Thursday, September 25, 2014 By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామాయి షిర్డీసాయి సేవా సత్సంగం - 65

ఓం శ్రీ సద్గురవే నమో నమ:

మం"  శ్రవణాయాపి బహుభిర్యో న లభ్య:

       శృణ్వంతో2పి బహవో యం న విద్యు:!

     ఆశ్చర్యో వక్తా కుశలో2 స్య లబ్ధా

       ఆశ్చర్యో జ్ఞాతా కుశలానుశిష్ట:!!


భా:- దేనిని గురించి వినడానికి అనేకులచే సాధ్యపడదో, 

విన్నప్పటికీ ఎందరో దేనిని అర్ధం చేసుకోలేరో, 

ఆ ఆత్మను గురించి ఉపదేశించేవాడూ అరుదు,

వినేవాడూ అరుదు.అంతటి అరుదైన వ్యక్తి ఉపదేశాలను 

పాటించి దానిని తెలుసుకున్నవాడు కూడా అరుదే.




శ్రీ సాయిబాబా జీవితచరిత్ర సముద్రము వలె విశాలమైనది.లోతైనది. అందరు దీనియందు మునిగి భక్తి,జ్ఞానములను మణులను వెలికితీసి కావలసినవారికి పంచి పెట్టవచ్చును.

వేదములవలె రంజకములును ఉపదేశకములునునగు బాబా ప్రభోదములు విని వానిని మననము చేసినచో భక్తులు వాంచించునవి, అనగా బ్రహ్మైక్యయోగము, అష్టాంగయోగ ప్రావీణ్యము, ధ్యానానందము పొందెదరు.

భక్తులకు బాబా లీలలు మిక్కిలి ఆనందం కలుగజేయును.శ్రీ సాయినాధుని దర్శనభాగ్యమున మనలో ఉన్న ఆలోచనలు మారిపోవును. వెనుకటి కర్మల  బలము తగ్గును.ప్రపంచమంతయు సాయిబాబా రూపమే వహించెను.

వేదాంత విషయములలో మానవుడు స్వేచ్చాపరుడా కాడా! అను వివాదము వదలి పరమార్ధము నిజముగా గురుబోధలవల్లనే కలుగుననియు, రామకృష్ణులు తమ గురువులయిన వసిష్ఠసాందీపులకు లొంగి అణుకువతో నుండి ఆత్మసాక్షాత్కారము పొందిరి. దానికి దృఢమైన నమ్మకము(నిష్ఠ), ఓపిక(సబూరీ) అను రెండు గుణములు ఆవశ్యకము అని శ్రీ సద్గురువు మనకు సచ్చరిత్రము ద్వారా  ఉపదేశిస్తున్నారు. 

మూడవ అధ్యాయములో శ్రీ సాయి అమృతతుల్యమగు పలుకులను తదుపరి టపాలో ...సశేషం .

సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు.








0 comments: