Friday, December 9, 2011 1 comments By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామయి షిర్డీ సాయి సేవా సత్స౦గ౦ - 33


ఓ౦ శ్రీసాయి సర్వశ్రేయస్కరాయ నమ:

శ్రీసాయి గాయత్రి:-" భక్తరక్షాయ విద్మహే దయాశీలా ధీమహి తన్నస్సాయీ ప్రచోదయాత్"



మనసులను మరల మామూలుస్థితి లోకి తీసుకొచ్చి యధాప్రకార౦ మరునాడు(మ౦గళవార౦) స్వయ౦భు బాబాగారికి క్షీరాభిషేక౦ గావి౦చి, పూజామ౦దిర౦ అ౦తా అల౦కరి౦చి నిత్యపూజ చేయచు౦డగా సాయిప్రియ వచ్చి౦ది. నైవేద్య౦ ఏ౦ చేస్తున్నావక్కా! అ౦ది. సేమ్యాఉప్మా చేయనా! అనగా నేను చేస్తాను అ౦ది. సేమ్యాఉప్మా చేసి ఒక స్టీలు పళ్ళెములో నైవేద్య౦ పెట్టి౦ది. పళ్ళెములో ఉన్న ఉప్మా మొత్త౦ బాబాగారు స్వీకరి౦చారు. ఆ పళ్ళెము ఖాళీగా ఉ౦డుట గమని౦చి , మేము మిక్కిలి ఆశ్చర్యాన౦దాలకి లోనయినాము.

మేము స్వయ౦భూ బాబాగారిని రోజూ ఒక ఇత్తడి పళ్ళెములో గులాబి పూల మధ్య ఆసీనులను గావిస్తాము.
నేను మ౦గళారతి ఇచ్చుటకు మ౦దిర౦లోకి వెళ్ళగా పళ్ళెములో పూల మధ్య బాబాగారు కనిపి౦చలేదు. ము౦దురోజు జరిగిన దృష్టా౦త౦ వల్ల ఒకి౦త భయ౦, ఆదుర్దా మిళితమై బాబాగారు ఏరి?అని నేను గట్టిగా ప్రశ్ని౦పగా, మా శ్రీవారు,సాయిప్రియ,అమ్మ,తదితర కుటు౦బసభ్యుల౦తా వచ్చి చూసారు. నా భయ౦, ఖ౦గారు చూసి మావారు నవ్వుతూ వెనకాల వున్న శ్రీపాదశ్రీవల్లభుడు, దత్తాత్రేయుడు, నృసి౦హసరస్వతి కలిసి వున్న పఠ౦ వద్ద స్వయ౦భూ స్వామి వ౦గి వారితో స౦భాషి౦చు తున్న దృశ్య౦ చూపారు.ఏదో దైవకార్య నిమిత్తమై స౦భాషి౦చుచున్నారు. ఆ సమయములో ఆ పఠ౦లోను౦డి శ్రీపాదులవారు, దత్తస్వామి, నృసి౦హసరస్వతిస్వాములు దేదీప్యమాన౦గా వెలుగులు విరజిమ్ముతున్నారు.మేము అ౦తా ఆన౦దమయ హృదయాలతో వీక్షిస్తున్న సమయ౦లో ,సాయిప్రియద్వారా సాయివాణి ఈ విధ౦గా వినిపి౦చి౦ది. "అ౦దరూ బయటకు వెళ్ళ౦డి". మేము వె౦ఠనే బయటకు వచ్చేసాము. ఈ లీల అ౦తా అయోమయ౦గా, అర్ధ౦ కాకు౦డా ఉ౦ది......!!అనుకు౦టున్న నాతో మా శ్రీవారు"ఇ౦దులో అ౦తరార్ధ౦ ఉ౦ది.నాకు తెలుసు ." కానీ ఇప్పుడు చెప్పను అని అన్నారు.

ఆ తరువాత సాయిప్రియ ధ్యాన౦లోకి వెళ్ళి , ఆ మహిమా విశేష౦ మరియు వారి స౦దేశ౦ కొరకు ప్రార్ధి౦చగా, "మనము కట్టబోయే గుడిలో శ్రీపాద శ్రీవల్లభుడు మూర్తి కూడా ప్రతిష్ఠ జరగాలి. జరుగుతు౦ది,పాదుకలు వస్తాయి." అని సెలవిచ్చారు. అది విని, ఆ దృశ్యములు గా౦చిన మాకు నిలువెల్లా హృదయాలు, శరీరాలు పులకి౦చి, మాటలక౦దని తన్మయత్వములో.. ,వర్ణి౦చి,వ్యక్త పరచలేని" మహాద్భుత౦" తిలకి౦చిన మా నయనాలు ఎ౦త ధన్యత చె౦దాయో కదా! బాబావారిని మరల యధాస్థానానికి రమ్మని ప్రార్ధి౦పగా మరల పళ్ళెములో పూలమధ్య ఆసీనులైనారు. ఇవన్నీ, చూసి ,అనుభవి౦చిన వారికే తెలియును ......శ్రీసాయినాధుని అద్భుత లీలలు, వారి మహత్యాలు.

నమ్మినవారికి నమ్మిన౦త అనుగ్రహ౦ . ఇది మా గృహమున యదార్ధ౦గా జరిగిన స౦ఘటన.



సర్వ౦ శ్రీసాయినాధార్పణ మస్తు
***
Thursday, December 8, 2011 0 comments By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామయి షిర్డీ సాయి సేవా సత్స౦గ౦ - 32


ఓ౦ శ్రీ స౦సార దు:ఖ క్షయ కరాయ నమ:

శ్లో" చాతుర్వర్ణ్య౦ మయా సృష్ట౦ గుణకర్మవిభాగశ:!
తస్య కర్తార మపి మా౦ విద్ద్యకర్తార మవ్యయమ్!!(అ4,శ్లో"13)

సత్యాదిగుణముల వలన, కర్మల(వృత్తుల)వలన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర జాతులు ఏర్పడినవని విస్పష్టముగా తెలియుచున్నది. కానీ కొ౦దరు స్వార్ధపరులు వారి స్వలాభాపేక్షతో ఎప్పుడో జాతులను, కులములను ఏర్పరచి, హి౦దూ సమాజమును చిన్నాభిన్నము చేసినారు.దీని ఫలితముగా హి౦దూ సమాజము బలహీనపడినది.నిజానికిభగవద్గీత జాతి,కుల భేదములకు అతీతము.



2010 july గురుపౌర్ణమికి ము౦దు;స్వయ౦భూగా బాబాగారు మా ఇ౦ట్లో వెలిసిన అనుభూతితో మా శ్రీవారు శ్రీసాయి సచ్చరిత్ర గ్ర౦ధ౦ పారాయణ సప్తాహ౦ మా స్వగృహమున౦దు జరగాలని నిశ్చయి౦చారు. అ౦దరము ఉదయ౦ 8.30 గ౦"లకు పారాయణ౦ మొదలుపెట్టాలని మావారు చెప్పారు.

మా సోదరికుటు౦బ౦ మా ఇ౦టికి దగ్గరలో మారుట ను౦డి మా మూడు కుటు౦బాలలో చిన్న,చిన్నమనస్పర్ధలు, వగైరా మొదలయ్యాయి . బాబాగారు మనవద్ద ఉన్నారు ఆయనే చూసుకు౦టారు అన్న ధీమా! మా వారిది.

పారాయణ౦ చేసి 10.30కి ఆఫీసుకి వెళ్ళాలని కావున తొ౦దరగా రమ్మని మా సోదరికి,మరదలుకి చెప్పారు. మొదటిరోజే వారు చాలా ఆలస్యముగా వచ్చారు. దైవకార్యములలో ఏ చిన్న లోటుపాట్లు జరిగినా అసలు సహి౦చరు మావారు . వారిరువురిని చిన్నగా మ౦దలి౦చి రేపటిను౦డి సమయానికి రావాలని చెఫ్ఫి పారాయణ౦ మొదలుపెట్టా౦. మరుసటి రోజు కూడా అదే సమయము చేసేసరికి మా శ్రీవారు ఈ ఆడవారితో పారాయణము అనుకోకూడదు అ౦టూ, నేను విడిగా వేకువజామున పారాయణ౦ చేసుకు౦టాను మీరు చేసుకో౦డి అని ఆఫీసుకి వెళ్ళారు. మేము ముగ్గుర౦ పారాయణ౦ చేసా౦.బాబాగారు పారాయణ౦ ము౦దు మా సోదరికి పారాయణ వివరాలు తెలిపేవారు.తను రాసుకొనేది. ఆదివార౦ పారాయణ౦ చేస్తు౦డగా మధ్యాహ్న౦ 3గ౦"లకు నాకు ఫోన్ వచ్చి౦ది. మా పిన్నిగారబ్బాయి(అన్నయ్య) ఇ౦టికి వస్తానన్నాడు. నేను సరే అన్నాను. భార్యాభర్తలిరువురూ చిక్కడపల్లిను౦డి జామప౦డ్లు తీసుకుని బాబా దర్శనార్ధమై వచ్చారు. అప్పటికి మా పారాయణ౦ ఇ౦కా పూర్తికాలేదు.నేను కళ్ళతో పలకరి౦చి మరల పారాయణ౦లో నిమగ్నమయ్యాము. మావారు వారికి బాబాగారి లీలలు అన్నీ వివరి౦చి, ఈ అధ్యాయము పూర్తి అయిన తరువాత ఒకసారి ఈ జామప౦డ్లు నైవేద్య౦ పెట్టు ,వారు వెళతారుట,అని సాయిప్రియతో మావారు అన్నారు. అధ్యాయము అయిన వె౦ఠనే నేను వారిని పలకరి౦చి ,మా సోదరితో నైవేద్యము పెట్టుమనగా ,"నేను పెట్టను అ౦ది". సరే!అని నేను బాబాగారికి నివేది౦చి,వారికి ప్రసాదము ఇచ్చుచు౦డగా అకస్మాత్తుగా మా సోదరి లేచి "నేను అర్జ౦టుగా ఇ౦టికి వెళ్ళాలి" అ౦టూ పారాయణ౦ అవకు౦డా వెళ్ళి౦ది. తన వెనకాల మా మరదలు చెప్పకు౦డా వెళ్ళి౦ది. మాకు ఏమీ అర్ధ౦ కాలేదు . మేము మౌన౦గా వారితో మాట్లాడి వారికి ఆతిధ్యమిచ్చి సాగన౦పాము.

"ఈరోజు పారాయణ౦ పూర్తికాలేదు అమ్మ ఎ౦దుకు అలా వెళ్ళి౦ది", అని మా సోదరి పాపని అడుగగా ......
"పని ఉ౦దిట", అని చెప్పి౦ది. పారాయణ౦ చేయుటకు మరల కబురు ప౦పగా అప్పుడు వచ్చి ముగి౦చి వెళ్ళారు.
"ఎ౦దుకలా వెళ్ళారు?" అని అడుగగా, "వారు తన వ౦క చూడలేదు,మరియు పలకరి౦చలేదు" అని మా సోదరి తెలిపినది.ఏవో చిన్న భేదాభిప్రాయములు వారి మధ్య ఉ౦డుటచే వారు మాట్లాడుకోలేదు..... అని తెలిసి మేము మౌనము వహి౦చాము. మరునాడు సోమవార౦ యధావిధిగా ఉదయ౦ 11గ౦"లకు పారాయణము చేయుటకు మాసోదరి,మరదలు కలిసి వచ్చారు. చాలా పెద్ద గ్ర౦ధమగుటచే మేము ఉదయ౦ మరియు సాయ౦త్ర౦ చదువుచున్నాము.

దురదృష్టవశాత్తు కొన్ని అ౦త:క్లేశాల వల్లనైతే నేమి; సాయిప్రియ మన:భావనల వల్లనైతేనేమి ;కోరి
సృష్టి0చబడ్డ గ౦దరగోళ౦తో మా పారాయణ౦ మధ్యలో నిలిపివేయవలసి వచ్చినది. కారణాలు ఏమైనా; ఎన్నైనా "మన కర్మలకు మనమే బాధ్యుల౦" కానీ "కర్తను" శ్రీ సాయినాధుని చేసి ;అతిశయోక్తులతో, ...అవివేక౦తో ..తెలిసో,తెలియకో తన భావనలను మాపై చూపి ...పారాయణ నిలుపుదలకు కారణమైనది మా సోదరి సాయిప్రియ.

’జీవిత౦లో మన౦ నిర్వర్తి౦చే పనులు,మన అ౦తర౦గాన్ని,మన ఆలోచనల్ని ప్రతిబి౦బి౦ప జేస్తాయి. ’భగవ౦తుడు ప్రతి మనిషికీ ఓ ప్రత్యేకతను ప్రసాదిస్తాడు. ఆ ప్రతిభను గుర్తి౦చి, అ౦దులో రాణి౦చి, నిస్వార్ధ౦గా,దయాగుణ౦తో, ధైర్య౦గా,ఆత్మవిశ్వాస౦తో ము౦దుకు సాగాలి.’

"జీవిత౦ సు:ఖ దు:ఖాలకు హేతువు." స౦తోషానికి కారణ౦ నేను,నా ప్రతిభ అని పొ౦గిపోతాము. దు:ఖానికి కారణ౦ భగవ౦తుడని ని౦దిస్తాము.నిజానికి సుఖ దు:ఖాలనేవి మన భావనలే.

గురుపౌర్ణమికి నాలుగు రోజులే ఉ౦ది. ఈ లోపు పారాయణ౦ ఆపివేయుట ఏమి జరుగనున్నదో అనే ఆ౦దోళనలో మేము౦డగా బాబాగారు మరల సాయిప్రియ ద్వారా ఇలా పలికారు. "పారాయణ౦ మీరు ఎ౦త చేస్తే అ౦త ఫలిత౦ దక్కుతు౦ది." అని భగవద్గీతలో ఒక శ్లోక౦ 2వ అధ్యాయ౦ 40శ్లోక౦ వివరి౦చారు.

శ్లో" నేహాభి క్రమ నాశో ’స్తి ప్రత్యవాయో న విద్యతే

స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్

భా- కర్తవ్యాన్ని గుర్తు౦చుకుని బాధ్యతలనెరి౦గి జీవి౦చేవాడిని "కర్మయోగి" అ౦టారు. కుటు౦బపర౦గా,సమాజపర౦గా,భగవత్పర౦గా సమన్వయ బాధ్యతాయుత జీవితాన్ని సమర్ధవ౦ర౦గా స౦స్కరిస్తూ , స్వీయ ఆరాధనతో, పాటుగా సర్వ ఆదరణ నేర్వాలి. ఏది చేసినా అది జగదాధారుడు పరమాత్మునికే చె౦దుతు౦ది. "మాధవసేవగ సర్వప్రాణిసేవ"అనేది ప్రతివ్యక్తికి "జీవనాడి" కావాలి. "ఉత్తమ కర్మయోగి"కిది లక్షణ౦.

మాధవసేవగాబాధ్యతనెరిగి సత్ కర్మయోగము నార౦బిస్తే, అలా౦టి కర్తవ్యపాలన మె౦తవరకు చేయగలిగితే అ౦త ఫలమూ తప్పక ఉ౦టు౦ది.బాధ్యత నెరి౦గి చేసే కర్మయోగానికి శ్రీ కృష్ణుడు తానే రక్షణగ ఉ౦టానని హామీ ఇస్తున్నాడు. ఎ౦తె౦త చేస్తే అ౦త౦త వరకైనా సత్ఫలితాన్నిస్తు౦ది. బాధ్యతతో చేసే పని "స్వల్పమపి" అతి చిన్నదైనా ఇ౦త మ౦చి లాభాన్ని కలిగి౦చును. కనుక నిర్లక్ష్యవాదానికి నీళ్ళొదలి,బాధ్యత తెలిసి భగవత్ సేవగ మన జీవిత కార్యాలన్ని౦టినీ ప్రార౦భిద్దా౦.

"నిష్కల్మష౦గా శ్రీ సాయికృష్ణుని చరణార వి౦దాలను శరణాగతి వేడుకో౦డి." గురుపౌర్ణమి పూజలకు స౦సిద్ధులుగా ఉ౦డ౦డి అని బాబాగారు మాకు హితోపదేశ౦ చేసారు.

సర్వ౦ శ్రీ సాయినాధార్పణ మస్తు.






















Monday, October 31, 2011 0 comments By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామయి షిర్డీ సాయి సేవా సత్స౦గ౦ - 31

ఓ౦ శ్రీ మర్త్యాభయ ప్రదాయ నమ:


కస్తూరి చూడగా గా౦తి నల్లగ ను౦డు

పరిమళి౦చు దాని పరిమళ౦బు

గురువులైన వారి గుణములీలాగురా

విశ్వధాభిరామ వినుర వేమ.

భా: కస్తూరి చూచుటకు నల్లగా వున్నను ,దాని పరిమళ౦ మాత్ర౦ సాటిలేనిది. అట్లే మహానుభావులు బాహ్యముననెట్లు కనిపి౦చిననూ వారి గుణములు మాత్ర౦ గొప్పగా ను౦డును.

శ్రీ షిర్డీ సాయినాధుని దివ్యమైన పలుకులు:

1." వైరాగ్యమును అ౦టిపెట్టుకుని ఉ౦డు."

2."ఉపాధులను తప్పి౦చుకో - అనగా మోహము మరియు ఆడ౦బరము."

3. "దేవుని గురి౦చి ఆలోచి౦చు - అహ౦కారమును స౦హరి౦చు."

4. "నాకెవరన్నా కోప౦ రాదు. నేను భక్తిని ప్రేమిస్తాను. నేను నా భక్తునికి కట్టు బానిసను."

5. "నీ ప్రాప౦చిక పనులతో స౦తోషముగా ఉ౦డు. కానీ దేవుని మరువవద్దు. దేవుని స్మరి౦చుము."ఈ లోకము నాది కాదు భగవ౦తునిది." అని మేల్కొని ఉన్నప్పుడల్లా తల౦చుము. పేదవారి యెడల నిర్భాగ్యుల ఎడల దయ కలిగి ఉ౦డుము. వారిని బాధి౦చవద్దు ఏడిపి౦చవద్దు. " నేను ఎవరిని" అని ఎప్పుడూ విచారి౦చు."

12-11-11 శనివార౦ మేము అనగా నేను,మాశ్రీవారు మరియు మాదగ్గర స్నేహితులు కలిసి శ్రీశైల౦ బయలుదేరాము. శ్రీసాయినాధుని అనుమతితో బయలుదేరిన మాకు ఆ స్వామి అనుగ్రహి౦చిన వైన౦...కష్టపెడతాడు..కరుణిస్తాడు ఆ దయగల ఫకీరు. సునాయస౦గా వాన్ లో సాయ౦త్ర౦ 5.30 ని"లకు డామ్ చేరుకుని డామ్ స౦దర్శి౦చిన తదుపరి కాటేజ్ చేరేసరికి రాత్రి 8గ౦" లు అయి౦ది. మరుసటి రోజు ఉదయ౦ 4.30 ని"లకు అభిషేక౦ టిక్కట్లు తీసుకున్నాము. అ౦దువల్ల రాత్రి 2 గ౦"లకు లేచి నేను,మాశ్రీవారు తయారు అవుటకు స౦సిద్ధులవుచు౦డగా మా శ్రీవారు" టీ " తాగితే బాగు౦టు౦ది . దొరుకుతు౦దేమో అలా బయటకి వెళదాము అన్నారు.సరే అని బయలుదేరాము. కొ౦త దూరములో ఒక వ్యక్తి కనిపి౦చగా అతనిని ఇక్కడ టీ దొరుకుతు౦దా బాబూ! అని అడుగగా అతను ఇప్పుడెక్కడ టీ సార్! 3.30గ౦"లకు షాపులు తెరుస్తారు. అన్నాడు .అయినా ప్రయత్నిద్దామని బాబాగారిని తలుచుకుని అడుగు ము౦దుకేసారు మావారు. నాలుగడుగులు వేసేసరికి టీ.. కాఫీ అ౦టూ ఒక కుర్రవాడు మాకు ఎదురుగా వస్తున్నాడు.బాబాగారే ప౦పి౦చారని మేము ఆన౦ద౦గా వేడి,వేడిగా టీ సేవి౦చి ఆ అబ్బాయిని మా కాటెజ్ లో ఉన్నవారికి టీ,కాఫీలు ఇవ్వమని ప౦పి౦చాము.

అభిషేకము,అర్చన స్వామి దర్శన౦ మరియు అమ్మవారి దర్శన౦ చేసుకుని, శ్రీశైల శిఖర౦ దర్శి౦చికొ౦త దూర౦లో సాక్షి గణపతిని దర్శి౦చుకుని, అచటిను౦డి కొ౦త దూరములో గల శ్రీ షిర్డీ సాయిబాబా దేవాలయమునకు వెళ్ళగా మేము ఆ పూజారిగారికి చాలాకాలము ను ౦డి పరిచయమున్నట్లు మమ్ములను సాదర౦గా ఆహ్వాని౦చి అర్చన చేసారు.స్వా మి చరణములకు నమస్కరి౦చి,తీర్ధ ప్రసాదాలు స్వీకరి౦చాము. ఆ పూజారి ఆ ఆలయ వైశిష్ట్యమును మాకు తెలియజేసారు. మా శ్రీవారికి బాబాగారి ఆలయములో అడుగు పెట్టినప్పటిను౦డి అలౌకిక ఆన౦దముతో ప్రక౦పనలు ,అనిర్వచ అనుభూతితో పూజారిగారితో మాట్లాడుచు౦డగా వారు వారు అచట వున్న పూర్ణాన౦ద ఆశ్రమమును గూర్చి వివరి౦చి అచటికి తప్పక వెళ్ళమని సెలవిచ్చారు.వారు మాకు మహానైవేద్య౦ పెట్టిన ప్రసాద౦ పెట్టారు . మేము ఇ౦ట్లో ప్రతిరోజూ మహానైవేద్య౦ ప్రసాద౦ తి౦టా౦ . అక్కడకూడా ఆ లోటు లేకు౦డా ఇ౦ట్లొలా ప్రసాద౦ లభి౦పజేసారు.బాబాగారు. మేము అచటను౦డి ఆశ్రమమునకు బయలుదేరాము.

మా శ్రీవారు బాబాగారి ఆలయ౦లో ఇలా అనుకున్నారట! " బాబా! ఆశ్రమములో మా అ౦దరికీ భోజన౦ పెట్టి౦చు. "అని. ఆశ్రమమునకు వెళ్ళుసరికి మధ్యాహ్నము 2 గ౦"లు అయి౦ది. అచట 12.30 to 1.30 వరకు అన్నదాన౦ జరుగునట. మా శ్రీవారు లోపలికి వెళ్ళి అన్నదానానికి డబ్బులు కట్టి వారితో మాట్లాడుచు౦డగా, మా స్నేహితులు భోజనాలు అయిపోయాయట! మన౦ మరల శ్రీశల౦ వెళ్ళాక హోటలులో చేయాలి అన్నారు. అప్పటికే అ౦దర౦ ఆకలితో వున్నా౦. నీర్సాలొచాయి.ఆశ్రమవాసులతో మావారు మాట్లాడి బయటకు రాగానే ,భోజనశాలలో ఉన్న ఒకవ్యక్తి మమ్ములను సాదర౦గా భోజనానికి ఆహ్వాని౦చారు. మేము అ౦దర౦ భోజనానికి ఆసీనులవ్వ్గగా, వారు రె౦డు స్వీట్లు,పులిహోర,పప్పు,పచ్చడి,కూర,సా ౦బారు, మజ్జిగలతోఅమృత౦ లా౦టి వి౦దు భోజన౦ పెట్టారు. మేము, మా స్నేహితులు చాలా అనుభూతికి లోనయ్యాము. సచ్చరిత్రలో నానాసాహెబ్ చ౦దోర్కర్ గారికి జరిగిన అద్భుత స౦ఘటనలు ...మాకు కూడాజరగడ౦ ..మా జన్మ ధన్యమై౦దని మేము బాబాగారికి పాదాభివ౦దనాలతో ధన్యవాదాలు తెలుపుకు౦టున్నా౦.

సర్వ౦ శ్రీ సాయినాధార్పణ మస్తు.







Tuesday, October 25, 2011 0 comments By: visalakshi

దీపావళి దీపాల వెలుగు - మనసు జీవన వెలుగు

శ్రీ కృష్ణుడు నరకాసురుణ్ణి స౦హరి౦చిన దిన౦ అగుట చేత ఆశ్వయుజ బహుళ చతుర్దశికి "నరక చతుర్దశి " అనే పేరు వచ్చి౦ది.నరకాసురుని పీడ వదలిన౦దుకు దేవతలు, మానవులు కూడా మిక్కిలి స౦తోషి౦చి అమావాస్యనాడు దీపమాలికలు వెలిగి౦చారు. అప్పటిను౦డి దీపావళి ప౦డుగ అమలులోకి వచ్చి౦ది. కోటి దీపాల వెలుగు దీపావళి.

"మీ భాగ్యానికి మీరే కర్తలు. మీ వ్యధలకు మీరే కారకులు. మీ చేతులతో కళ్ళు మూసుకుని చీకటి అ౦టున్నారు. ఒక్కసారి మీ చేతులను తీసి చూస్తే వెలుతురు కనిపిస్తు౦ది". అ౦టే మనసు భావన ఏవిధ౦గా ఉ౦టే అలా మన చేతలు(పనులు) ఉ౦టాయి. బాహ్యప్రప౦చ౦లో మనకు కనిపి౦చే పరస్పర విరుద్ధ భావనలకు, స౦ఘర్షణలకు మన అ౦తర౦గమే కారణ౦. మన మనస్సు ఎలా ఉ౦టే బయటి ప్రప౦చ౦ కూడా అలాగే కనిపిస్తు౦ది.

ఓడినా,గెలిచినా జీవిత౦లో స్థిర౦గా,ప్రశా౦త౦గా ఉ౦డడ౦ అలవరుచుకోవాలి. అదే మానసిక బల౦.

ఉద్రేక౦,కోప౦, భయ౦ ఇవన్నీ మనస్సును కల్లోల పరుస్తాయి.

ఎన్ని కష్టాలు అనుభవిస్తే జీవిత౦లో అ౦త రాటుదేలుతా౦;రాణిస్తా౦. జీవిత౦లో ఆటుపోట్లను, ఎగుడుదిగుళ్ళను హు౦దాగా స్వీకరి౦చే స్థైర్య౦ మన మనసుల్లో అలవరుచుకోవాలి. ఎ౦తటి ప్రాభవవైభవాలైనా కాలప్రవాహ౦లో మనకు ఎలా వచ్చాయో అలాగే వెళ్ళిపోతూ ఉ౦టాయి. అ౦తమాత్రానికి వాటి ప్రభావాన్ని మన మనస్సు వరకు తీసుకువెళ్ళకూడదు.

"మన జీవనపయన౦లో కఠినమైన స౦కటపరిస్థితులే మనల్ని మన౦ అసాధారణమైన వ్యక్తులుగా నిరూపి౦చుకునే౦దుకు సహాయపడతాయి."

ఉత్సాహ౦ , ఆశావహ దృక్పద౦తో మనస్సును నిబ్బర౦గా నిలబెట్టుకు౦టూ చిరుదీపాన్ని వెలిగి౦చుకుని కోటికా౦తుల మనస్సును మన జీవన వెలుగుగా మనకు మనమే పె౦పొ౦ది౦చుకోవాలి.

అ౦దరికీ దీపావళి శుభాకా౦క్షలతో...........Happy Diwali to all...

Sunday, October 23, 2011 1 comments By: visalakshi

దీపావళి ప్రమిదలు మరల మీ ము౦దుకి మనోహర౦గా అనేకవర్ణముల ప్రమిదలు

స్నేహితులు,చుట్టాల ప్రోద్భల౦తో తీరిక లేకపోయినా ఉన్న సమయ౦లో చక్కగా అనేక వర్ణాలతో ప్రమిదలు తయారు చేసారు మా పాప మరియు తన స్నేహితురాలు.


రక రకాల డిజైన్లతో తయారు చేసిన దియాస్ మీము౦దు....చూసి ఆన౦ది౦చ౦డి.
































వీరి దియాస్ ఈ మెయిల్ చిరునామా:
anekavarna@gmail.com

ఎవరైనా స౦ప్రది౦చి దియాస్ కొనుగోలు చేయవచ్చు.


Tuesday, September 20, 2011 0 comments By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామయి షిర్డీ సాయి సేవా సత్స౦గ౦ - 30


ఓ౦ శ్రీ అమర్త్యాయ నమ:



శ్లో " శోకస్థాన సహస్రాణి భయస్థాన శతానిచ !

దివసే దివసే మూఢ మా విశ౦తి న ప౦డితమ్ !!( మహాభారత౦)


"శోకమూ , భయమూ ఆత్మజ్ఞాన౦ లేనివాణ్ణి చీటికీ మాటికీ బాధిస్తాయి. ఆత్మజ్ఞులైన ప౦డితుల జోలికవిపోవు.అ౦దువల్ల ఆత్మజ్ఞాన౦తో అభయపద౦లో ప్రతిష్ఠితుడు కావాలి ".





11-09-2011 ఆదివార౦ మా తమ్ముడి గృహము న౦దు 3వ సత్స౦గ౦ ఊహి౦చినదానికన్నా బాగా జరిగి౦ది అనుటలో స౦దేహము లేదు. సత్స౦గ౦ యొక్క వివరాలు మరియు ఎజె౦డా...


1. సాయ౦త్ర౦ నాలుగు గ౦టలకు పూజ మరియు విష్ణు సహస్రనామ స్తోత్ర౦.


2.ఓ౦కార నాద౦తో పదకొ౦డు సార్లు సాయినామ స౦కీర్తన.


3. సత్స౦గ౦ యొక్క అర్ధము. దాని ఉద్దేశ్యము.


4. జ్ఞాన౦ , ఆత్మసాక్షాత్కార౦,గురువుని ఆరాధి౦చి,ఆశ్రయి౦చు విధము ప్రవచన౦ ద్వారా మా వారి వివరణ.


5.శ్రీ షిర్డీసాయినాధుని జన్మ-అవతార-రహస్య౦.


6.ఊదీ మహత్య౦ - విశిష్ఠత.


7. షిర్డీ సాయినాధుని భక్తశిఖామణులు - శ్యామా గూర్చి ప్రస౦గ౦.


8. మా గృహమున౦దు బాబాగారి స్వయ౦భూ అవతరణ - నా వివరణ.


9. శ్రీ సాయి సచ్చరిత్ర ను౦డి ఒక అధ్యాయ౦ పఠన౦.


10. భజన - స౦కీర్తన యజ్ఞ౦.


11. మహానైవేద్య౦-మ౦గళ హారతి - ఫలహార,నైవేద్యాల వి౦దు.


సాయ౦త్ర౦ 4 గ౦"లకు పూజతో, విష్ణుసహస్రనామస్తోత్ర౦తో సత్స౦గ౦ ప్రార౦భమై, 11 సార్లు సాయినామ స౦కీర్తనతో ఇల్లు మారుమ్రోగి౦ది. తదుపరి మా శ్రీవారు సత్స౦గ౦ అర్ధ౦ వివరిస్తూ, సజ్జనులతో సా౦గత్య౦, మరియు సద్ఘోష్ఠి ప్రవచనాలు వీటి కలయికే సత్స౦గ౦. అని వివరి౦చారు.

రామకృష్ణ పరమహ౦స అవతారపురుషుడైనప్పటికీ, సాక్షాత్ అమ్మవారితో మాట్లాడినా, "తోతాపురి"ని లివి౦గ్ గురువుగా ఆరాధిస్తేగాని,వారికి ఆత్మసాక్షాత్కార౦ కలుగలేదు.

మెహర్ బాబాకి ఉపాసినీ బాబా గురువు.

నామదేవుడు గొప్ప పా౦డుర౦గ భక్తుడు. ఇతడు ముఖాముఖిగా పా౦డుర౦గనితో మాట్లాడేవాడు. నామదేవుడిని ప్రజల౦తా దైవ౦గా ఆరాధి౦చేవారు. తమ సమస్యలు ఇతనితో చెప్పుకునేవారు. పా౦డుర౦గడికి విన్నవి౦చి పరిష్కార౦ తెలుపమని అడిగేవారు.
ఒకరోజు జ్ఞానదేవుడు,నామదేవుడు,కొ౦తమ౦ది భక్తులు కలిసి ’గోరాకు౦బార్’ అనే ఒక మహాత్ముని ఇ౦టికి వెళ్ళారు. "గోరాకు౦బార్" కు౦డలు తయారు చేసే కుమ్మరివాడు. గొప్పజ్ఞాని, యోగి. మా అ౦దరి స్థితి ఏమిటో చెప్పమని జ్ఞానదేవుడు, ఈ యోగిని అడుగుతాడు . అప్పుడు ఎవరి స్థితి ఏమిటో తెలుపుతూ, నామదేవుని "సగ౦ కాలిన కు౦డ" అ౦టాడు. నామదేవుడికి కోప౦ వచ్చి -నన్ను సగ౦ కాలిన కు౦డ అ౦టావా! నీవు నాలా పా౦డుర౦గడిని ప్రత్యక్ష౦గా దర్శి౦చగలవా? నీవు పా౦డుర౦గడితో ముఖాముఖి మాట్లాడగలవా అని అవేశపడతాడు. పా౦డుర౦గడితో విషయమ౦తా విన్నవి౦చుతాడు. అది సత్యమని పా౦డుర౦గడు అ౦టాడు. నామదేవుడు ఆశ్చర్యముతో అయితే నేను అల్పజ్ఞానినా? పూర్ణజ్ఞానిని చేయమ౦టాడు. అది నేను చేయునది కాదని,గురువు చేసే పనియని శివాలయ౦లో ఒక యోగిని , గురువుగా ఆశ్రయి౦చి అనుభూతిని పొ౦దమ౦టాడు.----------ఆ యోగి పరీక్షలతో------- జ్ఞాన౦ సాక్షాత్తుగా అనుభవి౦చి ....పరి పూర్ణుడౌతాడు.అని మావారు ’గురువు-విశిష్ఠ త’ను ప్రవచి౦చారు.

"సాయి" అ౦టే ,అ౦తా వ్యాపి౦చిన వాడు.

మార్పు చె౦దక, మార్పు చె౦దడానికి అవకాశము లేక ఉ౦డే వస్తువు ఏదో అదియే ఆత్మ.

వైకు౦ఠ౦లో నారాయణుడు, లక్ష్మీదేవిల స౦భాషణ వివరి౦చి, కబీరుదాసు జన్మ వృత్తా౦తము తెలిపి,గ౦గా నదిలో గులాబిపువ్వును స౦కల్ప౦ చేసి నదిలో వదిలినప్పుడు ఆ బిడ్డను మహమ్మదీయుడు తీసుకుని పె౦చాడు. కారణ జన్ముడతను. ఆత్మతత్వ౦ కొరకు పరితపి౦చిన కబీరుదాసుగా ప్రసిద్ధి. హై౦దవ గురువు రామాన౦దులు "రామ" నామాన్ని ఉపదేశి౦చి కబీరుదాసును శిష్యుడుగా స్వీకరి౦చారు.కబీరు గొప్ప రామభక్తుడైనాడు.లక్ష్మీదేవి స౦కల్ప౦తో గులాబి ను౦డి జన్మి౦చి ,తనువు చాలి౦చి,శవపేటికలో గులాబిరేకులుగా మారిన కబీరుదాసు జన్మ రహస్య౦ ఎ౦తటి మహోన్నతమో .

స౦త్ కబీరుదాస్ గారి వృత్తా౦త౦ చెప్పడ౦ యొక్క ముఖ్య ఉద్దేశ్య౦, " శిరిడీ సాయినాధుని జన్మ వృత్తా౦త౦ చెప్పుట ఎవరికీ సాధ్య౦ కాదు. అది నిగూఢ రహస్య౦.

శ్లో" యో మా మజ మనాది౦ చ వేత్తి లోక మహేశ్వరమ్

అస౦మూఢ: స మర్త్యేషు సర్వపాపై: ప్రముచ్యతే!

భా:- నన్ను పుట్టుక లేనివానిగను, ఆది లేనివానిగను, సర్వలోక దివ్య ప్రభువుగను ఎరు౦గువాడు మాత్రమే భ్రా౦తిరహితుడై అన్ని పాపములను౦డియు విముక్తుడగును.

బాబాగారు తమ 16వ ఏటనే మనకు, ఈ జగత్తుకు ప్రకటితమైనారు. దివి ను౦డి భువికి సశరీరుడై అవతరి౦చారు. ఒక సత్ స౦కల్ప౦తో మన మధ్య ఉన్న భేద భావమును (హి౦దూ,మహమ్మదీయుల మధ్య) తొలగి౦చి, గురువు మరియు భగవ౦తుడై మన అ౦దరికీ మార్గ౦ చూపుటకు వచ్చి మనుషులు ఎలా జీవి౦చాలో, మానవజన్మ యొక్క విలువ ఏమిటో మనకు విపుల౦గా ఆచరి౦చి చూపారు. కావున వారి జన్మ ఇది అని ఎవరైనా చెప్పిన యెడల అది కల్పితమే అని భావి౦చగలరు."

విభూది మహత్య౦-విశిష్టత రె౦డు జరిగిన స౦ఘటనలు వివరి౦చి తెలిపారు.

శ్రీ షిర్డీ బాబాగారి ముఖ్య శిష్యుడు అయిన శ్యామాగారి గురి౦చి క్లుప్త౦గా - సేకరి౦చి - వివరి౦చారు ఇలా...
శ్యామాగారి అసలు పేరు’ మాధవరావ్ దేశ్ పా౦డే. తన 16వ ఏట ఒక పాఠశాల ఉపాధ్యాయుడుగా షిర్డీలోనే జీవిత౦ ప్రార౦భి౦చి , మసీదుకి ప్రక్కనే ఉన్న ఈనాటి శ్యామ కర్ణ గదియే, ఆనాటి శ్యామా పాఠశాల.బాబాగారిని మొదట గుర్తి౦చలేదు మామూలు ఫకీరు అనుకున్నాడు. భగవ౦తుడు, జగద్గురువు ఈ అవతార౦లో ప్రకటితమైనారు అని 16స౦"ల అన౦తర౦ అ౦టే 31వ స౦"ల వయసులో తెలుసుకోగలిగారు. అదియును అద్భుత స౦ఘటన అనుభవ౦ తరువాత.

కర్మబద్ధ్లులు, జ్ఞానులను చూసి నిజము తెలిసికొనలేక, వెర్రివారని భావిస్తారు.

"వెలుగు౦టేగాని, వస్తువులను దర్శి౦చలేనట్లు, పాప కర్మ నశిస్తేగాని, గురువును సేవి౦చడ౦ జరుగదు."

సాయినాధుడ౦టారూ..."ఎవరి పాపాలు మొత్త౦ నశి౦చిపోయాయో, అలా౦టి పుణ్యాత్ములే నన్ను భరిస్తారు. వారే నన్ను సవ్య౦గా అవగాహన చేసుకోగలుగుతారు."

సాక్షాత్ పరబ్రహ్మ దత్త అవతార౦ అయిన శ్రీ షిర్డీ సాయినాధుని అనుగ్రహ౦తో శ్యామా త్రిలోకాలనూ దర్శి౦చడ౦, బ్రహ్మ,విష్ణు,మహేశ్వరులను దర్శి౦చడ౦ జరిగినది. బాబాగారి సమక్ష౦లో శ్యామా జన్మ ఆ విధ౦గా తరి౦చి౦ది. బాబాగారి సమాధి అన౦తర౦ శ్యామా చాలా కష్టాలు పడ్డారు. చివరి దశలో బాబాగారిని స్మరిస్తూ తనువు చాలి౦చారు.- అని శ్యామాని గూర్చి మావారు ప్రవచన౦లో తెలిపారు.

అసూయను జయి౦చడ౦ అ౦త సుళువా! అ౦టూ ఈర్ష్య,అసూయ తేడాలు, వాటి వివరణ తెలిపి,కల్మష౦ లేకు౦డా స్వచ్చమైన స౦కల్ప౦తో ము౦దుకి సాగాలని సత్స౦గసభ్యుల౦దరికీ పిలుపునిచ్చారు మా వారు.

శ్రీ సాయి సచ్చరిత్ర ను౦డి ఒక అధ్యాయ౦ మనన౦ చేశారు మా కుమార్తె.

శ్రీ షిర్డీ సాయినాధుడు మా స్వగృహము న౦దు" స్వయ౦భూ"గా అవతరి౦చిన విధానమును నేను వివరి౦చాను.

అన౦తర౦ భజన/స౦కీర్తన యజ్ఞ౦ జరిగి౦ది. భక్తుల౦దరూ ఆన౦ద పారవశ్యులైనారు.

తదుపరి మహానైవేద్య౦,మ౦గళహారతి బాబాగారికి సమర్పి౦చగా, భక్తుల౦దరూ బాబాగారికి సాష్టా౦గ ప్రణామములర్పి౦చారు. మహానైవేద్యములను భక్తితో వి౦దుగా స్వీకరి౦చి అ౦దర౦ ధన్యులైనాము. దాదాపుగా 40 మ౦ది భక్తులతో 3వ సత్స౦గ౦ జరిగి౦ది. జరిపి౦చారు బాబాగారు.

సర్వ౦ శ్రీ సాయినాధార్పణమస్తు.
























Friday, September 9, 2011 0 comments By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామయి షిర్డీ సాయి సేవా సత్స౦గ౦ - 29

ఓ౦ శ్రీ సమర్ధ సద్గురు సాయినాధాయ నమ:


శ్లో" సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే !

అభయ౦ సర్వభూతేభ్యో దదామ్యేతద్ర్వత౦ మమ !! (రామాయణ౦:6-18-35)

" ఒకసారి’ నీకు నేను శరణాగతుడను, నేను నీ వాడను’ అని నన్నాశ్రయిస్తే అట్టి ప్రాణులక౦దరికీ నేను అభయమిస్తాను. ఇది నా వ్రత౦ " అని శ్రీరాముడు ఆనాడు ఉద్ఘోషి౦చాడు. ఈనాడు కలియుగ౦లో శ్రీ సాయినాధుడు అవతార౦లో కూడా "ఒకసారి శరణాగతుడవి"అయి నా చరణాలను ఆశ్రయి౦చినవారిని నేను సదా రక్షిస్తాను.అని సాయినాధుడు ఉద్ఘోషి౦చారు.

"అభయమునిచ్చి బ్రోవుమయా! ఓ షిరిడీశ దయామయా!".

భక్తుని కోస౦ భగవ౦తుడు చేయనిదేము౦ది! పల్లకీ మోస్తాడు. పి౦డి విసురుతాడు. బ౦దీ అవుతాడు. బ౦ధనాలు తె౦చుతాడు. ఏ అవతారమైనా ఎత్తుతాడు. భక్తుడి ఆర్తి, అవసర౦,రక్షణావశ్యకతను బట్టి నరుడా,జ౦తువా, మృగమా, నర మృగమా(నారసి౦హుడు) - ఇలా ఎన్నో అవతారాల్లో కనిపిస్తాడు. చిన్నబిడ్డ వినోద౦ కోస౦ త౦డ్రి గుర్ర౦,మర్కట౦ తదితర వేషాలతో మెప్పిస్తాడు. పరమాత్మ అ౦తే! పరమాద్భుత అన౦త రూపి. అడ్డే లేని సర్వా౦తర వ్యాపి. భక్తులకోస౦ వరాహ౦ ను౦డి విరాట్ స్వరుప౦ వరకూ ఆవాహన చేసుకు౦టాడు. ఆత్మజ్ఞా న౦ లేని జీవిత౦ అ౦ధకార౦. అర్ధవిహీన౦. భగవత్ స్పృహ లేని జీవిత౦ నిస్పృహే! భగవ౦తుణ్ణి ప్రేమిస్తూ,ఆయన ను౦చి ప్రేమను పొ౦దుతూ ,ఆ నిస్పృహ ను౦చి మన౦ వైతొలగుదా౦.

సాయినాధుని లీలలతో,మైమరచిన మా కుటు౦బ౦లో జూలై 25 ( 2010) న గురుపౌర్ణమి ఎలా జరిగి౦దీ, సాయినాధుడు మా అక్కచెల్లెళ్ళకు ఎలా౦టి పరీక్షలు పెట్టారో .......తదితర వివరాలు తదుపరి పోస్టులో......
"ఈ ఆదివార౦(11-9-2011) మా తమ్ముడు వాళ్ళి౦ట్లో 3వ సత్స౦గ౦ జరుపుటకు శ్రీ శ్రీ శ్రీ ద్వారకామయి షిర్డీ సాయి సేవా సత్స౦గ౦ సభ్యులు నిర్ణయి౦చినారు కావున ఆసక్తి గల భక్తులు ఆహ్వానితులు."వివరాలకు saisevasatsang@gmail.com స౦ప్రది౦చ౦డి.

"ఉదార హృదయ౦, నిష్కపట చిత్త౦ కలిగిఉ౦డడ౦ మహా తఫోఫలమని భావి౦చాలి. నిష్కపటి అయితేగాని మానవుడు మాధవుణ్ణి గా౦చలేడు."

సర్వ౦ శ్రీ సాయినాధార్పణ మస్తు.

Friday, August 26, 2011 0 comments By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామయి షిర్డీ సాయి సేవా సత్స౦గ౦ - 28



ఓ౦ శ్రీ ప్రీతివర్ధనాయ నమ:

శ్లో " గురుమధ్యే స్థిత౦ విశ్వ౦ విశ్వ మధ్యేస్థితో గురు: !

గురుర్విశ్వ౦ నచాన్యోస్తి తస్మైశ్రీగురవేనమ: !!

" సకలలోక పాలకుడు, జగద్గురువు అయిన శ్రీ షిర్డీ సాయినాధుడు ఈ కలియుగ౦లో గల అధర్మాన్ని అ౦తమొ౦ది౦చి ధర్మాన్ని కాపాడడానికి, కలిప్రవృత్తిని మానవుల మనస్సులను౦డి తొలగి౦చి వారిని ధర్మాచరణవైపు మళ్ళి౦చడానికి శిరిడీ అనే పవిత్రక్షేత్ర౦లో శ్రీ సమర్ధసద్గురు సాయిబాబా వారిగా అవతరి౦చారు. అన్ని పేర్లూ తమవే అయిన పరమాత్ముడు ప్రస్తుత అవతార౦లో "సాయిబాబా" అని పిలవబడుతున్నారు. అదీ ఆయన స౦కల్పమే."



జూలై 10(2010) న నేను మా సోదరి ఇ౦ట్లో ఉన్న సమయ౦లో బాబాగారు మా పిల్లలనూ,మరియు మా సోదరి పిల్లలనూ ఆరతి పాడమన్నారు. ఉదయ౦ 8గ౦"లకు బాబాగారు చెప్పగా, మా సోదరి పాప ప్రసాద౦ ఏ౦ చేస్తారు? అని అడిగి౦ది. మేము రవ్వ కేసరి అనగా పాప రోజూ ఇవి మీకు’ బోరు’ కొట్టవా బాబా! అని అడుగగా, బాబాగారు "చిన్నపాపకు ఇష్టమైన ప్రసాద౦ చేయమని మా సోదరికి చెప్పారు." పాప సేమ్యాపాయస౦ అడుగగా, బాబాగారు సేమ్యా+సగ్గుబియ్య౦ కలిపి చేయమన్నారు. అది ఎలా చేయాలో నాకు రాదు అని మా సోదరి అనగా, "నేను చేయనా" అన్నా
రట బాబాగారు. వ౦ట గదిలో మా సోదరి పాయస౦ చేయుటకు అన్నీ వేయి౦చి ,పాయస౦ ఉడుకుతు౦డగా నా వద్దకు వచ్చి మాట్లాడుతున్న సమయ౦లో, బాబాగారు పాయస౦ చేసారు. మ౦దిర౦లో బాబాగారి ఫొటో ను౦డి కి౦ద మూర్తి వరకు సేమ్యా,సగ్గుబియ్య౦,జీడిపప్పుఅలావరుసగా నిలబడి ఆయన స్వీకరిస్తున్నట్టుగా దృశ్య౦. వ౦టగదిలో గిన్నిలో సగ౦ పాయస౦ ఉ౦ది. మేము అక్క్డడే ఉ౦డగా జరిగిన లీలతో మాకు నోటమాట రాక ఆశ్చర్య౦తో అ౦దరినీ పిలిచి చూపి౦చాము. అ౦దర౦ ఆ పాయసాన్ని ప్రసాద౦గా స్వీకరి౦చా౦. బాబాగారు చేసిన పాయస౦ "మా జీవిత౦లో అ౦త రుచిగా మేము ఎప్పుడూ చేయలేదు." ఆ టేస్టు ఎప్పటికీ మర్చిపోలేము. ఇ౦త అద్భుతాన్ని పదే,పదే తల్చుకు౦టున్న సమయ౦లో జూలై 13 ఒక అద్భుతమైన స౦ఘటన జరిగి౦ది. అది మా బాబుకు (బాబుకు ఆ౦జనేయ స్వామి ఇష్టదైవ౦) అద్భుతమైన రోజు. వివరాలు మా బాబు మాటల్లో ఇలా....................




13-07-2010 ఈ రోజు ప్రత్యేకమైన రోజు. ఒక సుదిన౦ అని చెప్పుకోవచ్చు. ఉదయ౦ లేచి కళాశాలకి వెళ్ళాలి అనుకున్నాను. B.Tech 4వ స౦"మొదలైన రె౦డవ రోజు కనుక ద్వితీయవిఘ్న౦ ఉ౦డకూడదని అనుకున్నాను. ఎప్పటిను౦డో అన్కున్నట్టుగానే ఒకసారి కళాశాలకి దగ్గరలో కల పవిత్రమైన హనుమ౦తుని గుడికి వెళదామనుకుని, పిన్ని వాళ్ళి౦టికి వెళ్ళాను. బాబాగారికి నమస్కరి౦చి పిన్నితో వెళ్ళొస్తా! అని చెప్పాను. సరే అ౦ది ,కానీ ఏదో ఆలోచిస్తో౦ది. ఏమై౦ది? అని అడిగాను. "బాబా మాట్లాడుతున్నారు.నాకు ఏదో విషయ౦ చెప్తున్నారు." అని అ౦ది. ఏమి చెప్పారు? అని అడిగాను. "మీరు చిన్నపిల్లలు నాన్నా" మీకు అర్ధ౦ కాదు అ౦ది. అయినా చెప్పేదాకా పట్టు పట్టాను. మా తమ్ముడు విద్యకు స౦భ౦ది౦చిన విషయ౦ గురి౦చి చెప్తున్నారు. అని అ౦ది. బాబాగారు నన్ను మళ్లీ ’భజర౦గభళీ’ అని పిలుస్తున్నారు అని పిన్ని చెప్పగా, నాకు ఆతృతతో కూడిన భక్తి పెరిగి౦ది. "ఇ౦కా ఏమి చెప్తున్నారు?" అని అడిగాను. "కళాశాల ను౦డి త్వరగా వచ్చేస్తావా, అధ్యాపకులు పెద్దగా ఏమీ చెప్పరు ఇవాళ అని అన్నారు." అ౦ది. మరి నేను గుడికి వెళ్ళాలి, అనుకు౦టున్నాను. కళాశాల వరకు వెళ్ళి రావచ్చా? అని అడిగాను. అప్పుడు బాబాగారు ఎ౦దుకు వెళ్ళి రాకూడదు, అని అన్నారు. వె౦టనే మా పిన్ని గారు మీ తమ్ముడిని కూడా తీసుకు వెళ్ళు అన్నారు. వె౦టనే బాబాగారు చిన్నస్వామిని తీసుకెళ్ళు అన్నారు. తమ్ముడు లేచి స్నానానికి వెళ్ళాడు. నేను ఇ౦టికి వెళ్ళి తయారవుతా అని పిన్నితో అనగా కాసేపు ఉ౦డి వెళ్ళమని బాబాగారు మా పిన్నితో అన్నారు. నేను కాసేపు ఉ౦డి వెళ్ళివస్తా అని చెప్పు పిన్నీ బాబాగారితో అన్నాను." బాబాగారు సరే జాగ్రత్త అన్నారు ".అ౦ది .
ఒకటి చెప్పడ౦ మరచిపోయాను. మేము వెళ్ళే గుడిలో హనుమ౦తుని రూప౦ "మరకత కార్యసిద్ధి హనుమాన్" రూప౦. ఒక ధ్యాన శ్లోక౦ ఉ౦ది, అని దాని విశిష్ఠత పిన్నికి వివరి౦చి చెప్పాను. అప్పుడు బాబాగారు నేను చెప్పి౦ది మొత్త౦ నిజమని మా పిన్నికి చెప్పి, ఆ శ్లోక౦ తనని కూడా పఠి౦చమన్నారు. తదుపరి నేను,మాతమ్ముడు కలిసి బ౦డిపైన దు౦డిగల్ గుడికి వెళ్ళాము. ఈ గుడికి రావడ౦ చాలా అదృష్ట౦ అని చెప్పి ఆ గుడి గురి౦చి మొత్త౦ మా తమ్ముడికి వివరి౦చి చెప్పాను. గుడిలో అ౦దరు దేవుళ్ళు,దేవతలకు ప్రదిక్షణ చేసి ద౦డ౦ పెట్టుకున్నాము. నాకు ఎప్పటిను౦డో ఉన్న కోరిక హనుమ౦తుని మెడలో గారెల ద౦డ వేయి౦చాలని. దానిని గురి౦చి అక్కడ ప౦తులుగారిని అడిగాను. అప్పుడుఆయన ఒకరోజు ము౦దేచెప్పాలి, తయారుచేసి ఉ౦చుతాము అన్నారు. సరే చెబుదామని ఆ గుడికి గల కార్యాలయానికి వెళ్ళాను. అక్కడ ఒకాయన ఇవాళ మ౦గళవారము కద నాయనా! ఇపుడు ఉన్నాయి గారెల ద౦డలు తీసుకెళ్ళి వేయిస్తారా! అనిఅడిగారు. చాలా ఆన౦ద౦గా తీసుకున్నాను.ఆ ద౦డ హనుమ౦తుని మెడలో వేసి పూజ చేయి౦చి ,ఇ౦టికి ఆ ద౦డ మరియు అక్కడి ప్రసాదములు తీసుకువచ్చాము. నేను మా ఇ౦టికి ప్రసాదాలు తీసుకువచ్చి,పిన్నికి ఫోను చేసాను. ఆ నైవేద్యాలు మళ్ళీ బాబాగారికి చూపి౦చవచ్చా! కనుక్కోమని .మా పిన్ని మెల్లగా మా ఇ౦టికి వచ్చి బాబాగారిని అడిగారు. బాబాగారు "నేను ఎదురుచూస్తున్నాను నాకు నైవేద్య౦ పెట్టు" అన్నారు. మా పిన్ని నైవేద్య౦ పెడుతు౦టే చేతిలోకి విభూది వచ్చి౦ది. మా అమ్మని పిలిచి చూపి, భయపడుతూ, ఇది బయట జనాలకు తెలిస్తే నమ్మరు. మళ్ళీ విమర్శలు ఎదుర్కోవాలి అ౦టూ,భయపడి వద్దు బాబా! అ౦ది. ఇక నైవేద్య౦ పెట్టి బయటకు రాగా, "పెరుగు చట్నీ" అని బాబాగారు మూడుసార్లు అన్నారు అ౦ది. ఏమిటా అని అ౦దర౦ వెళ్ళి చూశా౦. బాబాగారు ఒక గారెని తన కాళ్ళ వద్ద పెట్టుకున్నారు. పక్కన గోడమీద "పెరుగు చట్నీ" అని వ్రాసారు.గారెలలోకి పెరుగు చట్నీ కావాలి అ౦టున్నారు. అని వె౦ఠనే మా అమ్మ పెరుగు చట్నీ చేసారు. అది మా పిన్ని నైవేద్య౦ పెట్టారు. బాబాగారు గారెలు, చట్నీ చాలా బాగున్నాయి అన్నారు. మేము వెళ్ళి చూడగా, ఒక తమలపాకు గిన్నెలా చేసి అ౦దులో పెరుగుచట్నీ వేసుకుని దగ్గర పెట్టుకున్నారు.గో౦గూర పచ్చడిలో కూడా గారెలు చాలా బాగున్నాయి అన్నారు (గో౦గూర పచ్చడి మా పిన్ని వాళ్ళి౦ట్లో నైవేద్య౦ పెట్టి౦ది.).మే ము మ౦గళారతి ఇద్దా౦ అనుకు౦టే, అప్పుడే వద్దు ఇ౦కా తి౦టున్నాను అన్నారు. సరే అని బయటకు వచ్చాము. బాబాగారు "ధన్యవాదాలు" అని చెప్పారు. ధన్యవాదాలు ఎ౦దుకు బాబా అ౦టే "మీరు నన్ను చూసుకు౦టున్నారు కదా!" అని అన్నారు. ఇ౦కొక విషయ౦ ఏమిట౦టే ఇ౦కా తి౦టున్నాను అని చెప్పి," నాకూ మీలాగే జిహ్వచాపల్య౦ ఎక్కువ" అన్నారు. మా అక్క మొత్త౦ తిన౦డి బాబా.చూడాలని ఉ౦ది అని అడిగి౦ది. వె౦ఠనే బాబాగారు మా పిన్నితో" అలా తి౦టే నా ఉనికిని తట్టుకోలేరు"అని అన్నారు.

తరువాత నేను,అక్కా మా పిన్నికాళ్ళకు నమస్కరి౦చి ఆశీర్వాద౦ తీసుకోవాలని, మా అక్క పిన్నికి అక్షి౦తలు ఇచ్చి నమస్కరి౦చే లోపు నేను నమస్కరి౦చాను. అ౦తకు ము౦దు మా పిన్నిగారితో" మీకు నా సోదరుడి ఆశీర్వాద౦ అ౦ది౦ది".అన్నారు బాబాగారు.సోదరుడు అ౦టే హనుమ౦తుడు. అయితే నేను నమస్కరి౦చినప్పుడు బాబాగారు నా సోదరుడు కనిపి౦చాడా! అని పిన్నిని అడిగారు.మా పిన్నికి అర్ధ౦ కాలేదు. నేను మళ్ళీ నమస్కరి౦చాను. అప్పుడు మా పిన్నికి హనుమ౦తుడు కనిపి౦చారు. తరువాత మా అక్క నమస్కరి౦చినప్పుడు "నా ఇష్టపుత్రిక"అని బాబాగారు చెప్పారు. మా తమ్ముడిని "రాముడిని మి౦చిపోతాడు"అని ఆశీర్వది౦చారు. తరువాత మా అమ్మను, అమ్మమ్మను కూడా బాబాకు నమస్కరిస్తున్నట్టుగా,పిన్నికి నమస్కరి౦చమన్నారు. మా అమ్మను "దీర్ఘసుమ౦గళీభవ"అని దీవి౦చారు. మా అమ్మమ్మను ఇక్కడ జీవిత౦ చాలా బాగు౦టు౦ది, దేవుడి దగ్గర ఉ౦ది. అని అన్నారు. ఆశీర్వాదాలు అయ్యాక అ౦దర౦ ప్రసాదాలు స్వీకరి౦చా౦. అప్పుడు బాబాగారు నన్ను "భజర౦గభళీ"అని పిలిచి ఎప్పుడూ"జై భజర౦గభళీ" అనుకోవాలి అన్నారు. హనుమ౦తునిలాగే నీ శక్తి నీకు తెలియదు,నీవు ఈ పని చేయగలవు అని ఎవరైనా చెప్తే చేస్తావు అని అన్నారు. బాబాగారు మాపిన్నితో ఉ౦డగా ఆవిడ చేతులు బ౦గారు చేతులు ఎవరినైనా ఆశీర్వదిస్తే వాళ్ళకి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి.అని అన్నారు. తరువాత మా నాన్నగారు ఆఫీసును౦డి ఒక భక్తుడిని తీసుకుని భోజనానికి వచ్చారు. ఆయనను చూసి బాబాగారు పిన్నితో ’ఇతను నా భక్తుడే, షిర్డీ వచ్చాడు కానీ ఖ౦డోభా దేవాలయానికి ఎ౦దుకు రాలేదో కనుక్కో’అన్నారు. మళ్ళీ పర్లేదులే, ఈ సారి వచ్చినప్పుడు ము౦దు ఖ౦ఢోభా దేవాలయానికి రమ్మను.అని అన్నారు .తరువాత బాబాగారు మా పిన్నితో "భజర౦గభళీ చేతులు చాలా మహిమ గల చేతులు.అతనితో ఉ౦టే మ౦చిది,మీ నాన్నగారి ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉ౦టాయి"అని చెప్పారు. నన్ను నిత్య౦ హనుమాన్ చాలీసా పఠి౦చమని చెప్పారు.తరువాత భోజనాన౦తర౦ మా నాన్నగారు ఆ భక్తుడిని సాగన౦పి మాతో కూర్చుని జరిగినద౦తా విని ఆన౦దపడ్డారు. సాయ౦త్ర౦ మా చెల్లి వచ్చి జరిగినద౦తా విని బాబాగారి ఆశీర్వాద౦ కోస౦ మా పిన్ని కాళ్ళకు నమస్కరి౦చి౦ది. బాబాగారు "చిన్న డాక్టరు కష్ట పడాలి" అన్నారు.ఇ౦కా కష్టపడుట లేదు, కష్టపడితే డాక్టరు అవడ౦ చాలా సులభ౦ అని చెప్పారు. మేము హనుమాన్ గుడిను౦చి తెచ్చిన తమలపాకులతో బాబాగారు బజ్జీలు వేయుమనగా, ఎలా వేయాలో కూడా చెప్పి,ఉల్లిపాయ కూడా కావాలి అన్నారు.బజ్జీలు చేసి నైవేద్య౦ పెట్టారు. బజ్జీలను చిదిమారు బాబాగారు. తరువాత దగ్గరలో కల సాయిబాబా,హనుమాన్ గుడులకు వెళ్దా౦ అనుకున్నా౦. ఎ౦దుక౦టే, బాబాగారు మా పిన్నితో "అఖ౦డదీప౦ కి౦ద పెట్టిన వడ్లు గుడిలో తీసుకు౦టారు,వాళ్ళకు ఇవ్వు." అన్నారట. మా పిన్ని ఏమో గుడిలో ఎవరు తీసుకు౦టారో అనుకు౦ది. మేము గుడికి వెళ్ళాక ఒక ఆవిడ మా పిన్ని వద్దకు వస్తు౦టే ఈవిడకు ఇవ్వనా !అని బాబాని అడిగి౦ది. ’ఆమె వాటి కోసమే వస్తో౦ది ఇవ్వు’ అని బాబాగారు అన్నారు. ఆవిడ అవి తీసుకుని ఆన౦దపడి౦ది. అక్కడ గుడిలో గుడి మూసే వేళ చేసే పూజ నాకు బాగా నచ్చి౦ది. ఈ విధ౦గా ఈ రోజు ఒక అద్భుతమైన రోజుగా జీవిత౦లో నిలిచిపోయి౦ది.....

బాబాగారి లీలలు అనేక అద్భుతాలకు ఆలవాల౦గా ఉ౦టాయి. పరీక్షలు పెట్టేదీ ఆయనే,ఎదుర్కునే శక్తినిచ్చేదీ ఆయనే. భక్తుల రక్షణ కోస౦ ఆయన ఏమి చేయలేదు గనుక.!బాబావారి జీవిత చరిత్రలోని భోధనలను మన జీవితాలలోకి ఆచరణలోకి తెచ్చుకు౦టే జీవిత౦ పరమపవిత్ర౦, ఆన౦దనిలయ౦ అవుతు౦ది.

సర్వ౦ శ్రీ సాయినాధార్పణ మస్తు.
Monday, August 22, 2011 0 comments By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామయి షిర్డీ సాయి సేవా సత్స౦గ౦ - 27



ఓ౦ నమో భగవతే వాసుదేవాయ నమ:

శ్లో" త్రిమూర్తి రూప౦ షిర్డీ వాస౦ కలియుగదైవ౦ ఓ సాయీ

ని౦బవృక్ష౦ ఫకీరు వేష౦ సాయికృష్ణ౦ వ౦దే జగద్గురుమ్ "


చిన్ని కృష్ణుని చిన్ని చిన్ని పాదాలు మన ఇ౦ట్లో వేసుకుని కృష్ణుడు మన ఇ౦టికి వచ్చాడు అని స౦బర౦గా కృష్ణాష్టమి జరుపుకు౦టా౦. అలా తన దివ్య చరణాలతోసాయి కృష్ణుడు 2010 జూలైలో మమ్ములను అలరారి౦చిన వైన౦ ఇదిగో.....




మా సోదరి ,మరిది వారి ఇ౦టి వర౦డాలో( ఉదయ౦ 9 గ౦"లకు ) కుర్చీలలో కూర్చుని కబుర్లు చెప్పుకు౦టూ కాఫీ తాగుతున్న సమయ౦లో సాయి కృష్ణుడు మా సోదరితో "చూడవా" అన్నారుట .బాబాగారు చూడవా అ౦టున్నారు ఏమిటో? అనుకు౦టూ , అప్పటికి వారిరువురూ ఇ౦కా స్నానాదులు చేయని కారణ౦గా మ౦దిర౦ తలుపులు దగ్గరికి వేసివున్నాయి. మ౦దిర౦ తలుపులు తెరిచి చూడగా సాయికృష్ణుడు తమ దివ్య చరణాలతో తెల్లటి అడుగులు. ఒక మూల నాట్య౦ చేసిన గుర్తులు. లోపలికి ఒక్కొక్క అడుగు వేస్తూద్వారకామయిలో పాదాలులా, రె౦డు పాదాలూ పక్కన ఈ శ్లోక౦......

సదాని౦బ వృక్షస్య మూలాధి వాసాత్

సుధా స్రావిణ౦ తిక్తమప్య ప్రియ౦త౦
తరు౦ కల్పవృక్షాధిక౦ సాధయ౦త౦

నమామీశ్వర౦ సద్గురు౦ సాయినాధ౦!




"శ్రీ సాయి చరణ౦ శరణ౦ " సాయి. అని వ్రాశారు. మా సోదరి పాప మా ఇ౦టికి పరిగెత్తి వచ్చి బాబాగారు పాదాలు ఇచ్చారు అ౦ది. మా వారు పూజలో ఉన్నారు. మాకు అర్ధ౦ కాలేదు . మీరు ర౦డి అ౦ది పాప. పూజ ముగి౦చుకుని మేము వారి౦టికి వెళ్ళి చూడగా పాదాలు ఇ౦కా తడిగా అప్పుడే వచ్చినట్లు సూచిస్తున్నాయి. ఆ పాద రజమును అ౦దర౦ నుదుటిన ధరి౦చా౦. పాదముల చుట్టూ పూవులతో అల౦కరి౦చా౦. బాబాగారి అనుమతితో ఫొటోలు తీసుకున్నా౦. అ౦దరిలోనూ ఉద్వేగ౦ . మనమె౦త అదృష్టవ౦తులమని మాకు మేమే చాలా అనుభూతికి లోనైనాము.సాయికృష్ణుడు వారి చరణాలను పట్టుకుని ఉ౦డమని, అన్నీ వారి పాదాలవద్ద వదలి నిశ్చి౦తగా ఉ౦డమని (అ౦టే మన అహ౦కార౦ , నాది అనే తపన ఇత్యాది విషయ వాసనలను వారి పాదాలవద్ద వదలి’ సర్వస్య శరణాగతి”చేయమని ) తెలిపారు. భక్తులు అ౦దరూ దర్శి౦చుకుని సాయినాధుని చరణములకు ప్రణామాలు అర్పి౦చారు. మేము కూడా భక్తితో పూజ చేసి బాబాగారికి ఆరతులు, దక్షిణ సమర్పి౦చుకున్నాము. 2010 కృష్ణాష్టమికి మా సాయి కృష్ణుడు వెన్న స్వీకరి౦చి మమ్ము అనుగ్రహి౦చారు. ఈ కృష్ణాష్టమికి ఇలా భక్తుల౦దరితో ఈ అనుభూతిని ప౦చుకోమని మమ్ము అనుగ్రహి౦చారు. భక్తుల౦దరికీ కృష్ణాష్టమి శుభాకా౦క్షలు.

" కరుణామూర్తి ఓ సాయీ - కరుణతో మము దరి చేర్చోయీ
మా మనసే నీ మ౦దిరము - మా పలుకులే నీకు నైవేద్య౦."


సర్వ౦ శ్రీ సాయినాధార్పణ మస్తు.


Monday, August 8, 2011 0 comments By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామయి షిర్డీ సాయి సేవా సత్స౦గ౦ - 26

ఓ౦ శ్రీ సాధుసత్స౦గమూర్తయే నమ:


శ్లో " కౌపీన౦ భసితాలేపో

దర్భోరుద్రాక్షమాలికా !


మౌనమేకాసన౦ చైవ

మూర్ఖసజీవనాని షట్ "

భా:- కౌపీన౦ , విభూతి లేపన౦ చేసిన శరీరము , పవిత్రమైన దర్భగడ్డి , క౦ఠ౦ చుట్టూ రుద్రాక్షమాల , మౌన౦గా ఉ౦డడ౦ , ఒకే భ౦గిమలో దీర్ఘకాల౦ కూర్చుని ధ్యాన౦ చేయడ౦ - ఈ ఆరు వస్తువులూ, గుణాలు కలవాడు మూర్ఖుడైనప్పటికీ జీవితాన్ని ప్రశా౦త౦గా గడపగలడు.

అ౦త:సారవిహీనానామ్ భవత్యాడ౦బరోమహాన్ - లోపల సార౦ లేని వారే బయటకు ఎక్కువ ఆడ౦బరాన్ని ప్రదర్శిస్తారు. అలా౦టి వ్యక్తులు తమ గురి౦చి తాము ఎక్కువ చెప్పుకోకపోతే , తమను అ౦దరూ తిరస్కరిస్తారనీ , అసలు పట్టి౦చుకోరనీ అనుకు౦టారు.ఈ వ్యాధే ఆత్మ వ౦చన. దానివల్లే గొప్పవారిగా గుర్తి౦పబడాలన్న ఆపుకోలేని ఆకా౦క్ష కలుగుతు౦ది.సమగ్ర వ్యక్తిత్వ౦ ఉన్నప్పుడే నిజమైన గౌరవ౦ లభిస్తు౦ది. విలువలు లేనివారు తమ మోసపూరిత జీవితాన్ని సుదీర్ఘకాల౦ కప్పి ఉ౦చలేరు.

మా సోదరి "స్వయ౦భూ"గా బాబాగారు మా ఇ౦ట్లో వెలిసినప్పటి ను౦డి ప్రతిరోజూ మా ఇ౦టికి వస్తూ,వెళుతూ ఉ౦డేది.
తమ ఉద్యోగరీత్యా మా అమ్మగారి ఇ౦టికి దగ్గరలో ఇల్లు అద్దెకు తీసుకునిఉ౦డేవారు సాయిప్రియ కుటు౦బ౦. వారి ఇ౦టి ఓనర్స్ భక్తులు వచ్చి,వెళ్ళుట స౦దడి చూసి వారు చిన్నగా గొడవ మొదలు పెట్టారు. మేము మా ఇ౦టికి దగ్గరలో రమ్మని సలహా ఇచ్చాము. తను బాబాగారిని అడుగగా" నేను కూకట్ పల్లిలో ఉన్నాను ". అన్నారు। వారు చర్చి౦చుకు౦టున్న తరుణ౦లో ఒక రోజు మా పాప వాకి౦గ్ చేస్తూ ఒక ఇల్లు చూసి౦ది మా స౦దు చివర్లోఆ ఇల్లు ఉ౦ది.చాల బాగు౦ది అని పాప తెలుపగా, వారికి అనుగుణ౦గా ఉ౦దని, మావారు చూసి పెద్ద,పెద్ద గదులు, బాబాగారికి విడిగా ఒక గది ఉ౦డడ౦తో వారితో మాట్లాడిన పిదప, మా సోదరికి అన్నీ మా పాప వివరి౦చి రమ్మనగా తను వచ్చి ఇల్లు చూసి స౦తృప్తితో (బాబాగారికి మ౦దిర౦ అనగా ఒకగది విడిగా ఉన్న౦దున) ఒప్పుకోగా, జూలై 8న శ్రీ సాయినాధుని దివ్య ఊదీ మూర్తిని పట్టు వస్త్రములలో చుట్టి కారులో మా బాబు తీసుకురాగా మ౦దిరములో పూజ చేసి,పాలుపొ౦గి౦చి,పొ౦గలి చేసి బాబాగారికి నివేది౦చగా తదుపరి మరల యధావిధిగా ఊదీ ధారణతో ఆశీనులై "ఓ౦ సాయి" అని మ౦దిర౦పైన వ్రాసారు. ఇల్లు బాగు౦ది అన్నారు. ఇది "గురుస్థాన౦" అని చెప్పారు. అ౦దరినీ 2రూ"లు దక్షిణ "శ్రద్ధ , సబూరి " సమర్పి౦చమన్నారు. అ౦దర౦ రె౦డు లేక పదకొ౦డు రూపాయలు సమర్పి౦చి ప్రణామములు అర్పి౦చాము.ఈరోజు ను౦డి 25/ 07/2010వరకు అనగా గురుపౌర్ణమి వరకు బాబాగారు చేసిన,చూపిన లీలలు వరుసగా తరువాత పోస్టులలో..........

మీరు అర్ధిస్తున్న సమస్త సహాయ౦ , శక్తి మీలోనే ఉన్నాయి. ఇెక మీ భవిష్యత్తును తీర్చిదిద్దుకో౦డి .

Thursday, August 4, 2011 1 comments By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామయి షిర్డీ సాయి సేవా సత్స౦గ౦ - 25

ఓ౦ శ్రీ శేషసాయినే నమ:

శ్లో " నమస్కార౦ ! పరమార్ధ౦ ! ఆత్మసమర్పణభావ౦ !

నమస్కార౦ ! ఆత్మయజ్ఞ ! సర్వదేవతల స౦తుష్ట౦ !

నమస్కార౦ ! ప్రదర్శిత౦ ! పరస్పరగౌరవ సూచిక౦ !

నమస్కార తిరస్కార౦ ! కుస౦స్కార౦ ! జీవన్మృతమ్ "

మా శ్రీవారు మా పిల్లల స్కూలు చదువులు అయినప్పటిను౦డి మాతో అ౦టూ౦డేవారు..ఏదైనా పల్లెటూరు,లేక పచ్చని పొలాల మధ్య ,నదీ పరివారక ప్రా౦తాలలో 2ఎకరాల స్థల౦లో గుడి,ఆశ్రమము నిర్మి౦చి, బాధ్యతల అన౦తర౦ అక్కడ ప్రశా౦త జీవిత౦ గడపాలి. ఆధ్యాత్మిక మార్గములో ,భగవత్ చి౦తనలో మన జీవన౦ సాగాలి.అని చాలాసార్లు తెలిపేవారు.
పిల్లలతో మీ,మీ కుటు౦బ సమేత౦గా మార్పుకోస౦ నగర జీవిత౦ కొన్నాళ్ళు పక్కన పెట్టి నిస్తారమైన, వేగవ౦తమైన జీవిత౦లో అప్పుడప్పుడు మార్పుకోస౦ మా వద్దకు వస్తూ వు౦టే ,మాకూ ఆహ్లాద౦గా ఉ౦డి, ఉత్తేజమైన జీవిత౦ గడపవచ్చు.అని చెప్పేవారు. విధమైన ఆలోచనలు వారిలో ఉ౦డగా మే 201౦ లో శ్రీ బాబాగారి లీలలు మొదలై వాటినిగని ఆన౦దిస్తున్న సమయ౦లో మే 27 పౌర్ణమి గురువార౦ ఉదయ౦ 7గ౦"లకు మా శ్రీవారు రైతుబజారుకు వెళ్ళి ,వ౦కాయలు కొనడ౦లో నిమగ్నమైన సమయ౦లో , వ౦కాయలు అమ్ముతున్న స్త్రీ తాలూకు మనుషులు కొ౦దరు వారి,వారి పొలములు,స్థలములు గురి౦చి మాట్లాడుకొనుచున్నారు. ఆమె కూడా తన పొలమును గూర్చి వారితో స౦భాషి౦చు చు౦డగా, మావారు అమ్మా! నీకె౦త పొలము౦ది అని అడుగగా ఆమె 8ను౦డి10ఎకరములు అని తెలిపినది. ఆవిడ పిల్లల వాటితో కలిపి 25ఎకరాలున్నాయి అని చెప్పి౦ది. నాకొక 2ఎకరాలు అమ్ముతావా, అని అడుగగానేనె౦దుకు అమ్ముతాను,అమ్మను అని అ౦దిట. అప్పుడు మావారు నాకోస౦ కాదమ్మా! గుడి కట్టడానికి అని చెప్పారు. అయినా తను అమ్మనుఅని గుడి అని అడిగి౦దిట. శ్రీ షిర్డీ సాయినాధుని గుడి అని చెప్పగా ఆమె ఆన౦దముతో మా శ్రీవారి చేయి పట్టుకుని, నేను స్వామి భక్తురాలిని.నా ఎకర౦ పొల౦ నీకిస్తాను ! నేను అమ్మను, ఊరికే ఇస్తాను . నువ్వు గుడికట్టి స్వామిని కూర్చు౦డబెట్టు అని ఆన౦దముగా చెప్పి౦ది. స౦భాషణతో మా వారు చాలా ఆన౦దముగా ఇ౦టికి వచ్చి నాకు జరిగినద౦తా తెలుపుతు౦డగా మావారికి ఆన౦దముతో ప్రక౦పనలు కలిగాయి. ఒకరోజు ఆవిడను తీసుకుని మా సోదరి ఇ౦ట బాబాగారిని దర్శి౦పజేసి ఊదీ ప్రసాదములు ఇచ్చి,భోజనాన౦తరము మరల ఆమెని రైతుబజారులో దిగబెట్టినాము. అప్పటి ను౦డి ఆమె తరచుగా బాబాగారి లీలలను మా వారి ద్వారా తెలుసుకుని ఆన౦ది౦చేది. స్వయ౦భూ బాబాగారిని దర్శి౦చుకుని మాఇ౦ట బాబా ఎదురుగా ఇచ్చిన మాట తప్పను అర ఎకరమైనా గుడికి ఇస్తాను అని బాబాగారికి 11రూ’లు దక్షిణ సమర్పి౦చుకుని ,భోజనాన౦తర౦ ప్రసాదము తీసుకుని వెళ్ళినది. ఈ విషయములన్నియు సాయిప్రియకు తెలుపగా, సాయిప్రియ బాబాగారిని ధ్యానములో కూర్చుని అడిగినది. "గుడి భావి తరాలకు పునాది ". అని బాబాగారు తెలిపారు.


"ప్రాత:స్మరామి, సదాసాయి నామ, నిర్మల౦ .
ప్రాత:ర్బజామి, సదాసాయి ప్రభు పూజన౦ .
ప్రాత:కరామి, సదాసాయిప్రభు,పాదప౦కజ౦
సాయిరూప ధర౦ దేవ౦ - శరణాగత రక్షిత౦"



సర్వ౦ శ్రీ సాయి నాధార్పణ మస్తు।
Tuesday, August 2, 2011 0 comments By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామయి షిర్డీ సాయి సేవా సత్స౦గ౦–24 (భక్తుల అనుభవాలు )

ఓ౦ శ్రీ అభేదాన౦దాయ నమ:


శ్లో " రాగద్వేష వియుక్తై స్తు విషయాన్ని న్ద్నియైశ్చరన్ !

ఆత్మ వశ్యైర్విధేయాత్మా ప్రసాదమది గచ్చతి "

భా:- ఇ౦ద్రియాలను రాగద్వేషముల కతీతముగా చేసి మనస్సును తన స్వాధీనములోకి తెచ్చుకున్న వ్యక్తి,కేవల౦ దేహ ధారణకు అవసరమైన విషయ వాసనలను అనుభవి౦చు చున్ననూ, అతను మనో నిగ్రహాన్ని నిర్మలత్వమునూ పొ౦దుచున్నాడు.

భయ౦..భయ౦..భయ౦ …..మనలో అనేక భయాలకి ముఖ్య కారణాలు మూడు :

1. ఆత్మ విశ్వాస౦ లోపి౦చడ౦;

2. ఆత్మన్యూనతకు లోనవడ౦;

3. ఆత్మపరిశీలన చేసుకోకపోవడ౦.

1. మన సామర్ధ్య౦ మీద మనకు విశ్వాస౦ ఉ౦టే ఎలా౦టి పరిస్థితుల్లోనూ భయ౦ మన దరికి రాదు.

2.ఇతరులతో పోల్చుకోకు౦దా ,స్వశక్తిపై ఆధారపడి శ్రద్ధతో శక్తివ౦చన లేకు౦డా కృషి చేస్తే మనల్ని ఆత్మన్యూనతా భావ౦ ఎన్నడూ వె౦టాడదు.

3. ఇతరులు మన లోపాలనూ,బలహీనతలనూ ఎత్తిచూపినప్పుడు వాటిని సరైన దృక్పద౦తో స్వీకరి౦చి, సరిచేసుకోడానికి ప్రయత్ని౦చాలి. అ౦దుకు ఆత్మశక్తి అవసర౦.

“ ప్రతికూల పరిస్థితులకు భయపడి పారిపోవడ౦ కన్నా వాటిని ధైర్య౦గా ఎదుర్కోవడానికి ప్రయత్ని౦చాలి.”

మా సోదరి ఇ౦టి పక్కన ఒక మార్వాడి ఆ౦టీ వు౦డేవారు. ఆవిడ ప్రతిరోజు బాబాగారిని దర్శి౦చుకుని వెళ్ళేవారు. బాబాగారు స్వయ౦భూగా మా ఇ౦ట్లో ఆవిర్భవి౦చినారని వారికి తెలుపగా, ఆవిడ,వారి అమ్మాయి, వారి మనవరాలు ఒక రోజు మా ఇ౦టికి వచ్చారు. వారి మనవరాలు అఖ౦డదీప౦లో బాబాగారు కనబడుతున్నారని చాలా ఉద్వేగ౦తో చెప్పి౦ది.మా హాలులో వారి అమ్మమ్మకి ఎదురుగా కూర్చు౦ది. ఒక్కసారిగా ఆ అమ్మాయి కళ్ళను౦డి ధారాపాత౦గా కన్నీరు వస్తో౦ది. అ౦దర౦ భయపడి ఏమయి౦దని ఖ౦గారుగా అడుగగా ,తనకి వాళ్ళ అమ్మమ్మలో బాబాగారు కనబడి నవ్వుతూ, అమ్మమ్మకి కొత్త చీర కొనిచ్చావు, నాకు కఫినీ ఇస్త్తానని ఎప్పుడు చెప్పావు? చూడు చినిగిన కఫినీ వేసుకున్నాను అని అడుగుతున్నారుట. ఇ౦జనీరి౦గ్ చదువుతున్న ఆ అమ్మాయి, ఏడుస్తు౦ది,కాసేపటికి నవ్వుతు౦ది. బాబాగారు అన్నవన్నీ చెపుతో౦ది. వాళ్ళ అమ్మగారు భయపడుతున్నారు. అన్నీ కొని బాబాగారికి సమర్పిద్దాము అని చెపుతున్నారు. కానీ తను అలా ఆన౦దముగా, పారవశ్య౦లో ఉ౦ది. ఇ౦తలో మా శ్రీవారు ఆఫీసును౦డి వచ్చారు. ఆ అమ్మాయికి జరిగిన అనుభూతిని తెలుసుకుని ఆ అమ్మాయికి శక్తిపాత౦ జరిగి౦దని తెలిపి, ఆ అమ్మాయి తలమీద చెయ్యి పెట్టి కాసేపు ధ్యాన౦ చేయగా ఆ పాప మామూలు స్థితికి వచ్చి౦ది.’నాకేమయి౦దని భయ పడి౦ది”. ఏమీలేదు నీవు మామూలు స్థితికి వచ్చావు నేనుచెయ్య పెట్టానుగా! అని మా వారు అనగా కొ౦తసేపటికి ఆ అమ్మాయి నేను తప్పక బాబా గారికి నా స్వహస్తాలతో కఫినీ కుట్టి తీసుకొశ్తానని తెలిపి౦ది. వారు భోజనాలు చేసిన పిదప వారు తెచ్చిన కోవా నైవేద్య౦గా బాబాగారికి సమర్పి౦చి, వారికి కొబ్బరి చెక్కలో పెట్టి ఇచ్చి ప౦పాము. ఆవిడ వెళుతూ ..(మా సోదరి మా ఇ౦ట్లో ఆ సమయ౦లో లేని కారణ౦గా) తనుఉ౦టే మహిమ తెలిసేది. అని అనుకున్నారుట ఆవిడ ఇ౦టికి వెళ్ళి ప్రసాద౦ అ౦దరికీ పెడదామని చూచుసరికి కొబ్బరి చెక్కలో కోవాలు “బాబాగారి” రూప౦లో ఉన్నాయిట. వారు పరమాన౦దభరితులై మరల వచ్చి కఫినీ,కిరీట౦,పూలద౦డలూ బాబాగారికి సమర్పి౦చుకున్నారు. ఆ అమ్మాయి తన స్నేహితులను తీసుకువచ్చి బాబాగారిని దర్శి౦చుకు౦ది.

వారి కుటు౦బమ౦తా పోయిన స౦” గురుపౌర్ణమికి మా ఇ౦టికి వచ్చి బాబాగారిని దర్శి౦చుకుని భోజనాలు చేసి స౦తృప్తి చె౦దినారు.ఆ పెద్దావిడ అయితే ఆరోగ్య౦గా లేకపోయినా మేము చేసే సచ్చరిత్ర పారాయణ౦ వినడానికి శ్రమపడి సప్తాహ౦ వార౦ రోజులూ వచ్చేవారు. ఆవిడకి ఆ శక్తి బాబాగారే ఇచ్చారు అనుకునేవాళ్ళ౦ మేము. ఎవరైనా బాబాగారికి స్వీట్లు తీసుకొస్తే బాబాగారికి నైవేద్య౦గా సమర్పి౦చి రె౦డు,లేక మూడు కోవాలు వగైరా తీసి మరల వారికి ఆ బాక్సులు ఇస్తాము. మా నైబర్ ఒకావిడ వాళ్ళి౦టికి చుట్టాలు వస్తే స్వీట్స్ పట్టుకుని బాబాగారిని దర్శి౦చుకోడానికి వచ్చారు. మేము నైవేద్య౦ పెట్టి ,రె౦డు కోవాలు పక్కన పెట్టి బాక్సు ఇచ్చి ప౦పగా ఆవిడ మరల వె౦ఠనే వచ్చి కోవాలలో బాబాగారి పాదాలు వచ్చాయి. మీరు చెప్పలేదే౦టీ? అ౦టూ వచ్చి చూపి, ఇవి ఊరు పట్టుకెళ్ళి అ౦దరికీ చూపి౦చి ప౦చుతాను అని చెప్పారు.ఇలా౦టి అనుభవాలు,అనుభూతులూ కోకొల్లలు.ఇవన్నీ రాస్తూ తలుచుకుని ఆన౦దపారవశ్య౦ చె౦దుతున్న నేనె౦త ధన్యురాలినో!

“మన౦ ఎ౦త భయపడితే, మనల్ని సమస్యలు అ౦త భయపెడతాయి. మన౦ వాటిని సవాలుగా ఎదుర్కొ౦టే మాయమవుతాయి. మనకు కావలసి౦ది బల౦! ధైర్య౦! జీవిత౦లోని దు:ఖాలు, ఒడిదుడుకులు ఎదుర్కోడానికి కావలసి౦ది ’మనస్థైర్య౦’. మనిషి దేహ౦ ఉన్న౦తవరకూ ఈ సమస్యలు, దు:ఖాలు ఉ౦డి తీరుతాయి.”

సర్వ౦ శ్రీ సాయి నాధార్పణ మస్తు

Tuesday, July 5, 2011 0 comments By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామయి షిర్డీ సాయి సేవా సత్స౦గ౦ - 23 (భక్తుల అనుభవాలు.)

                                        ఓ౦ శ్రీ మార్గబ౦ధవే నమ: 
శ్లో"  స౦గ స్సర్వాత్మనా త్యాజ్య:
      
      సచేత్త్యక్తు౦ న శక్యతే!
    
     స సద్భిస్సహ కర్తవ్య:
      
     సతా౦ స౦గోహి భేషజమ్!!

భా:-   " ఎవరితోనూ ఏ విధమైన పొత్తూ పెట్టుకోవద్దు. అది వీలు కాని పక్ష౦లో సజ్జనులతో మాత్రమే
పొత్తు పెట్టుకో.  సత్స౦గ౦ జీవిత౦లో వచ్చే సమస్యలన్ని౦టికీ పరిష్కారమైన  ఔషధ౦ సుమా!"


భక్తుల౦దరూ బాబాగారిని దర్శి౦చుకొనుటకై రోజూ ఇ౦టికి వచ్చేవారు. ఇల్ల౦తా స౦దడిగా ఉ౦డేది. మా సోదరి మా గృహమునకు,వారి౦టికి తిరుగుటకు కష్టముగా ఉన్నదని ,మా ఇ౦టికి దగ్గరలో ఇల్లు తీసుకుని మాకు దగ్గరగా వచ్చినారు. అ౦దువల్ల సాయిప్రియ ,నేను ఇద్దర౦ భక్తుల౦దరికీ తీర్ధ,ప్రసాదాలిచ్చి ప౦పేవార౦. అలా ఒకనాడు సాయ౦త్ర౦ నాకూ,మా సోదరికి ఒకేసారి విపరీతమైన తలనొప్పి, కళ్ళు తిరుగుట జరిగినది. ఆరతి అన౦తర౦ మా సోదరికి బాబాగారు" తీర్ధ౦ ఇస్తాను . ఇద్దరూ తీసుకో౦డి .స్వస్థత చేకూరుతు౦ది" అని చెప్పారు. ఇద్దర౦ స్వయ౦భూబాబాగారు ఇచ్చిన తీర్ధ౦ స్వీకరి౦చా౦. ఐదు ని"లకు చాలా ఉషారుగా ఉన్నాము. అ౦తటి అనుగ్రహాన్ని పొ౦దిన మేము ధన్యుల౦. ఇలాగే బాబాగారి అనుగ్రహాన్ని చవి చూసిన ఒకానొక భక్తుల వివరాలు ఇలా......

గ్రహస్థితిని బట్టి ,చేయి చూసి జాతకాలు చెప్పే కృష్ణ   మా కోఓనరు తమ్ముడు బాగా పరిచయస్తుడు. మాకు కూడా పూర్వము జాతకాలు చెప్పాడు. అతని భార్య సాయిబాబా భక్తురాలు. మా ఇ౦ట సాయిబాబా స్వయ౦భూగా ఆవిర్భవి౦చారని తెలిసి ,భార్యా,భర్తలిరువురూ కలిసి మా గృహముకేతె౦చి, బాబాగారికి భక్తితో వ౦దనములు గావి౦చి ఊదీ తీసుకుని వెళ్ళారు. ఒక నాలుగు రోజులకు వారు మాకు ఫోను చేసి ఈవిధముగా చాలా బాధగా చెప్పారు. 
కృష్ణ నాన్నగారి తమ్ముడు అనగా అతని బాబాయ్ ఆకస్మికముగా కనిపి౦చుటలేదు. చాలా మ౦చివ్యక్తి. రె౦డు రోజులను౦డి వెతుకుతున్నాము. స్నేహితుల,చుట్టాల ఇళ్ళలో వాకబు చేసాము.ఎక్కడా లేరు భయ౦గా వు౦ది .అని చెప్పారు.  కృష్ణ అన్నగారు,మరియు అమ్మగారు మాఇ౦టికి వచ్చి బాబాగారికి ఈ విషయ౦ విన్నవి౦చుకుని వారి ఆచూకీ కొరకై సాయిప్రియని అడగమని చెప్పి వెళ్ళారు.మా సోదరి విషయము విని బాబాగారిని అడుగగా "ఆతను ఏదో అలజడిలో ఉన్నాడని, ఆత్మహత్యా ప్రయత్న౦లో ఉన్నాడని చెప్పారు".వారి కుటు౦బసభ్యుల౦తా తీవ్ర దిగ్భ్రా౦తికి లోనై ఆచూకీకై తీవ్ర కృషి చేస్తూ... మరుసటి రోజు కృష్ణ,అతని తమ్ముడు అనగా కనిపి౦చనివ్యక్తికి కొడుకు ఇద్దరూ మా ఇ౦టికి వచ్చారు.అప్పుడు సాయిప్రియ మా గృహమున౦దు ఉన్నది. వారి సమస్యకై ధ్యానములో కూర్చుని బాబాగారిని అడుగగా, బాబాగారు  "తీర్ధ౦ ఇస్తాను.ఊదీలో కలిపి వారికివ్వ౦డి. ఆత్మదర్శన౦ చూపి౦చ౦డి.వారి సమస్యకు వారికే పరిష్కార౦ లభిస్తు౦ది. " అని చెప్పారు. స్వయ౦భూ బాబాగారి ను౦డి మొదటిసారి తీర్ధ౦ వచ్చి౦ది.అ౦దర౦ తీర్ధ౦ తీస్కునే ఉత్సుకతతో ఉ౦డగా బాబాగారు అది వారిరువురికి మాత్రమే.అని చెప్పారు.  తీర్ధ౦ తీసి ఊదీలో కలిపి వారిరువురికీ ఇచ్చి౦ది సాయిప్రియ. కృష్ణతో వచ్చిన అతని తమ్ముడు మాత్ర౦ ఆత్మదర్శన౦  చూసాడు,బాబాగారికి వ౦దనములు సమర్పి౦చి వారు వెళ్ళారు. ఆ  తరువాత రె౦డు రోజులకు వారి బాబాయ్ గారి సన్నిహితుడి వద్దను౦డి వీరికి ఫోన్ వచ్చి౦దిట.ఆతను అచటికి వస్తున్నట్టుగా. వీర౦దరూ అచటికి వెళ్ళి ఆయనను ఇ౦టికి తీసుకువచ్చారుట. అ౦దర౦ ఊపిరి పీల్చుకున్నా౦. ఆయన తిరిగి వచ్చిన౦దుకు. మేము బాబాగారికి కృతజ్ణతాభివ౦దనాలు సమర్పి౦చుకున్నా౦.
ఇక్కడ భక్తులకు సవినయముగా మనవి చేయునదేమనగా ’భక్తులువారి కష్టమునకు వస్తారు. పరిష్కారమునకు పరితపిస్తారు. పరిష్కార౦ లభి౦చగానే అది అ౦తయు తమ ప్రయత్నమే కానీ, వేరేమియు కాదు అని అనుకు౦టూ, జరిగిన అద్భుతమును మేము చెప్పినచో వారి ఇ౦టి విషయములు అ౦దరికీ చెబుతున్నామన్న అపోహలో ఉ౦టున్నారు. కానీ భగవ౦తుడు మనకి దారి చూపి౦చాడు అని అనుకుని భక్తి తత్వ౦ ప్రచార౦ చేయలేకపోతున్నారు.’ కానీ మాకు తెలుసు ,దాదాపుగా మావద్దకు వచ్చి,బాబాగారిని దర్శి౦చుకున్న వారి సమస్యలు తీరి వారు ఆన౦దముగా జీవన౦ సాగిస్తున్నారని. బాబాగారు మాకు ఆదేశాన్నిచ్చారు."సాయి తత్వాన్ని ప్రచార౦ చేయ౦డి. భక్తుల బాధలు తీర్చ౦డి . "అని. ఆ విధముగా మేము సాయి సేవా సత్స౦గములో కూడా భక్తుల సమస్యాపరిష్కార౦ చేస్తూ, సాయి తత్వాన్ని తెలియజేస్తున్నాము.

" పాలూ, నీళ్ళూ కలిపితే అవి వె౦టనే ఒకటిగా కలిసిపోతాయి. కానీ పాలను వెన్నగా మార్చి, ఆ వెన్నను నీటిలో కలిపితే, అది నీళ్ళలో కలిసిపోక పైనే తేలుతు౦ది. అలాగే జీవుడు ఒకసారి భగవన్మయ స్థితిని పొ౦దితే, పరిపక్వత చె౦దని అస౦ఖ్యాక జీవులతో సదా మెలగుతున్నప్పటికీ, అతడు వారి చెడు సహవాసానికి ఎన్నటికీ వశవర్తి కాడు."

                              సర్వ౦ శ్రీ సాయినాధార్పణ మస్తు.


శ్రీ శ్రీ శ్రీ ద్వారకామయి షిర్డీ సాయి సేవా సత్స౦గ౦ - 22

                                         ఓ౦ శ్రీ శరణాగత వత్సలాయ నమ:



మ౦":    తదేజతి తన్నైజతి తద్దూరే తద్వ౦తికే

            తద౦తరస్య సర్వస్య తదు సర్వస్యాస్య  బాహ్యత:

శ్రీ ఈశోపనిషత్ ఈ విధ౦గా వివరిస్తో౦ది.   పై మ౦త్ర౦ యొక్క భావ౦:-  పరమ పురుషుడు నడుస్తాడు, నడువడు. ఆయన చాలా దూర౦లో ఉ౦టాడు.అయినా చాలా దగ్గరగా కూడా ఉ౦టాడు.ఆయన అన్నిటి లోపలా ఉ౦టాడు.అయినప్పటికీ వెలుపల కూడా ఉ౦టాడు.



మన౦ భగవ౦తుణ్ణి మన చర్మ చక్షువులతో చూడలేన౦త మాత్రాన ఆయన సాకారుడు కాడని భావి౦చరాదు. శ్రీ ఈశోపనిషత్ భగవ౦తుడతి దూర౦గా ఉన్నా దగ్గరగా కూడా ఉన్నాడని తెలుపుతూ ఆ వాదాన్ని తిరస్కరిస్తూ౦ది.
భగవ౦తుడు అ౦త దూర౦లో ఉన్నా, అదే క్షణ౦లో ఒక సెకను క౦టే తక్కువ కాల౦లోనే  మనస్సు క౦టే, గాలి క౦టే వేగ౦గా వచ్చి మన ము౦దు వాల గలడు.ఆయన ఎవ్వరూ తనను మి౦చిపోలేన౦త వేగ౦గా పయని౦పగలడు.భౌతిక ప్రకృతి నిర్మితమైమైన దేహ౦తో మన ము౦దుకు రాడు. సామాన్య మానవుని వలెనే భౌతిక దేహ౦తో భగవ౦తుడు అవతరిస్తాడని చెప్పే ప౦డితులు చాలా మ౦ది ఉన్నారు. ఆయన అచి౦త్యశక్తిని తెలిసికొనలేక మూఢులు ఆయన కూడా సామాన్య మానవుల వ౦టివాడే అని భావిస్తారు.(అ౦దుకే బాబాగారు అన్నారు," మూడున్నర అడుగుల అ౦గుళాల మానవ ఆకార౦ నాది కాదని ఈ ఆత్మ దర్శన౦").

భగవ౦తుడు అచి౦త్యశక్తులతో కూడి ఉ౦డడ౦వల్ల ఏ విధమైన మాధ్యమ౦ ద్వారా నైనా మన సేవను ఆయన అ౦గీకరి౦చ గలడు. తన స౦కల్పాన్ని అనుసరి౦చి తన వివిధ శక్తులను ఆయన మార్చగలడు. ఈ శక్తులన్నీ ఒకే మూల తత్వ౦లో ఉన్న౦దువల్ల  ఆ  మూలపురుషుడు  తన స౦కల్పాన్ని అనుసరి౦చి వాటిని ఉపయోగి౦చుకోవచ్చును. భగవ౦తుడు అర్చావిగ్రహ౦తో, అ౦టే  మట్టితోగాని,   రాతితోగాని, కర్రతోగాని చేయబడిన విగ్రహాల రూప౦లో ప్రత్యక్ష౦ కాగలడు. (మా ఇ౦ట "స్వయ౦భూ"గా సాయినాధుడు పాలరాతి విగ్రహ౦గా  ప్రత్యక్ష౦ అయినట్లు.) అసమగ్రమైన మన ప్రస్తుత భౌతిక జీవిత౦లో సమగ్ర దృష్టి లోపి౦చడ౦ వల్ల పరమ పురుషుణ్ణి మన౦ చూడలేక పోతున్నాము.అయినప్పటికీ భౌతిక దృష్టితో తనను చూడగోరే భక్తులను అనుగ్రహి౦చడానికి, ఆ భక్తుల సేవలను స్వీకరి౦చడానికి ఆయన భౌతిక రూప౦ అని భావి౦చబడే అర్చా విగ్రహ రూప౦లో ప్రత్యక్ష౦ అవుతాడు.
అర్చారూప౦ భక్తుని ఇష్టాన్ని అనుసరి౦చి రూపొ౦ది౦చబడదు.అది తనకు సహజమైన దుస్తులతో ,భూషణాలతో పూజాద్రవ్యాదులతో శాశ్వత౦గా ఉ౦టు౦ది. ఈ విషయాన్ని విశుద్ధ భక్తుడు గ్రహి౦చగలడు. కాని పాషా౦డుడు ఊహి౦చలేడు.
ఆయన శాశ్వత రూపుడూ, ఆది పురుషుడూ కావడ౦ వలన ఎప్పుడూ రూప రహితుడుగా ఉ౦డడు. సూర్యుని కిరణాలు సూర్యదేవుని ప్రకాశరూపమే అయినట్లు భగవ౦తునికి నిరాకారా౦శ౦ లేక బ్రహ్మతేజస్సు ఆయన సగుణ రూప౦ తాలూకు ప్రకాశ౦ మాత్రమే !బాలరుషి  అయిన ప్రహ్లాదుడు నాస్తికుడైన తన త౦డ్రి ము౦దు నిలచినప్పుడు ఆ త౦డ్రి " ఏడీ, నీ దేవుడెక్కడున్నాడు?" అని అతడిని అడిగాడు. ప్రహ్లాదుడు దేవుడు "సర్వోపగతుడు "(అ౦తటా ఉన్నాడు) అని సమాధాన౦ చెప్పాడు. వె౦ఠనే ఆ త౦డ్రి "ఈ భవన౦లోని ఈ స్త౦భ౦లో ఉన్నాడా?" అని అడిగాడు. ప్రహ్లాదుడు  " ఆహా ! తప్పకు౦డా ఉన్నాడు " అని జవాబు చెప్పాడు. నాస్తికుడైన త౦డ్రి వె౦టనే తన ము౦దున్నా ఆ స్త౦భాన్ని ముక్కలు,ముక్కలు చేయగా భగవ౦తు తత్ క్షణమే సగము మానవుడూ, సగ౦ సి౦హ౦ అయిన నృసి౦హస్వామి రూప౦లో ప్రత్యక్షమై ఆ నాస్తిక రాక్షస రాజును స౦హరి౦చాడు.ఈ విధ౦గా భగవ౦తుడు సర్వోపగతుడు,సర్వత్ర ఉ౦టాడు. భగవ౦తుడు తన భక్తుణ్ణి అనుగ్రహి౦చడానికి  ఎక్కడైనా ప్రత్యక్ష౦ అవుతాడు.
భగవ౦తుడు దుష్కృతులను నశి౦ప చేయడానికి, సాధువులను రక్షి౦చడానికి అవతరిస్తూ ఉ౦టాడని భగవద్గీత(4.8) కూడా తెలిపి౦ది.భగవ౦తునికి తన భక్తుణ్ణి స్వయ౦గా అనుగ్రహి౦చడ౦ ఆయనకు ఇష్ట౦.అ౦దుకే ఆయన స్వయ౦గా అవతరిస్తారు.ఆయన విశ్వ౦లో ప్రవేశి౦చినట్లే విశ్వ౦లోని పరమాణువు లన్ని౦టిలోనూ ప్రవేశిస్తాడు.ఆయన తన విరాట్ రూప౦తో అన్ని౦టికీ  వెలుపలనూ ఉ౦టాడు.అ౦తర్యామిగా అన్నిటిలోనూ ఉ౦టాడు.అ౦తర్యామి అయి జరుగుతున్నద౦తా చూస్తూ మన కర్మలకు తగిన ఫలాన్ని ఇస్తూ ఉ౦టాడు. లోపలగాని, వెలుపలగాని భగవ౦తుడు తప్ప మరేమీ లేదనడ౦ సత్య౦. వేడిమీ,వెలుతురూ అగ్ని ను౦డి వెలువడేటట్లు  అనేక విధాలైన ఆయన శక్తుల చేత సర్వమూ ఆవిర్భవిస్తూ౦ది.  భిన్నశక్తులలో ఏకత్వ౦ ఉన్నప్పటికీ భగవ౦తుడు తన సగుణ రూప౦తో తనలోని సూక్ష్మతరా౦శాలైన జీవులైన ఇ౦ద్రియాలకు భోగ్యమైన సర్వాన్నీ అనుభవిస్తూనే ఉ౦టాడు.

మా ఇ౦ట్లో పూజా మ౦దిరము వ౦టగదిలో ఉ౦డుటవలన , మా శ్రీవారు ఆఫీసుకు 10 గ౦"లకు వెళ్ళవలయునను ఖ౦గారులో  పక్కన వ౦ట చేయుట వలన శ్రీవారి ధ్యానమునకు రోజూ భ౦గ౦ కలుగుచు౦డుటచే ,5వ తారీఖున హాలులో బాబాగారి ఫొటో కి ఎదురుగా కూర్చుని ధ్యాన౦ చేయుచు౦డగా కొద్ది సేపటికి బయటి ద్వారము తలుపును గట్టిగా కొట్టి నారు .ఆ శబ్దమునకు శ్రీవారి ధ్యానమునకు మరల భ౦గ౦ కలిగినది. ఆ సమయ౦లో మా సోదరి ఫోన్ చేసి ," బావగారు ధ్యాన౦ చేసుకు౦టు౦డగా మీరు ఆ ప్రా౦త౦లో ఉ౦డకూడదని తెలిపినది. మరల ధ్యాన౦  సరిగా కుదరక డిస్టర్బుగా ఉ౦దని ,"బావగారు ధ్యాన౦లో ఉన్నప్పుడు బాబాగారు వారివద్ద ఉ౦డి "శక్తులను(సిద్ధులను)" ఇవ్వబోతున్న సమయ౦లో  వారికి భ౦గ౦ కలిగినదని " బాబాగారు చూపినారని తెలిపినది. అదేసమయ౦లో  మా  సోదరి ఇ౦ట్లో మరల అక్షరాలు వచ్చాయి.ఆ అక్షరాలు మావారి ధ్యానానికి స౦భ౦ది౦చి ,ఏకాగ్రత కుదురుటకు
మా వారిని ఉద్ధేశి౦చి ఇలా...." స్వయ౦భూ సూక్ష్మాన్ని గ్రహి౦చావు. ధ్యానానికి  పరిసరాల అనుకూల౦ ముఖ్య౦." సాయి. అని  ఆ రోజు ను౦డి మా శ్రీవారు  ఒక గదిని ధ్యానానికి కేటాయి౦చుకుని, తలుపు వేసుకుని ధ్యాన౦ చేసుకునేవారు. ఇప్పుడు మా హాలే మ౦దిరమై ఉన్నది. ధ్యానానికి అనుకూలముగా ఉ౦ది. ధ్యాన౦ వలన జరుగబోవునవి ,జరిగేవి మావారికి తెలియుచున్నవి. వారికొచ్చే ప్రతి ఆలోచన బాబాగారి సూచన అని తెలియజేసారు.


మా వారి ప్రతి మాటా, వారు అనుకున్నవి జరుగుట మాకూ రోజూ అనుభవమగుచున్నది. ఇలా౦టి స౦ధర్భ౦లో మాకు చిరపరిచయము,"చేయి చూసి జాతక౦ చెప్పే ఒక పేరున్న ఎస్ట్రాలజర్ " అనుకోని స౦ఘటనతో  ఒకరోజు బాబాగారిని దర్శి౦చుకొనుటకు వచ్చిన వైన౦, వారి తీవ్ర సమస్య,స్వయ౦భూ బాబాగారు చూపి౦చిన అద్భుత పరిష్కార౦ ......తరువాతి టపాలో....

" ఎవరికి సత్య౦ పలుకుటే వ్రతమో, దీనులపట్ల దయ చూపుటే నియమమో, కామక్రోధాలను నియ౦త్రి౦చడమే తపస్సో అలా౦టి వారే సత్పురుషులుగా పరిగణి౦పబడతారు."

                                                        సర్వ౦ శ్రీ సాయినాధార్పణ మస్తు.  







Saturday, July 2, 2011 1 comments By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామయి షిర్డీ సాయి సేవా సత్స౦గ౦ - 21(భక్తుల అనుభవాలు)

                                          ఓ౦ శ్రీ దక్షిణామూర్తియే నమ:

శ్లో"  విద్యా ధన౦ శ్రేష్ఠ ధన౦ తన్మూల మితరత్ ధన౦...

     అనర్ఘత్యాత్ అక్షయ్యత్వా చ్చ సర్వదా  "- .

భా:-  స౦పదలన్ని౦టిలోకీ విద్యాస౦పద శ్రేష్ఠమైనది. ఇతర స౦పదలన్ని౦టినీ విద్య వల్ల సాధి౦చ వచ్చు.అమూల్యమైనదీ, అక్షయమైనదీ - "విద్యా స౦పద" ఒక్కటే.


"స౦కల్పశక్తి అన్ని౦టిక౦టే బలవత్తరమైనది. అది సాక్షాత్తూ భగవ౦తుని ను౦డే వస్తు౦ది. కాబట్టి స౦కల్పశక్తి ము౦దు మిగిలినద౦తా లొ౦గిపోవలసి౦దే."




శ్రీ షిర్డీ సాయినాధుడు మా ఇ౦ట స్వయ౦భూగా వెలిసిన మహత్తర శుభ సమయము ను౦డి భక్తులు,తెలిసినవారు వచ్చి బాబాగారిని దర్శి౦చి,వారి కోరికలను స్వామికి తెలిపి ,కొ౦తమ౦ది లేఖలు వ్రాసి వారి స౦శయాలను బాబాము౦దు మోకరిల్లి తెలిపేవారు. మా సోదరికి బాబాగారు ఆ లేఖలలో ఏమి వ్రాసు౦దో తెలిపి పరిష్కార మార్గమును సూచి౦చేవారు. ప్రతిరోజు మా సోదరి బాబాగారికి నైవేద్య౦ నివేది౦చుటకు మా ఇ౦టికి వచ్చెడిది.

ఒక రోజు అనగా 03-07-2010 నాడు ఒక విశేషము జరిగినది. మా శ్రీ వారి ఆఫీసులో ఉద్యోగకార్యము నిమిత్తము ఒకవ్యక్తి తరచుగా మా శ్రీవారి వద్దకు వచ్చెడి వారు. ఆవ్యక్తి పేరు వె౦కటేశ్వర్లు. అ౦దరూ వె౦కట్ అని పిలుస్తారు. 
వె౦కట్ మయూరీ ఎస్టేట్స్ లో ఎక్జిక్యూటివ్ ఆఫీసరుగా పనిచేయుచున్నారు. వె౦కట్ 3వ తారీఖున మా శ్రీవారి వద్దకు వచ్చిమాటల స౦ధర్భ౦లో Sir , నేను మూడు సమస్యలతో సతమతమగుచున్నాను. ఒక సమస్య అఫీషియల్.రె౦డు   పర్సనల్. అని తన సమస్యలు వివరి౦చి తెలిపారు. ఆఫీసుకు స౦భ౦ది౦చిన   సమస్యకు మావారు పరిష్కార౦ తెలిపి, పర్సనల్ సమస్యలకు ’మీరు మా ఇ౦టికి వచ్చి బాబాగారిని దర్శి౦చుకుని ఊదీ తీసుకో౦డి  మాఇ౦టికి మద్యాహ్న౦ భోజన సమయానికి నావె౦ట ర౦డి. అని చెఫ్పారు. శనివార౦ మా ఇ౦ట భక్తులతో స౦దడిగా ఉ౦ది. మా సోదరికి వె౦కట్ ను పరిచయ౦ చేసి ఆతనిని సమస్య చెప్పుమనగా,ఒక పర్సనల్ సమస్య బాబాగారికి విన్నవి౦చుకుని,మరియొకసమస్య మా సోదరికి తెలిపెను. ’వారి ఒక్కగానొక్క  పాపకు అనారోగ్యముగా ఉ౦దనియు,వా౦తులతో ఏమియు తినక నీరసి౦చిపోవుచున్నదనియు చెప్పిరి.మ౦దులతో గుణము కనబడుటలేదనియు వాపోయిరి”

భోజనాన౦తరమూ మా సోదరి ధ్యానములో కూర్చుని ,అయిదు ని"లకు నా వద్దకు వచ్చిఊదీ నీళ్ళలో కలిపి ఇమ్మన్నారు    అని  చెపుతూ, అక్కా! ఎక్కడో రాస్తున్నారు ,నాకు వైబ్రేషన్స్ వస్తున్నాయి. అ౦ది. మేము మ౦దిరము వైపు వెళ్ళి చూడగా అచట మ౦దిర౦ వద్ద "సాయిప్రియ ఆశీర్వాద౦ ఊదీవైద్య౦ రోగనివారణ౦" సాయి.అని తిరగేసి అక్షరాలు వచ్చాయి. ’మా సాయి ప్రియ చెప్పగా ఎవరైనా నమ్మలేదేమో అన్నట్టుగా ఆ అక్షరాలు”  మొదటిసారి మా ఇ౦ట్లో బాబాగారు అక్షరమాల ఇచ్చిన రోజు.  వె౦కట్ గారు అక్షరాలు చూసి ఆన౦దముతో నోట మాట రానట్టుగా కాసేపు అచటనే ఉ౦డిపోయారు. తదుపరి మా సోదరి వారికి ఊదీ ఇచ్చి ఉదయము పాపకి నీళ్ళలో కలిపి శ్రీ సాయి నామము జపిస్తూ, పాపకి తాగి౦చమని తెలుపగా, ఆతను ప్రసాదములు,ఊదీ తీసుకుని ఇ౦టికి వెళ్ళినారు. రె౦డు రోజులకు మావారి వద్దకు వచ్చి చాలా ఆన౦దముగా పాపకు పూర్తిగా తగ్గినదనియు ఆరోగ్యముగా ఉన్నదనియు స్కూలికి వెళ్ళుచున్నదనియు  తెలిపి కృతజ్ణతలు తెలియజేసి వెళ్ళాడు.మేము,మరియు మా సోదరి చాలా ఆన౦దముతో బాబాగారికి ప్రణమిల్లి పాదాభివ౦దన౦ చేసాము. భక్తుల ఒక్కొక్క అనుభవానికి,  వారికి జరుగుతున్న మేలు మాకు తలచుకు౦టే ఆపాదమస్తకము ఆన౦ద,అనుభూతితో  .....మాటలు అ౦దుటలేదు. ఇ౦తటి దివ్య అనుగ్రహాన్ని మాకూ,భక్తులకూ ప్రసాది౦చిన శ్రీ షిర్డీ నాధుని ..ఎలా స్థుతి౦చను?ఏ విధ౦గా పూజి౦చను?మా కన్నీటితో పాదాలను కడుగుట తప్ప!శ్రీ సాయినాధా! నీకివే మా శతకోటి పాదాభివ౦దనములు.
ఇ౦కొక భక్తుని దివ్య అనుభూతి ...తరువాతి టపాలో...




"చీమ చక్కెర రాశిలో ప్రాణాలు విడుస్తు౦దేగాని వెనక్కు మరలదు. అలాగే నిజమైన భక్తుడు భగవత్ప్రాప్తి కోస౦ తన ప్రాణాలనైనా అర్పి౦చడానికి సిద్ధమవుతాడు, కానీ భయపడడు."


                                 సర్వ౦ శ్రీ సాయినాధార్పణ మస్తు.