అనుమతి తీసుకోవాలని "కాశి క్షేత్ర మహిమ చెబుతుంది.సాక్షాత్తు శివుడే కాల భైరవుడే సంచారించాడని శాస్త్రాలు చెబుతున్నాయి.హోమ కార్యాలలో అష్టాభైరవులకు ఆహుతులు వేసిన తర్వాతే ప్రధాన హోమం చేస్తారు. భక్తులకు అనుగ్రహాన్ని,అతింద్రమైన శక్తులని అయన ప్రసాదిస్తారు.దేవాలయంలో ఆయనకి గారెలతో మాల వేస్తారు.కొబ్బరి బెల్లం నైవేద్ద్యం పెడతారు.ఈశ్వరుడు ఆయుషును ప్రసాదిస్తాడు.ఆయనకు పరమ విధీయుడైన కాల భైరవుడిని ఆరాదిస్తే ఆయుష్షు పెరుగుతుందని ప్రతీతి.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"> శ్రీ కాలభైరవస్వామి ప్రధాన క్షేత్రాలు:</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">1. వారణాసి (ఉత్తరప్రదేశ్) :</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">కాలభైరవునికి బ్రహ్మ హత్యాపాతకం తొలగించిన స్థలంగా ఈ క్షేత్రం ప్రసిద్ది చెందినది.. అందుచే శివుని ఆజ్ఞ ప్రకారం వారణాసి క్షేత్రపాలకుడు కాలభైరవుడు..</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">2. ఉజ్జయిని (మధ్యప్రదేశ్ లో ఇండోర్) :</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">గర్బాలయంలోని శ్రీకాలభైరవుని విగ్రహం పూర్తిగా సింధూరంతో పూయబడి ఉంటుంది.. స్వామి విగ్రహం అల్కాహాల్ ను సేవించుట సైన్సుకు కూడా అంతుబట్టని విచిత్రము..</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">3. దంతేవాడ (చత్తిస్ ఘడ్ లో జగదల్ పూర్) :</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">ప్రాచీనాలయం ధ్వంసం కాగా భైరవమూర్తులు ఒక చిన్న పాకలో కొన్ని శతాబ్ధాలు అర్చించబడినాయి.. ప్రస్తుతం కన్పించే భైరవమందిరం ఇటుకలతో నిర్మించబడిన గోడలు, పై కప్పుగా పెంకులతో కన్పిస్తుంది..</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">ఈ మందిరంలో నాలుగు భైరవమూర్తులు దర్శినమిస్తాయి..</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">1. వనభైరవుడు</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">2. జటాభైరవుడు</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">3. గధాభైరవుడు</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">4. తాండవభైరవుడు.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">4. తేజ్ పూర్ (అస్సాం లో గౌహతి) :</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">ఇచ్చటి ప్రాచీనాలయంలోని స్వామి పేరు 'మహాభైరవుడు' లింగరూపంలో పూజలందుకుంటాడు. సుమారు 5,500 సం.ల క్రితం శివభక్తుడైన బాణాసురుడు ఈ లింగాన్ని ప్రతిష్ఠించి, పూజించినట్లు స్థలపురాణం.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">నాగులు ఈ లింగాన్ని పూజించేవి అనుటకి నిదర్శనంగా ఆలయ ప్రాంగణంలో సర్పస్తంభాలు, ఆలయం ముందు ప్రవేశద్వారంపై భాగంలో సర్ప ప్రతిమలు కనిపిస్తాయి..</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">5. ఇసన్నపల్లి / రామారెడ్డి (తెలంగాణ లో కామారెడ్డి జిల్లా) :</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">సుమారు 11 వ శతాబ్దం లో స్వామి వారి ఆలయం నిర్మించబడింది..</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">దక్షిణ భారతదేశంలో ఏకైక భైరవక్షేత్రంగా, గ్రహాపీడలను తొలగించే క్షేత్రంగా ఇది చెందినది.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">ప్రధాన గర్బాలయంలో 7 అడుగుల ఎత్తుతో ఉన్న కాలభైరవస్వామి వారి విగ్రహం నిల్చోని దిగంబరంగా దర్శనమిస్తుంది..</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">6. రామగిరి (ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి జిల్లా) :</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">ఇచ్చట 9వ శతాబ్దంలో నిర్మించబడిన శ్రీ కాలభైరవాలయం, శ్రీ వాలేశ్వర స్వామి వారి ఆలయం ప్రక్కప్రక్కనే ఒకే ప్రాకారంలో అమరియున్నవి. ఆలయంలో స్వామివారి విగ్రహం సుమారు ఐదు అడుగుల ఎత్తులో గంభీరంగా ఉంటుంది..</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">7. భైరవసెల (శ్రీశైల క్షేత్రం దగ్గర) :</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">ఎచ్చటా కానరాని సహజ సిదమైన 7 జలపాతాలతో, లోయలు, కొండలతో ప్రకృతి సౌందర్యంతో పరవశింపజేసే ఈ క్షేత్రంలో ఒకేసారి పాతికమంది కూర్చోవడానికి వీలున్నట్లు భైరవగుహ, ఆ గుహలో శివస్వరూపుడైన భైరవుడు.. ఒక శివలింగం.. స్థానిక చెంచుల దేవుడైన నిరాకార 'బయన్న' దర్శనమిచ్చును..</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">8. అడవివరం (ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం) :</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">ప్రకృతి సౌందర్యం మధ్యలో ఆలయం, గోడలు ఏమిలేకుండా పైకి మెట్లు నఇర్మించబడి, చుట్టూ మండపంతో ఓపేన్ ఎయిర్ లో భైరవుడు దర్శనమిస్తాడు..</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">9. ఖాట్మండు (నేపాల్) :</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">నేపాల్ దేశ రాజధానిగా ఈ క్షేత్రం ఉన్నది.. నేపాలీయులందరూ కాలభైరవుని ఎక్కువగా ఆరాధిస్తారు..</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">అందుకే ఇచ్చట అనేక దేవీ దేవతల విగ్రహాలతో పాటు ప్రతిష్ఠించబడిన శ్రీకాలభైరవస్వామికి విశేషంగా పూజలు జరుగుతుంటాయి.. ఇక్కడ స్వామి చిత్రవిచిత్రంగా ఆలంకారాలు చేస్తారు..</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">10. భైరవకొండ (ఆంధ్రప్రదేశ్ లో బంగోలు జిల్లా) :</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">ఇక్కడ త్రిముఖదుర్గ అమ్మవారు కొలువైఉంటారు.. అమ్మవారి శిరస్సు మాత్రమే ఉంటుంది.. కార్తికపూర్ణిమ నాటిరాత్రి 7 - 8 గం.ల మధ్య దేవీ ఏదురుగా ఉన్న జలాశయంలో చంద్రకిరణాలు ప్రసరించబడి అమ్మవారి ముఖం మీదికి పరావర్తనం చెందుట అపూర్వం.. క్షేత్రపాలకుడైన కాలభైరవస్వామి గుహాలయం శివాలయాలకు ఎదురుగా నిర్మించబడినది.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">11. తిరువైసనల్లూరు (తమిళనాడు లో కుంబకోణం) :</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">ఇచ్చటి శివయోగినాథాలయంలోని గర్బగుడిలో యోగ భైరవుడు, జ్ఞాన భైరవుడు, స్వర్ణాకర్షణ భైరవుడు, ఉన్మత్త భైరవుడు అను నాలుగు విగ్రహాలను ఒకేసారి దర్శించడానికి వీలుగా ఉన్నవి.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">12. న్యూడిల్లి :</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">ఈ క్షేత్రంలో పురాణాఖిల్లాకు దగ్గరగా అతిప్రాచీనమైన కాలభైరవస్వామి ఆలయం ఉన్నది. మహాభారత కాలంలో పాండవులు ఈ స్వామిని ఆరాధించినట్లు స్థల పురాణం.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">13. ధున్నాస్ (ఉత్తరప్రదేశ్) :</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">ఇచట ధర్మశాలతో పాటుగా శ్రీకాలభైరవస్వామి ఆలయం ఉన్నది. ఇచట నుండి కొంచం దూరం ముందుకు వెల్తే ప్రధాన పీఠ రహదారిలో కాళీమాత మందిరాన్ని దర్శించవచ్చు..</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">14. మున్నంగి (ఆంధ్రప్రదేశ్ లో గుంటూర్ జిల్లాలో) :</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">స్వయంభువులు గా వెలిసిన కాలభైరవుడిని చూడవచ్చు..</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">15. భైరవపాడు (ఆంధ్రప్రదేశ్ లో గుంటూర్ జిల్లా) :</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">స్వయంభువులు గా వెలిసిన కాలభైరవుడిని చూడవచ్చు..</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">16. అధియమాన్ కొట్టాయ్ (కర్నాటక లోని ధర్మపురి జిల్లా) :</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">9వ శతాబ్దంలో అధియమాన్ అను చక్రవర్తిచే ఇచ్చట కాలభైరవాలయం నిర్మింపబడినది.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">17. కచ్ఛాద్రి (కర్నాటక లోని కొల్లూర్ దగ్గర) :</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">ఇచ్చట గల కొండపై గల ఆలయంలో శ్రీకాలభైరవస్వామి తో పాటుగా ఉమాదేవిగా పిలువబడు అమ్మవారు దర్శనమిస్తారు.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;"> "ఓం శ్రీ కాలభైరవాయ నమః"</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe;">From FB...</span></p>visalakshihttp://www.blogger.com/profile/12353866459824269934noreply@blogger.com1tag:blogger.com,1999:blog-2640908686154358505.post-50940142622812345692021-03-23T00:46:00.001+05:302021-03-23T07:10:42.135+05:30శ్రీ దీపలక్ష్మీ నమోస్తుతే...<p> </p><div class="separator" style="clear: both; text-align: center;"><a href="https://1.bp.blogspot.com/-xldAuNTET4w/X5fWUA-NLoI/AAAAAAAACEE/kKaRaeAjef0JxdJ1mpd64H6u67yOyfPZgCLcBGAsYHQ/s912/FB_IMG_1603784353511.jpg" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="912" data-original-width="720" height="320" src="https://1.bp.blogspot.com/-xldAuNTET4w/X5fWUA-NLoI/AAAAAAAACEE/kKaRaeAjef0JxdJ1mpd64H6u67yOyfPZgCLcBGAsYHQ/s320/FB_IMG_1603784353511.jpg" /></a></div><br /><p></p><p>#సంధ్యా దీప దర్శన శ్లోకం*</p><p> *దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహమ్ |*</p><p>*దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోஉస్తుతే ||*</p><p>*భగవంతుడు జ్యోతి స్వరూపుడు కనుక దీపాన్ని ఆరాధిస్తే అజ్ఞానం తొలగడమే కాక సర్వ శుభాలూ కలుగుతాయి.*</p><p>శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే...</p><p>జ్యోతిని పరబ్రహ్మ స్వరూపం గా, మనోవికాసానికి, ఆనందాని కి, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తాం.</p><p>పూర్వం దుర్వాస మహర్షి ఒకసారి దేవేంద్రుని ఆతిథ్యానికి మెచ్చుకొని ఒక మహిమాన్వితమైన హారాన్ని వరంగా ప్రసాదిస్తాడు. ఇంద్రుడు దాన్ని తిరస్కార భావంతో తన వద్ద నున్న ఐరావతము అనే ఏనుగు మెడలో వేయగా అది ఆ హారాన్ని కాలితో తొక్కి నాశనం చేస్తుంది. అది చూసిన దుర్వాసుడు ఆగ్రహం చెంది దేవేంద్రుని శపిస్తాడు.</p><p>దీంతో శాపగ్రస్తుడైన దేవేంద్రుడు రాజ్యాధిపత్యం కోల్పోయి, సర్వసంపదలు పోగొ ట్టుకొని దిక్కుతోచని స్థితిలో దేవేంద్రుడు శ్రీహరిని ప్రార్థిస్తాడు. </p><p>అప్పుడు శ్రీ మహా విష్ణువు దేవేంద్రునికి ఒక సూచన ఇస్తాడు. ఒక జ్యోతిని వెలగించి దానిని శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా తలచి పూజించమని, ప్రార్ధించమని చెప్తాడు.</p><p>మహావిష్ణువు చెప్పిన విధంగా దేవేంద్రుడు పూజించడంతో దానికి తృప్తి చెందిన లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. </p><p>అప్పుడు దేవేంద్రుడు తిరిగి త్రిలోకాధిపత్యా న్ని, సర్వసంపదలను పొందుతాడు ఆనందంతో జీవిస్తాడు .</p><p>ఆ తర్వాత ఒకసారి లక్ష్మీదేవితో తల్లీ నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండుట న్యాయమా ! నీ బిడ్డలు నీ కరుణ పొందే మార్గం లేదా అని ఆ తల్లిని అడుగుతాడు. </p><p>అప్పుడు ఆ తల్లి లక్ష్మీదేవి తనను త్రికరణ శుద్దిగా ఆరాధించే భక్తులకు వారి అభీష్టాలకు అనుగుణంగా...</p><p>మహర్షులకు మోక్ష లక్ష్మి రూపంగా, విజయాన్ని కోరే బిడ్డలకు విజయలక్ష్మిగా, విద్యార్థులు నన్ను భక్తి తో ఆరాధిస్తే విద్యా లక్ష్మిగా, ఐశ్వర్యాన్ని కోరి నన్ను కొలిచేవారికి ధనలక్ష్మిగా, వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మిగా వారికి ప్రసన్నురాలనవుతానని దేవేంద్రునికి సమాధానం ఇస్తుంది. </p><p>ఆ తల్లిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో పూజిస్తారో వారికి ఆ తల్లి ప్రసన్నురాలై వారి కోర్కెలు నెరవేర్చుతుంది.</p><p>భక్తితో దేవతలను, పితృదేవతలను పూజించేవారు.. సత్యం పలికే వారు.. దాన ధర్మాలు చేసేవారు.. భార్యను గౌరవించేవారు.. బ్రాహ్మణుల పట్ల భక్తి చూపేవారు.. పగటిపూట నిద్రపోని వారు.. వృద్ధులు.. బలహీనులు.. అసహాయులైన స్త్రీలు.. పేదవారి పట్ల కరుణగల వారు.. పారిశుద్ధ్యాన్ని పాటించేవారు.. అతిథులకు పెట్టిన తర్వాతే భోజనం చేసేవారు శ్రీ మహాలక్ష్మికి అత్యంత ఇష్టులు అవుతారు.</p><p> వారి ఇళ్లలోనే శ్రీదేవి ఎల్లప్పుడూ ఉంటుంది.</p><p>అయితే అసత్యాలు పలికే వారి వద్ద, ఇతరుల మనస్సును గాయపరిచే వారివద్ద లక్ష్మీదేవి నివాసముండదు. ఇంట్లో వెంట్రుకలు గాలికి తిరగాడితే లక్ష్మీ కటాక్షం దక్కదు. బయటికి వెళ్ళి ,కాళ్ళను శుభ్రం చేసుకోకుండా ఇంటిలోనికి వచ్చే వాళ్ల ఇంట లక్ష్మీదేవి నివాసముండదు. తల్లిదండ్రులను లెక్కచేయని వారింట, గోళ్లు కొరికేవారింట శ్రీదేవి ఉండదని పురోహితులు అంటున్నారు.</p><p>.లక్ష్మీదేవి సకల సంపదలతోపాటు సౌభాగ్యాన్ని అందించే దేవత. అందుకే ఆ తల్లి అనుగ్రహాన్ని పొందేవిధంగా మసలుకొందాం..🙏</p><p>#రాజరాజేశ్వరీ అష్టకం* </p><p>అంబా శాంభవి చంద్రమౌళీ రబలా వర్ణా ఉమా పార్వతీ</p><p>కాళీ హైమవతీ శివా త్రినయనీ కాత్యాయనీభైరవీ</p><p>సావిత్రీ నవయౌవనా శుభకరీ సామ్రాజ్య లక్ష్మి ప్రదా</p><p>చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి ||1|| </p><p><br /></p><p>అంబా మోహిని దేవతా త్రిభువనీ ఆనంద సందాయనీ </p><p>వాణీ పల్లవపాణీ వేణు మురళీగాన ప్రియాలోలినీ</p><p>కళ్యాణీ ఉడు రాజబింబ వదనా ధూమ్రాక్ష సంహారిణీ</p><p>చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి ||2|| </p><p><br /></p><p>అంబానూపుర రత్నకంకణధర కేయూర హేరావళి</p><p>జాజీపంకజ వైజయంతి లహరీ గ్రైవేయ కైరాజితా</p><p>వీణా వేణు వినోద మండితకరా వీరాసనే సంస్థితా</p><p>చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి ||3|| </p><p><br /></p><p>అంబా రౌద్రిణి భద్రకాళి భగళా జ్వాలాముఖీ వైష్ణవీ</p><p>బ్రహ్మణీ త్రిపురాంతకీ సురనుతా దేదీప్యమానోజ్వలా</p><p>చాముండాశ్రిత రక్షపోష జననీ దాక్షాయణి వల్లవీ</p><p>చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి ||4|| </p><p><br /></p><p>అంబా శూలధను:శ్శరాం కుశధరీ అర్ధేందుబింబాధరీ </p><p>వారాహీ మధుకైటభ ప్రశమనీ వాణీ రమాసేవితా</p><p>మల్లాద్యాసుర మూకదైత్యదమనీ మాహేశ్వరీ అంబికా</p><p>చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి ||5|| </p><p><br /></p><p>అంబా సృష్టి వినాశ పాలనకరీ ఆర్యా విసంశోభీతా</p><p>గాయత్రీ ప్రణవాక్ష రామృతరసః పూర్ణానుసంధీకృతా</p><p>ఓంకారీ వినుతా సుతార్చిత పదా ఉద్దండ దైత్యాపహా</p><p>చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి ||6|| </p><p><br /></p><p>అంబా శాశ్వత ఆగమాది వినుతా ఆర్యా మహాదేవతా</p><p>యా బ్రహ్మాది పిపీలికాంత జననీ యావై జగన్మోహినీ</p><p>యా పంచ ప్రణవాది రేఫ జననీ యా చిత్కళా మాలినీ</p><p>చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి ||7|| </p><p><br /></p><p>అంబా పాలిత భక్త రాజి రజితం అంబాష్టకం యః పఠే</p><p>అంబాలోకకటాక్ష వీక్ష లలితా ఐశ్వర్య సంవృద్ధితా</p><p>అంబా పావన మంత్రరాజ పఠనా ద్దంతీశ మోక్ష ప్రదా</p><p>చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి ||8||</p>visalakshihttp://www.blogger.com/profile/12353866459824269934noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2640908686154358505.post-14855921526596934772021-01-30T19:25:00.000+05:302021-01-30T19:25:34.186+05:30శ్రీ భూ వరాహ స్తోత్ర మహిమ..<p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;"> శ్రీ భూ వరాహ స్తోత్ర మహిమ*</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;">ఇల్లు కట్టుకోవాలనే కోరిక, ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ అనేక కారణాల చేత సొంత ఇంటి కల కుదరక పోవచ్చు.సొంత ఇల్లు ఒక్కటే కాదు, స్థలాలు,భూములు,ఇళ్ళు కొనాలన్నా, అమ్మాలన్నా అడ్డంకులు తొలగడానికి ప్రతి రోజు పూజలో భాగంగా ఈ స్తోత్రంని కూడా చేర్చుకోని, ఈ స్తోత్రమును రోజూ 9సార్లు మండలం రోజులు పఠించాలి.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;">#శ్రీ భూ వరాహ స్తోత్రం*</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;">ఋషయ ఊచు |</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;">జితం జితం తేఽజిత యజ్ఞభావనా</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;">త్రయీం తనూం స్వాం పరిధున్వతే నమః |</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;">యద్రోమగర్తేషు నిలిల్యురధ్వరాః</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;">తస్మై నమః కారణసూకరాయ తే || ౧ ||</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;">రూపం తవైతన్నను దుష్కృతాత్మనాం</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;">దుర్దర్శనం దేవ యదధ్వరాత్మకం |</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;">ఛన్దాంసి యస్య త్వచి బర్హిరోమ-</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;">స్స్వాజ్యం దృశి త్వంఘ్రిషు చాతుర్హోత్రమ్ || ౨ ||</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;">స్రుక్తుండ ఆసీత్స్రువ ఈశ నాసయో-</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;">రిడోదరే చమసాః కర్ణరంధ్రే |</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;">ప్రాశిత్రమాస్యే గ్రసనే గ్రహాస్తు తే</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;">యచ్చర్వణంతే భగవన్నగ్నిహోత్రమ్ || ౩ ||</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;">దీక్షానుజన్మోపసదః శిరోధరం</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;">త్వం ప్రాయణీయో దయనీయ దంష్ట్రః |</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;">జిహ్వా ప్రవర్గ్యస్తవ శీర్షకం క్రతోః</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;">సభ్యావసథ్యం చితయోఽసవో హి తే || ౪ ||</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;">సోమస్తు రేతః సవనాన్యవస్థితిః</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;">సంస్థావిభేదాస్తవ దేవ ధాతవః |</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;">సత్రాణి సర్వాణి శరీరసంధి-</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;">స్త్వం సర్వయజ్ఞక్రతురిష్టిబంధనః || ౫ ||</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;">నమో నమస్తేఽఖిలయంత్రదేవతా</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;">ద్రవ్యాయ సర్వక్రతవే క్రియాత్మనే |</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;">వైరాగ్య భక్త్యాత్మజయాఽనుభావిత</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;">జ్ఞానాయ విద్యాగురవే నమొ నమః || ౬ ||</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;">దంష్ట్రాగ్రకోట్యా భగవంస్త్వయా ధృతా</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;">విరాజతే భూధర భూస్సభూధరా |</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;">యథా వనాన్నిస్సరతో దతా ధృతా</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;">మతంగజేంద్రస్య స పత్రపద్మినీ |</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;">త్రయీమయం రూపమిదం చ సౌకరం</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;">భూమండలే నాథ తదా ధృతేన తే |</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;">చకాస్తి శృంగోఢఘనేన భూయసా</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;">కులాచలేంద్రస్య యథైవ విభ్రమః |</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;">సంస్థాపయైనాం జగతాం సతస్థుషాం</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;">లోకాయ పత్నీమసి మాతరం పితా |</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;">విధేమ చాస్యై నమసా సహ త్వయా</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;">యస్యాం స్వతేజోఽగ్నిమివారణావధాః </span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;">కః శ్రద్ధధీతాన్యతమస్తవ ప్రభో</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;">రసాం గతాయా భువ ఉద్విబర్హణం |</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;">న విస్మయోఽసౌ త్వయి విశ్వవిస్మయే</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;">యో మాయయేదం ససృజేఽతి విస్మయమ్ |</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;">విధున్వతా వేదమయం నిజం వపు-</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;">ర్జనస్తపః సత్యనివాసినో వయం |</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;">సటాశిఖోద్ధూత శివాంబుబిందుభి-</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;">ర్విమృజ్యమానా భృశమీశ పావితాః |</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;">స వై బత భ్రష్టమతిస్తవైష తే</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;">యః కర్మణాం పారమపారకర్మణః |</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;">యద్యోగమాయా గుణ యోగ మోహితం</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;">విశ్వం సమస్తం భగవన్ విధేహి శమ్ </span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;">ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే తృతీయస్కంధే శ్రీ వరాహ ప్రాదుర్భావోనామ త్రయోదశోధ్యాయః | సంపూర్ణం.</span></p>visalakshihttp://www.blogger.com/profile/12353866459824269934noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2640908686154358505.post-48874107799484463992021-01-23T23:57:00.001+05:302021-01-24T12:12:46.392+05:30శ్రీ కృష్ణ దేవాలయం...<div class="separator" style="clear: both; text-align: justify;"><a href="https://1.bp.blogspot.com/-S6QW0DnMvAo/YAxo83Zj-4I/AAAAAAAACGc/Vnb5_tV2UBQEJMRNFY38Lm8lrJbeMejEwCLcBGAsYHQ/s965/20210123_234757.jpg" style="margin-left: 1em; margin-right: 1em;"><span style="color: #ff00fe; font-size: large;"><img border="0" data-original-height="833" data-original-width="965" src="https://1.bp.blogspot.com/-S6QW0DnMvAo/YAxo83Zj-4I/AAAAAAAACGc/Vnb5_tV2UBQEJMRNFY38Lm8lrJbeMejEwCLcBGAsYHQ/s320/20210123_234757.jpg" width="320" /></span></a></div><span style="color: #ff00fe; font-size: large;"><div style="text-align: justify;"><br /></div></span><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;"> శ్రీ కృష్ణ అద్భుత వింత దేవాలయం!</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;">మీకు తెలుసా ? ఈ దేవాలయంలో దేవుడికి ప్రసాదం పెడితే ప్రత్యక్షంగానే ఆయన భుజిస్తారు. సమర్పించిన నైవేద్యం అందరూ చూస్తుండగానే మాయమవుతుంది.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;"> గ్రహణం సమయంలో కూడా తెరిచి ఉండే ఏకైక కేరళ దేవాలయం తిరువరపు శ్రీకృష్ణ దేవాలయం, కొట్టాయం.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;"> అర్ధరాత్రి ఏకాంతసేవ తర్వాత కూడా దీపారాధన చేసే ప్రపంచంలోని అరుదైన హిందూ దేవాలయంగా పిలుస్తారు.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;"> ఇక్కడి కృష్ణపరమాత్మ మూర్తి చాలా ఆకలితో ఉంటారు. ఇక్కడ అర్చకులు రోజుకు 7 సార్లు స్వామికి మహా నైవేద్యాన్ని సమర్పిస్తారు. సమర్పించిన నైవేద్యం ప్రతిసారి కొంచెం తగ్గుతూ ఉండటం తరుచుగా గమనిస్తుంటారు. స్వామివారు స్వయంగా తింటారు అని ఇక్కడి భక్తుల విశ్వాసం. అదే విధంగా అందరూ చూస్తుండగానే ప్రసాదం మాయమవుతుంది.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;"> గుడి తెల్లవారుజావున 2 గంటలకు తెరుస్తారు. సాధారణంగా అన్ని దేవాలయాలలో అభిషేకం, అలంకరణ అనంతరం స్వామివారికి నైవేద్యం సమర్పిస్తారు కానీ ఈ దేవాలయంలో నైవేద్యం నివేదన చేసిన తర్వాత అభిషేకం, అలంకరణ చేస్తారు.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;"> నైవేద్యం సమర్పించడంలో కొంత ఆలస్యమైనా, ఆలయ ప్రధాన ద్వారం తెల్లవారుజామున తెరవకపోయినా చాలా దోషంగా భావిస్తారు. అందుకే ప్రధాన అర్చకుడి చేతిలో గొడ్డలి పట్టుకుంటారు. ఏదేని కారణం చేత తాలం పనిచేయకపోయినా, తాళం పోయినా, గొడ్డలితో తాళాన్ని పగలకొట్టడం ఇక్కడి ఆనవాయితీ.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;">కృష్ణుడికి చేసే నైవేద్యం చాలా రుచికరంగా ఉంటుంది. స్వామికి నివేదించిన అనంతరం భక్తులందరికీ ప్రసాదం పంచుతారు. ప్రసాదం తీసుకోకుండా ఏ భక్తుడూ ఆకలితో వెళ్ళకూడదని ఇక్కడి నియమం. అందుకే అర్చక స్వాములు “ఇంకా ఎవరైనా ప్రసాదం తీసుకోనివారు ఉన్నారా అని పెద్ధగా అరుస్తారు”. </span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;"> కృష్ణుడికి సమర్పించే నైవేద్యం ఆలస్యమైతే ఆకలికి తట్టుకోలేక కడుపు ఖాళీ అవ్వడం చేత స్వామివారి నడుము చుట్టూ కట్టిన ఆభరణం వదులై కొన్ని ఇంచులు క్రిందకు దిగడం మనం చూడవచ్చు. పూర్వం గ్రహణం సమయంలో ఆలయం మూయడం వలన ఇలాంటి అపసృతి చోటు చేసుకోవడం వలన, ఈ దేవాలయాన్ని గ్రహణం సమయంలోనే కాదు మరెప్పుడూ మూయరు .</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;">గ్రహ దోషాలు, గ్రహణ దోషాలు, సంతాన దోషాలు, సర్పదోషాలు, వ్యాపారాలలో నష్ట దోషాలు, వివాహ దోషాలు, బ్రహ్మహత్య వంటి మహాపాతకాలు ఏమున్నా సరే ఇక్కడికి వచ్చి కృష్ణపరమాత్మను దర్శించి, పూజిస్తే దోషాలు నివారింపబడుతాయి. దేవతలు, నవగ్రహాలు, అష్టదిక్పాలకులు కృష్ణభగవాణుడి సేవకులు కనుక ఇక్కడి కృష్ణభక్తులకు ఎటువంటి జాతక దోషాలు అంటవని స్వామిని భక్తితో కొలుస్తారు.</span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;">సైంటిష్టులకు కూడా అంతుచిక్కని ఎన్నో అద్భుతాలు ఈ ఆలయంలో జరిగాయి. భగవంతుడు ఉన్నాడు అని చెప్పడానికి ఇంత కన్నా గొప్ప దేవాలయం ఎక్కడ ఉంటుంది! </span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;"><br /></span></p><p style="text-align: justify;"><span style="color: #ff00fe; font-size: large;"> *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు</span><span style="font-size: medium;">*</span></p>visalakshihttp://www.blogger.com/profile/12353866459824269934noreply@blogger.com0