Wednesday, September 2, 2020 By: visalakshi

గుడిమల్లం దేవాలయం..

 



చిత్తూరు జిల్లా కాళహిస్తి మండలంలో రేణి గుంటకు ఏడు కిలోమీటర్ల దూరంలో సువర్ణముఖీ నది తీరంలో గుడిమల్లం గ్రామంలో ఒకటవ శాతాబ్దానికి చెందిన అతి ప్రాచీన శివాలయం ఉంది. ఈ ఆలయాన్ని శ్రీ పరుశురామాలయం అంటారు.


అత్యద్భుతమైన శిల్ప శోభితమైన ఆ ఆలయం చాలా కాలం కాలగర్భంలో కలిసిపోయి వెలుగులోకి వచ్చింది. 1911లో శ్రీ గోపీనాథరావు అనే పురాతత్వ వేత్త ఒక ఏడాది పరిశోధనలు జరిపి ఈ శివలింగం ఉనికిని ప్రపంచానికి మొదటిసారి తెలియజేశారు.


ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పురుషలింగాన్ని పోలి ఉండే ఏడు అడుగుల శివలింగంపై ఒక చేత్తో పరశువు, మరో చేతిలో గొర్రె పొట్టేలు పట్టుకుని యక్షని భుజాలపై నిలబడిన రుద్రుని రూపం దర్శనమిస్తుంది.


#అతి ప్రాచీన ఆలయం:

ఈ ఆలయంలో గర్భగుడి గజ పుష్ప ఆకారంలో ఉండి లోపల ఉన్న శ్రీ పరశురామ లింగం సహజ సుందరగా మహామహిమాన్వితమైనది. ఇక్కడున్న శిలాశాసనాలు చూస్తే ఆలయం మూడవ శతాబ్దానికి చెందినదని తెలుస్తున్నది.


ప్రాచీన శైవ పూజ విధానం తలపాగా, దోవతీ ధరించిన ఈ రుద్రుని వస్త్రధారణ ఋగ్వేదకాలంనాటిదని శాస్త్రఘ్నుల అంచనా. ప్రాచీన శైవ పూజ విధానం సవివరంగా తెలిపే ఈ లింగాన్ని చేక్కేందుకు వాడిన రాయి గురించి ఎలాంటి సమాచారం లేదు.

అలాగే ఆలయ నిర్మాతలెవరో తెలియనీ ఈ శాసనాలలో స్వామి నిత్య దీప, ధూప నైవేద్యాల కోసం దానం చేసిన భూమి, ఆవులు, ధనం మొదలైన విషయాలను తెలియజేసే వివరాలుమాత్రం శాసనాలలో ఉన్నాయి. 1973లో జరిపిన పురావస్తు శాఖ వారి త్రవ్వకాలలో లభించే జేగురు రంగు రాళ్ల వలన ఆలయం రెండు లేక మూడవ శతాబ్దానికి చెందినదని అనుకున్నారు. కుండలు, పెద్ద సైజు ఇటుకలను పరిశీలిస్తే ఒకటవ , రెండవ శతాబ్దపు ఆంధ్ర శాతవాహనుల కాలం నాటివని నిర్థారించారు. కనుక ఆలయం క్రీ.శ ఒకటవ శతాబ్దికి చెందిన అతి పురతాన ఆలయం అని నిశ్చయంగా చెప్పవచ్చు.


#ఈ ఆలయానికి ఒక పురాణగాథ

ఒకప్పుడు ఇక్కడ పరశురామేశ్వరుడు అనే మహా భక్తుడు ఉండేవాడట ఆతను రోజూ దగ్గరలో ఉన్న కొలనులో గట్టుమీద ఉన్న గజ పుష్పాలు మొదలైన వివిధ రకాల సుగంధ భరిత పుష్పాలను ఏరి తెచ్చి శివుడికి పూజ చేసేవాడు. అవి చాలా వింత ఆకారాలలో విచిత్ర పవిత్ర సువాసనలు వెద జల్లేవట. శివుడు ప్రీతి చెంది అతనిని అభినందింఛి ఆశీర్వ దించాడు.


#ఎలా వెళ్ళాలి?

గుడిమల్లం చేరుకోవడానికి రోడ్ మార్గం సులభంగా ఉంది. అయినా కూడా సమీపంలో విమాన మరియు రైలుమార్గాలు కూడా అందుబాటులో ఉన్నాయి.


#విమాన మార్గం: గుడిమల్లం సమీపాన రేణిగుంట దేశీయ విమానాశ్రయానికి 11కి.మీ దూరంలో ఉంది. 


ప్రభుత్వ బస్సుల్లో లేదా ప్రైవేట్ వాహనాల్లో గుడిమల్లం చేరుకోవచ్చు.


#రైలు మార్గం : గుడిమల్లం సమీపాన రేణిగుంట మరియు తిరుపతికి రైల్వేస్టేషన్లు కలవు. ఈ ఊర్ల నుండి గుడిమల్లం గ్రామానికి ప్రభుత్వ ప్రైవేట్ వాహనాలున్నాయి.


#రోడ్డు మార్గం : రేణిగుంట నుండి 11కి.మీ , తిరుపతి నుండి 22కి.మీ చిత్తూరు నుండి 85కి.మీ. చంద్రగిరి నుండి గుడిమల్లం గ్రామానికి బస్సు సౌకర్యంతో పాటుగా జీపు, షేర్ ఆటోల సౌకర్యం ఉంది.

0 comments: