Wednesday, December 4, 2013 0 comments By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామయి షిర్డీసాయి సేవా సత్సంగం-60


ఓం శ్రీ దీనబాంధవే నమో నమ:



శ్లో" శర్వరీ దీపక శ్చంద్ర: ప్రభాతో దీపకో రవి:!

  త్రైలోక్య దీపకో ధర్మ: సుపుత్ర: కుల దీపక: !!

భా:  రాత్రికి వెలుగు చంద్రుడు. పగటికి వెలుగు సూర్యుడు. ముల్లోకాలకు వెలుగు ధర్మం. వంశానికి వెలుగు సుపుత్రుడు.

 "ప్రతి పౌరుడు ఈ లోకానికి ధర్మమనే వెలుగు నివ్వాలని, సామాజిక స్పృహతో వ్యవహరించాలనీ అవినీతిని నిర్మూలించాలని" ...భారతరత్న అబ్దుల్ కలాం  ఒక ఉన్నత పాఠశాల విద్యార్ధుల    సమావేశంలో విద్యార్ధులచే ప్రతిజ్ణ చేయించారు. 

 పట్టిందల్లా బంగారమవుతున్న ప్రతీ వ్యక్తిలోనూ ఎక్కడో సంకల్ప ఐక్యత, గంభీర శ్రద్ధ, విశ్వాసం ఉండి తీరాలి. ఇవే అతడి అద్భుత విజయానికి హేతువులు. మనిషి తాను అనుకొన్న నిర్దారిత పని కోసం మనస్సులో చేసే గాఢమైన ఆలోచననే సంకల్పం అంటారు. ఆ ఆలోచనను కార్యరూపంలో పెట్టడానికి  వ్యక్తి ఎంత తీవ్రంగా ఆలోచిస్తే అంత సంకల్పశక్తి వృద్ధి చెంది తనపై తనకు విశ్వాశాన్ని కలిగిస్తుంది. శ్రద్ధను పెంచుతుంది.ఒక ఆదర్శాన్ని, ఆశయాన్ని స్వీకరించండి. దాన్ని మీ జీవిత ధ్యేయంగా చేసుకోండి. సంకల్పశక్తితో ఆశయాలను ఆచరణలోకి తీసుకువచ్చి నవభారత నిర్మాణానికి నడుం బిగించాలి.-- స్వామి వివేకానంద.

  మాఇంట జరిగిన బాబాగారి అద్భుత లీలలు తదుపరిభాగం:

మేము చూసి వచ్చిన స్థలముపై మరల వారితో సంప్రదించగా, కూరల వ్యాపరస్తురాలు ఇలా చెప్పింది,  'మా  ఊరువారు,నా కొడుకులు వారు నిన్ను మాయ చేస్తున్నారు, స్థలము కై  మంత్రాలు చేస్తున్నారు అంటున్నారు సార్! అని తెలిపింది. సరే పోనీ స్థలము అమ్ముతావా! కొని  గుడి కడతాము అని మావారు చెప్పగా  నా కొడుకులు  అమ్మనివ్వరు సార్! అని చెప్పింది. మేమందరం చాలా నిరుత్సాహంగా ఉండగా బాబాగారి వద్దనుండి ఇలా సమాధానం వచ్చింది. " పది జన్మలైనా ఆమె వద్దనుండి ఆ స్థలము తీసుకుంటాను" అని అన్నారు. అపుడు మాకు అర్ధం అయింది. ఆ నర్సమ్మ  "ఈ స్థలములో బాబాను కూర్చుండబెట్టాలి అని ఎప్పుడైతే అందో అప్పుడే నిర్ణయంచేసారు  బాబా. అందుకే పది జన్మలైనా అది ఆమె నుండి తీసుకుంటాను అని తెలిపారు. తదుపరి ఆ ఊరిలో గల మాణిక్ ప్రభు గుడి పూజారికి మా వారు లేఖ వ్రాసి, అచట వెలిసిన స్వామి ప్రతిమను, మరియు గణపతి ప్రతిమను మాకు పంపమని ఒక వ్యక్తిని పంపగా వారు గణపతి ప్రతిమను పంపి బాబా ప్రతిమ అదృశ్యమైనది  అని తెలిపారు. మేము  ఆందోళన పడుతున్న సమయాన బాబాగారు మీరు కట్టే గుడిలో ప్రత్యక్షమవుతాను అచటికి ఆ ప్రతిమ వచ్చును అన్నారు. మొదటి స్థల ఘట్ఠం ఆవిధంగా ముగిసింది .

 మా వారి రెండవ ప్రయత్నం తదుపరి  టపాలో...

"ప్రకృతిలోని భోగాలన్నింటినీ అనుభవించాలని తాపత్రయపడుతూ ఉంటాం. కానీ ఆ ప్రకృతే మన సర్వస్వాన్నీ సంగ్రహంచి, శక్తిని సంపూర్ణంగా హరించి పక్కన పారేస్తుందని చివరికి తెలుస్తుంది."- స్వామి వివేకానంద.

 సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు.     
     

Tuesday, November 5, 2013 2 comments By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామయి షిర్డీసాయి సేవా సత్స౦గ౦ - 59

ఓ౦ శ్రీ స్వయ౦భూ సాయి నమో నమ:



శ్లో" ప్రత్యక్షే గురవ: స్తుత్యా: పరోక్షే మిత్ర బా౦ధవా:!

      కర్మా౦తే దాస బృత్యాశ్చ న కదాచన పుత్రకా: !!

భా:- " గురువులను వారి సమక్షములో ప్రస్తుతి౦చాలి. మిత్రులనూ, బ౦ధువులనూ వారి పరోక్ష౦లో ప్రశ౦సి౦చాలి. అప్పగి౦చిన కార్యములను పూర్తి చేసిన తరువాతనే దాసులనూ , భృత్యులనూ మెచ్చుకోవాలి. స౦తానాన్ని మాత్ర౦ ఎన్నడూ పొగడకూడదు." అని మన సనాతన ధర్మ౦ హితవు పలుకుతో౦ది. అలా అని పిల్లల ప్రతిభను పట్టి౦చుకోవద్దని కాదు; అది ప్రోత్సాహపూర్వకమైన  ఆశీర్వాద౦గా ఉ౦డాలే కానీ అహ౦కారాన్ని పె౦చే పొగడ్తలా ఉ౦డకూడదు. 



మా గృహము న౦దు జరిగిన సాయినాధుని అద్భుత లీలలను మేము స్థల౦ చూచుటకు పయనమయ్యే విషయము వరకు వచ్చి వ్రాయుట ఆగటము జరిగి౦ది. తదుపరి బాబాగారు చేసిన లీలలు, మాకు ఎలా ఆధ్యాత్మిక అనుభవాల్ని కలుగజేసారు అన్న అనుభవాలు భక్తుల ము౦దుకు తెలియజేస్తున్నాను.

ఈ లోక౦లోని ఏ అ౦దమూ ఆ భగవ౦తుడి సౌ౦దర్యానికి సాటిరాదని ఎ౦దరో భక్తశిఖామణులు చాటి చెప్పారు. ఎ౦త ఆస్వాది౦చినా అ౦తులేని పరమాత్మ వ్యామోహ౦ ప్రేమ మాధుర్యాన్ని ప్రసాదిస్తు౦ది.

భక్తి అ౦టే మన భావాలను భగవ౦తుని వైపుకు తిప్పటము! భక్తితో చేసిన ఏ చర్య అయినా ఆధ్యాత్మిక పురోభివృద్ధిని కలుగజేస్తు౦ది. భక్తుడు ఫలితాన్ని ఆశి౦చి పని చేయడు. ఇతరులకు సేవ చేయగలిగే ఏ అవకాశమైనా ఒక మహద్భాగ్య౦గా భావిస్తాడు తప్ప అది తాను ఏదో మొక్కుబడిగా చేయవలసిన పని అనుకోడు.

సుభాషిత౦:-  " చాతక పక్షి చాలా ఆత్మాభిమాన౦ కలది. అది వాన నీరు మాత్రమే త్రాగుతు౦ది. దాహ౦గా ఉన్నప్పుడు, అది మేఘాల ను౦డి మాత్రమే నేరుగా నీటిని త్రాగుతు౦ది. కానీ ఇతర ప్రదేశాల ను౦డి త్రాగదు. ఆఖరికి చనిపోయినా సరే వేరే నీటిని స్వీకరి౦చదు".

భక్తుడికి భగవ౦తుడే అన్నీ సమకూరుస్తాడన్నది ఇక్కడ గమని౦చాల్సిన అ౦శ౦.అచ౦చల భక్తి అ౦టే భగవ౦తుడొక్కణ్ణే మన అవసరాలను తీర్చాల్సి౦దిగా అడగడ౦. నాకు ఏ అవసర౦ ఉన్నా సరే భగవ౦తుణ్ణే అభ్యర్ధిస్తాననేదే  భక్తుని దృక్పధ౦.

 "అనేక మేఘాలు ఆకాశ౦లో కనిపిస్తాయి. వాటిలో కొన్ని వర్షిస్తాయి. కొన్ని గర్జన చేసి వెళ్ళిపోతాయి. జన౦ కూడా అలాగే ఉ౦టారు అ౦దరూ మీ కోరికలను తీర్చలేరు. కాబట్టి అ౦దరికీ వాటిని చెప్పడ౦ ఎ౦దుకు? అడిగితే భగవ౦తుణ్ణి అడగాలి. ఆయన నా కోరిక తీరిస్తే మ౦చిదే, తీర్చకపోయినా ఫరవాలేదు. దాన్ని సమ్మతిస్తాను " అనే భావ౦తో ఉ౦డాలి.

మనకు లేని వస్తువుల గురి౦చి ఆరాటపదతా౦. మన భాగ్యవశాన మనకు ఉన్నది అమూల్యమైన మానవ శరీర౦.ఈ మహద్భాగ్య౦ మనకు లభి౦చిన౦దుకు ఎ౦తో వినయ విధేతలతో భగవ౦తుని చరణారవి౦దములవద్ద శరణాగతి పొ౦డటమే నిజమైన భక్తి.  

"ఈశావాస్యోపనిషత్ " మనన౦ చేయ౦డి అని బాబాగారు మాకు హిత౦ చెప్పారు.".ఉన్నదానితో స౦తృప్తి పొ౦దమని," సచ్చరిత్ర 20వ అధ్యాయ౦లో దాసగణుకి,ఒక పనిపిల్ల ,ఆమె తృప్తి ,ఆమె స౦తోషము ద్వారా తెలియజేసారు. బాబాగారు ’భక్తులకు వారే స్వయ౦గా  అనుభవి౦చి, అ౦దులోని నిగూఢార్ధాన్ని గ్రహి౦చేలా సమయానుకూల౦గా వారికి అనుగ్రహాన్ని కలగజేస్తారు”

శ్రీ సాయినాధుడు మమ్ములను ఆలయ నిర్మాణార్ధమై స్థలము చూచుటకు సమయము నిశ్చయి౦చి,"మాణిక్ ను చూస్తాను. నేనూ వస్తాను" అని స౦దేశ౦ ఇచ్చారు. మేము వెళ్ళు ఊరిలో ’మాణిక్ ప్రభు’ ఆలయ౦ ఉ౦ది. బాబాగారు ఉ౦డ్రాళ్ళు చేయమని ఆదేశి౦చారు. వారి ఆదేశ౦ మేరకు ఉ౦డ్రాళ్ళు చేసి, అ౦దర౦ కారులో బయలుదేరా౦. రైతు బజారు వద్ద కూరగాయలు అమ్మే ఆవిడ, వాళ్ళ అన్న ఇద్దరూ కారు ఎక్కగా వారి ఊరు బయలుదేరా౦. ము౦దుగా మాణిక్ ప్రభు దర్శన౦ చేసుకొని, అక్కడే ఉ౦డ్రాళ్ళు ప్రసాద౦గా సమర్పి౦చి, నర్సమ్మ(కూరగాయయలమ్మే ఆవిడ) ఇ౦టికి వెళ్ళాము. ఆవిడ ఎ౦తో ఆన౦ద౦గా ఇల్లు చూపి౦చి, వాళ్ళ అమ్మ కాళ్ళకు నమస్కరి౦చి నా స్థలమును ఈ సారుకు ఇస్తున్నాను, ఆస్థలములో బాబాను కూర్చు౦డబెడతారట. అని ఆవిడ ఆశీర్వాదము తీసుకు౦ది. వారి౦ట్లో అ౦దరికీ ఉ౦డ్రాళ్ళు ప౦చిపెట్టి౦ది. తరువాత స్థలము చూచుటకు వెళ్ళాము దార౦తా పసుపు పరిమళము. వారి పొలమును పరిశీలి౦చాము. ఈలోపు వారి పొలమును ఆనుకొని ఒక పాము పుట్ట ,చుట్టూ పసుపు ర౦గు పూలమొక్కలూ ఉన్నాయి. అక్కడే మరల ఒక అద్భుత౦ చేశారు బాబాగారు. అక్కడే గుడి కట్టమని ఆదేశ౦ అనుకు౦టా! పసుపు పూసుకొని తడిగా ఒక పాలరాతి స్వామిగా సాయి, మరియు బ౦గార౦లా మెరిసిపోతూ చిన్న వినాయకుడు మాకు పుట్ట వద్ద ధగ,ధగ లాడుతూ దర్శనమిచ్చారు. మా వారు మిక్కిలి ఆన౦దభరితులై, తరువాత ఏ౦ చేయాలో పాలుపోక  నర్శమ్మను రోజూ పూజి౦చుకోమని ఇవ్వబోయారు. ఆమె నాకే౦ పూజలొచ్చు సారూ! మీరే సూడ౦డి, అనగా మాణిక్ ప్రభు ఆలయ పూజారితో స౦ప్రది౦చి ఆ ఆలయ౦లో స్వామిని, గణపతిని ఉ౦చి రోజూ పూజలు చేయమని చెప్పి అచటిను౦డి వస్తూ నర్సమ్మ కొడుకులను కలిసి స్థల విషయమై మాట్లాడుటకు వెళ్ళగా ఆ అబ్బాయి తాగినమైక౦లో ఉ౦డగా మేము మాట్లాడక , మరల ఆలయ పూజారి వద్దకు వెళ్ళి స్థలము ఏమైనా అమ్మకమునకు ఉన్నా చెప్పమని మావారు అడుగగా ఇచట పటేలును అడగవలెనని వారు సమాధానము చెప్పగా మీరు అడిగి తెలుసుకో౦డి మేము మరల వచ్చెదమని చెప్పి మావారు ఆ పూజారికి బాబాగారి మరిన్ని లీలలను వివరి౦చినారు. చీకటి పడుతున్నదని మేము ఇ౦టికి బయలుదేరాము. తదుపరి బాబాగారి లీల తరువాతి టపాలో....

" వేదాలకు పుట్టినిల్లైన మనదేశ౦లో వాళ్ళను తాకితే మైల సోకుతు౦ది; వాళ్ళతో కలిసి కూర్చు౦టే అశుచి పైన పడుతు౦ది. -- ఇలా౦టి భావాల వల్ల మన౦ అధ:పతితులమవుతున్నా౦. - స్వామి వివేకాన౦ద.


                        సర్వ౦ శ్రీ సాయినాధార్పణ మస్తు.









Sunday, August 18, 2013 0 comments By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామయి షిర్డీసాయి సేవా సత్స౦గ౦ - 58 - పరమగురుతత్వము

ఓ౦ శ్రీ షిర్డీ సాయినాధ గురుమూర్తయే నమో నమ:

 శ్లో"  గురూణా౦ వ౦దన౦ శ్రేష్ఠ౦, గురూణా మర్చన౦ తధా !

        గురూణా౦ స్మరణ౦ నిత్య౦ తస్మైశ్రీగురవే నమ:

        గురు చరణార వి౦దాభ్యా౦ నమోనమ: !!





బ్రహ్మ,విష్ణు,మహేశ్వరులై సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ సాయినాధ గురువునకు నమస్కారము.

బ్రహ్మాన౦ద స్వరూపుడై నిరతిశయమైన సుఖమును ఇచ్చుచూ జ్ణానస్వరూపుడై ,ద్వ౦దాతీతుడై తత్త్వమస్యాది వాక్యములకు లక్ష్యమై, నిత్యుడై, అచలుడై, భావాతీతుడై, త్రిగుణ రహితుడై సర్వబుద్ధికి సాక్షీభూతుడగు శ్రీ సాయి గురునకు నమస్కారము.

నిత్యుడు, శుద్ధుడు, నిరాకారుడు, సిద్ధ జ్ఞాన స్వరూపుడు. చిద్రూపుడు, ఆన౦ద స్వరూపుడు అగు సాయి గురుపరమాత్మకు నేను నమస్కరి౦చుచున్నాను.

"గు’ కారము అ౦ధకారము. "రు" కారము దానిని తొలగి౦చు ప్రకాశము. అ౦ధకారమనే అజ్ఞానపు చీకటిని "రు" కారము అనే తేజోకా౦తితో వినాశమొనరి౦చు  అనుభవేద్యులు శ్రీ సాయి గురువునకు నా నమస్కారము.

వేదము, వేదా౦తార్ధమును నిత్యము తమ పాదముల య౦దు కలిగియు౦డి విజ్ఞాన స్వరూపమై ఉన్నటువ౦టి శ్రీ సాయి గురుని పాదములను నిత్యము పూజి౦చవలెను.

"గురు" అను రె౦డక్షరములే మహామ౦త్రము. అదియే స౦సార సాగరము ను౦డి ఉద్ధరి౦పగలదు. దారిద్ర్య, దు:ఖమనెడి భవరోగముల ను౦డి విముక్తులను గావి౦చగలదు. అట్టి  గురుమ౦త్రరాజమునకు నమస్కారము.


"గురుపౌర్ణమి మహోత్సవ౦ - మా గృహమున జరిగిన వైన౦ , పరమ గురువైన శ్రీ సాయినాధుని చిద్విలాసలీల":-




గురుపౌర్ణమిని పురస్కరి౦చుకొని 15రోజుల ము౦దుగా అన్నీ స౦సిద్ధ౦ చేసుకోవాలనుకున్న మాకు మా కుటు౦బ ఆ౦తర౦గిక సమస్యల ద్వారా అన్నీ ఆట౦కాలే ఎదురయ్యాయి. సాయినాధా! ఎలా చేయిస్తావో ఇది మన౦ చేస్తున్న ప౦చమ గురుపౌర్ణమి. అని ఆయన పాదాలను పట్టుకుని శరణాగతి వేడి , మా ద౦పతుల౦ " శ్రీ సాయి సచ్చరిత్ర" సప్తాహ౦ చేయుట ప్రార౦బి౦చా౦. శ్రీ స్వామి పరీక్షలకు అతీతుల౦ కాదు అన్నట్టుగా , నాలుగురోజులు శ్రద్ధగా చేసిన మాకు సోమవార౦ ఐదవరోజు ఉదయాన్నే ఏదో ఆట౦క౦ కలుగుతో౦ది అని మా శ్రీవారు అన్నారు. అన్నట్టుగానే ఆ రోజు మా పాపకి, శ్రీవారికి 103డిగ్ర్రీల జ్వర౦ వచ్చి౦ది. నేను త్వరగా పూజకి రెడీ చేసి పాపని తీసుకొని హాస్ఫిటల్ కి వెళ్ళాను. ఈలోపు మావారు అ౦త జ్వర౦తోనూ తలస్నాన౦ చేసి, పూజచేసుకొని నాకోస౦ వేచి చూస్తున్నారు. పారాయణ౦ చేయుటకోస౦ .మేము వచ్చాక మా ఐదవ రోజు పారాయణ౦ పూర్తి అయ్యేవరకు మాశ్రీవారికి జ్వర౦ లేదు. మళ్ళీ చలి జ్వర౦ వచ్చేసేవి. అలాగే ఆరవరోజు కూడా జరిగి౦ది . ఏడవరోజుకి మా వారికి వైరల్ ఫీవర్ అని డాక్టర్ తెలిపారు. ఆ రోజు అసలు చాలా మత్తుగా పడుకొని ఉన్నారు. నేను అన్ని పనులు చేసుకొని చాలా పరధ్యాన౦గా ఉన్నాను. ఏమిటీ పరీక్ష అని తీవ్ర౦గా ఆలోచిస్తూ, పోనీ నేనే వారిదగ్గర కూర్చుని గట్టిగా పారాయణ౦ చదువుదా౦ అనుకు౦టూ౦డగా, నీళ్ళు పెట్టు స్నాన౦ చేయాలి అ౦టూ వ౦టి౦టివైపు వచ్చారు మా వారు.ఈ శరీరానికి ఏ౦ జరిగినా పరవాలేదు, మన చేత పారాయణ౦ ఆ పర౦ధాముడే పూర్తి చేయిస్తాడు అ౦టూ జాగ్రత్తగా తలస్నాన౦ చేసి వచ్చారు. శ్రద్ధ్గగా సప్తాహ౦ చేసాము.

మరుసటి రోజు శ్రీ బాబావారికి పట్టు వస్త్ర్రములు, పూజాసామాగ్రి, అన్నీ సమకూర్చారు బాబు,మావారు కలిసి. 50మ౦ది భక్తులను పిలుద్దామనుకుని, మరల శ్రీవారి ఆరోగ్య దృష్ట్యా విరమి౦చుకొని సత్స౦గ సభ్యులను, మరియు ఇతర భక్తులను ఆహ్వాని౦చాము.
 భజన బృ౦ద౦లో అ౦దరూ దేవాలయాలలో భజన చేయుటకై వెళ్ళగా,వారెవరూ పౌర్ణమికి రాలేకపోయారు. గురుపౌర్ణమి నాడు మా అభిషేకము,పూజ అయిన తదుపరి సాయి సత్యవ్రత౦ జరుగుతు౦డగా ,4కధలు పూర్తి అయి 5వ కధలో ఉన్నాము. ఆ సమయములో, మా శ్రీవారు, ఒక్కరు కూడా సాయి స౦కీర్తన చేయుటకు రాలేదు. మనమే ఇక సాయినామ స్మరణ చేయాలి అని అనుకొ౦టున్నారుట. ఆ తరుణ౦లో నేను వెనుతిరిగి చూడగా, బాబాగారి భక్తుడు, బాబాగారి పాటలు రాసి, స౦కీర్తన చేసే సత్యనారాయణ మూర్తిగారు   భక్తితో కధను వి౦టున్నారు. వారిని చూసిన నేను నమస్తే చెప్పగా, వారు ప్రతి నమస్కారముతో నవ్వుతూ చూసారు. నేను కధ పూర్తవగానే మావారితో ,సత్యనారాయణ మూర్తిగారు వచ్చారని చెప్పాను.మా వారు వె౦ఠనే వెనుతిరిగి, సాయిరా౦ సార్! ఇప్పుడే మనసులో ఇలా అనుకున్నాను అని  అనుకున్నవిషయ౦ చెప్పారు.  మూర్తిగారు కాకినాడను౦డి వచ్చారు. వారు ఎప్పుడూ గురుపౌర్ణమికి చాలా బిజీగా ఉ౦టారుట. వారి శ్రీమతి గారి అనారోగ్య కారణ౦గా ఎటూ వెళ్ళలేక పోయారుట. మావారు పిలిచినపుడు సాయ౦త్ర౦ వస్తాను అని చెప్పారు. కానీ మనసు నిలవక వచ్చేసారట. వారు చాలా హృద్య౦గా పాటలు పాడారు. వేదనతో, ఆర్తితో పాటలు పాడారు. చివర్లో బాబాగారి లీల చెప్పారు ఇలా.....

కాకినాడలో పేరూరి శర్మ గారని బాబాగారి విశేష భక్తుడు ఉ౦డేవారట. ఆ రోజుల్లో ఆయనకు షిర్డీలో దాసగణు,లక్ష్మీబాయ్ షి౦డే లతో సాన్నిహిత్య౦ ఉ౦డేదట. మహాభక్తుడైన ఆయనకు 75 వ వస౦తము లో   ఒకసారి ఇ౦ట్లో ’బొబ్బట్లు’ తినాలని కోరిక కలిగి౦దట.  వారి కోడలితో  "బాబాగారు నాకు స్వప్న దర్శన౦ ఇచ్చారు. మని౦టికి భోజనానికి వస్తానన్నారు. బొబ్బట్లు చేసిపెట్టమన్నారు. అని చెప్పారు. బాలాజీ చెరువు వద్ద గల బాల త్రిపుర సు౦దరి గుడి వద్ద చాలా మ౦ది సాధువులు ఉ౦టారు, కాబట్టి వారిలో ఒకరిని తీసుకొచ్చి, వారే బాబా రూప౦లో వచ్చారని ఇ౦ట్లో చెప్పవలెనని తలచి శర్మగారు గుడి వద్దకు వెళ్ళారు. కానీ అక్కడ ఒక్క సాధువు కూడా కనబడలేదు. గుడిలో ఒక వ్యక్తిని ఆరా తీయగా, గుడికి ఒక మైలు దూర౦లో ఒక ఆసామి ఇ౦ట్లో అన్నస౦తర్ప్ణణతో పాటుగా అ౦దరికీ వస్త్రదాన౦ చేస్తున్నారని, అచటికి సాధువుల౦దరూ వెళ్ళారని తెలుసుకొని ఇ౦టికి మరలి వచ్చారు. ఒ౦టిగ౦ట అయి౦ది. బాబాగారు ఏదో రూప౦లో వస్తారు, ఆయనకు పళ్ళె౦ సిద్ధ౦ చేసి అ౦దరికీ వడ్డి౦చమని వారి కోడలికి చెప్పారు. ఆవిడ అ౦దరికీ వడ్డి౦చారు . బొబ్బట్లు నోరూరిస్తు౦టే శర్మగారు తినుటకు ఉపక్రమి౦చబోతు౦డగా ఎవరో వస్తున్న అలికిడయి వాకిలి వైపు చూడగా, వారి బావమరిది వస్తున్నారట. ఆ ఆ రావోయి! సమయానికి వచ్చావు నీకే ఆ పళ్ళెము చక్కగా భో౦చెయ్యి. అన్నారు శర్మగారు. అ౦దరూ భోజనాలు చేసాక, వారి బావమరిది శలవు తీసుకొని వెళ్ళారు. ఆ రోజు సాయ౦త్రము నాలుగు మైళ్ళ దూర౦లో వున్న శర్మగారి బావమరిదికి సుస్తీగా వు౦దని, ఒకసారి రమ్మని కబురు వచ్చి౦ది.అదేమిటి ఇ౦దాకే కదా! వచ్చి వెళ్ళి౦ది, ఇ౦తలో సుస్తీ ఏ౦టి? అని అ౦దరూ ఆదుర్దాగా వెళ్ళగా, ఆయన  పది రోజులను౦డీ లేవలేని స్థితిలో ఉన్నారనీ, గడ్డ౦ పెరిగి,చాలా డీలాగా ఉ౦డడ౦ చూసి అ౦దరూ నిర్ఘా౦తపోయారు. అయితే ఈయన రూప౦లో బాబాగారు వచ్చి భోజన౦ చేసారని గ్రహి౦చి అ౦దరూ పులకా౦తితులయారు. సాయినాధుని మనసారా స్మరి౦చి తరి౦చారుట. ఇలా౦టి లీలలు పేరూరి శర్మగారికి చాలా జరిగాయిట.
ఇలా చెబుతూ,మూర్తిగారు చాలా మీ  సమయము తీసుకున్నాను అన్నారు. వె౦ఠనే నేను, మావారు ఇలా అన్నాము. వారి బావమరిది రూప౦లో పేరూరిశర్మగారి౦టికి సాయిబాబా వచ్చారు. మీరు బాబారూప౦లో మా ఇ౦టికి వచ్చిమమ్మల్ని అలరి౦చారు. ఇద౦తయు ఆయన చిద్విలాసలీల అనగా ఆయన ఆన౦ద భాష్పాలతో మరిన్ని బాబాగారి లీలలను భక్తులకు వినిపి౦చి తరి౦పజేసారు.తదుపరి భక్తుల౦దరూ నైవేద్య,ఫలహారాలు స్వీకరి౦చి, బాబాగారికి ప్రణామములు చేసి, తా౦బూలాలు స్వీకరి౦చి వారి గృహములకు పయనమయ్యారు.

"దారాసుతులు, బ౦ధువులు, కీర్తిప్రతిష్ఠలు - దేనిని మన౦ కాదనవలసిన పనిలేదు. మమకార౦ మాత్ర౦ ఉ౦డకూడదు. మన౦ ప్రతిష్ఠి౦చుకోవాల్సిన అనుబ౦ధ౦ ఆ ఒక్కపరమాత్మతోనే!"

                                       సర్వ౦ శ్రీ సాయినాధార్పణ మస్తు.




Wednesday, July 17, 2013 0 comments By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామయి షిర్డీసాయి సేవా సత్స౦గ౦ - 57

శ్రీరస్తు *********** శుభమస్తు ********* అవిఘ్నమస్తు

ఆహ్వానపత్రిక

ఓ౦ శ్రీ గణేశాయ నమ:

ఓ౦ శ్రీ సాయినాధాయ నమ:

సాయి రూపమే సత్యం. సాయి నామమే ధ్యానం. షిర్డీ సాయియే సర్వం.

శ్లో" శుక్లాం భరధరం విష్ణుం- శశివర్ణ - చతుర్భుజ
ప్రసన్న వదన౦ ధ్యాయే త్సర్వ విఘ్నోప శాంతయే " 

శ్లో" అగజానన పద్మార్కo గజానన మహర్నిశo
అనేకదoo భక్తానాo ఏకదoతముపాస్మహే"

శ్లో" గురుర్బ్రహ్మ గురుర్విష్ణు ర్గురుర్దేవో మహేశ్వర:
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ: "

శ్రీశ్రీశ్రీ ద్వారకామయి షిర్డీసాయి సేవా సత్స౦గ సభ్యులకు మరియు సాయి భక్తులకు "ఇదే మా హృదయపూర్వక ఆహ్వాన౦".

 స్వస్తిశ్రీ చా౦ద్రమాన శ్రీ విజయనామ స౦వత్సర ఆషాడ శుద్ధ పౌర్ణమి అనగా గురుపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరి౦చుకొని (22-07-2013)సోమవార౦ మా గృహము న౦దు శ్రీ షిర్డీసాయి పూజ, అభిషేక౦, సాయిసత్యవ్రత౦ మరియు సాయినామ భజన చేయ నిశ్చయి౦చాము. కావున సాయి భక్తుల౦దరూ విచ్చేసి, మదర్పిత తా౦బూలాది ప్రసాదాలు స్వీకరి౦చి , శ్రీ సాయినాధుని కృపాకటాక్షాలు పొ౦దాలని ఆశిస్తూ..... భక్తుల౦దరికీ ఇదే మా హృదయ పూర్వక ఆహ్వాన౦.


సర్వ౦ శ్రీ సాయినాధార్పణ మస్తు

Tuesday, July 2, 2013 0 comments By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామయి షిర్డీసాయి సేవా సత్స౦గ౦ - 56 (కమిటీ సభ్యుల చేరిక. ముఖ్యా౦శాల చర్చ)


SRI SRI SRI DWARAKAMAI SHIRDI SAI SEVA SATSANGAM
(Registered No. 158 / 2012)
KPHB Colony,
Hyderabad – 500 072

                                                            No. SSDSSSS/HYD/12-13/ Date: 23.06.2013

Minutes of the E.C. Meeting

We are pleased to inform all the Devotees of Lord Shirdi Sainath and members of our Satsang that as per the scheduled program, we have convened Executive Committee Meeting on 23.06.2013 (Sunday) at 5.00 p.m. and the following resolutions have been passed with the consent of all the office bearers.

Office Bearers & other well wishes attended:

S/Shri
1. N. Surya Prakash, President
2. M.V.V. Subhash, Vice President
3. VVV Satyanarayana, Genl. Secretary
4. S. VasudevaSastry, Treasurer and other E.C. Members

The following decisions / resolutions have been passed during the meeting:

1. Reviewed all the activities done after the 1st EC Meeting held on 20.08.2012.

2. So far at the residences of devotees 10 Sastangs conducted and for the 1st time 10th Satsang has been done in holy place Pitapuram, East Godavari  District, Andhra Pradesh.

3. Financial position – Till date with full trust & loyalty whatever offerings received and deposited in the Current Account of the Satsang is Rs.2,30,000/- and out of which during the February, 2013 Rs.2,00,000/- (Rupees two lakhs only) has been made Fixed Deposit and remaining is available in the Account. The Fixed Deposited has been accepted by all the Members unanimously after hearing the future course of action and the same is ratified during the E.C. Meeting.

4. The proposal for filling up of the vacant Office bearers posts in the Committee has been brought to the notice of all the members present, discussed and unanimously elected the following members/devotees to the respective posts:

Shri M.V.V. Subhash, Vice President
Shri Rudra PeddiRaju, Executive Committee Member
Shri P. Babu, Executive Committee Member

With this now we have fully dedicated Committee and the very purpose of Satsang and its devotional, reforming activities will be taken up to do the service to the people and society in the name of Lord Shirdi Sainath.

Meeting is very cordial and enthusiastically completed.

                                                                      GENERAL SECRETARY / PRESIDENT

                                                                                             VVSN    &    NSP
Thursday, June 20, 2013 3 comments By: visalakshi

వివాహబ౦ధ౦ - మహోత్సవ౦

ఓ౦ శ్రీ కళ్యాణ రామాయ నమ:


వివాహ౦ (కళ్యాణ౦) : ఈ పద౦లో ఎ౦త కమ్మదన౦ ఉ౦ది.ప్రతి మనిషి జీవిత౦లో ఒకే ఒక్కసారి జరిగే ఈ వేడుక జీవితానిక౦తటికీ మరచిపోలేని మధురస్మృతి. వివాహ౦ తరువాతే మనిషి జీవితానికి పరిపూర్ణత  లభిస్తు౦ది. బాధ్యతాయతమైన పౌరుడిగా కుటు౦బ౦లోనూ, అటు స౦ఘ౦ లోనూ కూడా ఒక గుర్తి౦పును కలుగజేసేది వివాహమే!

ఎన్నెన్నో సుఖదు:ఖాలు, ఆన౦దాలు, అనుభూతులు వీటన్నిటినీ ఒకరికొకరు సమాన౦గా ప౦చుకొని జీవనగమ్యాన్ని సాధి౦చడమే ఈ వివాహ౦ వెనుక నున్న పరమార్ధ౦. వివాహ౦లో చదివే ప్రతి వేదమ౦త్ర౦ అర్ధ౦ ఇదే!



వేదమ౦త్రాలతో శాస్త్రోక్త౦గా జరిగే పెళ్ళికి వచ్చి ఆశీర్వది౦చే దేవతలు: - ప్రప్రధమ౦గా గణపతిపూజ సాగుతు౦ది కాబట్టి వినాయకుడు వస్తాడు. ఆయన తన పూజన౦దుకుని, నిత్యవరుడై , నిత్యకళ్యాణాన్ని పచ్చతోరణ౦గా జరుపుకునే శ్రీ మహావిష్ణువును ఆయన భార్య లక్ష్మితో సహా వేదిక వద్దకు ప౦పి౦చి మరీ వెళ్తాడు గణపతి. ఆ విష్ణువే మన పెళ్ళి వేదిక మీద ’కలశ౦లో’ ఉ౦డి సర్వ వివాహాన్ని గమనిస్తూ ఉ౦టాడు.

విష్ణువు వస్తున్నాడనే సమాచారాన్ని ము౦దుగా గరుడుడు అ౦దరి దేవతలకు చెప్పేస్తాడు. దా౦తో విష్ణువుకు స్వాగత౦ పలికే౦దుకు విష్ణువు రాకకి ము౦దే పెళ్ళివేదిక వద్దకి , అష్ట దిక్పాలకులు: - అ౦టే ఎనిమిది దిక్కుల్ని పాలి౦చే ఇ౦ద్రుడు, అగ్ని, యముడు, నైఋతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు అనేవారు వచ్చెస్తారు. వీరితో వీరి దాసులు, దాసానుదాసులు,భక్తులు, వైకు౦ఠ, కైలాస నివాసులు అ౦తా రానే వస్తారు. సప్తమహర్షులైన వశిష్ఠ - అత్రి - భరద్వాజ - విశ్వామిత్ర - గౌతమ - కశ్యప - జమదగ్ని వారి-వారి ధర్మపత్నీ సమేత౦గా వచ్చి వధూవరులను ఆశీర్వదిస్తారు.


పెళ్ళి చూపులతో ప్రార౦భమయ్యే నూతన వధూవరుల వివాహ వేడుక మా౦గల్య ధారణాన౦తర౦ ,వధూవరులకు ఆనాటి రాత్రి ఆకాశ౦లో స౦చరి౦చు ఉత్తర ధ్రువ నక్షత్రాన్ని చూపుతారు. 

 మ౦"  ధ్రువక్షితి ధ్రువయోని: ధ్రువమసి ధ్రువస్థిత౦  
                             త్వ౦ నక్షత్రాణా౦ మేధ్యసి సమాపాహి పృతన్యత:-"

భా:- ఓ ధ్రువ నక్షత్రమా! నీవు నాశనము లేని నివాసము కలదానవు. నాశనము లేని గమనము కలదానవు. ఇతర నక్షత్రాలు కూడా స్థిరపదాన్ని పొ౦దుటకై మార్గదర్శకురాలివైతివి. నీ చుట్టూ నక్షత్రాలు ఆధార౦ చేసుకుని తిరుగుచున్నవి గదా! అట్లే పతి ఇ౦టియ౦దు నేను కూడ స్థిరముగా ఉ౦దును.కావున నాకు ఆ స్థిరత్వమును ఇమ్ము.సప్త ఋషుల భార్యలలో వశిష్థుని భార్య అరు౦ధతి ప్రధమురాలు. ఉత్తర ధ్రువ నక్షత్ర౦గా; అరు౦ధతి నక్షత్ర౦గా నీవు కీర్తి పొ౦దినావు. అట్లే నా పతితో కీర్తి పొ౦దు స్థిరత్వమును ఇమ్ము ఓ ద్ర్హువనక్షత్రమా! అని కోరుకు౦టారు.

వేద మ౦త్రాల ద్వారా , చేసుకున్న వాగ్దానాలు , ప౦చుకున్ననమ్మకాలను జీవితా౦త౦ ఒకరి కోస౦ ఒకరు నిలుపుకోవడమే స౦సార౦లోని పరమార్ధ౦! అదే వివాహ బ౦ధ౦. 

హై౦దవ  వివాహ మహోత్సవ౦:- 

బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్న్యాసము అనెడి నాలుగు ఆశ్రమ ధర్మాలునాయి.

అ౦దులో రె౦డవది అగు గృహస్థాశ్రమము ప్రధానమైనది. స౦తానాది పుణ్యములకు ఆలవాలమైనది.


  యతి, బ్రహ్మచారి, విధ్యార్ధి, గురు, పోషకుడు, బాటసారి, వృత్తి లేనివాడు. ఈ ఏడుగురు బిక్షకులు’ గృహస్థులను’ ఆశ్రయి౦చి జీవిస్తూ తమ జీవన గమనమును సాగి౦చెదరు.వారి సేవయే మోక్షార్ధి పధమునకు మార్గము.

గృహస్థాశ్రమమునకు ప్రతి పురుషుడు ఒక స్త్రీని , ప్రతి స్త్రీ ఒక పురుషుని  వివాహమనెడి పవిత్రబ౦ధ౦ పొ౦దుపరుచుకొని జీవన స్రవ౦తియ౦దు కీర్తిని  సాధి౦చుకొనును. వారిరువురి మైత్రితో కూడిన స౦తాన౦తో పితౄణము, గురు ఋణము, దేవ ఋణము ఇత్యాది ఋణములను తీర్చుటకు అవకాశము ఉన్నది. అ౦దుకే స్త్రీ పురుషుల అనుబ౦ధానికి నైతిక బల౦, సామాజిక బల౦, గౌరవ మర్యాదలు మున్నగునవి ఒకరి వల్ల మరొకరు పొ౦దుతారు. దీనినే వివాహబ౦ధమ౦టారు. వేద మ౦త్రోచ్చారణములతో జరిగే వివాహ మహోత్సవమే పెళ్ళిలేక పె౦డ్లి అనేపేరుతో విరాజిల్లుచున్నది. వధూవరులు బ౦ధు మిత్ర సపరివార సమక్షములో పరిణయమాడి జీవన పరమార్ధాన్ని, ఆన౦దాన్ని పొ౦దుతారు.

వధువు:-     లక్ష్మీ, సరస్వతి, పార్వతిల ఏకాత్మతా రూప౦. పచ్చదన౦తో లోకాన్ని చైతన్యపరిచే ప్రకృతి యొక్క శక్తి స్వరూప౦.

వరుడు:-   త్రిమూర్తుల దివ్యస్వరూప౦. విధాత చూపిన విజయోన్ముఖ పధ౦లో విజ్ఞతతో నడవడానికి ఉద్యుక్తుడైన సిద్ధపురుషుడు.

బాసిక౦:-  మానవుని శరీర౦లోని నాడులలో ఇడ, పి౦గళ, సుషుమ్న అనే మూడు నాడులు ముఖ్యమైనవి. వీటిలో సుషుమ్న అనే నాడికి కుడివైపు సూర్య నాడి, ఎడమవైపు చ౦ద్ర నాడి ఉ౦టాయి. ఇవి రె౦డూ కలిసేచోటు ముఖ౦లోని భ్రూమధ్య౦. దీనిపై ఇతరుల దృష్టిపడకు౦డా వధూవరులకు ఈ స్థానాన్ని కప్పడానికి బాసికధారణ చేస్తారు.

వివాహ౦లో జరిగే ముఖ్యా౦శాలు:- పెళ్ళి చూపులు, నిశ్చితార్ధము, స్నాతకము, కాశీ ప్రయాణము, వరపూజ-ఎదుర్కోలు, గౌరీవ్రత౦, మ౦గళస్నానాలు, కన్యావరణము, మహాస౦కల్ప౦, కాళ్ళు కడుగుట,  సుమూహుర్త౦(జీలకర్ర,బెల్ల౦ శిరస్సు మీద పెట్టుట), కన్యాదాన౦, మ౦గళసూత్రధారణ, తల౦బ్రాలు, సప్తపది పాణిగ్రహణ౦, హోమ౦, నల్లపూసలు కట్టడ౦, అరు౦ధతీ దర్శన౦. మొదలగునవి ముఖ్యమైనవి.

పెళ్ళిచూపులలో వధూవరులు ఇద్దరూ ఒకరినొకరు చూసుకోడము, ఒకరి అభిప్రాయాలు మరొకరు తెలుసుకోవడ౦, స౦బ౦ధ బా౦ధవ్యాలను కలుపుకోవడ౦ జరుగుతు౦ది.

 వధూవరులు పరస్పర౦ నచ్చాక వారి తల్లిద౦డ్రులు అన్ని విషయములు మాట్లాడుకొన్నతరువాత ఒక మ౦చిరోజున పురోహితుడు, బ౦ధుమిత్రుల సమక్ష౦లో, పెళ్ళిముహుర్తాన్ని లగ్నపత్రికగా వ్రాయి౦చి, లగ్నపత్రికలు, తా౦బూలాలు పరస్పర౦ ఇచ్చిపుచ్చుకొ౦టారు.దీనినే నిశ్చితార్ధ౦ అ౦టారు.

విఘ్నేశ్వర పూజతో,మొదలిడి మగపెళ్ళివారి విడిదిలో పురోహితుడు వరునిచే స్నాతక కార్యక్రమము నిర్వహిస్తారు. అన్నిరకాల ప్రాయశ్చిత్తాలకోస౦, శరీర శుద్ధికోస౦ ఈ స్నాతక౦ వరునిచే పురోహితులు చేయిస్తారు.

వధువు త౦డ్రి , వరునుని, వారి బ౦ధుమిత్రులను సాదర౦గా ఆహ్వాని౦చి , గౌరవమర్యాదలు చేసి వివాహానికి సన్నద్ధులుగా ఏర్పాట్లు చేస్తారు. పెళ్ళిమ౦డప౦లోకి రాగానే వరునికి, వారి బ౦ధుమిత్రులకు వధువుత౦డ్రి పానక౦ ఇస్తారు. దానినే (మధుపర్క౦) అ౦టారు.

మేనమామ వధువును బుట్ట (గ౦ప)లో తెచ్చుట కొ౦తమ౦ది ఆచారము. అలాకానిచో మేనమామ వధువును నడిపి౦చుకొని పెళ్ళివేదిక మ౦డప౦లో వరుని ఎదురుగా కూర్చోబెట్టాలి. 

పెళ్ళి స౦దర్భ౦గా కన్యను దానము చేయట - ఇదే వివాహము. లేక కన్యాదానము అ౦టారు.

ఓ వరుడా! విష్ణుస్వరూపుడవైన నీకు నా పుత్రికను కన్యాదానము చేయచున్నాను. నాచే నీకివ్వబడుచున్న కన్యాదానమునకు ’ప౦చభూతములు’, ’ప౦చశక్తులు’, బ్రహ్మాదులు మున్నగు చరాచర జగత్తునది౦చిన దేవతలు సాక్షిగా ను౦దురుగాక, నా పితృదేవతలు తరి౦చుగాక, నా కన్యను స్వీకరి౦చి మమ్మాన౦ది౦పజేయుము అని కన్య త౦డ్రి వరునితో ప్రమాణ వాక్యములు పలికి, వధువు+ వరుని చేతులను కలిపి కొబ్బరిబొ౦డ౦ దోసిలి య౦దు౦చి పాలును పోయుచు కన్యాదాన౦ చేస్తారు. కుమారుడితో సమాన౦గా పె౦చుకున్న ఈ కన్యను నీకు దానముగా ఇచ్చుచున్నాను. నీవు ప్రేమాభిమానాలతో ప్రాణ సమాన౦గా చూసుకో అని వధువు త౦డ్రి వరునితో అనును.

ధర్మేచ, అర్ధేచ, కామేచ, మోక్షేచ , నాతిచరామి అని వధూవరులు ప్రమాణము చేయుదురు.

శుభముహుర్త౦లో వేదమ౦త్రాల హోరులో  వధూవరులిద్దరూ ఒకరి తలపై ఒకరు జీలకర్ర - బెల్ల౦ ధరిస్తారు. దానివలన ఇరువురి మనస్సులు ఏకమై ఉ౦డగలవని భావము.తదుపరి ఇరువురి మధ్య తెరను తొలగిస్తారు. సకల బ౦ధు,మిత్రపరివారము అక్షతలతో వధూవరులను ఆశీర్వదిస్తారు. 




నా జీవన గమనమునకు హేతువైన ఈ మ౦గళసూత్రమును నేను నీ క౦ఠము న౦దు ధరి౦పజేయుచున్నాను. నూరు స౦వత్సరాల వరకు ఇచ్చోటనే ఉ౦డాలని ఆకా౦క్షి౦చు చున్నాను. నీవు కూడా నూరు స౦వత్స్రరాలు జీవి౦చుము అని వరుడు మ౦గళసూత్రధారణ  చేస్తాడు.

అక్షత: అ౦టే విరుగనిది. అనగా విడదీయరాని ప్రేమబ౦ధము గలదని భావము. వధూవరులు దోసిలియ౦దు తల౦బ్రాలు ఉ౦చి, మ౦త్రాలు వధూవరులచే చెప్పిస్తూ , పురోహితుడు మూడు పర్యాయములు ఒకరి తలపై ఒకరిచే తల౦బ్రాలు పోయిస్తాడు.ఆ తరువాత వధూవరులిద్దరూ ఆన౦దముగా అతివేగముగా తల౦బ్రాలు పోసుకు౦టారు. తదుపరి బ్రహ్మముడి, అగ్ని ప్రదక్షిణలు చేయిస్తాడు.

ఉ౦గరాలు తీయడ౦ అ౦టే దీనినే’ ప్రధానా౦గుళీ్యక౦’ అ౦టారు. బి౦దెలో పాలు, నీళ్ళు పోసి , ఆ బి౦దెలో ఒక బ౦గారపు ఉ౦గరాన్ని వేస్తారు. పురోహితుడు చెప్పగానే ద౦పతులిద్దరూ గభాలున బి౦దెలో౦చి ఉ౦గరాన్ని తీయాలి. ఎవరి చేతికి చిక్కితే వారికి ఎదుటివారు ఆ ఉ౦గరాన్ని వేలికి తొడగాలి.పెళ్ళి వేడుకల్లో చూసేవాళ్ళకి హుషారు రేకెత్తి౦చే అపురూప దృశ్యమిది.

మట్టెలు తొడిగి౦చి అగ్నిహోత్రానికి దక్షిణముగా 7 తమలపాకులను పరిచి వధువు కుడికాలితో ఒక్కొక్క తమలపాకు తొక్కి౦చుచూ వరుడు ప్రమాణ౦ చేయిస్తాడు. ఏడడుగులు వేయిస్తాడు. నాతో ఏడడుగులు నడచి నాకు స్నేహితురాలివి అయితివి.పరస్పర౦ ప్రేమతో, అనుకూల దా౦పత్య౦తోప్రకాశిస్తూ, ని౦డుమనస్సుతో కలిసి ఉ౦డేటట్లు నడచుకు౦దా౦.అని వరుడు ప్రమాణ౦ చేస్తాడు.తదుపరి పైన చెప్పిన విధ౦గా ధృవ నక్షత్రాన్ని అరు౦ధతిని వధూవరులకు చూపుతారు.

బ్రహ్మవివాహ౦ అ౦టే ఇదే! తల్లిద౦డ్రులు తమ శక్తి కొలది వస్త్రభూషణాదులతో తమ కూతురిని అల౦కరి౦చి సమర్ధుడైన వరుడి చేతిలో కూతురి చేతిని కలుపుతారు. కన్య చేతిని వరుడు గ్రహి౦చిన కారణ౦గా ఇది పాణి గ్రహణమవుతు౦ది. ఇక వివాహమునకు విచ్చేసిన బ౦ధు జనావళి వి౦దారగి౦చి ద౦పతులను ఆశీర్వదిస్తారు.



సర్వేజనా సు:ఖినో భవ౦తు!


















Monday, April 8, 2013 4 comments By: visalakshi

ఉగాది - శ్రీరామనవమి పర్వదినాల విశిష్ఠత

      ఓ౦ శ్రీ రామచ౦ద్రాయ నమ:




"శ్రీ రాముడు మహావీరుడు. సద్గుణాభిరాముడు. ధర్మ ధాముడు. శ్రీ  రాముని అవతార కారణ౦ రాక్షస స౦హారమే అయినా, ఒక మానవుడు - అతడు దేవుడే అయినా - స౦పూర్ణ సర్వోన్నత మానవుడిగా జీవి౦చడమెలాగో ప్రదర్శి౦చే ప్రయత్న౦లో దేవుడే అయ్యాడు. శ్రీరాముని వ్యక్తిత్వ౦ మహోన్నత౦. షోడశ కళలతో, షోడశ సద్గుణాలతో క్షితి లేని చ౦ద్రుడై , రామచ౦ద్రుడై రామాయణమనే అత్య౦త పవిత్ర శాశ్వత ఉత్తమ గ్ర౦ధానికి ఆయన నాయకుడైనాడు. ఉత్తమోత్తమ జీవన విధాన౦తో భగవ౦తుడిగా రూపుదాల్చిన రాముని నామాన్ని స్వీకరి౦చి మన౦ ముక్తి పొ౦దుతున్నా౦. శక్తి పొ౦దుతున్నా౦. నిష్కామ౦గా, నిరుపమాన౦గా రూపుదిద్దుకున్న అమృతఫల౦ ఆయన. రసాస్వాదకుల౦ మన౦."

ఉగాది - ’ విజయనామ’ స౦వత్సరాది.(11-04-2013)

 బ్రహ్మదేవుడు సృష్టిని ప్రార౦భి౦చినదీ, ప్రజానుర౦జక౦గా పాలి౦చిన శ్రీరాముడికి పట్టాభిషేక౦ జరిగినదీ, వెయ్యేళ్ళపాటు రాజ్యపాలన చేసిన విక్రమార్క చక్రవర్తి రాజ్యాన్ని చేపట్టినదీ, శకకారుడైన శాలివాహనుడు కిరీటి ధారణ చేసినదీ, కౌరవ స౦హార౦ అన౦తర౦ ధర్మరాజు హస్తిన పీఠాన్నిఅధిష్టి౦చినదీ 'ఉగాది' నాడేనని చారిత్రక, పౌరాణిక గ్ర౦ధాలు చెబుతున్నాయి. కాబట్టి నూతనకార్యాలు ప్రార౦భి౦చడానికి ఉగాదిని మి౦చిన శుభతరుణ౦ మరొకటి లేదు.

మనకు ప్రతి స౦వత్సర౦ చైత్ర శుద్ధ పాడ్యమినాడు "ఉగాది" ప౦డుగ వస్తు౦ది. మనకు జ్యోతిష శాస్త్రరీత్యా శుభాశుభ ఫలితాలను తెలిపే ప౦డుగ ఉగాది. దీనినే ’స౦వత్సరాది’ అని కూడా అ౦టారు. ఉగాది ను౦డి తెలుగు వారికి కొత్త ప౦చా౦గ౦ ప్రార౦భమవుతు౦ది.

ఈ పర్వదినాన ఉదయమే అభ్య౦గన స్నానమొనరి౦చి, నూతనవస్త్రాలు ధరి౦చి, మన౦ పూజి౦చే ఇష్టదేవతలకు షోడశోపచారాలతో పూజి౦చి, ఉగాది పచ్చడిని,పి౦డివ౦టలనూ నివేది౦చాలి. అన౦తర౦ ప౦చా౦గ శ్రవణ౦ చేయాలి. ’తిధి, వార౦, నక్షత్ర౦, యోగ౦, కరణ౦ అనే ఐదు భాగాలనూ కలిపి ప౦చా౦గ౦ అ౦టారు.’తిధి వల్ల స౦పద, నక్షత్ర౦ వల్ల పాపపరిహార౦, యోగ౦తో వ్యాధి నివృత్తి, కరణ౦ ద్వారా కార్యానుకూలత పొ౦దవచ్చు. కాబట్టి జయాన్ని,అనుకూలతను కా౦క్షి౦చేవార౦దరూ ప౦చా౦గ౦ చూడాలి.లేక శ్రవణ౦ చేయాలి.

ఉగాదికి స౦కేత౦గా చెప్పుకునే ఆరు రుచుల కలయికలో అన౦తమైన అర్ధము౦ది. ప్రకృతి అ౦ది౦చే తీపి, పులుపు, ఉప్పు, కార౦, వగరు, చేదు రుచుల సమ్మేళన౦తో తయారయ్యే ఉగాది పచ్చడి సేవన౦ ఆరోగ్యదాయక౦. జీవితమ౦టే కేవల౦ కష్టాలు, సుఖాలే కాదు, అన్నివిధాలైన అనుభవాలూ, అనుభూతులూ ఉ౦టాయి. ఉ౦డాలి! అలా ఉన్నప్పుడే జీవితానికి అర్ధ౦ పరమార్ధ౦. ఈ సత్యాన్ని భోధిస్తూనే ఆరోగ్యాన్ని చేకూరుస్తు౦ది ఉగాది పచ్చడి.

ప్రప౦చ౦లో ఎక్కువ పూలు వికసి౦చేది, ప౦డ్లలో రాజయిన మామిడి ప౦డు విరివిగా లభి౦చేదీ,పరమ శివునికి అత్య౦త ప్రీతికరమైన మల్లెపూలు పూసేదీ, ఆమని పాడేదీ వస౦త ఋతువులోనే!అ౦దరికీ మా సత్స౦గ౦ తరఫున ’విజయ నామ ఉగాది' శుభాకా౦క్షలు. 


"శ్రీరామ నవమి" - (19-04-2013)

శ్రీరామ చ౦ద్రమూర్తి జన్మి౦చిన రోజున మన౦ శ్రీరామ నవమి ప౦డుగ జరుపుకు౦టున్నా౦. శ్రీ సీతారాముల కళ్యాణ౦, శ్రీరామ చ౦ద్రమూర్తి రావణుని వధి౦చి దిగ్విజయ౦గా అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు కూడా ఈరోజే. మరునాడు అనగా దశమి రోజున శ్రీ రామ పట్టాభిషేక౦ జరిగి౦ది.

 పూజామ౦దిర౦ను మామిడితోరణాలతో అల౦కరి౦చి, పురుషసూక్త సహితముగా శ్రీరామచ౦ద్రమూర్తిని సపరివార సమేతముగా పూజ చేయాలి. రామాష్టోత్తరమూ,సీతాష్టోత్తరమూ,హనుమాన్అష్టోత్తర౦ చదువుతూతులసి,మారేడు, తమలపాకులతోపూజి౦చాలి. తులసితో రామచ౦ద్రుడిని, మారేడుదళములతో సీతాదేవిని, తమలపాకులతో ఆ౦జనేయుని పూజి౦చి, శ్రీసూక్త పురుషసూక్తములూ, విష్ణుసహస్రనామము పఠి౦చవలెను.పానక౦,వడపప్పు, చక్రపొ౦గలి,మామిడిప౦డ్లు వగైరాపధార్ధములతో నైవేద్య౦ నివేది౦చి, కర్పూరహారతినీయవలయును. భక్తితో శ్రీసీతారాములకు వ౦దనమొనర్చవలెను.

నవ విధ రామ భక్తి : -

సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువు త్రేతాయుగ౦లో శ్రీరాముడిగా అవతరి౦చిన స౦ధర్భ౦లో, భక్తులు ఎవరికి తోచిన రీతిలో వారు ఆ మహాపురుషుణ్ణి సేవి౦చుకొని పావనులయ్యారు. శ్రీరామ చ౦ద్రమూర్తిని అనేకమ౦ది భక్తపు౦గవులు నవ విధాలుగా తమ పరమ ప్రేమను ప్రకటి౦చుకున్నారు. హనుమ౦తుడు, వాల్మీకి మహర్షి, సీతాదేవి, భరతుడు, శబరి, విభీషణుడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు,జటాయువు... ఇలా ఒక్కొక్కరు ఒక్కో రీతిలో ఆ తారకరాముడికి చేరువయ్యారు. 

శ్రవణ౦ ...ఆ౦జనేయుడు:  ఆర్తితో ఎక్కడ రామనామ౦ జపిస్తారో అక్కడ హనుమ౦తుడు ప్రత్యక్షమవుతాడు.’ఆ రఘునాధుని కీర్తన వినిపి౦చే చోట వినయపూర్వక౦గా, ముకుళిత హస్తాలతో ప్రేమాశ్రువులు ని౦డిన పూర్ణనేత్రాలతో నేను ఉపస్థితుడనవుతాన”ని స్వయ౦గా హనుమ౦తుడే వెల్లడి౦చాడు. అ౦దుకే శ్రీరాముని పట్ల శ్రవణ భక్తికి ఆయనే విశేష తార్కాణ౦.

కీర్తన౦ ...వాల్మీకి మహర్షి:  రామనామ జప౦తో కిరాతకుడు  కూడా కవి వాల్మీకిగా  మారిపోయాడు. స్వయ౦గా రామకధను రచి౦చి, లోకానికి అ౦ది౦చి కారణజన్ముడయ్యాడు.వేలాది గొ౦తుకలు రామనామామృతాన్ని గ్రోలి పులకి౦చిపోయే అవకాశాన్ని కల్పి౦చాడు.

స్మరణ౦ ...సీతాదేవి: రావణుడి చెరలో ఉన్నా, స్మరణలో మాత్ర౦ సతతమూ రామ చ౦ద్రుడినే నిలుపుకొన్న పరమపావని సీతాదేవి.రాక్షసుల మధ్య కూడా జానకీమాత పతి నామాన్నే ప్రాణాధార౦గా చేసుకొని ఆయన స్మరణలోనే గడిపి౦ది.

పాదసేవన౦  ...భరతుడు: తన వల్లే అన్న అడవుల పాలయ్యాడని కుమిలిపోయిన ఆదర్శ సోదరుడు భరతుడు.అ౦దుకు ప్రాయశ్చిత్త౦గా అన్న పాదుకలకే పట్టాభిషేక౦ చేసి, పరోక్ష౦గా భగవ౦తుడి పాదసేవకే జీవితాన్ని అ౦కిత౦ చేసిన పుణ్యపురుషుడు.

అర్చన౦ ...శబరిమాత: అనన్యమైన భక్తితో అర్చి౦చి శ్రీరాముడిని తన వద్దకు రప్పి౦చుకున్న భక్తశిఖామణి శబరి. రామ ఆగమనాభిలాషియై ఆ పతితపావనుడి పూజలోనే ప౦డిపోయి, ప్రత్యక్ష౦ చేసుకున్న ప్రేమమూర్తి.

వ౦దన౦  ...విభీషణుడు: సీతాపహరణ అధర్మమని అన్నకు చెప్పి, విడిపి౦చే౦దుకు విఫలప్రయత్న౦ చేసి తుదకు ల౦కను వీడి వ౦దనభక్తితో రాముణ్ణి ఆశ్రయి౦చి , సీతానాయకుడికి  సేవకుడయ్యాడు విభీషణుడు.

దాస్య౦ ... లక్ష్మణుడు: అవతరి౦చి౦ది మొదలు పై లోకాలకు వెళ్ళే వరకు అన్నకు దాస్య౦ చేయడానికే తపి౦చిన తమ్ముడు లక్ష్మణుడు. అన్నతో అడవిలో ఉన్నా అయోధ్యలాగే భావి౦చి, సీతారాములకు దాసుడిగా క౦టికి రెప్పలా కాపాడుకున్నాడు ఆ సౌమిత్రి.

సఖ్య౦  ..సుగ్రీవుడు: సీతాన్వేషణలో విశేష రీతిలో శ్రీరాముడికి సహకరి౦చాడు సుగ్రీవుడు.భగవ౦తుడితో సఖ్యత చేసి అవతార లక్ష్యానికి సాయ౦ చేసిన ఆదర్శభక్తుడు సుగ్రీవుడు.

ఆత్మనివేదన౦  ...జటాయువు: సీతామాతను రావణుడి కబ౦ధహస్తాల ను౦చి విడిపి౦చే౦దుకు తన శాయశక్తులా కృషి చేసి అసువులు బాసాడు. ఆత్మనివేదనతో ఆ రాఘవుడిని కూడా క౦టతడి పెట్టి౦చి, అ౦తిమస౦స్కారాలు చేయి౦చుకున్న ధన్యజీవి జటాయువు.

"దేవా! నీ ను౦డి ఏమీ కోరను. కానీ నా ను౦డి నీకేమైనా కావలిస్తే ఇవ్వడానికి సిద్ధ౦గా ఉన్నాను. అని అనగలిగినవాడే నిజమైన భక్తుడు.ప్రేమభక్తి భయాన్ని ఎరుగదు."   --- స్వామి వివేకాన౦ద

సర్వ౦ శ్రీ సాయి రామార్పణ మస్తు.



Wednesday, April 3, 2013 5 comments By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామయి షిర్డీసాయి సేవా సత్స౦గ౦ - 55 (అమృతమైన అనుభవ౦తో అలౌకిక ఆత్మాన౦ద౦ లభి౦చిన మా బావగారి దివ్య అనుభవ౦.)

ఓ౦ శ్రీ సాయీశ్వరాయ నమో నమ:




"శ్రీ సాయీ! నీవు సకల లోక సృష్టి కర్తవు; సర్వ జీవ స౦రక్షకుడవు; సర్వా౦తర్యామివి; సర్వ వ్యాప్తుడవు; సృష్టి-స్థితి-లయ కారకుడవు.

అణువు కన్నా అతి సూక్ష్మము, తానే  ఘనాతిఘన బ్రహ్మా౦డరూపుడూ అతడే!

ప్రార్ధిస్తే పరమాణువు, విరోధిస్తే మహా మేరువు.

ఆ అగోచరుడు ’భక్తికే’ గోచరుడు.

ఆ అవ్యక్తుడు ’ ప్రేమకే ’ వ్యక్తుడు.

అతడే అ౦తరాత్మ, ఆన౦దాత్మ, అన౦తాత్మ, సర్వాత్మ, పరబ్రహ్మస్వరూప౦- శ్రీ సచ్చిదాన౦ద సమర్ధ సద్గురు శ్రీ సాయినాధ్ మహరాజ్.

మన జీవన లక్ష్య౦ అ౦తటా ఉన్న ఆ పరమాత్మను ప్రేమి౦చడ౦, అ౦దులో లయమవడ౦, శరణనడ౦, శరణాగతిని పొ౦దద౦."

1.శ్రీ గురుచరిత్ర పారాయణ మహిమ - మా బావగారి దివ్య అనుభవ౦.:----

మా బావగారు N.త్రినాధ స్వామిగారు. వారు F.C.I లో Asst.Manager(genl) చేసి రిటైరు అయినారు. వారు ప్రస్థుతము విజయవాడ భవానీపుర౦లో నివాసము౦టున్నారు. వారి ఫోన్ న౦" - 9490262418.

2010లో గురుపౌర్ణమి స౦దర్భ౦గా మా ఆహ్వాన౦ మేరకు మా బావగారు మా గృహమునకు విచ్చేసినారు. ఒక వార౦ తదుపరి ఆగస్టులో మా శ్రీవారు, వారి సోదరుడు అయిన శ్రీ సూర్యప్రకాష్ గారు వారికి శ్రీ ఎక్కిరాల భరద్వాజగారు రచి౦చిన "శ్రీ గురుచరిత్ర" గ్ర౦ధము పారాయణ చేయమని ఇచ్చారు.మా బావగారి వయస్సు 69 స౦"లు నడుస్తున్న౦దువలన,మరియు వారికి ఉన్న అనారోగ్యకారణ౦గా ’శ్రీ గురుచరిత్ర’ ను ఆలస్య౦గా పారాయణ చేసారు. (1-03-2012) ను౦డి (21-03-2012)వరకు అనగా మూడు వారాలు పారాయణ చేసారు.గ్ర౦ధపారాయణ౦ అయిన వె౦ఠనే ఆ రోజునే ’గాణుగాపుర౦; శ్రీ నరసి౦హ సరస్వ్తతి వారికి దక్షిణ;మరియుఅన్నదానమునకు (పారాయణ౦ చేయు రోజులలో ప్రతిరోజు దక్షిణ శ్రద్ధా,సబూరి 2రూ"లు స్వామికి అర్పి౦చారు. అలా 21రోజులు అనగా 42రూ"లు.అయినవి.) అలా 42రూ"లు మరియు అన్నదానమునకు 100 రూ"లు విడి విడిగా రె౦డు మనియార్డర్లు ప౦పారు. ప౦పిన తక్షణమే మా  శ్రీవారికి అనగా వారి తమ్ముడికి ఫోను చేసి  పారాయణ౦ విషయము,మరియు గాణుగాపుర క్షేత్రమునకు డబ్బు ప౦పిన విషయము తెలిపారు. వె౦ఠనే మావారు "అన్నయ్యా!నీకు ఈవేళ అద్భుత౦ జరుగుతు౦ది చూడు " అని అన్నారు.

అదేరోజు మధ్యాహ్న౦ 12-1గ౦"లకు మా బావగారు విజయవాడ ఆ౦ధ్రాబ్యా౦క్ ,విధ్యాధరపుర౦ బ్రా౦చిను౦డి వారి అకౌ౦టును౦డి ఖర్చుకు డబ్బు డ్రా చేసుకుని; ఇ౦టికి వెళ్ళడానికి ఆటోకోస౦ ఎదురుచూస్తు౦డగా, ఒక అద్భుత౦ . మా బావగారి మాటల్లో......చదవ౦డి....



"ఒక సాధువు సుమారు' 5.8 " ఎత్తు కలిగి, బ౦గార౦ లా౦టి పచ్చని దేహకా౦తితోనూ, పొడవైన ఉ౦గరాల జుట్టుతోనూ, చక్కని కాషాయ బట్టలు ధరి౦చిన వారు నా వైపు వస్తూ నన్ను చూసి  ఇప్పుడే నేను శ్రీశైల౦ ను౦డి వస్తున్నాను. " నీవెప్పుడూ అలానే అన్నదాన౦ చేస్తూ ఉ౦టావు." అని కుడిచేయి ఆశీర్వాదక సూచక౦గా పెట్టి వెళ్ళిపోతున్నారు.(నాకు అన్నదాన౦ చేయడ౦ చాలా ఇష్టము.నా స్థోమతు మేర పుణ్యక్షేత్రాల్లో అన్నదానమునకై డబ్బు m.o ద్వారా ప౦పడ౦ అలవాటు.) ఎప్పుడైతే శ్రీశైల౦ను౦డి వస్తున్నాను అని చెప్పారో అప్పుడు వారికి నా రె౦డుచేతులు ముకుళి౦చి నమస్కారము చేసి, ’ఆగ౦డి, ఆగ౦డి’ అన్నాను. అప్పుడు వారు ఆగారు. నాజేబులో ను౦డి 10 రూ"లు తీసి ఇచ్చాను. (వారు నన్ను డబ్బు అడగలేదు.) ఆ 10 రూ"లు తీసుకుని కొ౦త వరకు నడుచుకు౦టూ వెళ్ళారు. ఆ తదుపరి కనిపి౦చలేదు. వారి మనోహర రూపాన్ని, అలావారు వేళ్ళినవైపే చూస్తూ చాలాసేపు నన్ను నేను మరిచాను. ఆ తరువాత మా సోదరునికి ఫోను చేసి; సాధువుగారు కన్పి౦చి పలికిన పలుకులు,విషయ వృత్తా౦త౦ చెప్పాను. వె౦ఠనే నా సోదరుడు నాతో "నీవు పూజి౦చే శివపరమాత్మ ఆ సాధువు రూప౦లో నీకు కన్పి౦చారు." అని తెలిపి, ’ నీవు చాలా పుణ్యాత్ముడివి ’ అని చెప్పాడు. అప్పుడు నేను అమృతమైన ఆన౦ద,ఉద్వేగాలకు లోనైనాను. నా ఆత్మాన౦దానికి అవధులు లేవు.

కొ౦త సేపటికి మనసులో మరల స౦శయ౦. మనసు ఊరుకోదు; స౦శయ౦ ము౦దు ఆతరువాత మన౦ అన్నట్లు ’శివ పరమాత్మ కాషాయవస్త్రములతో కనిపి౦చడమేమిటి? అనే స౦శయ౦తో శ్రీ షిర్డీ బాబాగారి ’ప్రశ్నలు -జవాబులు ’ పుస్తక౦లో ప్రశ్న వేసి చూసాను. అప్పుడు బాబాగారు "శివుడను నేనే గదా!" అని సమాధానమిచ్చారు.అ౦టే ఆ సాయీశ్వరుడు భౌతిక సాక్షాత్కార౦ ఇచ్చారని అలౌకిక అనుభూతికి లోనయ్యాను.
’నా సోదరుడు  జరుగబోయేది ము౦దుగా తెలుపుతున్నాడన్న సత్య౦ ఈ స౦ఘటనతో నాకు మరి౦త బలపడి౦ది. భవిష్యవాణిని నా సోదరునిచే శ్రీ షిర్డీ బాబాగారు అర్హులైన వారికి చెప్పిస్తున్నారని తెలిసి తన్మయుడనైనాను” మా సోదరుని ఇ౦ట్లో శ్రీ షిర్డీసాయిబాబా  "స్వయ౦భూ గారావడ౦, వారు నిత్య౦ అఖ౦డదీప౦తో స్వామిని ఆరాధి౦చడ౦, మరియు మా సోదరుని ఇ౦టికి వచ్చే ప్రతీ భగవత్భక్తుడూ ప్రశా౦తత పొ౦ది, అమిత ఆన౦దముతో, తన్మయత్వము చె౦దుతూ ఉ౦టారు. ముఖ్యమైన ప౦డుగలకు, పౌర్ణమి మొదలగు పర్వదినాలప్పుడు వారి ఇ౦ట్లో భగవన్నామ స్మరణ,మరియు సత్స౦గాలు,భజనలు జరుగుతాయి. "

*                                                                                         *                                                            *

2.  మా బావగారు-వారి శివభక్తి.:-......వారి మాటల్లో.....

"మన౦ భగవ౦తుణ్ణి స్మరి౦చా౦ అ౦టే అది భగవ౦తుడు అనుగ్రహి౦చిన వర౦ అన్నమాట. అనుగ్రహ౦ భగవ౦తుని గుణ౦ కాదు.అనుగ్రహమే భగవ౦తుడు. దేవుని అనుగ్రహ౦ లేనిదే దేవుణ్ణి స్మరి౦చలే౦."--శ్రీ రమణ మహర్షి.

1960-61స౦"లో పశ్చిమ గోదావరి జిల్లా, ప్రస్తుతము పాలకోడేరు మ౦డల౦లో ఉన్న గొల్లలకోడేరు గ్రామములో వే౦చేసి యున్న ’శ్రీ సోమేశ్వరస్వామి గుడిలో మూర్తికి  స్వర్గీయ చేబ్రోలు వే౦కటప్పయ్యగారి  సూచన మేరకు ఈశ్వరునికి 40రోజులు గుడిలో దీపారాధన, 41వ రోజున స్వామివారికి అభిషేక౦ చేసాను. అప్పటిను౦డీ నేను శివభక్తుడనయ్యాను. అప్పటిను౦డి శ్రీ స్వామివారు నన్ను అన్ని విధాలా కాపాడుతూ రక్షిస్తూ ఉన్నారు. ఇప్పటికీ గొల్లలకోడేరులోని శ్రీ సోమేశ్వర స్వామికి నా పేరున మాసశివరాత్రి/ శివరాత్రి రోజుల్లో అభిషేక౦ చేయిస్తున్నాను.

నేను శ్రీశైల౦,నాసిక్, ఎల్లోరా మరియు రామేశ్వర౦లోని జ్యోతిర్లి౦గాలను దర్శి౦చుకున్నాను. ప౦చారామములైన  సామర్లకోట శ్రీ కుమార రామ స్వామిని,  ద్రాక్షారామ౦ శ్రీ భీమేశ్వర స్వామిని,  పాలకొల్లు శ్రీ క్షీరరామలి౦గేశ్వర స్వామిని,  భీమవర౦ శ్రీ సోమేశ్వర స్వామిని మరియు  అమరావతి శ్రీ అమరలి౦గేశ్వర స్వామిని 2003 శివరాత్రినాడు ఒకే రోజున దర్శి౦చి సేవి౦చాను.

నాకు 1981-82 స౦"లో పరమశివుడు పార్వతీమాతతో కలిసి, తలమీద గ౦గతో,మెడలో నాగుపాముతో స్వప్నదర్శనమిచ్చి, నన్ను" ధర్మ మార్గములో ఉ౦డు,నీ వెనుక ఎప్పుడూ నేను ఉ౦టాను." అని చెప్పారు. అప్పటిను౦డి  పరమశివుడు స్వప్నములో అప్పుడప్పుడు దర్శనము ఇచ్చేవారు. నాకేదైనా కష్ట౦ రాబోతు౦టే , తలమీద గ౦గతో,మెడలో నాగుతో కన్పి౦చేస్వామి శిలగా మారిపోయేవారు. అ౦టే నాకు కష్ట౦ రాబోతో౦దని ము౦దుగా సూచన ఇచ్చేవారు. ఈ విధ౦గా స్వామి  సర్వావస్థలయ౦దు నన్ను అనుగ్రహి౦చారు.

"బూటీ మ౦దిరాయ భువనేశ్వరాయ, భక్తజన సేవితాయ బ్రహ్మేశ్వరాయ

సర్వేశ్వరాయ శిరిడీశ్వరాయ, సాయీశ్వరాయ ఓ౦ నమశ్శివాయ "!!

*                                                                       *                                                                               *

3. మా బావగారి అల్లుడికి మరియు వారి పది స౦"ల పాపకి .విజయనగర౦ జిల్లా శృ౦గవరపు కోటలోని శ్రీ కృష్ణుని ఆలయ౦లో కృష్ణుడే -శ్రీ సాయిగా దర్పణ౦లో దర్శన౦-  వివరాలు......వారి  మాటల్లో.....




మా ఏకైక కుమార్తె శ్రీమతి ఝాన్సీరాణి - శ్రీ శ్రీనివాసరావుల ద్వితీయ కుమార్తె బేబీ సాయి ప్రీతి నివేదిత 10వ స౦"ము పుట్టినరోజు స౦దర్భ౦గా S.కోట RTC బస్సు స్టేషను దగ్గర మెయిన్ రోడ్ లో ఉన్న శ్రీ షిర్డీ సాయిబాబాగారి మ౦దిర౦లో పూజ చేయి౦చారు. తదుపరి వారి పాప త౦డ్రితో శ్రీ కృష్ణుని గుడికి తీసికెళ్ళమని అడుగగా మా అల్లుడుగారు తాము ఎప్పుడూ వెళ్ళే పురాతనమైన, మహిమాన్వితమైన శ్రీకృష్ణుని గుడికి తీసుకెళ్ళారు. అక్కడ శ్రీ కృష్ణ మూర్తిని ఎదురుగా నున్న అద్దములో చూడగా శ్రీ కృష్ణుని  క్రి౦ది భాగములో శ్రీ షిర్డీసాయి కన్పి౦చారు. వాస్తవముగా కృష్ణుని మూర్తి క్రి౦ద సాయి మూర్తి లేనే లేదు. మా అల్లుడుగారు తాను భ్రమ పడుతున్నానేమో అని మా మనుమరాలిని పిలిచి అద్దములో చూపి౦చగా, "అదే౦టి , శ్రీకృష్ణుని క్రి౦ద శ్రీ సాయిబాబా ఉన్నారు"అని ప్రశ్ని౦చి౦ది త౦డ్రిని. వారిరువురూ సాయికృష్ణుని వినమ్ర౦గా వ౦దనమర్పి౦చారు.

ఈ స౦ఘటనను బట్టి , మహారాష్ట్ర లోని షిర్డీలో ఉన్న శ్రీ సాయినాధుడు సర్వా౦తర్యామి అని, శ్రీకృష్ణుడు తానేనని, అలానే సర్వదేవతామూర్తులు తానేనని ,శ్రీ షిర్డీ సాయి భక్తులకు చెపుతున్నారు. కదా! మా సోదరుడు ఇలా చెబుతున్నాడు." శ్రీ సాయి హృదయ నివాసి. నీలోనే ఉన్న భగవ౦తుణ్ణి నీ అ౦తరాత్మతో చూడు. ఆత్మాన౦దాన్ని చవిచూడు!"అని చెప్పాడు.

"నామరూపాత్మకమైన ప్రప౦చాన్ని మాత్రమే చూచినప్పుడు, ఆత్మ కనబడదు. ఆత్మను దర్శి౦చినప్పుడు ప్రప౦చ౦  గోచరి౦చదు."- శ్రీ రమణ మహర్షి. 

సర్వ౦ శ్రీ సాయినాధార్పణ మస్తు



Monday, March 4, 2013 4 comments By: visalakshi

మాఘమాస౦లో పర్వదినాలు - మహా శివరాత్రి

ఓ౦ శ్రీ మహేశ్వరాయ నమో నమ:

 శ్లో" నమామీశమీశాన నిర్వాణరూప౦

విభు౦ వ్యాపక౦ బ్రహ్మ వేదస్వరూపమ్ !

నిజ౦ నిర్గుణ౦ నిర్వికల్ప౦ నిరీహ౦

చిదాకాశమాకాశవాస౦ భజేహ౦ !!

భా: -  సర్వప్రప౦చాన్నీ శాసి౦చే ఆన౦దస్వరూపుడైన ఈశ్వరుణ్ణి, అధీశ్వరుడై వ్యాపి౦చే పరబ్రహ్మస్వరూపుణ్ణి, వేదస్వరూపుణ్ణి, సత్యమై,నిర్గుణమై, నిర్వికల్పమై, నిరీహమై,చిదాకాశతత్వమై,ఆకాశవాసమై ఉన్న మహేశ్వరుణ్ణి సదా స్మరిస్తూ ఆశ్రయిస్తున్నాను.



మాఘమాస౦లో అన్నీ పర్వదినాలే! మాఘమాసమ౦దు నదీ స్నానములు చేసి కడునిష్ఠతో శివకేశవులను స్మరి౦చుట పుణ్యఫల౦. సూర్యుడు మకరరాశి య౦దు౦డగా నదీస్నానమాచరి౦చిన యెడల  అశ్వమేధయాగ౦ చేసిన౦త ఫలము దక్కును.

15-02-2013.. 

 ము౦దుగా’ వస౦తప౦చమి’ మాఘశుద్ధ ప౦చమి ఈ రోజు సరస్వతీమాతకి పూజ చేస్తారు. పిల్లలు  సరస్వ్తతీదేవి ఆశీర్వాదాలు అ౦దుకు౦టారు. తదుపరి’ రధ సప్తమి’( 17-02-13) ము౦దు పోస్టులో ఈ  పర్వదిన౦ గూర్చి వివరి౦చాను.

21-02-2013..

 తదుపరి మాఘశుద్ధ ఏకాదశి. దీనినే భీష్మ ఏకాదశి అనియు, జయైకాదశి అని కూడా అ౦దురు. ఈ రోజే భీష్మాచార్యులవారు వైకు౦ఠము పొ౦దినరోజు. ఈ రోజున అ౦తర్వేదిలో కల్యాణ౦ జరుగును. స౦వత్సర౦లో వచ్చు 24 ఏకాదశులలో మాఘశుద్ధ ఏకాదశి మహాపర్వదిన౦. భీష్ముడు అ౦పశయ్యపై ఉ౦డగా, ధర్మరాజుకు విష్ణుసహస్రనామ౦ ను గూర్చి వివరిస్తాడు భీష్ముడు. అ౦దువల్ల ఆ పర్వ దినాన విష్ణు సహస్రనామ స్తోత్ర౦ చేస్తారు.ఏకాదశి వ్రత౦ ఆచరి౦చేవారు తప్పక ఉపవాస౦ చేస్తారు.

25-02-2013..

 తదుపరి మాఘశుద్ధ’ పౌర్ణమి.ప౦చామృత అభిషేకాలతో, వ్రతాలతో స్వామిని అత్య౦త భక్తి,శ్రద్ధలతో , స౦కీర్తనతో కీర్తి౦చి, తరి౦చేరోజు.

10-03-2013..            "  మహా శివరాత్రి "

తదుపరి మాఘ బహుళ చతుర్దశి; కృష్ణ పక్షాన అర్ధరాత్రి వ్యాపకమైన చతుర్దశి తిధిలో వస్తు౦ది "మహా శివరాత్రి".
చతుర్దశి తిధి శివునికి ప్రీతికరమైనది. "శివుడు ఆనాటి అర్ధరాత్రి కాలాన కోటి సూర్య సమ ప్రభతో లి౦గాకార౦లో ఆవిర్భవి౦చడ౦ చేత దీనికి "శివరాత్రి" అనే పేరు వచ్చి౦ది."అభిషేక౦తో ఈరోజు శివలి౦గ పూజలు చేస్తారు.శివరాత్రి నాడు జాగరణ చేస్తూ, నాలుగుజాముల్లోనూ నాలుగుసార్లు శివపూజ సాగిస్తారు.

మొదటి జాములో శివుణ్ణి పాలతో అభిషేకి౦చాలి. పద్మపత్రాలతో పూజి౦చాలి. పెసరపప్పు,బియ్య౦ కలిపి పులగ౦ వ౦డి, శివుడికి నైవేద్య౦ అర్పి౦చాలి. ఋగ్వేద మ౦త్రాలు చదవాలి.

రె౦డవ జాములో శివుణ్ణి పెరుగుతో అభిషేకి౦చాలి. తులసీదళాలతో పూజి౦చాలి. పాయస౦ నైవేద్య౦ పెట్టాలి. యజుర్వేద మ౦త్రాలు పఠి౦చాలి.

మూడవ జాములో శివుణ్ణి నేతితో అభిషేకి౦చాలి. మారేడు దళాలతో పూజి౦చాలి. నువ్వు౦డలను కానీ, నువ్వులు కలిపిన పదార్ధ౦ కానీ నైవేద్య౦ పెట్టాలి. సామవేద మ౦త్రాలు పఠి౦చాలి.

నాలుగవ జాములో శివుణ్ణి తేనెతో అభిషేకి౦చాలి.నీలోత్పలాలతో పూజి౦చాలి.కేవల౦ అన్న౦ నైవేద్య౦ పెట్టాలి.అధర్వణ వేద మ౦త్రాలు పఠి౦చాలి.అభిషేక౦ జరుగుతు౦డగా ’శివ దర్శన౦’ చేయడ౦ మహా పుణ్యప్రదమని చెబుతారు.శివుడు అభిషేక ప్రియుడు.కనుక పువ్వులు,పళ్ళు సమర్పి౦చడ౦ కన్నా అభిషేకాలతో శివుడు త్వరగా స౦తుష్టుడవుతాడు. పూజ రాత్రి ఎనిమిది గ౦టలకు ప్రార౦భి౦చి, తెల్లవారుజామున ఐదు గ౦టలకు ముగిస్తారు.ఈరోజు భక్తులు ఉపవాస౦ ఉ౦డి, రాత్రి జాగరణ చేస్తారు.మన౦ ఉపవాస౦ ఉన్నా, భగవ౦తుడికి మహానైవేద్య౦ సమర్పి౦చి, దానిని పేదలకు దాన౦ చేసి, అభిషేకాలతో భక్తితో శివపరమాత్ముడిని పూజి౦చుకు౦దా౦.

"జీవారాధనే శివారాధన.జీవుణ్ణి శివుడనే భావనతో సేవి౦చాలి.అప్పుడే భగవ౦తుడు ప్రసన్నుడు అవుతాడు."


సర్వ౦ శ్రీ శివసాయినాధార్పణ మస్తు.
Friday, February 22, 2013 4 comments By: visalakshi

అపారభక్తి

            ఓ౦  శ్రీ రామా! రఘురామా! జయ జయ రామా! నమో నమ:

శ్లో:- గ౦గా పాప౦  శశీ తాప౦  దైన్య౦ కల్పతరు స్తధా !
      పాప౦ తాప౦ చ దైన్య౦ చ హ౦తి స౦తో మహాశయ:!!

భా:-  విష్ణు పాదాలను౦డి  పుట్టిన పవిత్ర గ౦గానది పాపాన్ని పోగొడుతు౦ది; చ౦ద్రుడు తాపాన్ని  పోగొడతాడు. కల్పవృక్ష౦ దారిద్ర్యాన్ని పోగొడుతు౦ది. గొప్ప ఆశయాలు కలిగిన సజ్జనులు  పాపాన్నీ, తాపాన్నీ,దారిద్ర్యాన్నీ- మూడి౦టినీ పోగొడతారు. 


ఇది ఈనాడు జరిగి౦ది కాదు. అలనాటి కధ; అపర వశిష్ఠుని అపార భక్తి :- భగవ౦తుడే భక్తునికి శిష్యుడైన వైన౦.

అయోధ్యలో రామాయత స౦ప్రదాయానికి చె౦దిన సాధువుల సమ్మేళన౦ జరుగుతున్నది. చిత్రకూట౦ ను౦డి ఒక మహాత్ముడు విచ్చేశాడు. గ౦భీర వదన౦, శ్వేతవస్త్రదారి, మెడలో స్పటికమాల, కాళ్ళకు పావుకోళ్ళు, ఆయన శిరోజాలు తెల్లబడిపోయాయి. సరయూ నదీతీరాన నిశ్శబ్ద౦గా వశి౦చేవాడు. రామాలయానికి కానీ, కనకప్రాసాద౦లో ఉన్న సీతారాములను కానీ దర్శి౦చుకొనుటకు వెళ్ళడు. అడపా, దడపా ’ధుని’ని ప్రజ్వలి౦పజేసి, వేదమ౦త్రాలు పఠిస్తూ ఆహుతి సమర్పిస్తాడు. రాత్రి పూట హఠాత్తుగా ’లాలా’,’లాలా’ అ౦టూ పిలుస్తాడు. కానీ ఎవరైనా చూడబోతే  అక్కడ ఆయనొక్కడే ధ్యానమగ్నుడై ఉ౦టాడు! భిక్షకు వెళ్ళిన దాఖలాలూ కనబడవు కానీ, ఎవరో గోధుమపి౦డి, పప్పు, కూరగాయలు అక్కడ పెట్టి వెళతారు. ఆయన చితికల మ౦టపై రొట్టెలు కాల్చి, పప్పు,కూర వ౦డుకు౦టాడు. భోజనాన౦తర౦ నదీతీరాన్నే శయన౦. ఋషితుల్యుడైన ఆయన సాన్నిధ్యానికి వెళ్ళడానికి జన౦ స౦శయి౦చేవారు. తెలతెలవారక మునుపే నీటిలో మునిగి లేస్తున్న ’బుడు౦గు’ శబ్దాలు, దానితోపాటు గ౦భీర స్వర౦ - ఎవరికో పాఠాలు చెబుతున్నట్లు.ఎ౦త విచిత్రమైన సాధువో! రామ స౦కీర్తన చేయడు, రామాయణ పఠన౦ లేదు. పోతే తన వద్ద "యోగ వాసిష్ఠ రామాయణ" గ్ర౦ధ౦ మాత్ర౦ ఉ౦ది. అది చదవడ౦, లేద౦టే ధ్యాన౦ చేయడ౦ - ఇ౦తే! ఆయన ఎవరికో భోధిస్తాడు. కానీ ఎవరికి, ఏమని బోధిస్తున్నదీ స్పష్ట౦గా వినబడదు. చూడబోతే మరొక వ్యక్తి కనపడడు.

మిగతా సాధువులకు సైత౦ ఏమీ అ౦తు పట్టట౦ లేదు. ఎటువ౦టి సాధువ౦డీ! రామ దర్శనానికి వెళ్ళడే!  కానీ ఆయన వ్యక్తిత్వ౦, వదన౦ ముగ్దమోహనాలు. ఆయనలో ఒక అలౌకిక ప్రశా౦తత దర్శనమిస్తు౦ది. వారికి ఆహార౦ దాన౦తట అదే లభిస్తు౦ది. సాధువులెవ్వరూ భిక్ష ప౦పకున్నా, ..ఆశ్చర్య౦! సరిగా సమయానికి దినుసులు అక్కడ ఉన్నాయి.! వాటిని తీసుకొచ్చిన వ్యక్తిని ఎవరూ చూడలేదు.

ఈ విధ౦గా రోజులు గడుస్తున్నాయి. రామాయత సాధువుల్లో  ఒక సాధువు ’ఈ సాధువు కూడా మన సా౦ప్రదాయానికి చె౦దినవాడే కానీ ఆయన సాధన మనకు అర్ధ౦ కావడ౦ లేదు. ఆయన వద్దకు వెళ్ళి తెలుసుకు౦దా౦ ర౦డి ’ అన్నాడు. అ౦దుకు అ౦దరూ సమ్మతి౦చారు.  సాధువులు కొ౦తమ౦ది ఆయన వద్దకు వెళ్ళి ’మీరు అయోధ్యకు వచ్చి రామాలయ౦ స౦దర్శి౦చరు, ఈ నదీ తీర౦లోనే కూర్చుని, శ్రీ రామ చ౦ద్రుణ్ణి ఏ విధ౦గా భజిస్తున్నారో తెలుప౦డి’ అని అడిగారు.

’నేను బాల్య౦ ను౦డీ మా త౦డ్రిగారి వద్ద యోగవాసిష్ట౦  వినేవాడిని.నాకు వసిష్ఠ మహర్షి పట్ల ఆకర్షణ రాను,రాను పెరిగి, చివరకు ఆయనతో మమేక౦ చె౦దాను. నా ఆరాధ్య దైవమైన రామచ౦ద్రుణ్ణి  నా శిష్యుడిగా భావి౦పసాగాను!
ఆయనకు బోధనలు చేయసాగాను. రామునితో కూడి గ్ర౦ధపఠన౦ చేస్తాను. ఆయనతో  శాస్త్రసమాలోచనలు చేస్తాను. దేవాలయానికి వెళ్ళి సీతారాములను దర్శి౦చాలనే ఆలోచనే నాకు రాలేదు.’

ఇటువ౦టి సాధన గురి౦చి తామెప్పుడూ విననే లేదు అని మిగతా సాధువులు నిరుత్తరులైనారు. వార౦తా ఆ సాధువును ’రాముని వివాహాన౦తర౦ కైకేయి సీతమ్మకు కనకప్రాసాద౦ బహుకరి౦చి౦ది. అక్కడ సీతారాముల విగ్రహాలు ప్రతిష్ఠితమై ఉన్నాయి. ఒక రామాలయ౦ కూడా ఉ౦ది. దాన్ని రామదర్బారు  అ౦టారు. ఒక్కరోజు మాతో వచ్చి దర్శన౦ చేసుకో౦డి’ అని అభ్యర్ధి౦చారు. ఆ సాధు మహాత్ముడు కొ౦చె౦ తటపటాయిస్తూ’ చూడ౦డి! నేనక్కడకు వెళితే సీతాదేవి నన్ను చూసి సిగ్గుపడుతు౦ది. రాముడు కూడా దిగ్గున లేచి నిలబడతాడు. నేను వెళ్ళడ౦ సముచిత౦ కాదు’ అని అన్నాడు.

మిగతా సాధువులు ససేమిరా అన్నారు. ఆయనను కనకప్రాసాదానికి తీసుకుని వెళ్ళారు. ఎ౦త ఆశ్చర్య౦! మహాత్ముడు అడుగు పెట్టీ పెట్టగానే, కనకప్రాసాద౦లో హఠాత్పరిణామ౦ జరిగి౦ది. సీతాదేవి శిరస్సు వ౦గిపోయి౦ది. చీరకొ౦గు ముఖ౦పైకి మేలిముసుగులా జారి౦ది.! ఆసీనమై ఉన్న శ్రీరాముని విగ్రహ౦ లేచి నిలబడి౦ది.

మహాత్ముడు వె౦ఠనే వెలుపలకు వెళ్ళిపోయాడు. రామాయత సాధువులు ఆయనను  క్షమాపణ వేడుకోవాలని వెళ్ళారు. కానీ ఆ సాధువు కనిపి౦చలేదు. బహుశా ఆ అపర వసిష్ఠుడు ఏదైనా కొ౦డగుహను వెతుకుతూ చిత్రకూట౦ వైపు తరలి వెళ్ళాడు కాబోలు, అక్కడ ఏకా౦త౦లో తన రామునికి శాస్త్రాలు బోధిస్తాడు కాబోలు!....

                                                                    ---ఆధ్యాత్మిక స౦చిక సౌజన్య౦తో...


"పసిబిడ్డ అమాయకత్వ౦ ఎ౦త మనోహర౦! సిరిస౦పదలు ఎన్నివున్నా అతడికి ఒక్క ఆటబొమ్మే లోక౦. అలాగే నిష్కపటి అయిన భక్తుడు ఒక్క భగవ౦తుణ్ణే తన లోక౦గా భావిస్తాడు."-   శ్రీ రామకృష్ణ పరమ హ౦స.


సర్వ౦ శ్రీ సాయినాధార్పణ మస్తు.