Sunday, December 18, 2016 By: visalakshi

పరాభవం - పరంధామము.




శ్లో: న ప్రహృష్యే త్ప్రియం ప్రాప్య నో ద్విజే త్ప్రాప్య చా ప్రియం
    స్థిరబుద్ధి రసమ్మూఢో బ్రహ్మాని ద్బ్రహ్మణి స్థిత:  (5వ అ- 20వ శ్లో )

ప్రియమైన దానిని పొందినపుడు సంతోషించక, సుఖించక అప్రియమును పొందినపుడు దు:ఖింపక ఉండు వానిని , స్థిరమైన బుద్ధిగలవానిని, మోహితుడు కానివానిని, దివ్యజ్ఞానము కలవానిని, దివ్యత్వము (బ్రహ్మము) నందున్న వానినిగా తెలుసుకోవలయును. 

ప్రియ  భాషణముతో  పొగిడినా,  అప్రియ  భాషణముతో పరాభవించినా...
మానావమానములను ఒకేలా తీసుకోవాలని మహాత్ములు కొందరు ఆచరించి చూపారు. ఆ బాటలో మనం నడవాలంటే మానసిక స్థైర్యమును అలవరచుకోవాలి. రాగ ద్వేషాలను జయించ గలగాలి. 

 శాంతి, అశాంతి..సుఖం, దు:ఖం ఇవన్నీ మనసు ఏర్పరిచే గందరగోళ స్థితి. బాహ్య ప్రాపంచిక శాంతిని పొందాలని ఆతృత పడతాము. అశాంతిని కొని తెఛ్చుకుంటాము. 

మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయో:
బంధాయ విషయాసంగో ముక్యై నిర్విషయం మన: 

"మానవునికి మనస్సే బంధమోక్షములకు కారణము. ఇంద్రియార్ధములందు 
నిమగ్నమైన మనస్సు బంధమునకు కారణము. వానియందు అనాసక్తమైన మనస్సు ముక్తికి కారణము." 



మనస్సును జయించిన వానికి మనస్సే ఉత్తమ మిత్రము. మనస్సును పరాభవించిన వానికి మనస్సు గొప్ప శత్రువుగా ఉండిపోవును. అంటే కామము, కోపము, లోభము, భ్రాంతి మున్నగు వాటికి దాసుడై ఉండవలెను. కానీమనస్సుజయింపబడినప్పుడు మానవుడు అందరి హృదయములందును పరమాత్మస్వరూపమున నెలకొనియున్న భగవంతుని ఆజ్ఞలను అనుసరించుటకు స్వయముగా అంగీకరించును.

ప్రపంచములో అత్యున్నత లోకమునుండి..అత్యధమ లోకము వరకు అన్నియు దు:ఖ మయమైన ప్రదేశములే. మనస్సును సర్వదా పరమాత్మ స్మరణలో నిమగ్నమై ఉండునట్లు భక్తి ప్రపత్తులతో.. భగవత్ సేవలందు ఆసక్తితో దేవదేవుని పూజించవలెను. పరిపూర్ణ స్థితిని పొందవలెను.అదియే పరంధామము. 



  

0 comments: