Tuesday, February 24, 2015 0 comments By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామాయి షిర్డీసాయి సేవా సత్సంగం - 75 ఆగామి(క్రియమన)కర్మ తత్వబోధ

  ఓం శ్రీ పరమేష్ఠి గురుభ్యో నమ:


ఆగామి కర్మ అంటే...

శ్లో:  జ్ఞాన ఉత్పతి అనంతరం, జ్ఞాని దేహ కృతం !
పుణ్య పాప రూపం కర్మ ఎత్ అస్థి తత్ ఆగామి ఇతి అభిదియతే!!

"The invisible results of action --A person gets while doing actions after getting the self -knowledge is called agami."



ఆగామి కర్మ ఎలా నశిస్తుంది....

శ్లో:  ఆగామి కర్మ అపి జ్ఞానేన నష్యతి/కిం చ ఆగామి
 కర్మానాం నలిని దల గత జల వత్ జ్ఞానినాం సంబంధో నస్తి// 

"Agami karma ,also will get exhausted by the self knowledge.also, like the water on the lotus leaves, the agami karma will not effect the jnani."

"ఆత్మ స్వతహాగా నిర్వికారి. స్ఫటికంలాగా దోషరహితంగా ఉండికూడా సంసారంలో మాయతో, కర్మలతో బంధించబడినట్లు కనిపిస్తుంది.'నేను ఈ దేహాన్ని '     అన్న అభిమానం ముక్తస్థితిలో ఆత్మకి మిధ్యాబంధనాన్ని తీసుకొస్తుంది. దేహము, ఇంద్రియాలు, మనసు, ప్రాణము వీటిపై అభిమానం ఉన్నంతవరకు కర్తృత్వమూ,భోక్తృత్వమూ ఉంటాయి. వాటి జ్ఞానాన్ని కూడా ఆపలేము. అంతర్యామి ఆత్మే ఈశ్వరుడు. ఈశ్వరుడే గురువు. గురువు మనకు దివ్యనేత్రాలనిచ్చినప్పుడే జ్ఞాననిధి లభిస్తుంది.అవిద్య,కామము,కర్మ అనే బంధనాలనుండి సంపూర్ణంగా విడివడటానికి గురు స్వరూప జ్ఞానాన్ని యధాతధంగా తెలుసుకొని గురుధ్యానాన్ని  అనుష్ఠించడం, దర్శించడం అవుతుంది."   


 శ్లో" మన్నాధ: శ్రీ జగన్నాధ: మద్గురు: శ్రీ జగద్గురు:!
      మదాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీ గురవేనమ:!!


 "గురువు అంటే అజ్ఞానాంధకారమును తొలగించే ఒక శక్తి. శక్తి అంటే తత్వము, అని అర్ధం చేసుకోవాలి. మానవునిలోని అజ్ఞానాన్ని తొలగించే శక్తి కేవలము భగవంతునికి మాత్రమే ఉన్నది."

 శ్రీ షిర్డీ బాబాగారుచేసిన సహజ ఉపదేశం "ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన వాక్కలహాన్ని వారి కర్మ నశించే వివరణను",మరియు బాబాగారి జ్ఞానబోధను తెలుసుకుందాము....

ఒకసారి ఒక శ్రేష్ట భక్తుడు, మరో భక్తుడి గురించి చెప్తూ స్వతహాగా చెడుమాటలు మాట్లాడటం మొదలుపెట్టాడు. ఎంతగానో నిందించడం మొదలుపెట్తాడు. అతని చక్కటి గుణాలు పక్కనపెట్టి నోటితో ఎడాపెడా దూషించటం మొదలుపెట్టాడు. అసలు సంగతి పక్కనపడి, నిందే వరదలై పొంగిపొరలింది.
 'ఏదో కారణంతో ఎవరి ఆచరణైనా నింద్యంగా ఉంటే వారిపై జాలి పడి వారికి ఎదురుగానే ప్రబోధం చేయాలి. ఎప్పటికీ నిందించకూడదు.' 
 నిందించేవారు నిందింపబడేవారికి ఉపకారులు. వీరు అనేకరకాలుగా శుభం కలిగిస్తారు. నిందించేవారు తమ నాలుకతో ఇతరుల మాలిన్యాన్ని కడిగేస్తారు. నింద నిమిత్తంతో వారి దోషాలు వారికి తెలుపుతారు. భవిష్యత్తులో రాబోయే అనేక అనర్ధాలను వాళ్ళు తప్పిస్తారు.సరే! ఆ భక్తుని నోటినుంచి నింద ఎక్కువగా రావటం చూసి వినేవాళ్ళకి అసహ్యం కలిగింది. వారందరూ బాబా దర్శనం కోసం మశీదుకి బయలుదేరారు.నిందించే భక్తుడు శౌచం కోసం కాలువదగ్గరకెళ్ళాడు.
   సాయిబాబా సర్వజ్ఞులు. భక్తులతో కలిసి లెండీకి బయలుదేరినప్పుడు బాబా ఆ నిందించే భక్తుడి గురించి అడిగారు.దానితో భక్తులు ఇలా అన్నారు. "అతను కాలువ దగ్గ్రకు శౌచానికి వెళ్ళాడు." తమ కార్యక్రమం ముగిసిన తరువాత బాబా లెండీనుంచి తిరిగి వచ్చారు. కాలువ వద్దనుండి ఆ నిందించిన భక్తుడు కూడా ఇంటికెళ్ళేందుకు తిరుగుముఖం పట్టాడు. దార్లో అతను బాబాకి ఎదురయ్యాడు.  బాబాగారు  అక్కడకి దగ్గరలో ఓ పందిని జూపి ఇట్లనెను. "చూడుము! ఈ పంది అమేధ్యమును ఎంత రుచిగా తినుచున్నదో! నీ స్వభావము కూడా అట్టిదే! ఎంత ఆనందముగా నీ సాటి సోదరుని తిట్టుచున్నావు.ఎంతయో పుణ్యము చేయగా నీకీ మానవజన్మ లభించినది.ఇట్లు చేసినచో శిరిడీ దర్శనము నీకు తోడ్పడునా?"ఆ మాటలు నిందించిన  భక్తుని మనసుకు గుచ్చుకొని, అందులోని నీతిని,సారాన్ని గ్రహించాడు."నా భగవంతుడు నా వాడైతే నాకు మంచమ్మీదే నే కూచున్నచోటే అన్నీ ఇస్తాడు" ఈ సామెత నిజమే కానీ అబద్ధం కాదు. కానీ అన్న వస్త్రాలవరకే ఇది వర్తిస్తుంది.దాన్ని పరమార్ధానికి ఆపాదించేవారికి పరమార్ధం అన్నిరకాలుగా దూరమవుతుంది.
 ఈ విధంగా నిందాస్తుతి వల్ల జరిగే అనర్ధాన్ని బాబాగారు ఉపదేశంతో వివరించి.. అజ్ఞానవినాశనం చేసి జ్ఞానబోధతో ఆగామికర్మ  నశించేలా చేసారు. 


 సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు