Thursday, August 13, 2020 By: visalakshi

**శ్రీ దత్త గురవే నమః*

*శ్రీ దత్తాయ గురవేనమః*


*భక్తితత్వమే మహిమాన్వితం!*

సంతాపాలన్నీ సంకల్ప జనితాలు. ఆవేదనలన్నీ ఆలోచనా ఫలితాలు. విచారము లేకుండా విషాదము రాదు. భావనలోనే బాధలు పుట్టుకొస్తాయి. వర్షం కురిసింది అంటే ఆకాశంలో మేఘాలున్నట్లే. గగనంలో నిలిచియున్న మేఘాలే వర్షాలై కురుస్తాయి. మనోగగనంలో చలించే సంకల్ప మేఘాలే బ్రతుకులలో బాధల వర్షాన్ని కురిపిస్తాయి. వేదనా వడగళ్లను రాల్చుతాయి.

బాధపడటం ఎవ్వరికీ ఇష్టం లేదు. అలాగని బాధల నుండి విడిపడటం ఎవరికీ సాధ్యం కావటం లేదు. అంటే, బాధలు బ్రతుకుల్లో అంతగా పెనవేసుకుని ఉన్నాయని అర్థం. విడదీయలేని రీతిలో అతుక్కుపోయాయి. బాధలు ఇష్టం లేకపోయినా, బాధపడటం కష్టంగానేయున్నా, బాధలుపడుతూ బ్రతకడం మనిషికి అనివార్యంగా ఉంది. అలవాటుగా మారింది. ఎందుకో తెలుసా! బాధలు నాకు వద్దు అంటున్నది ఎవరో ఒక్క క్షణం ఆలోచించండి. బాధలను వరించినవారే. ఇక్కడే ఉంది చిక్కుముడి.  నేను ఇంతకాలం జీవించాను అనేవారే గాని అలా జీవించడంలో ఎంత బాధను ప్రోది చేసుకున్నాను అని ప్రశ్నించుకొనేవారు అరుదుగా ఉంటారు. ఒకనాటి బాధలు నేడు లేకపోవచ్చు. బాధానుభూతులు మనస్సుల నుండి దూరం కాలేదనే వాస్తవం తెలిసినవారెందరు? బ్రతుకులో బాధలున్నాయి. బుద్ధిలో బాధల జ్ఞాపకాలూ ఉన్నాయి. అవే బాధాస్మృతులు. మతులను చెడగొట్టేవి మనుగడను కాలరాచేవి ఈ స్మృతులే. ఎవరి మనస్సులైనా చేదు జ్ఞాపకాలతోనే చిందులేస్తూ ఉంటాయి. స్మృతులను ఆపడం మనిషికి ఎలా సాధ్యం కాదో, వాటి మధ్య హాయిగా జీవించడం కూడా అలాగే సాధ్యం కాదు. ఇక్కడే బ్రతుకు మోయలేని బండగా మిగిలిపోతోంది.

మనసేమీ బాగలేదు. అలా సినిమాకెళ్దాం. ఇలా మిత్రుల మధ్య గడుపుదాం అని పలుకుతూ ఉంటారు. అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు కూడా. నిజమే.   బావుంది.. ఫలితమేమిటి? అలా చెయ్యడం వల్ల బాగలేని మనస్సు బాగుపడుతుందా? కానే కాదు. బాగుపడలేని మనస్సు, బాధపడే మనస్సు తాత్కాలికంగా బాధను మరచిపోతుంది. అంతే.  సినిమాలో ఉండేది రెండుమూడు గంటలే. బంధుమిత్రాదుల మధ్య ఎంతకాలం ఉండగలం? వాళ్లను, లేదా ఆ పరిస్థితుల్ని విడిచిపెట్టి రాగానే మళ్లీ జ్ఞాపకాలు ప్రారంభమవుతాయి. స్మృతులు కదుల్తాయి. మతులు కలవరపెడతాయి. మరొక విషయాన్ని కూడా ఇక్కడ అర్థం చేసుకోవాలి. వినోదాల మధ్య ఉన్నంత మాత్రాన జ్ఞాపకాలు రావని చెప్పలేము. సరదాగా స్నేహితుల సరసన నవ్వుతూ కాలం వెళ్లబుచ్చుతున్నా, బాధల జ్ఞాపకాలు రావచ్చు. అలాంటి సమయాల్లోనే ప్రక్కవారు ”ఏమిటి? ఉన్నట్లుండి అదోలా మారిపో యారు అని మన ఆంతర్యంలోని మూగబాధను ముఖాలలో చూసి మాట్లాడుతూ ఉంటారు. అర్థమైందా? మన గతాలు స్వగతాలుగా మారి, అనుక్షణం బుద్ధిలో స్వాగత తోరణాలను అలం కరిస్తూ ఉన్నంతకాలం బాధల నుండి విడిపడటం మనిషికి సాధ్యం కాదు. మనం మనకు జ్ఞాపకం వస్తున్నంత కాలం మనస్సు మదనపడుతూనే ఉంటుంది. మనుగడ మలినపడుతూనే ఉంటుంది.  గతాన్ని పూర్ణంగా తుడచివేయాలి. బాధానుభవాలను గూర్చి మనస్సు ఆలోచించకుండా చూసు కోవాలి. అదెలా సాధ్యం? స్మృతుల మధ్య సతమతమయ్యే మనస్సు, బాధానుభవాలలో తలదూర్చి విలపించే బుద్ధి వాటి నుండి విడిపడాలి.

అలా జరగాలి అంటే, మనస్సు మరోకోణంలో ఆలో చించడం ప్రారంభించాలి. బుద్ధి మరోవిధంగా చరించగలగాలి.  అయితే, ఒక్క సత్యాన్ని ఇక్కడ విస్మరించకూడదు. మనస్సు దేనిని గురించి ఆలోచించినా, బుద్ధి మరొక చోట సంచరించినా ఫలితం మాత్రం శూన్యంగానే ఉంటుంది. ఎందుకో తెలుసా? ఆలోచనలన్నీ ప్రపంచానికి సంబంధించే ఉంటాయి. మన స్మృతులు అందుకు భిన్నంగా లేవు. సంబంధాలతో ముడిపడియున్న ఈ ప్రపంచంలో ఒక అనుభవం మరొక అనుభవంతో కరచాలనం చెయ్యకపోదు.  చీకటిని చీకటితో పోగొట్టలేము. (నహి తమ స్తమసో నివర్తకమ్‌) మరి బాధల వలయం నుండి ఎలా విడి వడాలి? దానికి మార్గమేమిటి? మార్గం ఉంది. అదే భక్తి. భక్తి ఏం చేస్తుంది? భక్తి వల్ల బ్రతుకులో ఏం జరుగుతుంది? భక్తి మనస్సును సం స్కరిస్తుంది. మనస్సులోని స్మృతులను శాశ్వతంగా మరుగున పడేస్తుంది. మహిమను ఆవిష్కరిస్తుంది.  పరమేశ్వరునితో మనకుండే సంబంధాన్ని భక్తి గుర్తుచేస్తుంది. భగవంతుని స్మరణతో బుద్ధిని నింపేస్తుంది. జ్ఞాపకాలతో గొడవపడే మనస్సును గోవిందునితో ముడిపడి జీవించేలా చేస్తుంది. గతం పంచే అనుభవ స్మృతుల మధ్య శోకసాగరంలో మునిగి పోతూ భగవంతుని విస్మరించాం. సదా పరమేశ్వరుని చింతించడంలో గతానుభూతుల్ని శాశ్వతంగా పాతిపెట్టి ఆనందంగా, తృప్తిగా జీవించగలు గుతాము. ఇదంతా భక్తి వలన కలిగే దివ్యమైన శక్తి.  బాధలను శాశ్వ తంగా మరుగుపరచి, మహిమతో మనస్సును ఊరేగించే స్థితి.  భక్తి ఎలా చెయ్యాలి? భక్తితో బుద్ధిని భవ్యంగా ఎలా మార్చుకోవాలి? బుద్ధిలో సదా భగవంతుడే శోభించేలాగా ఆచారాన్ని, విచారాన్ని కదలిస్తూ ఉండటమే భక్తి.

 శ్రీ దత్తస్వామి తన సంకల్పంతోనే దుష్టశిక్షణ చేయగలడు. అయినా కలియుగంలో బలహీనులు, అల్పాయుష్కులైన మానవులకు మనసును నిగ్రహించే శక్తి బహుస్వల్పమని పరమాత్మకు తెలుసు. కాబట్టే శ్రీ పాద శ్రీ వల్లభుడుగ మానవరూపముతో అవతరించుట, జగద్గురువుగా ప్రజలకు విశదపరచుట జరిగింది. ఆయన అపారదయామయుడు. తన నామస్మరణతోనే, దత్త నామస్మరణతోనే, గురు నామస్మరణతోనే రక్షణ యిస్తానని వాగ్దానం చేసినాడు.  అంతేకాదు. అనేక వేలమంది తపస్వులయొక్క తపోశక్తిని,  గురువుల ధారణాశక్తిని  ఆస్తికులైన మానవులకు అదృశ్యంగా అందించి, ప్రజలందరినీ గురుభక్తిమార్గమునందు ప్రవర్తించునట్లు చేయ సంకల్పించినారు .కలిపురుషుని కబంధహస్తాలకు గురుభక్తులైనవారు చిక్కరు. ఇది బ్రహ్మదేవుడు కలిపురుషునికి ప్రారంభంలోనే చెప్పిన నిబంధన.

     శ్రీ పాదుల సంకల్పంతో అనేక మంది గురువుల సంకల్పబలంతో ఇటీవల సర్వులకూ భక్తిమార్గం లభించింది. యాత్రలు చేయుటయందు దైవ దర్శనము చేయుటయందు అభిరుచి పెరిగింది. ఇది కలిపురుషునికి కంటగింపైనది. ఏ విధంగానైనా దైవ దర్శనాలు భక్తులకు లేకుండ చేయుటే లక్ష్యంగా ఈ *కరోనా వ్యాధి* అనే అస్త్రాన్ని ప్రయోగించి భక్తులను భయభ్రాంతులను చేయ ప్రయత్నిస్తున్నాడు. కానీ గురువుల సంకల్పము, దత్త సంకల్పము మహా శక్తివంతమైనవి.గుడిలోని దైవమే గుండెలో వున్నాడు. ప్రతి భక్తుని గుండె ఒక గుడియై నిరంతరారాధన అపారంగా జరుగుచున్నది.ఎవరింటిలో వారు వుండి మహత్తరమైన ఆరాధన చేయుచున్నారు. మనసు నిలుపుకొనుటకై ఒక రూపము అవసరమైనది. అందువలననే దేవాలయములు వెలసినవి. మహర్షులయొక్క మరియు సద్గురు శ్రీ పాద వల్లభుల పరంపర యొక్క మహాసంకల్పము చేత కలిపురుషుని ప్రభావము అణగారిపోవును.ఇది తథ్యము. గురు భక్తులారా! ప్రస్తుత పరిస్థితుల్లో నిరంతరము గురునామ స్మరణయే గురు భక్తుల చేతిలోని బ్రహ్మాస్త్రం.

నేటి మంత్రపఠనం*

#దత్తాత్రేయ అష్టోత్తర శతనామావళి - శ్రీ దత్త నామ కవచం - ఫలితాలు

దత్తపరమైన జ్ఞానం చెప్పుకోవడం, వినడం అనే క్రియవల్ల అన్ని అమంగళములు నశించి పోతాయి అంటూ దత్తుడి మహిమ చెప్పుకోవడం వల్ల వచ్చే ఫలితం చెప్తూ వేదధర్ముడు దీపకునికి ఒక 108 అద్భుత దత్తనామములు చెప్తాడు. ఆ దత్తనామాలు నిత్యానుష్టానం చేసేవాడిని కవచంలా స్వామి కాపాడతాడు.

#దత్తాత్రేయ అష్టోత్తర శతనామావళి*

ఓం శ్రీ దత్తాయ నమః
ఓం దేవదత్తాయ నమః
ఓం బ్రహ్మదత్తాయ నమః
ఓం శివదత్తాయ నమః
ఓం విష్ణుదత్తాయ నమః
ఓం అత్రిదత్తాయ నమః
ఓం ఆత్రేయాయ నమః
ఓం అత్రివరదాయ నమః
ఓం అనసూయాయ నమః
ఓం అనసూయాసూనవే నమః 10
ఓం అవధూతాయ నమః
ఓం ధర్మాయ నమః
ఓం ధర్మపరాయణాయ నమః
ఓం ధర్మపతయే నమః
ఓం సిద్ధాయ నమః
ఓం సిద్ధిదాయ నమః
ఓం సిద్ధిపతయే నమః
ఓం సిధ్ధసేవితాయ నమః
ఓం గురవే నమః
ఓం గురుగమ్యాయ నమః 20
ఓం గురోర్గురుతరాయ నమః
ఓం గరిష్ఠాయ నమః
ఓం వరిష్ఠాయ నమః
ఓం మహిష్ఠాయ నమః
ఓం మహాత్మనే నమః
ఓం యోగాయ నమః
ఓం యోగగమ్యాయ నమః
ఓం యోగాదేశకరాయ నమః
ఓం యోగపతయే నమః
ఓం యోగీశాయ నమః 30
ఓం యోగాధీశాయ నమః
ఓం యోగపరాయణాయ నమః
ఓం యోగిధ్యేయాంఘ్రి పంకజాయ నమః
ఓం దిగంబరాయ నమః
ఓం దివ్యాంబరాయ నమః
ఓం పీతాంబరాయ నమః
ఓం శ్వేతాంబరాయ నమః
ఓం చిత్రాంబరాయ నమః
ఓం బాలాయ నమః
ఓం బాలవీర్యాయ నమః 40
ఓం కుమారాయ నమః
ఓం కిశోరాయ నమః
ఓం కందర్ప మోహనాయ నమః
ఓం అర్ధాంగాలింగితాంగనాయ నమః
ఓం సురాగాయ నమః
ఓం వీరాగాయ నమః
ఓం వీతరాగాయ నమః
ఓం అమృతవర్షిణే నమః
ఓం ఉగ్రాయ నమః
ఓం అనుగ్రహరూపాయ నమః 50
ఓం స్ధవిరాయ నమః
ఓం స్ధవీయసే నమః
ఓం శాంతాయ నమః
ఓం అఘోరాయ నమః
ఓం మూఢాయ నమః
ఓం ఊర్ధ్వరేతసే నమః
ఓం ఏకవక్త్రాయ నమః
ఓం అనేకవక్త్రాయ నమః
ఓం ద్వినేత్రాయ నమః
ఓం త్రినేత్రాయ నమః 60
ఓం ద్విభుజాయ నమః
ఓం షడ్భుజాయ నమః
ఓం అక్షమాలినే నమః
ఓం కమండలధారిణే నమః
ఓం శూలినే నమః
ఓం శంఖినే నమః
ఓం గదినే నమః
ఓం ఢమరుధారిణే నమః
ఓం మునయే నమః
ఓం మౌనినే నమః 70
ఓం శ్రీ విరూపాయ నమః
ఓం సర్వరూపాయ నమః
ఓం సహస్రశిరసే నమః
ఓం సహస్రాక్షాయ నమః
ఓం సహస్రబాహవే నమః
ఓం సహస్రాయుధాయ నమః
ఓం సహస్రపాదాయ నమః
ఓం సహస్రపద్మార్చితాయ నమః
ఓం పద్మహస్తాయ నమః
ఓం పద్మపాదాయ నమః 80
ఓం పద్మనాభాయ నమః
ఓం పద్మమాలినే నమః
ఓం పద్మగర్భారుణాక్షాయ నమః
ఓం పద్మకింజల్కవర్చసే నమః
ఓం జ్ఞానినే నమః
ఓం జ్ఞానగమ్యాయ నమః
ఓం జ్ఞానవిజ్ఞానమూర్తయే నమః
ఓం ధ్యానినే నమః
ఓం ధ్యాననిష్ఠాయ నమః
ఓం ధ్యానస్ధిమితమూర్తయే నమః 90
ఓం ధూళిదూసరితాంగాయ నమః
ఓం చందనలిప్తమూర్తయే నమః
ఓం భస్మోద్ధూళితదేహాయ నమః
ఓం దివ్యగంధానులేపినే నమః
ఓం ప్రసన్నాయ నమః
ఓం ప్రమత్తాయ నమః
ఓం ప్రకృష్టార్ధ ప్రదాయ నమః
ఓం అష్టైశ్వర్యప్రదాయ నమః
ఓం వరదాయ నమః
ఓం వరీయసే నమః 100
ఓం బ్రహ్మణే నమః
ఓం బ్రహ్మరూపాయ నమః
ఓం విశ్వరూపిణే నమః
ఓం శంకరాయ నమః
ఓం ఆత్మనే నమః
ఓం అంతరాత్మనే నమః
ఓం పరమాత్మనే నమః
ఓం శ్రీ దత్తాత్రేయాయ పరబ్రహ్మణే
నమో నమః 108

 ఓం శ్రీ దత్తాయనమః ఓం దేవదత్తాయనమః తో ప్రారంభమయ్యే  ఈ దివ్య నామములు  దివ్యదృష్టితో దత్తాత్రేయ స్వామి ని  దర్శించి వేద ధర్ముడు దీపాకునికి చెప్పాడు. తరువాత ఈ నామములను కవచముగా ఎలా చేసుకొనవలెనో వివరించాడు. ఈ కవచమును ఉదయము, సాయంత్రం శ్రద్ధగా చదివిన పాపములనుంచి విముక్తి కలుగును అని శిష్యునకు కూడా చెప్పెను.

#శ్రీ దత్త నామ కవచం*

1. ఓం కారాది నమోంతానం! నామ్నామష్టోత్తరం శతమ్!
శ్రద్ధయా యః పఠేన్నిత్యం! త్రిసంధ్యం నియతః సుధీః॥

#భావము:: వేదధర్ముడు ఇలా చెప్పారు - ఓం కారంతో మొదలు పెట్టి నమః శబ్దమును చివర చేర్చి నూట ఎనిమిది నామములను విద్వాంసుడు ఏకాగ్రతతో మూడు సంధ్యా కాలములలో శ్రద్ధగా చదవాలి.

2. సర్వపాప విముక్తాత్మా! జాయతే విమలాంతరః !
భుక్త్యా యథేప్సితాన్భోగాన్! ప్రేత్య బ్రహ్మణి లీయతే ॥

#భావము:: ఈ నామములు పఠించిన చో పాపచింతనలనుండి విడివడి స్వచ్ఛమైన మనస్సు కలవాడై. కోరిన కోర్కెలు తీరి సమస్త సుఖములను అనుభవించును . పరలోకమున శ్రీ దత్తునియందు ఐక్యము చెందును.

3. భక్తరక్షాక్షణో దేవః!స్మృతః సేవా స్వవేశ్మని!
స్వభోజ్యస్యార్పణం దానం! ఫలమింద్రాది దుర్లభమ్ ॥

#భావము:: భక్తరక్షణ కొరకు ఎల్లప్పుడూ దత్తుడు సిద్ధంగా వుండును. భక్తులను రక్షించుటయే ఆయనకు ఆనందం. మన ఇంట్లోనే వుండి ఆయనను తలచినా, భోజనమునకు ముందు ఆ స్వామికి భోజనం అర్పించి తినినా, మనకు దానఫలము లభిస్తుంది. ఇంద్రాది దేవతలకు కూడా దుర్లభమైన ఐశ్వర్యమును ఇచ్చును.

4. య ఏతైర్నామభిర్దివ్యైః! కవచం ధారయేత్కృతీ!
రాజవేశ్మని కాంతారే! దుర్గాదిషు మహాభయే ॥

#భావము:: ఈ అష్టోత్తర శతనామములు ఎవరు కవచముగా ధరించెదరో వారు కృతార్థులు అగుదురు. రాజభవనము నందు , అరణ్యములందు మహాభయములందు ఈ నామములతో కవచముగా ధరించిన విజయము పొందుతారు.

5. శత్రుచోరభయాకీర్ణే! శ్మశానే ప్రేతదూషితే!
న భయం విద్యతే తస్య! దృష్ట్వా తం విద్రువేద్భయమ్॥

#భావము: శత్రువులు, దొంగలు, శ్మశానములయందు,భయములువుండు చోట ఈ నామములు కవచముగా కలిగిన వానిని చూసి భయపడి అన్ని పారిపోవును.

6. శిరో లలాటం నేత్రేచ! భ్రూమధ్యం చ భ్రువౌ తథా!
నాసే కర్ణౌ తథోష్ఠౌ చ! హనుః కంఠం కకుత్తథా ॥

#భావము:: శిరస్సు, నుదురు, నేత్రములు, కనుబొమల మధ్యభాగం, కనుబొమలు, ముక్కు, చెవులు, పెదవులు, దవడలు, కంఠము, ఈ  నామములు చెప్పుచూ తాకవలెను. అక్కడ వున్న రోగములు పోతాయి.

7 . దౌతాంఘ్రిహస్త ఆచమ్య! స్మృత్యా దత్తం న్యసేత్సుధీః!
కరాంగన్యాసౌ విన్యస్య!షడ్భిః ష్షడ్భిః తతః క్రమాత్ ॥

#భావము:: చేతులు, కాళ్ళు కడుగుకొని కేశవాది నామాలతో ఆచమనం చేసి దత్తాత్రేయుని స్మరించి ఈ అష్టోత్తర శతనామ కవచమును చదువుకొనవలెను. అంగన్యాస, కరన్యాసములు ఆరేసి నామములతో  చేయవలెను.

8. జత్రుస్తనౌ చ చక్షుశ్చ! హృదయం నాభిరేవచ!
మూలాధార స్ఫిచావూరూ! జానుజంగాశ్చ గుల్ఫయౌః ॥

#భావము:: మూపు సంధులు, వక్షస్థలము, నేత్రములు, నాభి, మూలాధార ము, పిరుదులు, కటిప్రదేశము,తొడలు, మోకాళ్ళు, పిక్కలు, గిలకలు.

9. ప్రపదౌ పాదమూలాభ్యం ! తథా పాదతలే ఉభే!
పాదాగ్రాంగుష్ఠయో శ్చైవ ! హస్తాగ్రాభ్యాం తథైవ చ ॥

#భావము: మోకాళ్ళు, పాదమూలములు , పాదప్రదేశములు, బొటనవేళ్ళు, చేతుల యొక్క అగ్రభాగములకు, నామములతో కవచము చేసుకొనవలెను. నామ ప్రభావముతో ఆయా అవయము ల రోగములు పోవును మరియు కవచము వలె రక్షణ ఇచ్చును.

10. స్కంధయోర్బుజమూలాభ్యాం ! సంధిభ్యాం కరయోః పృథక్!
అంగుల్యం గుష్ఠయోశ్చైవ! హస్తాగ్రాభ్యాం తథైవ చ ॥

#భావము: భుజస్కంధముల యందు, భుజముల మూలలయందు, హస్తముల సందులయందు, వ్రేళ్ళయందు, హస్తాగ్రములయందు .

11.హృదయాద్దస్త పాదాగ్ర! పర్యంతవ్యాపకం న్యసేత్!
దశేంద్రియాంతః కరణ! చతుష్టయధృతంన్యసేత్ ॥

#భావము:: హృదయము నుంచి హస్తాది పాదాగ్రముల వరకు ఈ నామకవచమును కప్పవలెను. పది ఇంద్రియాలందు, మనో,బుద్ధి, చిత్త, అహంకారముల యందు ఈ కవచమును ఉంచవలెను.

12. రోమస్వేకం చ హృదయం! స్పృష్ట్వా నామాని పంచ చ !
జేద్భక్త్యా స్మరన్దేవం! కృతకృత్యో భవేన్నరః ॥

#భావము: రోమమలయందు, హృదయము నందు స్పృశించి అయిదు నామములను చెప్పవలెను. ఇట్లు భక్తి తో తన అవయముల అన్నిటి అందును ఆ దేవదేవుని స్మరించుచూ ఆ స్వామి నామములను జపించవలెను.

జపమునకు ముందు చేయవలసిన ధ్యాన శ్లోకం:::

#పీతాంబరాలంకృత పృష్టభాగం! భస్మావగుంఠామలరుక్మ దేహమ్!
విద్యుత్సదాపింగ జటాభిరామం! శ్రీ దత్తయోగీశమహంనతోస్మి ॥

భావము:: పట్టు వస్త్రాలు కట్టుకొన్న, విభుతితో పూయబడిన బంగారపు శరీరము కలవాడు, మెరుపు తీగ వలె పచ్చనైన జడలతో మనోహరమైన శ్రీ దత్తయోగీశ్వరునికి అన్నివేళలా వంగి వంగి నమస్కరిస్తాను.....(from FB)

        *శుభమస్తు*

🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏

0 comments: