Thursday, July 2, 2020 0 comments By: visalakshi

బిల్వదళం...మోక్షఫలం..

బిల్వ దళం – మోక్ష ఫలం



మహాత్ముల అవతార ఉద్దేశం ఏమైనప్పటికీ వేలాది మంది తరించడం దానికి అవాంతర ప్రయోజనమై ఉంటుంది. గంగ భగీరథుని పితరులను తరింపచేయడనికి వచ్చినా ఇప్పటికి ఎన్ని తరాలుగా ఎంతమందిని తరింపంజేస్తొంది?!

మహాస్వామి వారు 1935 ప్రాంతాలలో కాశీ యాత్రకు వెళుతున్నప్పటి సంఘటన ఇది...

స్వామివారు కర్నూలు దాటి చిన్న చిన్న గ్రామాల గుండా శ్రీశైలం వైపు తమ పరివారంతో ప్రయాణం చేస్తున్నారు. రోడ్డునకు కొంచం లోపలగా ఉన్న గ్రామపు జమీందారు, తమ గ్రామస్థులందరితో కూడి పూర్ణకుంభంతో నుంచుని ఉన్నాడు. ముందు మఠ నిర్వహణ వారు ఎర్పాటు చేసినట్లు స్వామివారు మరికొంచం దూరం వెళ్ళి రోడ్డు పక్కనే ఉన్న గ్రామంలో బస చేయవలసి ఉన్నది. కానీ జమిందారుతో కూడిన గ్రామాస్తులందరూ శ్రీవారు తమ గ్రామాన్ని పావనం చేసి అక్కడ బస చేయాలని ప్రార్ధించారు.

జమిందారు గారు ఊరిలో ఒక చెరువు, దాని వడ్డున సత్రం ఉన్నాయని, శ్రీవారి బసకు, పుజకు, పరిచారికులకు సౌకర్యంగా ఉంటుందనీ వివరించాడు. ఎదో ఒకటి రెండు రోజులు ఉండి పోదాము అనుకున్న స్వామివారు రమణీయమైన పరిసరాల మధ్యనున్న గ్రామం, ఆ గ్రామస్థుల భక్తి చూసి అక్కడ కొంత కాలం ఉండటానికి ఒప్పుకున్నారు. అంతే!! గ్రామస్తులందరూ కలిసి కావలసిన పందిళ్ళు, పాకలు వేయించడంలోను, సంబారములు సమకూర్చడంలోనూ నిమగ్నమైనారు. మరునాటి ఉదయం చంద్రమౌళీశ్వర పుజకి కావలసిన వస్తువులన్నీ సమకూర్చబడినాయి. కాని చంద్రమౌళీశ్వర పుజకి కావలసిన బిళ్వదళాలు మాత్రం రాలేదు. ఆ గ్రామస్తులకు మారేడు దళాలు అంటే ఎమిటో తెలియలేదు. ఉన్న ఒకటి రెండు బ్రహ్మణ కుటుంబాల వారు కూడా బిళ్వదళాలు ఈ చుట్టుపక్కల లేవు అని తేల్చి చెప్పారు.

పూజకు సంబంధించిన సంబారాలు చూచే మఠొద్యోగులకు ఏమి చేయాలో తోచలేదు. ఇంతలో స్వామివారు స్నానం చేసి వచ్చి అనుస్టానం ఆచరించబోతూ "బిళ్వదళాలేవి?" అని అడగనే అడిగారు. పరిచారకులు "ఇక్కడ బిళ్వదాళలు ఎరిగినవారే లేరట" అని చేప్పారు. స్వామివారు చిరునవ్వు నవ్వి గోశాల వెనకనున్న బండరాయి పైన కూర్చుని అనుస్టానం ఆరంభించారు. పరిచారకులు నిర్మాల్యంలో ఉన్న బిళ్వదళాలను చూపి ఊరి యువకులని వాటిని వెతుక్కుని రమ్మని పంపారు.

స్వామిమివారి ఒక గంట జపం ముగిసి కనులు తెరిచారు. జనం కుడా ఆత్రుతగా బ్రహ్మానుభవంలో ఓలలాడే ఆ పరమాత్మ వంక చూస్తున్నారు. స్వామివారు బిళ్వదళాల లేమికై ఎమి చెప్పబోతారో? తాము ఉందామనుకొన్నని రోజులు ఉండకుండానే వెళిపోతారేమోనని కలత పడుతున్నారు. ఇంతలో శ్రీమఠ పరిచారకులలో ఒకరు ఎంతో ఆనందంతో బిళ్వదళాలు పట్టుకుపస్తూ పందిరి వద్ద కనిపించారు. అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

స్వామివారు బిళ్వదళాలు చేతిలొకి తీసుకుని పరీక్షించారు. "ఈ చుట్టుపక్కల మారేడు చెట్లే లేవన్నారే? ఈ దళాలు ఎక్కడ నుంచి వచ్చాయి. అన్నీ నవనవలాడుతూ కోమలంగా మూడు మూడు ఆకులతో ఉత్తమంగా ఉన్నాయి. ఎవరు కోశారు? ఎక్కడ నుండి వచ్చాయి?" అని అడిగారు. బుట్ట తీసుకువచ్చిన పరిచారికుడు నేను యాదృచ్చికంగా అటుపక్క వెళ్ళినపుడు పందిరి గుంజ పక్కన ఈ బుట్ట పెట్టి ఉన్నది స్వామి. ఎవరు తెచ్చారో చుడలేదన్నాడు. "ఎవరు ఇక్కడ పెట్టరు అని నీవడగలేదా?" అన్నారు స్వామివారు.

"అడిగాను కానీ ఎవరూ తమకు తెలియదంటున్నారు" అన్నాడు పరిచారికుడు.

“మరెవరు తెచ్చి ఉంటారు? చంద్రమౌళీశ్వరుడే తన పుజకు తానే బిల్వములను తెప్పించుకున్నాడ” ని నవ్వుతూ పూజకు వెళ్ళారు స్వామివారు. ఆరోజు కార్యక్రమాల వత్తిడిలో బిల్వదళాల గురించి మళ్ళీ ఎవరూ ఆలోచించలేదు.

మరుసటిరోజు పూజా సమయానికి పూజకట్టు పర్యవేక్షించే అధికారి క్రితపు రోజు బిల్వదళాలు తేచ్చిన పరిచారికునితో ఈ రోజు కూడా బిల్వదళాలు ఏర్పాటు చేయలేదు. నిన్న ఉన్న చోట మళ్ళీ ఉన్నాయేమో చూసిరా అన్నారు.

ఆశ్చర్యంగా ఆ రోజుకుడా అక్కడ బిల్వదళముల బుట్ట పెట్టి ఉన్నది. పూజకి వచ్చిన స్వామివారు సాభిప్రాయముగా అధికారి వంకకు చూసారు.

"అవును స్వామి ఈ రోజు కూడా అక్కడ బిల్వదళముల బుట్ట పెట్టి ఉన్నది“ అన్నాడాయన. మూడవరోజు కుడా ఇదే తంతు.

నాల్గవరోజు స్వామివారి ఆజ్ఞమేరకు పరిచారకుడు పొద్దున్నుండీ ఎవరికీ కనిపించని చోటు నుండి రోజూ బిల్వదళాముల బుట్ట పెట్టబడే స్థానాన్ని పరిశీలిస్తూ కుర్చున్నాడు.

సుమారు 8 - 8:30 గంటలకు తూర్పు పక్కనున్న మామిడి తోపు నుండి ఒక యువకుడు తలపై బుట్ట పెట్టుకుని వస్తున్నాడు. సరిగా దువ్వి ముడిపెట్టని పెద్ద శిఖ, మోకాళ్ళ పైదాక కట్టిన నీరుగావి పంచతో శుద్ధ గ్రామీణునిలా కనిపిస్తున్నాడు. అతను అటూ, ఇటూ తేరిపార చూసి తాను రోజూ పెట్టే స్థానంలో బుట్ట పెట్టి వెళ్ళబోతున్నాడు.

పరిచారకులు పరుగెత్తుకుని వెళ్ళి శ్రీకార్యం వద్ద ప్రవేశపెట్టారు.

అతను భయముతో వణుకుతూ సాష్టాంగం చేసి నమస్కరించాడు. "భయపడకు నీవేనా రోజూ ఈ దళాలు తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టేది? అన్నారు శ్రీకార్యం. అవునన్నాడు ఆ కుర్రవాడు.

"మంచిది సాయంకాలం స్నానం చేసి, తల సరిగా దువ్వుకుని శిఖముడి వేసుకుని, మంచి బట్టలు కట్టుకుని రా!" స్వామివారి దగ్గరకు తీసుకుని వెళ్తాను. ఆశీస్సులు పొందవచ్చు" అన్నారు శ్రీకార్యం. మూడు గంటలకు ఆ యువకుడు ఆజ్ఞాపించిన విధంగా వచ్చాడు.

దూరం నుండి ఆ యువకుని చూపించి ఎదో చెప్పారు శ్రీకార్యం. స్వామివారు దగ్గరకు పిలిచారు. భయపడుతూ ఎంతో వినయంగా నమస్కరించాడు ఆగంతకుడు.

పేరేమిటి! అని తెలుగులో ప్రశ్నించారు స్వామివారు.

"పురంధర కేశవులు" అని స్వచ్చమైన తమిళంలో బదులిచ్చాడు.

"తమిళుడివలే ఉన్నావు, ఇక్కడికి ఎలా వచ్చావు?" అన్నారు స్వామివారు.

"నా స్వగ్రామం ఉసిలంపట్టి, మధురై దగ్గరండి. నే పుట్టిన రెండు సంవత్సరాలకే నా తల్లి గతించింది. మా నాన్నే నన్ను పెంచాడు. ఆరు ఏళ్ళ క్రితం నాతో బ్రతుకుతెరువుకై ఈ దేసం వచ్చాడు ఆయన. ఈ జమీన్ గ్రామంలో ఆవులు మేపే పనిదొరికింది. నేను చిన్నప్పటి నుండీ ఈ పనే చేస్తున్నాను. చదువుకోలేదు. మా నాన్నే నాకు ఎన్నో విషయాలు చెప్పేవాడు. ఆయనకు సంగీతంపై మక్కువ. పురంధరదాసు కీర్తనలు, త్యాగరాజ కీర్తనలు వినికిడి జ్ఞానం వల్ల పాడేవాడు. అందుకే నాకు పురంధరకేసవులని పేరు పెట్టాడు. రెండేళ్ళ క్రితం ఆయన మోక్షానికి చేరుకున్నాడు. నాకిప్పుడు పన్నెండేళ్ళు స్వామి! ఆవుల్ని మేపుతూ ఉంటాను. జమీన్ లో భోజనం పెట్టి జీతం ఇస్తారు" అన్నాడు.

"ఈ చుట్టుపక్కలెక్కడా మారేడు చెట్లే లేవంటున్నారు. మరి నీవెలా తెస్తున్నావు?" ప్రశ్నించారు స్వామివారు.

"ఇక్కడికి మూడు నాలుగు మైళ్ళ దూరంలో పర్వతం మొదట్లో దట్టమైన పచ్చిక, చెట్లూ ఉన్నాయి. మేము ఆవులని మేపడానికి వెళ్ళేవాళ్ళం. అక్కడ మూడు పెద్ద బిల్వ వృక్షాలున్నయి. మానాన్న ఆ ఆకులను చూపి "ఒరే పురంధరా! ఈ మూడు ఆకులు కలిసిన దానిని బిల్వదళం అంటారురా! దీంతో శివునికి పూజ చేస్తే మహా విశేషం" అని చెప్పేవాడు.

మూడు రోజుల ముందు పూజ దగ్గర ఉండే అయ్యావారు ఇటువంటి ఆకులు కావాలని ఈ ఊరివాళకు చెబుతున్నారు. నాకు వెంటనే ఈ చెట్లు గుర్తుకువచ్చాయి. పరిగెత్తికెళ్ళి కోసుకుని వచ్చాను. అయితే గొల్లవాడు తెచ్చిన దళాలతో మీరు పూజ చేస్తారో లేదో అని ఎవరూ చూడకుండా అక్కడ పెట్టి వెళ్ళాను ఇది సత్యం స్వామి" అన్నాడు.

స్వామివారు ఎంతో ప్రీతిచెందారు.

పురంధరా నీకు ఏమి కావలో చెప్పు ఇప్పిస్తాను అన్నారు స్వామివారు. వాడు రెండు చెంపలు వేసుకున్నాడు. "స్వామీ! మీ వద్ద లౌకికమైన విషయాలు కోరడమా! మా నాన్న ఇవన్నీ క్షణ భంగురాలని చెప్పేవాడు. అయితే నాకు రెండు కోరికలు ఉన్నాయ్ స్వామి! మీరు అనుగ్రహిస్తే ఒకటి ఇప్పుడు అడుగుతాను, రెండవది మీరు ఈ ఊరినుండి వెళ్ళేప్పుడు అడుగుతాను" అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ సాస్టాంగ నమస్కారాలు చేస్తున్నాడు. స్వామి వారు వాడిని బుజ్జగించి చెప్పు నీ కొరికేమిటో అన్నారు.

"ఎం లేదు స్వామి మా నాన్న నాకు పురంధరదాసు కృతులు, త్యాగరాజ కృతులు నేర్పాడు, నేను ఆవుల దగ్గర పని చేస్తూ ఒంటరిగా పాడుకుంటూంటాను. ఒక్కసారి మీ ఎదురుగా పాడలని ఉంది స్వామి" అన్నాడు. స్వామివారికి ఆ కోరిక విని చాలా ఆనందం వేసింది.

"తప్పకుండా! నేనే కాదు అందరమూ వింటాము. నేనున్నన్ని రోజులూ సాయంత్రం మూడు గంటలకి ఇక్కడకి వచ్చి పాడు. అమ్మవారు అయ్యవారు (త్రిపురసుందరీ చంద్రమౌళీశ్వరులు) కుడా విని నిన్ను అనుగ్రహిస్తారు" అన్నారు.

పురంధరకేశవుల ఆనందానికి అంతే లేదు. "సరి నీ రెండో కొరిక ఏమి?" అన్నారు స్వామివారు.

నవ్వుతూ "అది మీరు వెళ్ళిపొయేటప్పుడు కోరతాను" అన్నాడు అతను.

స్వామి వారు తమ మెడలో ఉన్న తులసి మాలను అనుగ్రహించారు. ఎంతో అపురుపంగా కనులకు అద్దుకుని గంతులేసాడు పురంధరకేశవులు. ఆ ఊళ్ళో స్వామి వారు ఇరవైఒక్క రోజులు ఉన్నారు. వెళ్ళిపొయే రోజు వచ్చింది. ఊరు ఊరంతా విరిగిపడినట్లు వచ్చారు జనాలు. అందరినీ ఆశీర్వదించి నిదానంగా ముందుకు సాగారు స్వామివారు. గ్రామప్రజలందరి కళ్ళలో నీరు. ఏదో కోల్పోతున్న భావన. అంతలో ఏదో జ్ఞాపకం వచినట్లుగా వెనక్కి తిరిగి చూసారు మహాస్వామి. దూరంగా పందిరి గుంజకు చుట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ పురంధరకేశవులు ఉన్నాడు.

"పురంధరా! నీకు ఉన్న భక్తి విశ్వాసాలకు నీకు తప్పక ఉన్నతి లభిస్తుంది. ఇంకో కోరిక వెళ్ళేటఫ్ఫుడు చెబుతానన్నావే! అదేమిటి?" అన్నారు.

వాడు వెక్కి వెక్కి ఏడుస్తూ, వచ్చే వేక్కిళను ఆపుకుంటూ అన్నాడు. “స్వామి! మా నాన్న దేముడిని లౌకికమైన చిన్న చిన్న విషయాలు గురించి అడగకూడదు. జన్మ అంటేనే దు:ఖం. మరుజన్మ లేని మోక్షాన్ని కోరుకోవాలి. దానికోసం మనం సత్యమే చెప్పాలి. ధర్మంగా జీవించాలి. మహాత్ములను మనం కోరవలసినది మోక్షమే అని చెప్పేవాడు. స్వామీ! నువ్వే మానాన్న చెప్పిన మహాత్ముడివి. నాకు మోక్షం ప్రసాదించు స్వామి!” అంటూ బావురుమన్నాడు.

కదిలిపోయారు స్వామివారు. పన్నెండేళ్ళ పసివాడు మాట్లాడే మాటలా ఇవి. ఆశ్చర్యపోయారు. అబ్బురపాటు చెందారు.

ఎంతో ప్రేమతో కరుణగా చూచి నవ్వుతూ "తగిన సమయంలో భగవంతుడు నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు" అంటూ దూరంగా ఉన్న జమిందారుని పిలిచి "పురంధరుని విషయంలో ఏమి జరిగినా మఠానికి టెలిగ్రాం పంపు" అన్నారు.

చాలాకాలం గడిచిపోయింది. స్వామివారు కాశీ యాత్ర ముగించి తిరిగివచ్చారు. అప్పుడు కంచిలో ఉన్నారు. ఒక మధ్యాహ్నం హఠాత్తుగా మఠం నుండి బయల్దేరి కామాక్షీ గుడిలోని కొలనుకి వచ్చారు. స్నానం చేసి ఒక గంట సేపు జపం చేశారు. మళ్ళి స్నానం చేసి మళ్ళీ జపం చేస్తున్నారు. సాయంకాలం ఆరుగంటలదాక ఈ విధంగా ఎనిమిది సార్లు చేసారు. స్వామివారు ఎందుకిలా చేస్తున్నారో ఎవరికీ అవగతం కాలేదు. చివరిసారిగా స్నానం చేసి మెట్లు ఎక్కుతున్నప్పుడు మఠం నుండి టెలిగ్రాం పట్టుకుని "కర్నూలు నుండి టెలిగ్రాం వచ్చింది స్వామి! పురంధరకేశవుల ఆరోగ్య పరిస్థితి ఎంతో ఆందోళన కరంగా ఉన్నదట. మరి ఈ పురంధరకేశవులేవరో ఎవరికీ తెలియడం లేదు స్వామి" అన్నారు.

"పురంధరకేశవులు కొద్దిసేపటి ముందే కాలం చేసాడు. వాని గ్రామం వెళ్ళినపుడు నన్ను మోక్షంకై ప్రార్ధించాడు. మంచి జీవి అతడు. చంద్రమౌళీశ్వరుని అనుగ్రహము వలన మోక్షం లభిస్తుందని చెప్పాను. కొద్ది కాలంగా అతనికి విషజ్వరం వచ్చింది. శరీర బాధ గురించి పట్టించుకోకుండా మొక్షేచ్చతో పరితపించిపోతున్నాడు. అతనికింకో ఆరు జన్మలు పొందాల్సిన కర్మ ఉన్నది. ఎలాగోలా మొక్షం కలగాలని ప్రార్ధిస్తూ ఇలా జపం చేస్తున్నా. "పురంధరకేశవులు శుద్ధాత్మ" అంటూ మఠం వైపుకు దారి తీసారు.

స్వామివారు అతనికి మొక్షం లభించిందనే విషయం స్పష్టంగా చెప్పలేదు. అయితే ఆ పురంధరునికి మోక్షం వచ్చి ఉంటుందనడంలో మరి సందేహం ఏముంటుంది.

అయితే అద్వైత శాస్త్రం ‘ఙ్ఞానాదేవహి కైవల్యం’ అని చెబుతున్నది కదా! ఇంకొకరికి మొక్షం ప్రసాదించడం ఎలా అన్న ప్రశ్న పుస్తక జ్ఞానం కలవారికి తోచవచ్చు. మహస్వామి వారి తపస్సు చేత అతని కర్మలను దహించడం వల్ల శుద్ధమైన జీవునికి జ్ఞానం కలిగి ఉండవచ్చు.

అయినా దీనిగురించి విచారం అనవసరమేమో! శ్రీ రమణభగవానులు తమ తల్లిగారితో సహ అనేక మందికి మోక్షాన్ని అనుగ్రహించారు.

--- శ్రీకార్యం చల్లా విశ్వనాథ శాస్త్రి, ఋషిపీఠం ప్రచురణల నుండి

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

బిల్వ పత్రాలు....:




#ఏక బిల్వం శివార్పణం*

పరమ శివుని పూజించుకునేటప్పుడు మనం "ఏక బిల్వం శివార్పణం" అంటూ మారేడు దళాలను సమర్పించుకుంటూ పూజించుకుంటాము. 

ఙ్ఞానస్వరూపమయిన పరమాత్ముడే పరమశివుడు. మనలోని అఙ్ఞానాన్ని రూపుమాపి, ఙ్ఞానజ్యోతిని వెలిగించి, మన మనసులను పవిత్రం చేసి, నిర్మలమైన జీవనాన్ని కలిగించమని, ఙ్ఞానస్వరూపమైన మారేడు దళాలను స్వామికి సమర్పించుకుంటూ ఉంటాము.

మారేడు దళాలను పరిశీలించినప్పుడు మూడు దళాలు కలిసి ఒక్క కాండానికే ఉండటాన్ని గమనించగలము. అందుకే, దీనికి బిల్వము అనే పేరు వచ్చింది. 

ఈ మూడు రేకులకు ఆధ్యాత్మికంగా పూజకుడు-పూజ్యము- పూజ / స్తోత్రము - స్తుత్యము- స్తుతి/ ఙ్ఞాత - ఙ్ఞ్యేయము - ఙ్ఞానము అనే అర్ధాలను చెబుతున్నారు. 

ఇలాగ ఈ మూడింటిని వేరు వేరుగా భావించటమే త్రిపుటి ఙ్ఞానము.

ఒక వృక్షానికి కొమ్మలు వేరు వేరుగా కనిపించి నప్పటికీ, ఆధారకాండము ఒకటే అయినట్లు , సృష్టి, స్థితి ,లయ కారకుడైన ఆ మహదేవుడు మారేడు దళాలతో " మూడు పత్రాలుగా వేరు వేరు ఉన్నట్లు గోచరిస్తున్నాడు. కాని ఆయనే సర్వాంతర్యామి!

బిల్వపత్ర దర్శనం వలన అత్యంత పుణ్యం లభిస్తుంది. వాటిని స్పృసించడంవలన వలన సర్వ పాపాలు నశిస్తాయి.
ఓక బిల్వ పత్రాన్ని శివునికి భక్తిశ్రద్ధలతో అర్పించతం వలన, ఘోరాతిఘోరమైన పాపాలు సైతం తొలగిపోతూ ఉంటాయంటారు. 

అటువంటి త్రిగుణాలుగల బిల్వ దళ్ళాన్ని స్వామికి అర్పించుకుంటే ఆయన అనుగ్రహం సులభంగ కలుగుతుంది. 

పూజకుడవు నీవే, పూజింబడేది నీవే - అనే భావంతో శివుని పూజించుటయే ఉత్తమమైన భావం. 

ఈ ఙ్ఞానరహస్యాన్ని తెలుసుకుని - బిల్వపత్రరూపంతో ' త్రిపుటి ఙ్ఞానాన్ని ' నీ పాదాల చెంత నేను సమర్పిస్తున్నాను అని స్వామికి విన్నపించుకుని " శివోహం, శివోహం " అనే మహావాక్య ఙ్ఞానాన్ని స్థిరపరిచేదే బిల్వార్చన అవుతుంది.

పవిత్రమైన ఈశ్వర పూజకు " బిల్వపత్రం " సర్వశ్రేష్టమైనది. శివార్చన కు మూడు రేకులతోనున్న పూర్తి బిల్వదళాన్ని ఉపయోగించాలి.
బిల్వదళాలు వాడిపోయినప్పటికి పూజర్హత కలిగి ఉంటాయి.

ఏక బిల్వ పత్రంలోని మూడు ఆకులలో ఎడమవైపునున్నది బ్రహ్మ అని, కుడి వైపు ఉన్నది విష్ణువు అని, మధ్యన ఉన్నది శివుడు అని చెప్పబడుతోంది.

ఇంకా బిల్వదళంలోని ముందు భాగం లో అమృతము, వెనుక భాగంలో యక్షులు ఉండటఒ చేత బిల్వపత్రం యొక్క ముందు భాగాన్ని శివుడి వైపుకు ఉంచి పూజ చెయ్యాలి.

బిల్వవనం కాశి క్షేత్రంతో సరిసమానం అని శాస్త్రవచనం.

మారేడు చెట్ట్లు ఉన్న చోట శివుడు నివసిస్తాడు. ఇంటి ఆవరణలో , ఈశాన్య భాగం లో మారేడు చెట్టు ఉంటే, ఆపదలు తొలగి, సర్వైశ్వర్యాలు కలుగుతాయి!

తూర్పున ఉంటే సుఖప్రాప్తి కలుగుతుంది.
పడమర వైపు ఉంటే సుపుత్రసంతాన ప్రాప్తి, దక్షిణ వైపు ఉంటే యమబాధలు ఉండవు!
Monday, June 29, 2020 0 comments By: visalakshi

శ్రీ సాయి దత్త .....

"శిరిడి సాయిబాబా అంటే ఆనందసాగరమే*"..!!



శ్రీ సాయిబాబా ఎంతటి మహనీయులైనా, ఇప్పుడా యన బౌతికంగా లేరు కదా అన్నదే చాలామందికి కలిగే సందేహం. దానికి తోడు ఎంతటి సద్గురువైనా సజీవులుగా వున్నంత వరకే శిష్యులకు ఆత్మజ్ఞానం ప్రసాదించగలరని పెద్దలు చెబుతుంటారు. కానీ శ్రీసాయి కేవలం సిద్ధపురుషులు మాత్రమే కాదు. సాక్షాత్తూ దత్తాత్రేయుల అవతారం!

అంతేగాక బాబా మహాసమాధి అనంతరం కూడా తాము భక్తులను పూర్వంలాగానే అనుగ్రహిస్తామని గమ్యం చేరుస్తామని వాగ్దానం చేశారు. ఎందరో మహనీయులు కూడా ఈ విషయమే ధృవపరిచారు. అది ఎందరి అనుభవమో సాయి భక్తులు శ్రీ ఎమ్
రంగాచార్యగారు శ్రీసాయి గురించి సాధు సత్పురుషుల నుండి వినిన వాక్యాలను వ్రాస్తున్నారు.

స్వామి శంభునాథ్ జీ అను సిద్ధ పురుషుడు 1937లో నాతో, “ముందు ముందు నీవు ఒక సాటిలేని మహాత్ముని శరణు పొంది అంతిమ ఘడియ వరకు ఆయనకు అంకితమవుతావు" అన్నారు. వారు చెప్పిన మాటలు ఒకటి రెండు సంవత్సరాలలో నేను శ్రీ సాయిబాబాను ఆశ్రయించడం జరిగింది. తరువాత 1940లో స్వామి రామదాసు (కన్హన్ గఢ్)గారిని దర్శిం చాను. వారు నా గురించి విని, నిధులన్నింటికీ నిధియని చెప్పదగిన మహాత్ముని ఆశ్రయించావు. ఆయననెన్నడూ విడువకు" అన్నారు.

అలానే 1958లో విజయదశమికి ఋషీకేశ్ లోని స్వామి శివానందసరస్వతి గారిని సందేశం కోరగా “షిరిడి సాయిబాబా అంటే ఆనందసాగరమే! అంతకంటే గొప్పది మరేమున్నది?" అన్నారు. శ్రీ గణపతి సచ్చిదానంద అను సిద్ధపురుషుని యిటీవల నేను దర్శించాను. అప్పుడు వారు "శిరిడి సాయిబాబా అంటే దత్తాత్రేయుని అవతారమే!" అని, ఒక్కక్షణం ఆలోచించి, "కాదు, కాదు! వారు సాక్షాత్తూ దత్తాత్రేయులే!" అన్నారు.

కొద్ది సంవత్సరాల కిందట మద్రాసు వెళ్ళి నప్పుడు ఒక మిత్రుడు నన్ను ఒక భక్తురాలి దర్శనానికి తీసుకు వెళ్ళాడు. మేము వెళ్ళే సరికి శ్రీ మాతాజీ ధ్యాన సమాధిలో వివిథ దేవతా పటాలకి ఎదుట కూర్చుని వున్నారు. నేనొక మూల కూర్చొన్నాను. ఒక పావుగంట తర్వాత ఆమె "శిరిడి సాయిబాబా" అన్నారు. ఆయనే నా ఇష్టదైవమని వారికెలా తెలుసు ఆమె యింకా యిలా అన్నారు. "త్రిమూర్తుల్లో బ్రహ్మకు ఆలయం, పూజా లేవు. వారి మొదటి అవతారం త్రేతాయుగంలో వశిష్టమహర్షి, రెండవ అవతారం ద్వాపరయుగంలో దత్తాత్రేయుడు, మూడవ అవతారం కలియుగంలో షిరిడి సాయిబాబా!" అన్నారు.

బాబాకు ముందు కొందరు దత్తావతారులు వున్నారు కదా! అని మనసులో అనుకున్నాను. వెంటనే ఆమె “బాబాకు ముందున్న వారంతా దత్తాత్రేయుని అంశ అవతారాలే. ఈ యుగంలో శిరిడి సాయిబాబా ఒక్కరే సంపూర్ణ దత్తావతారం. ఇప్పుడు శివాలయాలు, రామ మందిరాలు వున్నట్లే, ఒకటి రెండు శతాబ్దాల్లో ప్రతి గ్రామంలోనూ సాయి మందిరాలు వెలుస్తాయి. అవి మన గ్రామ జీవితమంతటికి కేంద్రాలవుతాయి" అన్నారు.

(సాయిలీలామృతం నుండి)

*సాయితత్వ రహస్యం*..

మానవాళికి భగవంతుడు ఇచ్చిన మహనీయ వరం శ్రీ సాయి. శ్రీకృష్ణుడు మనిషి ఎలా బతకాలో భగవద్గీతలో చెప్పాడు .

శ్రీ సాయి అలా జీవించి చూపారు. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న ఎన్నోసమస్యలకు, బాధలకు ఏకైక పరిష్కారం సాయితత్త్వం. చిక్కులో పడి కొట్టుకుపోతున్న మనిషికి, అలసిన మనసుకు చేయుతనిచ్చి సేద తీర్చే సాధనం సాయితత్త్వమే. మానవాళికి ఉద్దరణ కోసం, మనిషిగా మానవత్వంలో ఎలా బతకాలో చెప్పటం కోసం శ్రీ సాయి తన కాలాన్ని మొత్తం వెచ్చించారు.

పూజా విధులు, పురస్కార తంతులు, విధి విధానాలు ... బాబాకు వీటితో పనిలేదు. శ్రద్ధ , సహనం ...ఇవి రెండే భక్తుల నుంచి కోరిన బాబా, వాటిని ఆచరించిన వారికి తన ప్రేమను పంచారు. సాయి ఆదర్శ జీవన విధానం మనవ సంశయాలను పటాపంచలు చేస్తుంది.

బాబా బోధనలు మనో వికాసాన్ని కలిగిస్తాయి . ఉత్తమ వ్యక్తిత్వ లక్షణాలను అలవరుస్తాయి. అదే సాయితత్వ రహస్యం.
 
   సాయితత్వాన్ని నిత్యజీవితంలో ఆచరిస్తే ఆధ్యాత్మిక చింతన అలవడుతు౦ది జీవితం ధన్యమవుతుంది .సాధన అనేది జీవితంలో ఒక భాగం కావటం కాక, జీవితమే ఒక సాధనగా మారుతుంది.

 శ్రీ సాయి సద్గురువు. ధర్మసూత్రాలు, సత్య ప్రవచనాలు చెప్పి ఊరుకోలేదు . స్వయంగా ఆచరించి చూపారు. అందుకే బాబా సమర్ధ సద్గురు అయ్యారు .మనిషి జీవిత పరమార్ధం ఏమిటి ?ఎలా నడుచుకోవాలి ?ఇదంతా బాబా ఆచరించి చూపారు .

ఆచరించి చూపటమే అవతార పురుషుని ప్రథమకర్తవ్యం కదా! బాబా చెప్పిన విషయాలను, బాబా జీవన విధానాలను చదివి మననం చేసుకోవటం ముఖ్యం. బాబా బోధనలు, మంచి మాటలు మన హృదయమనే క్షేత్రంలో మొలిచిన దుష్టబుద్దులు, చెడు లక్షణాలనే కలుపు మొక్కల్ని పెకిలించి వేస్తాయి.

 షిరిడి సాయిబాబా ఈ యుగావతరం. నేడు ప్రపంచ౦ ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు ‘శ్రీ సాయి సచ్చరిత్ర’లో పరిష్కారం లభిస్తుంది.

           *ఓం సాయిరాం*
Sunday, June 28, 2020 0 comments By: visalakshi

సాయినాధ గురు సాన్నిధ్యం - ప్రార్ధన...

    ఓం శ్రీ సాయినాధాయ నమో నమః




మనసే మందిరంగా చేసి సాయిని ఆరాధిద్దాం
సాయిబాబాకు ఆర్భాటాలు, ఆడంబరాలు అక్కర్లేదు. నిండైన మనసు చాలు. మనసునే మందిరంగా చేసి సాయిని ఆరాధిద్దాం.
సాయిబాబా పాదాలను ఆశ్రయించడమే ఆరాధన. మనసులో నిరంతరం బాబాను తల్చుకోవడమే నివేదన.
సాయిబాబాకు భక్తుల గురించే ధ్యాస. మనని భవబంధాలనుండి ఎలా విముక్తుల్ని చేయాలి, అశాశ్వతమైన అనుబంధాల నుండి ఎలా బయట పడేయాలి, ఆధ్యాత్మిక చింతన పెంచి జీవితాన్ని సార్ధకం చేయాలి అనే ఆయన చింత. భగవంతుడు మనిషికి అవసరమైనవన్నీ ఇచ్చి భూమ్మీదకు పంపాడు. మరి అలాంటప్పుడు భగవంతుడు తాను ఇచ్చిన ఆస్తులను, మానవులు సవ్యంగా ఖర్చు పెట్టాలని ఆశిస్తాడు కదా. కనుక మనం దేన్నీ దుర్వినియోగం చేయకూడదు. మనకు ఉన్న ఆస్తులను సద్వినియోగం చేసుకుంటూ, తోటివారికి ఉపయోగపడుతూ, జీవితాన్ని సార్ధకం చేసుకోవాలి.

వివిధ సందర్భాల్లో సాయిబాబా అన్న మాటలు గుర్తుచేసుకుందాం...

"ప్రజల్ని సన్మార్గంలో పెట్టమని భగవంతుడు నన్ను పంపాడు. కానీ, ఈ రోజుల్లో ప్రజలు కాస్తయినా దేవుడిపట్ల భక్తిశ్రద్ధలు లేకుండా కాలం గడుపుతున్నారు. క్షణికమైన మొహావేశాల్లో పడి కొట్టుకుపోతున్నారు. సత్సంగాలపై ధ్యాస, నమ్మకం లేవు. సత్యం మాట్లాడుతూ, ధర్మాన్ని ఆచరించమంటే, అసత్యాలు చెప్తూ, అధర్మంలో తేలుతున్నారు. భక్తిభావన నిలుపుకుంటే మీకే శ్రేయస్కరం. నా ప్రయత్నాన్ని నేను చిత్తశుద్ధితో చేస్తాను."



పుడుతున్నాం. తింటున్నాం. కాలయాపన చేస్తున్నాం. పుట్టడం, ఆయుష్షు ఉన్నంతవరకు జీవించడం - ఇదేనా జీవితం? ఇందులో ఏమైనా జీవితపరమార్ధం ఉందా? మన జీవితానికి గమ్యం అంటూ ఉండనవసరం లేదా? సరైన, నిర్దుష్టమైన గమ్యాన్ని నిర్ణయించుకుని దాన్ని చేరేందుకు ప్రయత్నించాలి. మనిషి తనను తాను తెలుసుకోలేనంతవరకూ, గమ్యాన్ని నిర్దేశించుకునేంతవరకు జ్ఞానం లేనట్లే. గమ్యం తెలిసివాడే జ్ఞాని. సద్గురువు బోధనలు వింటే, వాటిని పాటిస్తే జీవితం సార్ధకమౌతుంది.

పుట్టినవారు గిట్టకమానరు. అందరూ మట్టిలో కలిసిపోవలసిందే. అయితే, చావుపుట్టుకల మధ్య ఉన్న జీవితాన్ని సార్ధకం చేసుకోవాల్సిన బాధ్యత మనమీద ఉంది. తోటివారితో వీలైనంత వినయవిధేయతలతో మాట్లాడాలి.  , విలాసాలకు దూరంగా నిరాడంబరంగా గడపాలి.

''ఇంద్రియాలను అదుపులో ఉంచుకో..సౌశీల్యాన్ని, సౌజన్యాన్ని అలవర్చుకో..ఎక్కువగా మాట్లాడకు..ఎదుటివారు చెప్పేది విను..
సుఖదుఃఖాలను సమానంగా స్వీకరించు..దంతులు, వాదులాలు వద్దు..
అహంకారాన్ని విడిచిపెట్టు..కోపతాపాలకు దూరంగా ఉండు..
దేనిమీదా ఇష్టాన్ని పెంచుకోకు..దేన్నీ ద్వేషించకు..మనోవికారాలకు దూరంగా,నిర్వికారంగా ఉండటం అలవర్చుకో..శ్రద్ధ, సబూరీలను సమర్పించు
ఇదే నిజమైన గురుదక్షిణ''

సాయిబాబా సదానంద స్వరూపం. మోక్షాన్ని ప్రసాదించే సాధనం. శాంతికి మారుపేరు. సర్వ విజ్ఞాన ఖని.




బాబా మాటలు అమూల్యమైన హితోక్తులు. ఆయన బోధనలు అమృత జల్లులు..బాబా మనమధ్య తిరిగినప్పుడు ఎన్ని అద్భుతాలు చేసి చూపాడో, సమాధి స్థితిలోనూ చూపుతున్నాడు. ..బాబా మనకు మార్గదర్శకుడు.

బాబా అడుగులతో పునీతమైన షిర్డీ నేల పుణ్యక్షేత్రం అయింది. షిర్డీ వెళ్ళి వస్తే చాలు తమ కష్టాలు తీరుతాయని నమ్ముతారు భక్తులు. షిర్డీ క్షేత్రానికి వెళ్ళి, ప్రశాంత చిత్తంతో వెనుతిరిగి వస్తుంటారు. 

సాయి భక్తులు వీలైనపుడల్లా షిర్డీ వెళ్ళి వస్తుంటారు.

చిన్నాపెద్దా, పేదాధనిక తేడా లేకుండా బాబా అందర్నీ కాపాడుతాడు. కష్టాలను ఎదుర్కొనే శక్తి సామర్ధ్యాలను అందిస్తాడు.

బాబా సిద్ధపురుషుడు అయ్యుండీ సామాన్యుడిలా జీవించాడు. నలుగురి మధ్యా సాధకునిలా జీవించి ఎన్నెన్నో జీవనసత్యాలను అరటిపండు వలిచి నోట్లో పెట్టినట్లు అర్ధం చేసి చెప్పాడు.


లోకమంతా నిద్రలో ఉంటే జగద్రక్షకుడిగా బాబా మెలకువగా ఉండేవాడు. అందరూ మేల్కొని ఉన్నప్పుడు ఆయన యోగనిద్రలో ఉండేవాడు.

మనల్ని ఎల్లవేళలా కంటికి రెప్పలా కనిపెట్టుకుని ఉండే బాబా ఉండగా మనకెందుకు చింత? నిశ్చింతగా, నిబ్బరంగా ముందుకు సాగుదాం. జీవన మాధుర్యాన్ని ఆస్వాదిద్దాం.....ఓం సాయిరాం



ప్రార్ధన..ఓం సాయిరాం ..


ప్రేమతో ,భక్తితో పిలిస్తే పలకని ,తలిస్తే తరింపచేయని దైవం ఉంటారా ?


భక్తుల ప్రార్ధనలోని వేడుకోలు అనే వెచ్చదనానికి భగవంతుని హృదయం వెన్నలా కరగకుండా ఉంటుందా ?


ద్రౌపదిని వస్త్రాభరణం నుంచికాపాడింది ప్రార్ధనే!

గజేంద్రుడికి ప్రాణభిక్ష పెట్టింది ప్రార్థనే !
మార్కండేయుడిని యమగండం నుంచి తప్పంచింది ప్రార్థనే !
ప్రహ్లాదుడిని భక్తిముక్తిదాయకుడిని చేసింది ప్రార్దనే!

శ్యామాను పాముకాటు నుంచి రక్షించి౦ది ,తాత్యాకు ప్రాణభిక్ష పెట్టింది ప్రార్దనే !


ఈ కాలంలో ప్రార్ధనకు అర్ధం మారిపోయింది.

దేవుడితో బేరసారాలు ఆడటమే ప్రార్ధనల పరమావధి అయింది .'నా కోరిక తీర్చు...నీ చెంతకొస్తా'.....'ఫలానా పనయ్యేలాచెయ్యి... ''నీకు కానుకలిస్తా ''ఇంకా ఇలాంటివే మన ప్రార్ధనలన్ని !
ఏదిఏమైనా భగవంతుడు అందరివాడు అందరిలోనూ ఉన్నాడు .

ప్రార్ధన స్వభావం ఏదైనా భగవంతుడు వెంటనే కదులుతాడు.అందుకే మనం చేసే ప్రతి ప్రార్ధనకు ప్రతిఫలం ఉంటుంది .


కీర్తి ,ప్రతిష్ట ,గౌరవం,ఐశ్వర్య౦,ఆరోగ్యం .....ఏదడిగిన కాదనకుండా భగవంతుడు మనకు కోరినవన్నీ ప్రసాదిస్తాడు .మనం కోరకునేవన్ని కూడా అవే !

మనం చేసే ప్రార్ధనలో 'దేవుడిలా కావాలని ' చేసే ప్రార్ధన ఒకటి ఉండదు .జ్ఞానాన్ని ప్రసాదించమని 'ఒక్కరూ భగవంతుడ్ని వేడుకోరు .

ఒకసారి కుంతిదేవితో శ్రీకృష్ణుడు ''అత్తా !ఏదైనా వరం కోరుకో ''అన్నాడట .


''నాపై దయ ఉంటే నాకు ఎడతెగని కష్టాలు ప్రసాదించు ''అందట కుంతిదేవీ .


''అదేమిటి ?అందరు భోగభాగ్యాలు ,సుఖసంతోషాలు కోరుకుంటే నువ్వేమో కోరికష్టాలను ఇవ్వమంటావు?''అని కృష్ణుడు ఆశ్చర్యపోయాడు .
''కష్టాలలో ఉంటేనే కదా నిరంతరం భగవంతుడు గుర్తుండేది .సుఖాలకు మరిగితే ఇక నీ అవసరం ఉండదు .నాకు భగవంతుని సాంగత్యమే ఇష్టం .అందుకే నేను భగవంతుడినే ఎల్లప్పుడూ ధ్యానించాల౦టే నాకు కష్టాలనే ఇవ్వు ''. భగవంతుడు చెంతనే ఉంటే మాత్రం కోరి కష్టాలను వరించటం ,మనసును కష్ట పెట్టుకోవటం ఎవరికీ మాత్రం ఇష్టం .మరి ,మన కోరికలను తీర్చుకుంటునే భగవంతుడుని ఎలా ధ్యానించాలి ?నిత్యం భగవంతుడిని మనసు మందిరంలో ఎలా ప్రతిష్టించుకోవాలి ?అసలు మనం భగవంతుడిని కోరుకోవాల్సినవి ఏమిటి ?ఇవన్ని భక్తుడిని సందిగ్ధంలో పడవేసే ప్రశ్నలు .చాలా వరకు సులభరీతిలో సమాధానం దొరకనివి కూడా!




ఈ క్రమంలోనే మానవజన్మకు భూమిపైనే చరితార్థం చేయగల సులభోపాయాలు ,సరళబోధలు ,..నీతిసూత్రాలు , చక్కని ఉపదేశాలతో జ్ఞానమార్గాన్ని చూపటానికి ఓ దివ్య అవతారం వెలసింది .మానవాళి ఉద్ధరణకు మానవ రూపంలో అవతరించిన ఆ దైవమే షిరిడిసాయినాధుడు .అరవై ఏళ్ళ పాటు ఈ నేలపై నడయాడి మనుషుల పాప కర్మలని ,కష్టాల్ని తనపై వేసుకుని ,తననుభవించి మానవ జీవితాలను పావనం చేసిన సాయినాధుడు భక్తసులభుడు. మనిషి నడవడిక ఎలా ఉండాలో బాబా స్వయంగా ఆచరించి చూపారు.ఆదర్శజీవన  విధానానికి బాటలు వేశారు .ఆ అడుగుజాడలే ఇవి....ఆసాయిపధ౦ ఇది .......ఆ బాటలో నడవండి!ముక్తులుకండి! జీవితాల్ని ధన్యంచేసుకోండి.

ఇక సర్వం శ్రేయస్సులు మీవే!.......Fb సౌజన్యంతో..

సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు


Friday, November 1, 2019 0 comments By: visalakshi

శ్రీ పాద శ్రీ వల్లభ స్వామి, స్వామి సమర్ధుల అద్భుత లీల..

             శ్రీ పాద శ్రీ వల్లభ స్వామి ,
           స్వామి సమర్థుల అద్భుత లీల




బహుశా ఇది మల్లాది గోవింద దీక్షితులుగారి ముత్తాత తరంలోఅంటే సుమారు 1910 -15 సంవత్సరాల మధ్య జరిగిన సంఘటనఅని చెప్పారు. అప్పుడు మల్లాదివారి కుటుంబీకులు పిఠాపురంలో ఉంటుండేవారు.ఒక సారి గుంటూరు నుంచి ఒక వైశ్య వర్తకుడు పిఠాపురం వచ్చాడు. అతనికి అక్కడ కొంతమంది స్నేహితులు కూడా ఉన్నారు. అక్కడ భూములు కొనుక్కుని అక్కడే వ్యవసాయం చేస్తూ స్థిర పడి పోవాలి అనే ఉద్దేశ్యంతో ఆయన వచ్చాడు. చుట్టూ ప్రక్కల అంతా వెతుక్కుని కొన్ని పొలాలను చూసుకున్నాడు. వాటికోసం ఆయనకి కొంత పైకము అడ్వాన్స్ గా ఇవ్వాల్సి వచ్చింది.

అది ఇచ్చి ఆయన గుంటూరు కి తిరిగి వెళ్లి అక్కడ ఉన్న ఆస్తి-పాస్తులు అమ్ముకుని ఆ వచ్చిన ధనముతో ఆ భూమి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అనే తలంపు అతనికి కలిగింది. కాని అతని దగ్గర అడ్వాన్స్ చెల్లించడానికి అంత డబ్బు లేక పోవడముతో అక్కడే పిఠాపురంలో ఉన్న ఒక సంపన్న వర్తకుని దగ్గరకి వెళ్లి ప్రామిసరీ నోటు వ్రాసి ఇచ్చి కొంత డబ్బు అప్పు తీసుకుని ఆ వ్యవసాయదారునికి అడ్వాన్స్ చెల్లించి గుంటూరు వెళ్ళిపోయాడు. అక్కడి ఆస్తి-పాస్తులు అమ్మేసుకుని ఆ ధనం తో పిఠాపురానికి వచ్చేసి ఆ ధనిక వర్తకుని బాకీ తీర్చేసాడు. కాని యేవో కారణాలవల్ల ఆ ప్రామిసరీ నోటు ఆ ధనికుడు వాపసు ఇవ్వలేదు. ఆ వర్తకుడు కూడా అంత పట్టించుకోలేదు. ఇలా కొన్ని రోజులైనాక ఆ వర్తకునికి రాజమండ్రి హైకోర్ట్ నుంచి ఒక నోటీసు వచ్చింది. దాని సారాంశం ఏమంటే ఫలానా తేదీన ఈ వర్తకుడు నా దగ్గర్నుంచి ధనం అప్పు తీసుకుని ఇన్ని నెలలైనా బాకీ తీర్చలేదు. తక్షణమే ఆ డబ్బు వడ్డీతో సహా వాపసు ఇవ్వవలసినదిగా కోర్ట్ నోటీసు ఇప్పించాడు. ఇది చదివిన ఆవర్తకుని గుండె చెదిరి పోయింది. చాలా భయపడి పోయాడు. ఆ ధనికుడు ఆ పట్టణంలో మంచి పేరున్నవాడే. ఏదో పొరబాటు జరిగి ఉంటుంది అని ఆలోచించి ఆ ధనికుడి దగ్గరకి వెళ్ళాడు."నేను అప్పుడే మీ బాకీ తీర్చేసాను కదా ! ఈ సంగతి మీకు తెలిసీ కూడా నాకిలా ఎందుకు కోర్ట్ నోటీసు పంపించారు ?" అని అడిగాడు. "మీలాంటి పెద్దవాళ్ళు ఇలాంటి పనులు చేయరు అని నాకు నమ్మకం ఉంది. ఎక్కడో, ఏదో పొరబాటు జరిగి ఉంటుంది అని కనుక్కోవడానికి వచ్చాను" అని చెప్పాడు.

దానికి ఆ అప్పు ఇచ్చిన ధనికుడు, "భలేవారే ! ఏమిటీ ఇలా మాట్లాడుతున్నారు? మీరు నాకు అసలు ఎప్పుడు డబ్బు వాపసు ఇచ్చారు? మీరు వాపసు ఇచ్చి ఉంటె ఆ ప్రామిసరీ నోట్ మరి నా దగ్గరే ఎందుకు ఉంది? అది మీ దగ్గరే ఉండాలి కదా ! అయినా ఎవరైనా సాక్ష్యం ఉన్నారా?" అని అడిగాడు.

దానికి గుంటూరు నుంచి వచ్చిన వర్తకుడు ఇలా అన్నాడు. మీరేమో పెద్ద మనుష్యులు. ఇలా అన్యాయం చేయడం ఏమి బాగా లేదు . ఈ విషయం మన ఇద్దరికీ తప్ప ఇంకెవరికీ తెలియదు అని మీకు బాగా తెలుసు అని ఆ వర్తకుడు అన్నాడు . అప్పుడేమో ఆ ధనికుడు మీరు అప్పు తీర్చేసి ఉంటే ఆ ప్రామిసరీ నోటు నేను మీకు వాపసు ఇచ్చేవాడిని. అది నా దగ్గరే ఉన్నది. మీరు నా అప్పు తీర్చలేదు. ముందు నా బాకీ తీర్చండి అని గట్టిగా మందలించి ఆ వర్తకున్ని పంపించేసాడు.




దీనితో పాపం ! ఆ వర్తకుడు దిక్కు తోచక గాభరా పడిపోయాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. డబ్బులు వాపసు ఇచ్చినప్పుడు సాక్షులు కూడా ఎవ్వరూ లేరు . పైగా ఎవరూ నా మాటలు నమ్మరు. పరిస్థితి చాలా విషమంగా ఉంది అని సతమతమవుతూ ఉంటే అతని స్నేహితులు ఒక ఉపాయం చెప్పారు. ఈ ఊళ్లోనే శ్రీ పాద శ్రీ వల్లభుల వంశానికి చెందిన మల్లాదివారి కుటుంబం ఉంది. పై ఊరినుంచి వచ్చిన ఎవరినైనా సరే దత్త స్వరూపులుగా భావించి ఆతిథ్యం ఇస్తారు. నీవు అక్కడికి వెళ్ళు. తప్పకుండా నీ సమస్య తీరిపోతుంది అని సలహా ఇచ్చారు. ఇక దిక్కు తోచని స్థితిలో ఆ వర్తకుడు శ్రీ పాద శ్రీ వల్లభులని నమ్ముకుని ఆయన మీదే భారం వేసి మల్లాది వారింటికి వెళ్ళాడు. ఆ ఇంటి సాధ్వీమణి అతనిని చూసి మీరు పై ఊరినుంచి వచ్చినట్టున్నారు. బాగా అలసి పోయినట్టు కనిపిస్తున్నారు. త్వరగా కాళ్ళు చేతులు కడుక్కుని రండి. భోజనం వడ్డిస్తాను అని అన్నది.సరే అని ఆయన కాళ్ళు చేతులు కడుక్కుని భోజనానికి కూర్చున్నాడు. అన్యమనస్కంగా భోజనం చేస్తున్న అతన్ని చూసి ఆ సాధ్వీమణి , "ఏమిటీ నాయనా ! అలా ఉన్నావు ?నిన్ను చూస్తుంటే ఏదో చాలా బాధ పడుతున్నట్టుగా ఉన్నావు. అసలు విషయమేమిటీ? అని అడిగింది. ఆయన భోరున ఏడుస్తూ జరిగిన సంగతి అంతా చెప్పాడు విషయం విని ఆవిడ కూడా చాలా బాధ పడింది . మరి సాక్ష్యం చెప్పడానికి ఇప్పుడు ఎవరూ లేరా? అని అడిగింది. నిన్ను చూస్తే మంచి సాధు స్వభావం ఉన్న వాడిలా కనిపిస్తున్నావు. నీవు చెప్పింది నిజమైతే మా శ్రీపాదుడే వచ్చి సాక్ష్యం చెప్తాడులే అని అన్నది. మంచి మనస్సు ఉన్నవాళ్ళు ఏమీ ఆలోచించకుండానే వారి మనస్సులో ఉన్నది మనస్పూర్తిగా బయటకి చెప్పేస్తారు. ఆవిడ మాటలు వినగానే ఆ వర్తకునికి ధైర్యం వచ్చింది. ఈలోగా ఆ సాధ్వీమణి ఈ విషయం తన భర్తకి చెప్పితే ఆయన లబోదిబోమని మొత్తుకున్నారు.

నీవెందుకు శ్రీపాదుడు సాక్ష్యం ఇస్తాడు అని చెప్పావు ? శ్రీపాదుడేమిటి ? సాక్ష్యం ఏమిటీ? ఇది జరిగే పనేనా? ఇలాంటి అసాధ్యమైన హామీలు ఎందుకు ఇస్తున్నావు? అని మందలించారు. ఆవిడ మటుకు ధైర్యంగా మరి దేవుడైన శ్రీపాద శ్రీ వల్లభుడు భక్తులైన వారికి సహాయం చేయాలి కదా ! మరి ఆ మనిషిని చూస్తే నిజమే చెప్తున్నాడని నాకనిపిస్తుంది. అటువంటి మంచి ,నిజాయతిపరుడైన వ్యక్తికి శ్రీపాద శ్రీ వల్లభుడు సహాయం చేయకపోతే మన మాట పోదా ? ఏమో ! నాకేమీ తెలియదు. నేనైతే మాట ఇచ్చేశాను. నా మాట నిలబెట్టడం ఆ శ్రీ పాదుని బాధ్యతే అని చెప్పేసి తన పనిలో ఆవిడ మునిగిపోయింది.

ఇక్కడ గుంటూరు నుంచి వచ్చిన వర్తకుడు తన లాయరు దగ్గరకి వెళ్ళాడు. నీకెవరైనా సాక్ష్యం ఉన్నారా అని లాయరుగారు అడిగితే ఉన్నారు అని బదులు చెప్పాడు. ఆ లాయరుగారు కూడా అంత పట్టించుకోలేదు.రాజమండ్రి హై కోర్టులో తారీఖు వచ్చినప్పుడు వీళ్ళిద్దరూ కోర్ట్ కి వెళ్ళారు. ఆ రోజుల్లో బ్రిటిషువారి పరిపాలన మూలంగా అక్కడ ఒక ఆంగ్లేయుడే న్యాయమూర్తిగా ఉన్నాడు. కేసు విచారణకి వచ్చిన రోజున ఆ వర్తకుని లాయరుగారు సాక్షి గురించి ఎప్పుడు వస్తాడు? ఎక్కడ ఉన్నాడు? అని అడిగితే శ్రీ పాద శ్రీ వల్లభులే సాక్ష్యం ఇస్తారు అని ఆ సాధ్వీమణియే చెప్పారు అని సమాధానం చెప్పాడు. అది విని లాయరుగారు బిత్తర పోయారు. అదేమిటండీ! శ్రీ పాద శ్రీ వల్లభుల వారేమిటీ? సాక్ష్యం చెప్పడానికి రావడ మేమిటీ? నాకంతా గందరగోళంగా ఉంది. మీరు నాకు ముందే చెప్పాల్సింది కదా ! ఆయన ఎలా వస్తారు? అని గాభరా పడ్డారు.

ఇంతలో " శ్రీ పాద శ్రీ వల్లభుల వారు హాజరు కావాలి " అని బంట్రోతు గట్టిగా పిలిచాడు. అక్కడ సాక్ష్యం చెప్పే బోనులో స్వామి సమర్థ వారి ఆకారం ప్రత్యక్షమయింది. కోలాహలంతో కోర్ట్ హాలు దద్దరిల్లి పోయింది. జడ్జిగారు కూడా చాలా ఆశ్చర్య పోయారు. ఇదంతా ఏదో దైవిక శక్తి లాగా ఉంది. ఇది ఎలా సాధ్యం? అయినా ఒక్క నిమిషం ఆలోచించి తన విధి తానూ చేయాలి కాబట్టి "స్వామీ ! మీరు సాక్ష్యం చెప్పడానికి వచ్చారు కదా ! మీ పేరేమిటీ ? అని స్వామి సమర్థవారిని అడిగారు.

ఇదేమి ప్రశ్నరా బాబూ ! నేనేమిటీ ? నా పేరేమిటీ ? అన్ని పేర్లు నావే. నేను అంతటా ఉన్నాను. అందరిలో ఉన్నాను అని స్వామి సమర్థవారు బదులు చెప్పటం జరిగింది.

ఆ మాటలు విని ఆ జడ్జిగారు ఇతనెవరో సాధారణమైన వ్యక్తి కాదు. అందరి లాగా కాదు అని భావించుకుని నెమ్మదిగా, "స్వామీ ! తమరి కులమేమిటీ?" అని అడిగారు.

"నేను చర్మకారుణ్ణి. మాదిగవాణ్ణి "అని స్వామి సమర్థవారు గట్టిగా అరిచి చెప్పారు
.అప్పటికే హాలులో ఉన్న జనమంతా హడలిపోయి ఉన్నారు.అక్కడ జరుగుతున్నదంతా విచిత్రంగా ఏదో మహా శక్తి ఆవరించుకున్నట్టుగా అనిపించింది. ఈ అప్పిచ్చిన ధనికుడు గడగడా వణికి పోసాగాడు.అటువంటి మహా దైవిక శక్తి ముందు తను చేసిన ఈ అమానుష పనికి లోపల్లోపలే పశ్చాత్తాప పడడం మొదలు పెట్టాడు. శ్రీపాద శ్రీ వల్లభుడు సాక్ష్యం చెప్పడానికి వస్తాడు అని నేనెప్పుడూ అనుకోలేదు. అనవసరంగా అబద్ధమాడాను. ఇప్పుడు నాగతేమిటీ? ఏమన్నా శిక్ష పడుతుందో ఏమో అని పరిపరి విధాలా ఆలోచించ సాగాడు.
తదుపరి ప్రశ్న "మీ తల్లిదండ్రులేవరూ?" అని జడ్జిగారు అడిగారు.
"నా తలిదండ్రులా? నాకు పుట్టుక ఏమిటీ? చావేమిటీ? నా తల్లిదండ్రులంటూన్నావేమిటీ ? అసలు నీ పుట్టుక గురించి నువ్వాలోచించుకో. నీ తండ్ర్రెవరో నీకు తెలుసా?" అనిగర్జించారు.
ఆ స్వామివారి మేఘ గర్జనకి ఆ జడ్జి గారేమిటీ, లాయర్లేమిటీ, అందరూ కూడా నిశ్చేష్టులై పోయారు. గడ గడా వణికి పోవడం మొదలు పెట్టారు.
పాపం ! ఆ జడ్జీ గారు దెబ్బకి క్రింద పడిపోయారు. ఇదేమిటీ? నేను అనాథున్ని, అక్రమ సంతానాన్ని (లావారిస్),నా తండ్రెవరో ఏమో నాకే కాదు మరెవ్వరికీ కూడా తెలియదు అని ఈయనకి ఎలా తెలిసి పోయిందీ? అని గాభరా పడి పోయారు. కోర్టులో అందరూ కూడా ఏమవుతుందా అని భయపడి పోయారు. ఇతనెవరో సామాన్య మానవుడు కాదు. మహానుభావుడు అయి ఉంటాడు అని అనుకున్నారు.

ఇక్కడ ఆ ధనికుడు పశ్చాత్తాప పడుతూ జడ్జీ గారి దగ్గరకి పరిగెత్తుకుని వచ్చాడు. గుంటూరు నుంచి వచ్చిన ఆ వర్తకుడికి మాత్రం ఆశ్చర్యంతో నోట మాట రాకుండా అలాగే ఉండి పోయాడు. అక్కడ అందరి పరిస్థితి అలాగే ఉండింది. ఆ ధనికుడు గబా గబా జడ్జీగారి దగ్గరకి వెళ్లి , నేను చాలా పొరబాటు చేసాను.ఆ వర్తకుడు చాలా మంచివాడు, నిజాయతిపరుడూ,నా బాకీ అప్పుడే తీర్చేసాడు. నేను ఆ ప్రామిసరీ నోటు అతనికి వాపసు ఇవ్వకుండా,అతన్ని మోస పుచ్చి, మళ్ళీ డబ్బు అతని దగ్గర్నుంచి లాక్కోవాలనే దురాశతో ఇలా చేసాను నన్ను క్షమించండి. మీరు ఏ శిక్ష విధించినా నాకు అంగీకారమే అని ప్రాధేయ పడ్డాడు. ఈ విధంగా ఆ ధనికుడు తన తప్పు ఒప్పుకున్నాడు. ఆ జడ్జిగారు ఆ ధనికున్ని కోప్పడి బాగా జరిమానా వేసి అక్కణ్ణుంచి పంపించేసారు. ఆ గుంటూరు నుంచి వచ్చిన వ్యాపారి మాత్రం శ్రీ పాద శ్రీ వల్లభులవారి మహిమ ఏమిటీ ఇలా జరిగింది. నిజంగా వారి వంశం వారు ఇచ్చిన మాట ఆయన నిలబెట్టారు కదా ! అని అనుకుని శ్రీ పాద శ్రీ వల్లభులవారి పరమ భక్తాగ్రేసర చక్రవర్తి లాగా మారి పోయాడు. అయితే ఈ వృత్తాంతమంతా ఆ జడ్జీ గారు తన డైరీలో వ్రాసుకున్నట్టుగాలేక స్పెషల్ గా నోట్ చేసుకున్నారు. అది ఇప్పుడు కూడా ఇంగ్లాండ్ లో ఉన్నది అని శ్రీ గోవింద దీక్షితులు గారు చెప్పారు.

దయచేసి మీకు   తెలిసిన   పెద్దవారికి , దర్శించే వీలు లేని వారికి చూపించండి . దేవుడు ఎలా అనుగ్రహిస్తాడో , ఎప్పుడు దర్శనభాగ్యం కలిగిస్తాడో మన ఊహకు అందదు.అందరికీ దర్శనభాగ్యం కలగాలనే మా ప్రయత్నం.

" సంభవామి యుగే యుగే " ఫేసుబుక్ పేజీ ద్వారా పోస్ట్ చేస్తున్న ఇతర పోస్ట్ లు కూడా చూడండి మీకు కొన్నైనా ఉపయోగపడితే మా ప్రయత్నం సఫలీకృతం అవుతుంది అని మా ఆశ


శ్రీ పాద రాజం శరణం ప్రపద్యే
ఓం నమో శ్రీ స్వామి సమర్ధ

వాట్సప్ లో ఫార్వార్డ్ చేయబడిన ఈ ఆధ్యాత్మిక పోస్ట్ ను నా బ్లాగు లో కాపీ చేసాను..
Sunday, October 27, 2019 0 comments By: visalakshi

వివాహనిశ్చితార్థం....

                             ఓం శ్రీ గణేశాయ నమో నమః








సంప్రదాయాలకు, సంస్కారాలకు, శ్రేష్టమైన
ఆచారవ్యవహారాలకు నిలయం "భారతీయ సంస్కృతి". అందులో ఒకటైన మన వివాహ విధానం ఘననీయమైనది. గృహస్థాశ్రమం నాలుగుఆశ్రమంలలో శ్రేష్ఠోత్తమం. ఈ ఆశ్రమం లోనికి  ప్రవేశంకి  ఉత్తమ సంస్కారముంది. అదే వివాహం. 
   
వివాహం అనేది ఒక వైదిక కార్యం. ఇది ఒక సాంస్కృతిక సార్వజనీనమైన సంప్రదాయం. మూడు ముళ్ళ బంధం ద్వారా ఒకటై విడదీయరాని నూతన బంధానికి శ్రీకారం చుడుతూ తమ పవిత్ర కలయిక ద్వార మరో కొత్తతరానికి నాంది పలికేటట్లు చేసే సంస్కారమే వివాహం. 

అసలు వివాహం ఎందుకు? పురుషార్ధాలలో ఒకటైన కామం కోసమా...కానేకాదు. ఆమె కామపత్నికాదు ధర్మపత్ని. దేనికైన ఓ పవిత్రతను కలిగించడం, దైవభక్తితో, దేవతల శక్తులతో అనుసంధానించడం భారతీయజీవన ఔనత్యం. హిందూ వివాహవ్యవస్థ ఓ ధర్మం. మన సంస్కృతి 'వివాహం'ను ఓ ధర్మసాధనగా పేర్కొన్నది. గృహస్థ కర్తవ్యములైన పంచయజ్ఞములను నిర్వహించుటకొరకు, ముఖ్యంగా మువ్విధములైన ఋణములు తీర్చుకొనుటకొరకు.ఆ ఋణాలేమిటంటే - 

దైవఋణం:- దైవం ఒకటే అయినా అనేక దేవతారూపాల్లో పూజిస్తాం. అలా ఆరాధించడం వలన, మరియు జపధ్యానాదులు యజ్ఞయాగాదుల చేయడం ద్వారా, పంచభూతాల రూపంలో నిరంతరం మనల్ని పోషిస్తున్న దైవాన్ని అర్చించడం (ప్రకృతిశక్తులకు కృతజ్ఞత చూపడం) ద్వారా దేవఋణం తీరుతుంది. 

పితృఋణం :- గత జన్మల ప్రారబ్ధం అనుభవిస్తూ , ఈ జన్మలో ఉత్తమకర్మలు చేస్తూ, పునరావృతి లేని ముక్తస్థితి పొందడానికి అవసరమైన శరీరాన్ని ఇచ్చి, పెంచిన తల్లితండ్రుల ఋణం తీర్చుకోవాలి. తల్లితండ్రులను పెద్దలను గౌరవించడం వలన, అలాగే పూర్వీకులైన పితృదేవతల పట్ల మనకున్న ఋణం సంతానం కనడం ద్వారా తీరుతుంది. అంటే వంశాన్ని ముందుకు తీసుకెళ్ళడం వల్ల పూర్విజులైన పితృఋణం తీరుతుంది. దేవఋణం తీరడానికి యజ్ఞయాగాదులు ఎలాగో, పితృదేవతల ఋణం తీరడానికి శ్రాద్ధకర్మలు కూడా అలాంటివే . 

ఋషిఋణం:- జ్ఞానసంపన్నులు అయిన ఋషులు చెప్పిన వేదోపనిషత్తులను అధ్యయనం చేయడం, సాధనలు, సత్గ్రంధ పఠనాదులు చేస్తూ ధర్మాన్ని ఆచరించడం ద్వారా ఋషిఋణం తీరుతుంది. 
పై ఋణాలకి వివాహానికి సంబంధం ఏమిటంటే- దేవతానుగ్రహం చేతనే సర్వకార్యములు జరుగుతాయి. వారికి అందుకే కృతజ్ఞత చూపాలి. యజ్ఞయాగాదులతో హవిస్సునివ్వాలి. అలా ఇవ్వాలంటే ప్రక్కన ధర్మపత్ని వుండాలి. ధర్మపత్నితో కూడి వున్నప్పుడే యజ్ఞం చేయడానికి అర్హత వుంటుంది. 

ఇక పితృఋణం వంశాన్ని ముందుకు తీసుకెళ్ళడం అంటే సంతానం పొందడం ద్వారా తీరుతుంది కాబట్టి, ఆ సంతానం ధర్మబద్ధంగా ఉండాలి కాబట్టి వివాహ సంస్కారంద్వారా పత్నిని పొందాలి.ఆపై తాను పుణ్యకర్మములు చేయలన్న,  జాతిహితంకై ఋషులు చెప్పిన వాజ్మయంలను చదివి ఆచరించాలన్న, తనని, తనవారిని శ్రద్ధగా చూసుకుని, సహకరించే భార్య కావాలి. అప్పుడే ఋషిఋణం తీర్చుకోవడం అవుతుంది.

ఈ మూడు ఋణాలు తీరాలంటే వివాహం చేసుకొని గృహస్థాశ్రమం లోనికి ప్రవేశించాలి తప్ప వేరే మార్గం లేదు. ధర్మాచరణకు ప్రధానమైన ఉపకరణం ధర్మపత్నియే. ఎన్ని వున్నా, వున్నది పుణ్యంగా మార్చుకోవడానికి సహచరి తప్పనిసరి. 

ఎన్నెన్నో అనుభూతులు ఆనందాలు సుఖాలు కష్టాలు సర్ధుబాటులు...ఒకటనేముందీ...అన్ని అనుభవాలను సామరస్యంగా ఒకరికొకరు తోడై పంచుకుంటూ సంతోషంగా జీవనగమనం సాగిస్తూ పురుషార్ధాలను సాధించడమే వివాహ అంతరార్ధం. 

ఇక మన వివాహపద్ధతిలో చాలా ప్రత్యేకతలున్నాయి. మన ఈ పద్ధతుల్లో ప్రతీ ఘట్టం సంప్రదాయకమే, మరుపురాని మధురస్మృతే. ముందుగా అబ్బాయికి తగిన అమ్మాయిని, అమ్మాయికి తగిన అబ్బాయిని ఎంపిక చేయడం ఓ ముఖ్యఘట్టం.

మొదటి ఘట్టం 'పెళ్ళిచూపులు'.
యుక్తవయస్సు వచ్చిన అబ్బాయి, అమ్మాయిలకు వివాహం చేయదలచి ఇరుపెద్దలు చక్కటి సంబంధాలకై పెద్దవారిని, తెలుసున్నవారిని ఆశ్రయించి (ఇప్పటివారు సమిష్టితత్వం లేనందున మాట్రిమోనీలమీద ఆధారపడుతున్నారు)
వారి సహకారంతో వారిని సంధానకర్తలుగా నిలిపి 
ఇరు కుటుంబాల నడుమ రాయభారాలు నడిపి ఒకరిది ఒకరికి నప్పింది అని అనుకున్నప్పుడు తొలుత పెళ్ళిచూపుల కార్యక్రమంకు నాంది పలుకుతారు. ఆపై చేసుకున్నవారికి, చేసేవారికి సమ్మతమై, ఇరువురి ముఖ్యబంధువులు ఒకచోట సమావేశమై, పరస్పర సంప్రదాయలు, కుటుంబ ఆచారవ్యవహారాలు చర్చించుకొని, అన్నీ కుదిరాక ఓ శుభముహుర్తమున 'నిశ్చితార్ధం' చేయ నిర్ణయించుకోవడం రెండవ ఘట్టం.




నిశ్చితార్ధం:- ఇరు కుటుంబాలవారు వారి అబ్బాయి అమ్మాయి ఏకమవ్వడానికి చేసిన ప్రతిపాదనను శాస్త్రానుసారంగా వేదమంత్రాల నడుమ వాగ్ధానం ద్వారా నిశ్చయించుకోవడాన్ని నిశ్చితార్ధం అంటారు. సంప్రదాయబద్ధంగా పెద్దల సమ్మతితో అందరి అత్మీయుల ఆశీర్వాదములతో జరిగే ఈ వివాహ నిశ్చయం అమ్మాయి ఇంట్లో గాని వారు సూచించే చోట జరుగుతుంది. నిశ్చితార్ధంకై అబ్బాయి తన కుటుంబ బంధుమిత్రాదులతో వచ్చినప్పుడు అమ్మాయి తరుపున వారు ఆదరాభిమానాలతో ఆహ్వానిస్తారు. పరస్పర నమస్కారాలతో (నమస్కారం మన సంస్కారమంటారు. దీనిలో కూడా ఓ అంతరార్ధముంది. భగవంతునికి నమస్కరించడంలో భక్తిభావం, గురువుని నమస్కరించడంలో పూజ్యభావం, పెద్దలను నమస్కరించడంలో గౌరవభావం ఉన్నట్లే, పెళ్ళి ఒప్పందం లాంటి ఈ వేడుకలో ఇరు కుటుంబాలవారు నమస్కరించుకోవడంలో రెండు కుటుంబాలు ఒకటి కావాలనే ఆకాంక్షతో అరమరికలు లేకుండా కలిసుందామని రెండుచేతులు జోడించి అనుబంధాన్ని దృఢపర్చుకునేభావముంటుంది)పలకరించుకుంటారు.

హితులు, స్నేహితులు, బంధువుల నడుమ వైదిక మంత్రాలమధ్య అందరికీ అమోదయోగ్యమైన ఈ ఇరువురు పెళ్ళిని లాంచనప్రాయంగా ఖాయపరచుకోవడమనే ఈ కార్యక్రమం ప్రధమంగా విఘ్నేశ్వరుని పూజతో ప్రారంబమౌతుంది. వివాహప్రక్రియ అసాంతం విఘ్నాలు లేకుండా చూడమని ఆయన్ను పూజించడం ఆనవాయితి. ఆపై అమ్మాయికి అబ్బాయి తల్లితండ్రులు నూతనవస్త్రాలను నగానట్రా పండ్లు మధురపధార్ధాలను ఇచ్చి తనకోడలుగా స్వీకరిస్తారు. ఇప్పుడు అమ్మాయికి అత్తమ్మగారు (అబ్బాయి తల్లి), అబ్బాయికి మామయ్యగారు(అమ్మాయి తండ్రి) ఉంగారాలు తొడుగుతారు. అయితే నేటితరంవారు అబ్బాయి అమ్మాయి ఒకరికి ఒకరు తొడుక్కుంటున్నారు. శాస్త్రరీత్యా వివాహం అప్పుడే పాణిగ్రహణం జరగాలని పెద్దలు చెప్తుంటారు. ఇది ఎవరి వంశానుసారంగా వారి వారి కుటుంబ పెద్దలు ఆచరించినది అనుసరించడం ఉత్తమం. 
పురోహితుడు బంధుమిత్రుల సమక్షంలో పెళ్ళి ముహుర్తాన్ని లగ్నపత్రికగా వ్రాయించిన తదుపరి, వధూవరుల తల్లితండ్రులు నూతన వస్త్రాలపై లగ్నపత్రికలు, తాంబులాలు పెట్టి మార్చుకుంటారు. అటుపిమ్మట అమ్మాయితో కొందరికి తాంబులాలు ఇప్పించి వధూవరులను వేరు వేరుగా ఆశ్వీరదిస్తారు. కానీ ఇప్పటి తరంవారు ప్రక్క ప్రక్కనే కూర్చొబెట్టి ఆశీర్వదిస్తారు. అది సరికాదని, అంతగా సరదా ఉంటే వేరువేరు కుర్చీలలో కూర్చోబెట్టి మధ్యలో చిన్న ఉదకబాండం ఉంచండని పెద్దలవాక్కు. తాత్కాలిక ముచ్చట్లుకు కాకుండా జీవితాంతం ముచ్చటగా ఉండేటట్లు చూడండి అని పెద్దలు చెప్తుంటారు. అప్పటికి ఇప్పటికి కొన్ని మార్పులు అన్నింటా చోటుచేసుకున్నవి. 




పిమ్మట రెండు మనసులు జీవితకాలం తోడునీడై కలిసుండడానికి వేసే ఈ తొలి వేడుకలో, రెండు కుటుంబాలూ కుటుంబాలు జీవితకాలం ఆత్మసంబంధీకుల్లా కలుసిపోయే శుభతరుణంలో, అందరూ ఒకచోట కలుసుకునే ఈ మధురక్షణాల్లో ఆత్మీయముచ్చట్లు,విందుఆరగింపులు,చలోక్తులు, చతురోక్తులు...నవ్వులు, కవ్వింపులు...ఓహో...ఆనంద వెల్లువ...కమనీయ వేడుక...శుభాకాంక్షల డోలిక..... మూడవది ముచ్చటైనది మూడుముళ్లు  పడే శుభదినంకై సన్నాహాలు ఎదురుచూపులు... ఈ ఉల్లాస ఉత్సాహాలు మరుపురాని మధురఘట్టం.

ఇలాంటి మధురానుభూతుల సమాహారాల కలయికే వివాహ బంధంగా ముడిపడి దంపతులుగా ఆదర్శంగా నిలవాలని ముక్కోటి దేవతలు ఆశీర్వదిస్తారు..

                       సర్వే జనా సుఖినో భవంతు...
















Monday, September 30, 2019 0 comments By: visalakshi

ఆత్మశక్తి-దైవ ఆరాధన...


ఓం శ్రీ సాయినాథాయ నమో నమః


   
స్వభావరీత్యా మానవునకు ప్రేమానురక్తులను ఆశించడం పరిపాటి. ఆ ఆశలను అందుకోవడంలో విఫలమైనప్పుడు ఆవేశపూరితుడవుతాడు. కానీ ఆలోచిస్తే ఆ ఆశ అన్న భావాన్ని మనసునుండి తొలగించుకునే ప్రయత్నంలో అతను సాధు స్వభావుడవుతాడు.

మహాత్ముల స్వరూపం సదా ఆనంద దీపికలు వెలిగిస్తూ ఉంటుంది. దైవదృష్టికి పరిమితి లేదు. "ఏయధా మాం ప్రపద్యంతే తాంస్తధైవ భజామ్యహం" (నా పట్ల ఎలాంటి భక్తిని కలిగిఉంటే వారికి వారి భక్తి ననుసరించి అలాంటి ప్రతిఫలమిస్తాను) అయితే మహాత్ముల అంత:కరణ వారిని నిందించిన వారిపై కూడా కారుణ్యం కురిపిస్తుంది. బాబా ఎన్నోసార్లు "ఇతరుల మనసుకి కష్టం కలిగేలా మాట్లాడితే అవి నా హృదయాన్నే తూట్లు పొడుస్తాయి. నా అత్యంత సున్నితమైన భాగానికి గుచ్చుకుంటాయని తెలుసుకోండి. ఇతరులను   బాధాకర మాటలతో కోపం కలిగేలా మాట్లాడితే అవి నన్నే బాధిస్తాయి. కానీ వాటిని శాంతంగా సహించే వారే నాకు బాగా తృప్తి కలిగిస్తారు". అని చెప్పి ఉన్నారు. అలా సాయిబాబా జీవులన్నింటా లోపలా, బయటా నిండి ఉన్నారు .ఆ మహా మంగళప్రదమైన ప్రేమమయి సర్వవ్యాపకుడై  భక్తుల హృదయనివాసుడైనాడు...ఓం సాయిరాం.... 





దృఢమైన మనసుతో భగవానుని కొరకు లోకమందలి స్వజన సంబంధములు మరియు మిత్ర పరిచయముల వంటి సమస్త సంబంధములకు ఋణములన్నీ తీర్చుకోవలెను. ఋణవిముక్తులవ్వాలంటే ఆధ్యాత్మిక జీవనమనే సాధు సాంగత్యముతో విష్ణు ఆరాధనలో భక్తిభావ సమన్వితులై భగవచ్చరణారవిందములను ఆశ్రయించడం ద్వారానే మనం ఋణము లనుండి విముక్తులవుతాము.

 సుఖదు:ఖములు తాత్కాలికము. వాటి రాక పోకలు శీతగ్రీష్మ అనుభవముల వంటివి. జీవితానుభవముల వలన అవి కలుగుచుండును. కావున కలత పొందక వాటిని సహింపవలెను. నిజానికి సుఖదు:ఖములనేవి మనస్సు వలన కలుగునన్నది మనకు విదితము. కాబట్టి మనసును దైవ ఆరాధనలో నిమగ్నం చేసి  ప్రశాంతతను అలవరచుకోవాలి....ఓం సాయిరాం...,




బాబా తమ కమలసుమదళంలాంటి చేతిని శిరస్సుపై పెట్టటంతోనే అనేక జన్మలనుంచీ సంతరించుకొన్న పాపాలు ప్రక్షాళనం అయిపోయి నా లాంటి సాయియొక్క ప్రేమిక భక్తులు పవిత్రులవుతారు. బాబాస్పర్శతో హృదయంలో అష్టసాత్విక భావాలు ప్రకటమవుతాయి. పారాయణ చేస్తున్నా, పురాణాలు చదువుతున్నా అడుగడుగునా బాబా కనిపిస్తారు. రాముడు కృష్ణుడు, వేంకటేశ్వరుడు....ఏ దేవాలయానికి వెళ్ళినా.. ఆ రూపాలలో బాబా దర్శనమిస్తారు. ఆహా జన్మ ధన్యము కదా!... కాయా, వాచా, మనసా శ్రీ సాయినాధునికి సాష్టాంగం చేస్తే ధర్మ అర్ధ కామ మోక్షాలనే నాలుగు పురుషార్ధాలను, కర్మ,జ్ఞాన యోగ, భక్తి- అనే నాలుగు మార్గాలతోనూ ఈశ్వరుడు ప్రాప్తిస్తాడు. మనసనే తోటలో భక్తి అనే నీటిని చల్లితే వైరాగ్యం మొలకెత్తుతుంది. జ్ఞానమనే పూలు విరగబూస్తాయి. కైవల్యమనే ఫలం లభిస్తుంది. జ్ఞానమయం విప్పారుతుంది. జనన, మరణాలు నిశ్చయంగా తప్పిపోతాయి.."ఓం సాయిరాం..."





" మా మనస్సును అంతర్ముఖము చేయుము. దానిని లోపలివైపు పోవునట్లు చేయుము. నిత్యానిత్యములకు గల తారతమ్యమును తెలిసికొను శక్తిని కలుగజేయుము. ప్రపంచ వస్తువులందు మాకు గల ఆసక్తిని పోగొట్టి మాకు ఆత్మసాక్షాత్కారము కలుగునటుల చేయుము. మేము మా శరీరమును ప్రాణమును సర్వమును నీకు సమర్పించెదము. సుఖదు:ఖానుభవములు కలుగకుండునట్లు మా నేత్రములు నీవిగా చేయుము. మా శరీరమును మనస్సును నీ స్వాధీనమందుంచుకొనుడు... మా చంచల మనస్సు నీ పాదముల చెంత విశ్రాంతి పొందుగాక!"...ఓం సాయిరాం...

"తడిసిన కట్టెలకు నిప్పు సెగను పెట్టగానే తేమ పోయినట్లు, సాధు సా౦గత్య౦ వల్ల  లౌకికుల హృదయాల్లోని లోభ మోహాలనే తేమ పోతు౦ది."


"ఒక దీపాన్ని, మరో దీప౦ వెలిగిస్తు౦ది. అ౦తమాత్ర౦ చేత వెలిగి౦చే దీప౦ వెలుగు తగ్గిపోదు. అలాగే ఇతరులకు బోధి౦చే కొద్దీ మీ జ్ఞాన౦ పెరుగుతు౦దే కానీ తరగదు." .."ఓం సాయిరాం".


సర్వం శ్రీ సాయి నాధార్పణ మస్తు









Friday, September 27, 2019 0 comments By: visalakshi

శ్రీ సుబ్రహ్మణ్యుడే సుబ్బారాయుడు గా నిజరూప దర్శనం....


               ఓం శ్రీ సుబ్రహ్మణ్యస్వామి నమోనమ:



500 ఏళ్ళ క్రితం జరిగిన అద్భుత సంఘటన -
శ్రీ సుబ్రహ్మణ్యుడే శ్రీ  సుబ్బారాయుడుగా వెలసిన క్షేత్రం ,
శ్రీ సుబ్బారాయుడి నిజరూప దర్శనం.................................... ఫేస్ బుక్ సౌజన్యంతో ఈ టపా.....

పాణ్యం మండలం సుబ్బరాయుడు కొత్తూరు భిన్నమైన ఆచారాన్ని పాటిస్తోంది. ఆదివారం అందరికీ సెలవు. ఆ పల్లెకూ సెలవే. కానీ మిగిలినవారికంటే కాస్త ఎక్కువ సెలవు. ఆదివారం మాంసాహారం ముట్టకపోవడం, అంత్యక్రియలు నిర్వహించకపోవడం ఈ పల్లెలో అనాదిగా వస్తున్న ఆచారం. మిగిలిన రోజుల్లో మాంసాహారం తినాలన్నా.. ఆ ఊరిలో దొరకదు. ఆరు కిలోమీటర్లు వెళ్లి తెచ్చుకోవాల్సిందే. ఆసక్తి కలిగించే ఈ ఆచారం వెనుక సుబ్రహ్మణ్య స్వామి ఆలయ స్థల పురాణ నేపథ్యం ఉంది.

*ఏమిటా కథ..?*
500 ఏళ్ళ క్రితం కొత్తూరు గ్రామానికి చెందిన బీరం చెన్నారెడ్డి అనే రైతు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. గట్టెక్కే మార్గం చూపాలని ఓ బ్రాహ్మణుడిని ఆశ్రయిం చాడు. మాఘ శుద్ధ షష్ఠి రోజున పొలం దున్నితే కష్టాలు తొలగుతాయని బ్రాహ్మణుడు సూచించాడు. దీంతో చెన్నారెడ్డి కాడెద్దులను నాగలికి కట్టి పొలం దున్నడం ప్రారంభిస్తాడు. ఆ సమయంలో నాగలికి ఉన్నట్లుండి భూమిలో ఏదో అడ్డుతగులుతుంది. ఆ క్షణంలోనే ఆకాశంలో 12 తలల నాగుపాము రూపం ప్రత్యక్షమౌతుంది. ఆ తేజస్సుకు రైతు కంటిచూపు కోల్పోతాడు.

కాసేపటి చుట్టు పక్కల రైతులు వచ్చి నాగలిని వెనక్కులాగి చూస్తారు. అక్కడ 12 శిరస్సుల నాగేంద్రుడి విగ్రహం బయట పడుతుంది. ఒక బాలుడు ప్రత్యక్షమై తాను సుబ్బరాయుడినని(సుబ్రహ్మణ్యేశ్వస్వామి), మూడు రోజుల పాటు తనకు క్షీరాభిషేకం చేస్తే చెన్నారెడ్డికి చూపు వస్తుందని చెబుతాడు. అలా పూజలు చేయగానే చెన్నారెడ్డికి కంటిచూపు వస్తుంది. దీంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి గుడి కట్టాలని గ్రామస్థులు నిర్ణయించుకుంటారు. స్వామివారిని వేడుకుంటారు. ‘రాత్రి రోకలిపోటు తరువాత మొద లుపెట్టి.. తెల్లవారు జామున కోడి కూతకు ముందే గుడి నిర్మాణం పూర్తి చేయాలి’ అని స్వామి సెలవిస్తాడు. లేదంటే ఏడుగురు బలి అవుతారని హెచ్చరి స్తాడు. స్వామివారి స్వయంభు విగ్రహాన్ని నేలపైనే పెట్టి గుడి నిర్మాణం ప్రారంభిస్తారు. కోడి కూతలోగా ప్రహరీ మాత్రమే పూర్తవుతుంది. పైకప్పులేని ఆలయం సిద్ధమౌతుంది. అప్పటిదాకా ఆ గ్రామం పేరు కొత్తూరు కాగా.. స్వామి వెలసిన తరువాత సుబ్బరాయుడు కొత్తూరుగా మారింది. ఇదీ స్థల పురాణం.

*ఆదివారం సెలవెందుకు..?*
సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతిపాత్రమైన రోజు ఆదివారం. ఎస్‌ కొత్తూరు గ్రామానికి ప్రతి ఆదివారం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలి వస్తారు. కేవలం ఆదివారం రోజే 6 నుంచి 8 వేల మంది భక్తులు స్వామిని సందర్శిస్తారు. ఆ ఒక్కరోజే సుమారు మూడు వందల అభిషేకాలు జరుగుతాయి. స్వామిని పూజిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. తమను చల్లాగా చూస్తున్న స్వామి కోసం ఆదివారం ఆచారాన్ని ఆలయం నిర్మించిన సమయంలోనే ప్రారంభించారు గ్రామస్థులు. ఆదివారం వస్తే మాంసాహారం వండరు, తినరు. గ్రామంలో మాంసాహార దుకాణాలు లేవు. మామూలు రోజుల్లో కావాలన్నా.. గ్రామానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న నందివర్గం వెళ్లి తెచ్చుకోవాల్సిందే. ఇక పండుగ మరుసటి రోజున మాంసాహారంతో కర్రిపండుగ నిర్వహించడం సాధారణం. ఆ పండుగ ఆదివారం వస్తే.. సోమవారానికి వాయిదా పడుతుంది.

*ఆ మూడు మాసాల్లోనూ అంతే..*
ఏడాది పొడవునా ఆదివారాలతోపాటు కార్తీకం, మాఘం, శ్రావణ మాసాల్లో గ్రామస్థులు మాంసాహారం ముట్టరు. ఈ కట్టుబాటును ఎవ్వరూ మీరింది లేదు. ఆదివారాలతో కలిపి ఇలా ఏడాదిలో సుమారు నాలుగు నెలల పాటు మాంసా హారానికి దూరంగా ఉంటూ గ్రామస్థులు స్వామిపై తమకున్న భక్తిని చాటుకుం టున్నారు. ప్రతి ఆదివారం వేలాదిగా వచ్చే భక్తులకు దేవస్థానం ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహిస్తున్నారు.

*అంత్యక్రియలకూ సెలవే....*
కొత్తూరులో 220 కుటుంబాలు ఉన్నాయి. జనాభా సుమారు 900. ఆదివారం గ్రామస్థుల్లో ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు నిర్వహించరు. మరుసటిరోజు వరకూ మృత దేహాన్ని ఇంటివద్దే ఉంచుతారు.సోమవారం అంత్యక్రియలు నిర్వహి బస్తారు. ఇందుకూ స్వామిపై ఉన్న అపార మైన భక్తే కారణం. గ్రామానికి ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు వస్తారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. అలాంటి పవిత్రమైన రోజున మృతదేహాన్ని తీసుకువెళితే భక్తులకు అసౌకర్యం కలుగుతుందని గ్రామస్థులు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. మృతదేహంతో వెళితే భక్తులకు అంటు తగులుతుందని తమకు తామే కట్టడి చేసుకున్నారు.

*ఎలా చేరుకోవచ్చు...?*
బనగానపల్లె మండలం నందివర్గం నుండి S.కొత్తూరు 5 కి.మీ దూరంలో కలదు.ఇక్కడ నుండి ఆటో సదుపాయం కలదు.

 ఓం నాగేంద్రాయ నమ: