Monday, September 21, 2020 By: visalakshi

మహా మృత్యుంజయ దేవాలయం...

 



#మృత్యుంజయ మంత్రానికి ఆది క్షేత్రం*


మనం నిత్యం చదివే మృత్యుంజయ మంత్రానికి ఆది క్షేత్రం ఇది. 

ఈ మహిమాన్విత ప్రదేశం పేరు జాగేశ్వర్. 


ఉత్తరాఖండ్ లోఆల్మోరా కి సమీపాన (సుమారు 50 కిలోమీటర్లు) ఉంది.


ఇక్కడి స్వామి జాగేశ్వరుడు…

అమ్మవారి పేరు పుష్టీ దేవి. 


#ఇదే దారుకావనం.. 


నిజానికి ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రంలో ఉన్నది

నాగేశం దారుకావనే కాదట.. జాగేశం దారుకావనే అని చెబుతారు. అదే ఈ

జ్యోతిర్లింగం.. 


చుట్టూ దారుకావనం ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం.


సతీ దేవి తపస్సొనర్చిన గొప్ప క్షేత్రం కూడా ఇదే.


“ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం

ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్”


ఈ మహా మృత్యుంజయ మంత్రంలోని పుష్టి వర్ధనుడే ఈ

స్వామి. 


కోవెల ద్వారపాలకులుగా నంది మరియు స్కంది వుండగా శివుడు పడమర ముఖంగా వుంటాడు.


 ఇక్కడి శివలింగం రెండు భాగాలు కలిపినట్టుగా వుంటుంది. 


దీనిని అర్ధనారీశ్వర శివలింగమని, పెద్దగా వున్న భాగం శివుడని, కాస్త చిన్నగా వున్న భాగం పార్వతని అంటారు. 


ఈ శివలింగాన్ని చేత్తో కదిపితే కదులుతుంది. అన్ని శివాలయాలలోను శివుడు యోగనిద్రలో వుండి హారతి సమయాలలో మాత్రమే జాగరూకుడై భక్తులను అనుగ్రహిస్తాడుట కాని యిక్కడ సర్వకాల సర్వావస్థల యందు జాగ్రదావస్థలో వుండి భక్తులను అనుగ్రహిస్తాడుట అందుకని ఈ ఈశ్వరుని "జాగేశ్వరమహదేవ్ " అని అంటారు. 


శివలింగానికి వెనుక వైపున చందరాజులైన దీప్ చంద్ , త్రిపాల చంద్ ల అష్ఠలోహ విగ్రహాలు అఖండ జ్యోతి వుంటాయి. 


ఇక్కడ మరో విశేషం ఏంటంటే గర్భ గుడిలో కుడివైపున పట్టు పరుపు పై రాత్రి స్వామికి పవ్వళింపు సేవ చేస్తారు. 


రాత్రి చక్కగా పరచిన పక్క మరునాడు నలిగి వుంటుందిట స్వామి స్వయంగా పవ్వళించినట్లుగా స్థానికులు భావిస్తారు. 


కోవెలలో యెలుకలు లాంటివి వున్నాయేమో అనే సందేహం వెలిబుచ్చితే ఆ వూరు మొత్తం మీద యెలుకలు లేవని తెలిసింది.. 


ఆది శంకరా చార్యుల తో వచ్చిన కర్ణాటక బ్రాహ్మణులు యిక్కడ పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ యిక్కడే వుండిపోయి కాలక్రమం యిక్కడి పిల్లలని పెళ్లి చేసుకొని యిక్కడే స్థిరబడ్డారు. వారి సంతతి వారే పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.


సేకరణ..

(FROM FB)

0 comments: