Showing posts with label మనోభావాలు. Show all posts
Showing posts with label మనోభావాలు. Show all posts
Wednesday, June 14, 2017 0 comments By: visalakshi

తండ్రి (పితృదేవోభవ)




శ్లో" పితాధర్మ: పితాస్వర్గ: పితా హి పరమం తప:!
     పితరి ప్రీతి మాపన్నే సర్వా ప్రీయంతి   దేవతా:!!   (మహాభారతం)

తండ్రిని సేవించడమే ధర్మం. తండ్రిని సర్వవిధముల సుఖింపజేయడమే స్వర్గం. ధర్మవర్తనుడైన తండ్రి ఆదేశాలను అనుసరించడమే సర్వశ్రేష్టమైన తపస్సు. తండ్రిని ప్రసన్నంగా ఉంచితే సమస్త దేవతలు ప్రసన్నులౌతారని ఈ శ్లోకము యొక్క అర్ధం. "సర్వ దేవ మయ: పితా"! తండ్రి సంపూర్ణంగా దేవతా స్వరూపము. అందుకే తల్లిదండ్రులను ఆదర సత్కారాలతో  సేవించాలి. తల్లిదండ్రులకు శ్రద్ధతో అభివాదం చేసే సంతానానికి అక్షయమైన సుఖసంతోషాలు  ప్రాప్తిస్తాయని  శాస్త్రాలు  తెలుపుతున్నాయి.


పాలించి పోషించి, రక్షించేవారిని పితా అంటారు. సంతతిని పాలించి పోషిస్తున్నాడు కనుక తండ్రిని ప్రజాపతి స్వరూపమంటారు. తండ్రి ఆకాశానికంటే ఎత్తైనవాడు. ఉన్నతుడు. తండ్రి హృదయాకాశంలో తన పుత్రుని యందున్న అనంతప్రేమ, వాత్సల్యం వర్ణింపలేనివి. ..పుత్రుడైన శ్రవణ కుమారుని వియోగంతో అంధులైన తల్లిదండ్రులు తమ ప్రాణాలనే త్యజించారు. దశరధమహారాజు తన ప్రియపుత్రుడైన శ్రీరామచంద్రుని యెడబాటును భరించ లేక ప్రాణాలు విడిచాడు.           



జన్మనిచ్చినవాడు, భయాన్నుండి రక్షించినవాడు, అన్నమిచ్చి ఆదరించినవాడు, జీవనాధారమైన వృత్తినిచ్చి ఆదుకొన్నవాడు, యజ్ఞోపవీతధారణ సంస్కారము చేసినవాడు ఈ ఐదుగురు పితరులని ఆచార్య చాణక్యుడన్నారు. తల్లిని సేవించినట్లే, తండ్రిని దేవుడుగా భావించి తప్పనిసరిగా సత్కరించాలి. తండ్రి వలన మానవ దేహోత్పత్తి, పాలన, సత్యశిక్షణ, విద్య, ధర్మోపదేశం లభిస్తాయి. పరమాత్ముని సాక్షాత్కారానికి తండ్రి సోపానము. తండ్రి కర్తవ్యపరాయణుడు, విద్వాంసుడయితే సంతానం సత్పురుషులౌతారు. తండ్రి పుత్రులకు వినయాన్ని నేర్పి, శుభకార్యాలలో వారికి శ్రద్ధను కలిగించాలి. పితృ శబ్ధానికి సర్వరక్షకుడు, శ్రేష్ట స్వభావం కలవాడనే అర్ధం ఉంది.


పుత్రుడు ఎప్పుడూ తండ్రి ఆధీనంలో ఉండాలి. తల్లి దండ్రులకు దుర్గతి కలుగకుండా పుత్రుడు చూడాలి. వంశ ప్రతిష్టను గౌరవించి రక్షించాలి. ధర్మ శాస్త్రాల ననుసరించిన ఆదర్శ పురుషుడు, పితృభక్తుడు, ఆజ్ఞాకారియైన సుపుత్రుడు శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడు పితృవాక్య పరిపాలన కోసం సర్వస్వం త్యాగం చేసి సీతాదేవి, లక్ష్మణ సమేతంగా అరణ్యాలకు తరలి వెళ్ళాడు. కౌసల్యామాత శ్రీరాముడు వనాలకు వెళ్ళేందుకు అనుమతి నివ్వలేదు. శ్రీరాముడు తల్లితో " ఈ ప్రపంచంలో ధర్మమే చాలా శ్రేష్ఠమైంది. ధర్మంలోనే సత్యం స్థితంగా ఉంది. ఆ ధర్మాన్ని అనుసరించడమే నాకు పరమ కర్తవ్యం. ధర్మాన్ని పాలించడంలో నా ప్రాణాలు పోయినా నేను లెక్కచేయను. నిఖిల దేవతల కంటే పూజ్యుడు అధికుడు తండ్రి.వారి ఆజ్ఞను నేను ధిక్కరించలేను. నాకు సత్యం ధర్మం రెండూ అత్యంత ప్రియమైనవి. ధర్మబద్ధమైన తండ్రిగారి కోరిక పాలించడమే నా విధి. ఈ విధిని పాలించడంలో నేను మనోధైర్యాన్ని కలిగి ఉండేటట్లుగా ఆశీర్వదించమని" తల్లితో అంటాడు.  అది శ్రీరామచంద్రునిలోని సౌశీల్యం.

శంతన మహారాజు సత్యవతీదేవి సౌందర్యాన్ని చూచి మోహితుడై ఆమెను వివాహం చేసుకోవాలని ప్రయత్నించి, దాశరాజు కోరికను మన్నించలేక విఫలమై నిరాశతో హస్తినాపురం చేరుకుంటాడు. దేవపుత్రుడు దు:ఖంతో ఉన్న తండ్రి సుఖం కోసం అఖండ బ్రహ్మచర్యాన్ని పాటిస్తానని భీషణ ప్రతిజ్ఞ చేసి భీష్ముడయ్యాడు. చంద్ర దర్శనం వలన అంధకారం దూరమై రాత్రి శోభించునట్లుగా శీలసంపన్నుడు విద్యా ప్రియుడైన పుత్రుని వలన వంశం ఖ్యాతి గాంచుతుంది. 




తండ్రికి కష్టాలు, బాధలు,సమస్యలు ఎదురైనపుడు ఆ సమస్యల నుండి తండ్రిని సంతానం రక్షించాలి. తండ్రి ఆత్మశాంతిలో సంతానం యొక్క శాంతి ఉంది. ఒక్కొక్కసారి మన నిర్లక్ష్యం వలన అమూల్యమైన తల్లిదండ్రులను పోగొట్టుకుంటాం.తల్లిదండ్రుల సేవలో మనం తరించాలి. మనమలా వ్యవహరించినపుడే భగవంతుడు మనను ఆదరించి మరింత సద్బుద్ధి ప్రసాదిస్తాడు. పరమాత్ముని ఆజ్ఞలను పాలించిన గృహంలో ఎప్పుడూ సుఖశాంతులుంటాయి. 



పుత్రులను సన్మార్గంలో నడిపించే తండ్రి తనపేరు తనయుడు నిలబెట్టాలని ఆశిస్తాడు. పితృభక్తి కలవాడే పుత్రుడు. పూర్వకాలంలో తల్లిదండ్రులు లేక తాతయ్యలు పిల్లలకు పురాణ గ్రంధాలను వినిపించి వివరించేవారు. చదివించేవారు. వారివల్ల సదా గ్రంధపఠనం..తెలియని విషయాలను సేకరించి వారిని సందేహాలను అడిగి తెలుసుకుని ఆ విషయ జ్ఞానమును, ఆ ధర్మాలను మనం ఆచరిస్తున్నాము. ఆ పితామహులు సదా చిరస్మరణీయులు. వారిని ఇలా స్మరించుకోవటమే మనం వారికిచ్చే బహుమతి. ఆ విలువలను, సంస్కృతి సభ్యతలను మనం రక్షించుకోవాలి అంటే మన కుటుంబపరమైన మన పూర్వీకులను వారిచ్చిన సంస్కారాన్ని గౌరవించి ఆచరించాలి. "తండ్రి సర్వదా పూజ్యనీయుడు."....ఈ నెల 18న పితృ దినోత్సవ సంర్భంగా... మన భారతీయ సమాజంలో మనకు ధర్మవర్తనులైన  పితామహులందరికీ  వందనాలు. 











                                       
Thursday, April 27, 2017 0 comments By: visalakshi

వైవాహిక జీవితం




 మీ వైవాహిక జీవితం గురించి నీ స్పందన ఏమిటి? అని సరదాగా అడిగింది..    నా అంతరంగిక స్నేహితురాలు  . తనకి నేను సమాధానం చాలా వివరంగా చెప్పాను. కానీ ఒకసారి నన్ను నేను తరచి చూసుకున్నాను. నా వైవాహిక జీవితంలో 29 ఏళ్ళు వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్నో ఒడి దుడుకులు...అయినా అన్నిటినీ సమానంగా తీసుకున్న మా కుటుంబ ఔన్నత్యం నాకు సంతోషాన్నిస్తుంది. ఒక క్రమశిక్షణ గల భర్త, ఆ క్రమ శిక్షణను పాలించిన మా పిల్లలు. అంతే ప్రేమతో అమ్మా,నాన్నలపై గౌరవం.. ఒక వయసు వరకు మా అదుపాజ్ఞలలో ఉన్నా వారి స్వతంత్ర నిర్ణాయాలకు ఎప్పుడూ మేము కూడా గౌరవమిచ్చాము. భార్య అంటే ఇలా ఉండాలి అని నన్ను చూసి బహుశా ఎవరూ అనుకోక పోవచ్చు..కానీ భర్త అంటే ఇలా ఉండాలి అని ప్రతి ఒక్కరూ మావారిని చూసి అనుకుంటారని నా అభిప్రాయము. అది నూటికి నూరుపాళ్ళూ నిజం. అంతటి ప్రేమతత్వాన్ని వారితో అనుభవించాం మా కుటుంబ సభ్యులం. కోపం లేదు అనుకుంటే పొరపాటే..కానీ ఆ కోపం వెనకాల ప్రేమ మరింత గోచరిస్తుంది.

 ఒక్క కుటుంబ సభ్యుల మధ్యే కాక అందరితోటి చాలా కలివిడిగా ఎప్పటినుండో ఆత్మీయులు అన్నట్లు అందరితో ప్రేమగా ఉంటారు. అది కొంతమంది అలుసుగా తీసుకొని అవమానాలు చేసినా.. మాన అవమానాలను సమంగా తీసుకొని చిరునవ్వే సమాధానంగా శతృత్వం అనేది లేకుండా క్షమించే మనసున్నవారు శ్రీవారు.

 నేను అనబడే నాకు.. కొంచం అసహనం ఎక్కువ.. తొందరపాటుతో విషయాన్ని అపార్ధం చేసుకున్నా తప్పుని గ్రహించినా పిల్లలముందు మళ్ళీ తక్కువైపోతానని మొండిగా వాదించి గెలుస్తాను అప్పుడప్పుడు.. కానీ ప్రేమతో వాళ్ళు ఏమన్నా సంతోషంగా స్వీకరిస్తాను. మంచి మనస్తత్వమే అని అనుకుంటున్నాను.

  పాప, బాబు, అల్లుడు ఇంచుమించు ఒకే వయసు వారు ..మా అల్లుడు మాకు మా అబ్బాయే. తనని అంతే చనువుతో చూస్తాము. చాలా నెమ్మదస్తుడు. అత్తమ్మా,మామయ్యా అంటూ ఆప్యాయంగా పలకరిస్తాడు. మృదుస్వభావి. ప్రేమతత్వంతో అందరినీ  ఆదరిస్తాడు. అడిగిన వారికి కాదనకుండా సహాయం చేసే స్వభావం. ఇంటా,బయటా అందరి మన్ననలను పొందుతాడు. తల్లిదండ్రులంటే ప్రేమతో కూడిన గౌరవాభిమానం. చెల్లి అంటే ప్రాణం.  ఆధ్యాత్మిక  అవగాహన ఉంది, భక్తితత్వం ఉంది. అన్ని దేవాలయాలు భక్తితో దర్శించారు మా అల్లుడు, పాప, వారి కుటుంబం. బాబాగారి ఆశీస్సులు మా అల్లుడికి సదా ఉన్నాయి. స్నేహమయుడు  నాఅల్లుడు..



  మా పాపకి...అమ్మ అంటే ప్రేమ..తనే ఒక అమ్మై నన్ను చూసుకుంటుంది. తమ్ముడు అంటే ప్రాణం. నాన్న అంటే పంచప్రాణాలు. పెళ్ళి అయ్యాక ఇవన్నీ కలగలిపి అంటే అన్నీ తానే అయిన భర్త అంటే తనకి  సర్వస్వం . తన భర్తే తన ధైర్యం.. అంటే బలం..బలహీనత అని చెపుతుంది. అందరినీ ప్రేమిస్తుంది అందరికీ ప్రాధాన్యతనిస్తుంది. అది అర్ధం చేసుకునే మనసులకు తన పరిణత తెలుస్తుంది. బంధు మిత్రులంటే చాలా ఇష్టం.. వారితో సమయం సరదాగా గడుపుతుంది. ఇక షాపింగ్ అంటే ఎనలేని ఇష్టం.. అన్నీ ఇష్టంగా కొంటుంది.. కానీ ధరణకి, ధారణకి ఏమీ నచ్చవు.. ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళాలంటే మళ్ళీ షాపింగ్...చిన్నప్పటి నుండీ ఇదే సాగుతోంది.ఆధ్యాత్మిక అవగాహన ఉంది. షిర్డీసాయి భక్తురాలు. మరియు బాబాగారి ఇష్టపుత్రిక. చాగంటివారి రామాయణ ప్రవచనాలు విని శ్రద్ధగా రామాయణం చదివి, నాకు కూడా కొన్ని వివరించింది. ఇతరులకు సహాయం చేయడం, వారి బాధను తనదిగా పాటించడం పరిపాటి. కష్టాల్లో ఉన్నవారందరూ తన బంధువులే అన్నట్లుగా వారిని దరిచేర్చుకొని వారిని ఓదారుస్తుంది. కాబట్టి స్నేహమయి, ప్రేమమయి..నా పుత్రిక.

 మా బాబు.అందరినీ ప్రేమిస్తాడు. ఒకరి ప్రేమకై ఎదురుచూడడు. ఎవరినీ విమర్శనాత్మకంగా చూడడు. మీ నాన్నగారే మళ్ళీ పుడుతున్నారోయి అన్న మా శ్రీవారి మాటలను నిజం చేస్తూ.. మా నాన్నగారు నాకు మళ్ళీ కుమారుడుగా జన్మ తీసుకున్నారు. వాళ్ళ అక్కతో పోలిస్తే అల్లరి తక్కువే..చాలా నెమ్మదస్తుడు. అలా అని తనని ఎవరైనా ఏమైనా అంటే ఊరుకోడు. అమ్మా,నాన్న అంటే ప్రేమతో కూడిన గౌరవం. అక్కా, బావా అంటే చాలా ఇష్టం. ఏ వ్యవహారమైనా వారిద్దరినీ సంప్రదించి చేస్తాడు. అక్కే తనకు స్పూర్తి. తనని తాను గౌరవించుకుంటూ అందరినీ గౌరవిస్తాడు. మనసులోని తన భావాలను తొందరగా బయటకు తెలియనీయడు. మా బాబు అంటూ ఉంటాడు. నన్ను ఎవరితో పోల్చవద్దు. నేను నేనే..ప్రత్యేకం ..అని 'మా అన్నయ్య కూడా తనని అలాగే అంటాడు. తనకి తనే ప్రత్యేకం. అని మా బాబుని చూసి ఆనందపడేవాడు.' ఎవ్వరినీ ఒక్క మాట అనడు. కోపం వచ్చినా ఎవరిముందు ప్రదర్శించడు. సమయస్పూర్తిగా వ్యవహరిస్తాడు. ఆంజనేయస్వామి భక్తుడు. సుందరకాండ, రామాయణ గ్రంధాలను పఠించాడు. బాబా అనుగ్రహం చవి చూసి వినమ్ర భక్తుడయ్యాడు. రామాయణ మహాకావ్యంలో ఏమైనా సందేహాలుంటే మేము మా బాబుని అడిగి తెలుసుకుంటాము. రాముడుని ఆదర్శంగా తీసుకుంటాడు   నా పుత్రుడు.

 ఇలా ఆనందంగా సాగిపోతున్న నా జీవితంలో చిన్న..చిన్న  స్పర్ధలు మా మధ్య వచ్చినా అవి తామరాకు మీద నీటిబొట్టులాంటివే.. కాబట్టి నా జీవితంలో  వైవాహిక జీవితం  ఆనందమయ జీవితము. ఉత్సాహపూరిత ఆదర్శకుటుంబం మాది అని సగర్వంగా చెప్పుకోగలను. 


  సర్వం శ్రీ సాయినాధార్పితం..



   

  
Sunday, April 23, 2017 0 comments By: visalakshi

జీవనశైలి-విధానం

ఒక కుటుంబములో నలుగురు సభ్యులుంటే ఆ నలుగురి మనస్తత్వాలు ఒకే రీతిలో ఉండవు. విభిన్న అభిరుచులు అభిప్రాయాలు ఉంటాయి. కానీ ప్రముఖ నిర్ణయాలకు మాత్రము సంప్రదింపులతో ఏకాభిప్రాయముతో ఒక నిర్ణయము తీసుకొని అమలుపరుస్తారు. అలాగే  ఒకరికొకరు అని మమేకమై మైత్రీ భావనతో ఉన్న ఇద్దరు ప్రాణ మిత్రుల అభిప్రాయాలు కూడా ఒకేలా ఉండాలని లేదు. అభిరుచులు అసలు కలవకపోవచ్చు. వారి జీవన విధానము కూడా భిన్నంగా ఉండవచ్చు. వారి ఆలోచనా శైలి వేరుకావచ్చు. కానీ వారు  .. ఒకరి ఆలోచనలను ఒకరు గౌరవిస్తారు. ఒకరి అభిప్రాయలకు ఒకరు విలువనిస్తారు. ఇరువురి ఆలోచనా శైలిని ఒకరితో ఒకరు పంచుకుంటారు.   







కుటుంబములో కలతలూ కలహాలు సహజము. కానీ ప్రేమతో అవన్నీ సమసి పోయేలా మనం మలచుకుంటాము. మైత్రిలో అసలు కలతలూ, కలహాలు రాకూడదు. వచ్చినా ఆ ఇద్దరిలో ఏ ఒక్కరైనా సమర్ధవంతంగా వాటిని దూరం చేసి మనసుతో, మమతను తెలిపి మనసుకు హత్తుకునే మాటలతో మధుర భావనను ఆ స్నేహములో నింపాలి.  ఒక కుటుంబం, స్నేహం, బంధములను 
ఏకాభిప్రాయముతో ఎలా సత్సంబంధాలను నెలకొల్పుకుంటున్నామో... అలాగే మన భారతదేశంలో మత సంబంధమైన ఆదర్శాలు వందల శతాబ్దాలుగా ప్రభవిస్తున్నాయి. మనం  ఆదర్శాల మధ్యన పుట్టి పెరుగుతున్నాం. ఇవి మన రక్తంలో ప్రవేశించి, నరాల్లో స్పందిస్తూ, శరీరతత్వంలో ఒక భాగమై, మన జీవనశక్తిగా మారిపోయాయి. 





మన భారత హృదయం మతభావ పూరితం. ఆ తరువాతే మరొక దానికి స్థానం. మన ప్రాణాధారమైన రక్తం ఆధ్యాత్మికత.ఈ ప్రాణాధార రక్తం స్వచ్చంగా, బలంగా, శక్తిసంపన్నంగా ప్రవహిస్తే చాలు. రాజకీయ, సాంఘీక ఇతర ప్రాపంచిక లోపాలన్నీ, చివరికి మన దేశ దారిద్ర్య చిహ్నాలన్నీ కూడా చక్కదిద్దబడుతాయి. రాజకీయమైనా, సాంఘీకమైనా ఏదైనా సరే ప్రబోధించదలుచుకుంటే దానికి కావలసిన ఒకే అంశం - ఆధ్యాత్మికశక్తి ఎంతగా ద్విగుణీకృతమవుతుందో చెప్పాలి. ఏ ఇతర జ్ఞానమైనా మనబాధలను స్వల్ప వ్యవధి వరకే తొలగించగలదు. శాశ్వతంగా మన బాధలను తొలగించగలిగేది ఆధ్యాత్మిక జ్ఞానమొక్కటే." మత భావాలను భగ్నపరచకుండా సామాన్య ప్రజల సముద్ధరణాన్నే మన లక్ష్యంగా మన ముందుంచుకోవాలి".




 మంచి విషయం ప్రతిదీ ఇతరులనుండి నేర్చుకోవాలి. కానీ దాన్ని స్వీకరించి, నీ సహజ శైలిలో ఆకళింపు చేసుకోవాలి. మనం ఇతరులలా మారిపోకూడదు. మన భారతీయ జీనంలోంచి బయటకు రావడానికి అంగీకరించవద్దు. భారతీయులందరూ వేరే జాతులలా వేషం ధరించి, భుజించి, ప్రవర్తిస్తే భారతదేశ స్థితి ఏదో బాగుపడిపోతుందని ఒక్క క్షణం పాటైనా అనుకోకండి. పిరికితనంతో కూడిన అనుకరణ మనిషి పతనానికి ప్రత్యక్షచిహ్నం.  అవన్నీ పై పై మెరుగులే అని గుర్తించి మన భారతీయ జీవనశైలిని, ఆ విధానాన్ని గౌరవించి అనుసరించండి. మన హిందూ ధర్మాన్ని నిర్వర్తించి అభ్యుదయాన్ని సాధించండి.



 సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు..

Monday, April 17, 2017 4 comments By: visalakshi

ఆ తరాలు - అంతరాలు






 ఈ మధ్య నా నెచ్చెలి అమ్మ నాన్న గుర్తుకొచ్చారురా.. అంది. అలా ఆలోచనలో పడిన నాకు మా అమ్మ..నాన్న గుర్తు వచ్చారు. అమ్మ నాన్న వారితో మనకుండే అనుబంధం..మన పిల్లలకి మనతో ఉండే అనుబంధం ఆలోచన .  ఈ టపాకి నాంది అయింది నా ఆలోచనల పరంపర..

జన్మ నిచ్చిన తల్లి ఋణం తీర్చుకోలేము అంటారు. నిజమే! భగవంతుడు ఏర్పరిచిన మధుర బంధం.. సృష్టికి ప్రతిరూపాలు తల్లిదండ్రులు.అమ్మ ఆలనా, నాన్న పాలనా.. వారి కనుసన్నలలో పిల్లల దినదినాభివృద్ధి..పూర్వకాలంలో తల్లిదండ్రులు పిల్లలను ప్రేమతో పాటు, గౌరవ అభిమానాలను పెద్దలయందు మర్యాదాపూర్వక భయభక్తులను నేర్పేవారు. 

 చిన్నతనంలో అమ్మ సాయంత్రము వేళల్లో నాన్నగారికి పలహారం అందించి తను ఎదురుగా మల్లెపూవుల దండను కడుతూ కబుర్లు చెప్పేది. మేము పిల్లలం ఒకింత దూరంలో కూర్చుని చదువుకొనేవారము. ఆ దృశ్యము ఎప్పుడూ నా మదిలో నిలిచిపోయింది. నాన్నగారికి పనసపొట్టుకూర చాలాఇష్టం. ఆయన పనసపళ్ళు. కాయలను తీసుకువచ్చి తానే ఉదయమే పనసపొట్టును తీసి, పనసతొనలను వలిచేవారు.. ఆ ప్రహసనమునకు రెండు గంటల సమయము కాబట్టి ఆదివారము చేసేవారు. అదో జ్ఞాపకం. జామపళ్ళు తెచ్చేవారు. అమ్మ వాటిని ఒక పెద్ద పళ్ళెములో పెట్టేది.. జామపళ్ళ వాసనతో, ఆ గది బలే ఉండేది. ఇవన్నీ ఎక్కడోకాదు. హైదరాబాదు మహానగరంలోనే.. జీతం రాగానే ముందు పుల్లారెడ్డి స్వీటు, చెగోడీలు తెచ్చేవారు. అమ్మ అందరికీ పెట్టేది. నాన్నగారు వస్తున్నారు అంటే మేము మరి మాట్లాడే వాళ్ళం కాదు. స్కూలికి వెళ్ళేటప్పుడు ఆయన చేయి పట్టుకొని వెళ్ళేవారం.  అదో అపురూపం.  అప్పట్లో సందేహాలన్నీ ఉపాధ్యాయులను అడిగి తీర్చుకునేవాళ్ళం. అమ్మా నాన్నను అడగాలంటే వెరపు.  అది మా తరం.

 క్రమేణా తల్లిదండ్రుల ప్రేమలలో స్వార్ధం చోటు చేసుకొంది.తమ పిల్లల ఉన్నతస్థాయి..ఎదుటి పిల్లలకన్నా మరింత ఉన్నతంగా ఉండాలన్న ధ్యాసలో పిల్లలను స్వార్ధపూరితంగా వారి మనసులలో పోటీతత్వమును నింపుతున్నారు. తత్ఫలితం నేటి విద్యార్ధులు. రేపటి స్వార్ధహృదయులు. అన్నీ వారికే కావాలి. అన్నిటా వారే ముందుండాలి. లేకపోతే అసహనం ..కోపం. .విపరీత పరిణామాలు. అమ్మ అదిగో నాన్నగారొచ్చారు చూడు అంటూ చిన్నతనం నుండి నాన్న అంటే గౌరవముతోపాటు భయం భక్తిని తను చూపిస్తూ పిల్లలకు నేర్పించేది. నాన్న కూడా తన పిల్లలను మనసుతో దగ్గరికి తీసుకొనేవారు. కానీ పైకి గంభీరంగా విషయపాలన చేసేవారు. నాన్నగారిని ఏమైనా అడగాలంటే అమ్మద్వారానే సాధ్యం. ఆడపిల్లలను తండ్రి తల నిమిరి ఆశీర్వదించేవారు.అమ్మాయిలు ఎలా ఉంటే ఇంటా బయటా గౌరవంగా చూస్తారనేది... చిన్నప్పటి నుండి నాన్నగారు, సోదరుల అభిమానాల, అభిరుచుల, అభిప్రాయాల సమ్మేళనముతో... ఇంట్లో అమ్మ నాన్నతో మిగిలిన బంధువులతో ఎలా మసులుకుంటుందో ఎంత గౌరవ మర్యాదలను పాటిస్తుందో చిన్నప్పటినుండీ పిల్లలు గమనిస్తారు. ఆ సంస్కారము వారిలో కూడా దిన దిన ప్రవర్ధమానమౌతుంది. సమాజంలో వారు ఆ సంస్కారముతో అభివృద్ధి చెందుతారు. ఈ రోజులలో మనమే పిల్లలకు విదేశీ సంస్కృతి నేర్పుతున్నాము. సోషల్ మీడియా,  టీ.వీలు  ఈ మాధ్యమాల ద్వారా ఒకింత వేగంగా పిల్లలు మన సంస్కృతి సంప్రదాయలకు విలువలు తగ్గించేసారు. పేరుకి వాట్స్ ఆప్ లలో అన్ని పండుగలకు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. కానీ నిజంగా హృదయపూర్వకంగా ఆ పండగల విలువలను వాటి పారమార్ధాన్ని తెలుసుకొని ఆకళింపుచేసుకొని పాటిస్తున్నది ఎంతమంది? హాయ్! డాడ్.. హాయ్! మాం ..ఇవీ పలకరింపులు.. అమ్మా! అన్న పిలుపులో తీయదనం మిగిలిన పిలుపుల్లో వస్తుందా.. పల్లెటూళ్ళలో కొంతమంది ఇప్పటికీ ఎంతో ఆప్యాయంగా అమ్మా!, నాన్నగారండీ,అన్నయ్యా,  చెల్లీ, తమ్ముడూ, అక్కా! ఇలా పారవశ్యంగా పిలుచుకుంటారు. ఆ అనుభూతి ఎంతో హృద్యంగా ఉంటుంది. చెప్పడంలో కూడా వారిపై ప్రేమ ఆ మాటలలో కదలాడుతూ ఉంటుంది. మరి మనమో..పిలుపులు సరే!.. మనకే అధ్యాత్మిక విషయాలు అంతంత మాత్రంగా తెలుసు. చిన్న పిల్లలప్పుడు చెప్పడానికి సరైన అవగాహన లేదు. కనీసము ఇప్పుడైనా  అవే పిల్లలకి చెపుదామంటే వారికి వినే, చదివే ఆసక్తి లేదు. చెప్పాలంటే వారికి టైము సరిపోదు. ఈ ఉరుకుల పరుగుల సాఫ్ట్వేర్ ఉద్యోగాలతో వారు సతమతమవుతూ, మిగిలిన సమయాన్ని నిద్రకు సరిపెడుతున్నారు. సెలవు సమయాలలో విందు, వినోదాలకు సమయాన్ని కేటాయిస్తారు. కానీ విలువైన భక్తి విషయాలు తెలుసుకోవాలని కోరుకోరు. ఇప్పటినుండీ ఎందుకు? అన్న ఆలోచన..లైఫ్ ఎంజాయ్ చేయాలి. అన్న ఉద్దేశ్యముతో వారి విధానములలో వారు ఉంటారు. వాళ్ళు చేస్తున్నది తప్పుకాదు ఆ విధానమే కరక్టు అనుకుంటారు.  ఈ తరంలో చాలామంది తుదిదాకా పట్టువిడువకుండా ముందుకు సాగలేకపోతున్నారు. ఏవో సాకులతో నీరుగారిపోతూ ఉంటారు. ఆరంభశూరత్వంతో మధ్యలోనే విజయమార్గం నుంచి వెనుతిరుగుతూ ఉంటారు. దీనికి ప్రధానకారణం లక్ష్యసాధనలో ఏకాగ్రత కొరవడటం. పట్టుదల లేకపోవడం! 

 అమ్మా, నాన్న చెప్పేవి పాతతరం కబుర్లు.. ట్రెండు మారిపోయింది. అంటూ సినిమాల ప్రభావంతో కొత్త పదజాలాలు.. సరి కొత్త వ్యంగ్య బాణాలు.. ఇంట్లోనే మాట్లాడం ప్రారంభిస్తారు. వాటిని మనం కూడా మన పిల్లలు ఏది చేసినా ముద్దుగా పరిగణిస్తూ వారిని మరింత కలుషిత వాతావరణంలోకి నెడుతున్నాము. అన్నిటికీ కనెక్ట్ అయిపోతున్నారు. వారిని మార్చలేక మనం కూడా వారి బాటలో నడవడం ముదావహం.  




 "మానవ మేధస్సును ..అతడే సృష్టించిన కృత్రిమ మేధస్సు జయిస్తుంది." అని ఓ మహానుభావుడు చెప్పింది అక్షరాలా నిజమైంది. ఎందుకంటే స్మార్ట్ ఫోన్ కి మనం అంతగా కనెక్ట్ అయ్యాము. ఉదయం ఫోన్   తోనే లేస్తాను.. మధ్యలో ఫోన్ చూసుకుంటాను. రోజంతా దానితోనే గడుపుతాను. అందరినీ అనే ముందు నేనే దానికి బానిసను. ఇది వైభోగమనుకుంటాము కానీ నాకైతే ఇది బలహీనత. మరి నాకే అలా ఉన్నపుడు యువతకు మరింత బలహీనత. ఎంతవరకు దాని అవసరమో అంతవరకు ఉపయోగించుకొని.. మన మానసిక దౌర్భల్యానికి లోనుకాకుండా దానికి మనకు విశ్రాంతి నివ్వడం ఎంతైనా అవసరం. 

ఇదివరకు సినిమాలు.. హాలు వరకే పరిమితం.. కానీ ఇప్పుడు ఇంట్లో, ప్రతి సంభాషణలలో ప్రతి వారి మధ్యా.. సినిమా కబుర్లు, అనుకరణలు.. ఒక్కో కుటుంబాన్ని చూస్తే ఒక సినిమా చూస్తున్న ఫీలింగ్..అలాంటి డైలాగులు ఉంటాయి వారి మాటలలో..   టు పోతోంది ఈ సమాజంలో నాగరికత.. మళ్ళీ ఎవరు వచ్చి నా సోదర సోదరీ మణులను, నా భరతమాత బిడ్డలను సంస్కరించాలి. నావంతు నేను ఏమి చేయాలి..నా పిల్లలను.. చుట్టూ ఉన్న నా అనుకున్న అందరికీ గొంతెత్తి మన సంప్రదాయాల  సంస్కృతికి , అమ్మా నాన్నలకి సముచిత గౌరవమిస్తూ, ఆధ్యాత్మికంగా మన పండగల వైశిష్ట్యాన్ని తెలియజేయడం.. నా విధి. తెలిసిన అనుసరిస్తున్న  జ్ఞానాన్ని నలుగురికీ తెలియజేయటం నా ధర్మం. మీరు  అంటే ప్రతి తల్లి,దండ్రి మీ కర్తవ్యాన్ని విస్మరించవద్దని నా మనవి.  జీవిత లక్ష్యాన్ని నిర్దేశించుకొని..ఆ లక్ష్యాన్ని సాధిస్తూ వాస్తవంలో జీవిద్దాం. యువతకు అదే నేర్పుదాం.స్పూర్తినిద్దాం.

 భరతావనికి అంజలి ఘటిస్తూ.............




Saturday, December 24, 2016 0 comments By: visalakshi

సంస్కారం

' మనుర్భవ - జనయా దైవ్యం జనం '!సృష్టిలో మానవజన్మ అత్యంత శ్రేష్టమైంది. మానవత్వంతో పరిమళించే సంతానాన్ని దంపతులు సృజించాలి. వారు దేవతలు అయ్యేటట్లుగా కృషి చేయాలి. మానవులలో విశేష కర్మలు ఆచరించేవారే దేవతలు. అట్లాంటి దేవతా సంతానంతో సమాజం సుశోభితం కావాలి. షోడశ సంస్కారాల ద్వారా కలిగే పూర్ణ ప్రయోజనమిది. వైదిక సంస్కృతిలో మానవ జీవనాన్ని సంస్కరించేందుకు షోడశసంస్కారాల విధానాన్ని ఋషులేర్పరిచారు. 16 సార్లు మానవుణ్ణి సంస్కారాలతో సంస్కరించారు. అందులో ఒక భాగంగానే శిశువును సంస్కారాల ద్వారా సంస్కరించేందుకు ప్రయత్నం జరుగుతుంది. స్వర్ణకారుడు సువర్ణాన్ని అగ్నిలో వేసి దానిలోని మలినాలను తొలగించి శుద్ధి చేసినట్లుగా, జన్మించిన శిశువును సంస్కారాలనే బట్టీలో వేసి, శిశువులోని పూర్వమున్న చెడు భావాలను దుర్గుణాలను తొలగించాలి. మంచి సంస్కారాలను వేసేందుకు పూర్తిగా ప్రయత్నించాలి. 



 "సంస్కారో హి గుణాంతరాదాన ముచ్యతే"!

చెడును తొలగించి మంచిని స్థాపించడమే సంస్కారాల ప్రధాన ఉద్దేశ్యం.

అనేక జన్మల నుండి తనతో పాటు వచ్చే సంస్కారాలు..వంశపరంపరగా తల్లిదండ్రుల నుండి వచ్చే సంస్కారాలు ఇవి మంచివి కావచ్చు, చెడువీ కావచ్చు.. సంస్కారాలతో సంపూర్ణమానవ నిర్మాణానికై రచింపబడే ప్రణాళిక, ఆధ్యాత్మిక ప్రణాళిక. ఇదియే వైదిక సంస్కృతి ముఖ్య లక్ష్యం. 



సంపూర్ణ మానవ నిర్మాణానికి సంస్కార పద్ధతే ఆధారం. జన్మించిన శిశువు తనపూర్వ జన్మలలోని కర్మల సంస్కారాలను, తల్లిదండ్రుల ద్వారా లభించే సంస్కారాలను తన వెంట తీసుకువస్తుందనే మాట వేదసమ్మతం - శాస్త్ర సమ్మతం. 

 ఈ సంస్కారాలలో కొన్ని ఆత్మ శరీరాన్ని ధరించడానికి ముందు, కొన్ని ఆత్మ శరీరాన్ని ధరించిన తరువాత చేస్తారు. శిశువు జన్మించేందుకు ముందు చేసే సంస్కారాలలో గర్భాదాన సంస్కారం మొదటిది. వైదిక సంస్కృతి ఈ సంస్కారాన్ని ఒక క్రొత్త ఆత్మను ఆవాహన చేసేందుకు జరిగే పవిత్ర యజ్ఞంగా భావిస్తుంది. శిశువును గర్భంలో ధరించక ముందే దంపతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లిదండ్రులు శ్రేష్టమైన సంతానాన్ని ఉత్పన్నం చేసే సంకల్పం ఈ గర్భాదాన సంస్కారంలో ఉంది. హోమంలో ఘృత ఓషధులను ఆహుతులుగా ఇస్తూ భౌతికశుద్ధి వేదమంత్ర పాఠంతో ఆత్మశుద్ధి కలిగి శరీర ఆత్మబలాలతో కూడిన సంతానాన్ని ఉత్పన్నం చేసేందుకై దృఢమైన సాధనతో 20 విశేష ఆహుతులతో హోమం చేయాలి. ఈ హోమం వలన దంపతులలో శారీరక మానసిక ఉన్నతికి ప్రతికూలమైన దోషాలను దూరం చేసి, అలాగే సంతానోత్పత్తికి సంబంధించిన సామర్ధ్యం ఉండాలని పరమాత్ముని ప్రార్ధిస్తారు. 

  

తల్లిదండ్రులు ఎలాంటి భావాలు కలవారో అట్లాంటి భావాలవైపు ఆ శిశువు ఆకర్షించబడుతుంది. బీజాన్ని సంస్కరిస్తే ఉత్కృష్టమైన మొక్క ఉత్పన్నమౌతుంది. అలాగే సుదృఢమైన వేగవంతమైన ఆలోచనలతో కూడిన తల్లి గర్భాన్ని ధరిస్తే ఆ తల్లినుండి ప్రతి అంగం తయారవుతుంది. అది శిశువు పూర్వ సంస్కారాలను పూర్తిగా మార్చేస్తుంది. చెడు ఆలోచనలను బలహీనం చేస్తుంది. అప్పుడే సంపూర్ణ మానవ నిర్మాణం జరుగుతుంది. దివ్య గుణాలతో కూడిన శిశువు జననోదయ మవుతుంది.  

 సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు




Tuesday, December 20, 2016 1 comments By: visalakshi

సాధు స్వభావం





 తితిక్షవ: కారుణికా: సుహృద: సర్వదేహినాం
 అజాతశత్రవ: శాంతా: సాధవ: సాధుభూషణా:

ఓర్పు, కరుణ, సర్వజీవుల యెడ మిత్రత్వము అనునవి సాధులక్షణములు. అతడు అజాతశత్రువు, శాంతుడు, శాస్త్రమునకు కట్టుబడి యుండువాడు అయి యుండును. మరియు అతనివి ఉదాత్తగుణములు.


స్వభావరీత్యా మానవునకు ప్రేమానురక్తులను ఆశించడం పరిపాటి. ఆ ఆశలను అందుకోవడంలో విఫలమైనప్పుడు ఆవేశపూరితుడవుతాడు. కానీ ఆలోచిస్తే ఆ ఆశ అన్న భావాన్ని మనసునుండి తొలగించుకునే ప్రయత్నంలో అతను సాధు స్వభావుడవుతాడు.  



ఉదాహరణకి ఒక వ్యక్తినుండి ఏదైనా ఆశించినపుడు లభించకపోతే ఆ వ్యక్తిని నిరసనభావంతో చూడడం హాస్యాస్పదం. ఆశించినది నీ మనసు..ఇందులో ఆ వ్యక్తి ప్రమేయము లేదు. ఆశించిన అనురక్తి అందక మనసుకు కలిగే ఉక్రోషమును వారిపై చూపరాదు. అన్నిటిని సమాన దృష్టితో చూసే జ్ఞానమును అలవచుకోవాలి. 

దృఢమైన మనసుతో భగవానుని కొరకు లోకమందలి స్వజన సంబంధములు మరియు మిత్ర పరిచయముల వంటి సమస్త సంబంధములకు ఋణములన్నీ తీర్చుకోవలెను. ఋణవిముక్తులవ్వాలంటే ఆధ్యాత్మిక జీవనమనే సాధు సాంగత్యముతో విష్ణు ఆరాధనలో భక్తిభావ సమన్వితులై భగవచ్చరణారవిందములను ఆశ్రయించడం ద్వారానే మనం ఋణము లనుండి విముక్తులవుతాము.



 సుఖదు:ఖములు తాత్కాలికము. వాటి రాక పోకలు శీతగ్రీష్మ అనుభవముల వంటివి.జీవితానుభవముల వలన అవి కలుగుచుండును. కావున కలత పొందక వాటిని సహింపవలెను.నిజానికి సుఖదు:ఖములనేవి మనస్సు వలన కలుగునన్నది మనకు విదితము. కాబట్టి మనసును దైవ ఆరాధనలో నిమగ్నం చేసి  ప్రశాంతతను అలవరచుకోవాలి. 

 సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు.  





Sunday, December 18, 2016 0 comments By: visalakshi

పరాభవం - పరంధామము.




శ్లో: న ప్రహృష్యే త్ప్రియం ప్రాప్య నో ద్విజే త్ప్రాప్య చా ప్రియం
    స్థిరబుద్ధి రసమ్మూఢో బ్రహ్మాని ద్బ్రహ్మణి స్థిత:  (5వ అ- 20వ శ్లో )

ప్రియమైన దానిని పొందినపుడు సంతోషించక, సుఖించక అప్రియమును పొందినపుడు దు:ఖింపక ఉండు వానిని , స్థిరమైన బుద్ధిగలవానిని, మోహితుడు కానివానిని, దివ్యజ్ఞానము కలవానిని, దివ్యత్వము (బ్రహ్మము) నందున్న వానినిగా తెలుసుకోవలయును. 

ప్రియ  భాషణముతో  పొగిడినా,  అప్రియ  భాషణముతో పరాభవించినా...
మానావమానములను ఒకేలా తీసుకోవాలని మహాత్ములు కొందరు ఆచరించి చూపారు. ఆ బాటలో మనం నడవాలంటే మానసిక స్థైర్యమును అలవరచుకోవాలి. రాగ ద్వేషాలను జయించ గలగాలి. 

 శాంతి, అశాంతి..సుఖం, దు:ఖం ఇవన్నీ మనసు ఏర్పరిచే గందరగోళ స్థితి. బాహ్య ప్రాపంచిక శాంతిని పొందాలని ఆతృత పడతాము. అశాంతిని కొని తెఛ్చుకుంటాము. 

మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయో:
బంధాయ విషయాసంగో ముక్యై నిర్విషయం మన: 

"మానవునికి మనస్సే బంధమోక్షములకు కారణము. ఇంద్రియార్ధములందు 
నిమగ్నమైన మనస్సు బంధమునకు కారణము. వానియందు అనాసక్తమైన మనస్సు ముక్తికి కారణము." 



మనస్సును జయించిన వానికి మనస్సే ఉత్తమ మిత్రము. మనస్సును పరాభవించిన వానికి మనస్సు గొప్ప శత్రువుగా ఉండిపోవును. అంటే కామము, కోపము, లోభము, భ్రాంతి మున్నగు వాటికి దాసుడై ఉండవలెను. కానీమనస్సుజయింపబడినప్పుడు మానవుడు అందరి హృదయములందును పరమాత్మస్వరూపమున నెలకొనియున్న భగవంతుని ఆజ్ఞలను అనుసరించుటకు స్వయముగా అంగీకరించును.

ప్రపంచములో అత్యున్నత లోకమునుండి..అత్యధమ లోకము వరకు అన్నియు దు:ఖ మయమైన ప్రదేశములే. మనస్సును సర్వదా పరమాత్మ స్మరణలో నిమగ్నమై ఉండునట్లు భక్తి ప్రపత్తులతో.. భగవత్ సేవలందు ఆసక్తితో దేవదేవుని పూజించవలెను. పరిపూర్ణ స్థితిని పొందవలెను.అదియే పరంధామము. 



  

Saturday, December 17, 2016 0 comments By: visalakshi

ఆధ్యాత్మిక ఉన్నతి






ఆధ్యాత్మిక ఉన్నతికి అవరోధాలు ఏమిటి? మంచి ఆధ్యాత్మిక అవగాహన గల మిత్రులతో సాహచర్యం ఆధ్యాత్మిక ఉన్నతికి దోహదం చేస్తుంది అంటారు. కానీ నా మిత్రులు ఆధ్యాత్మికంగా ఒకరు రచనలు సాగిస్తుంటే వారికి మాటలతో అంతరాయం కలిగించకూడదు. వారి ఉన్నతికి మిత్రుల మౌనమే ప్రోత్సాహం అంటున్నారు. ఎంతవరకు ఇది సమంజసం... అని ఆలోచిస్తే... రచనలు చేసే వ్యక్తికి మిత్రుల మాటలు, వారి ఆత్మీయ పలకరింపు, తన రచనకు సద్విమర్శలు..లేక ఇలా కాదు మరోలా రాసుంటే ఇంకా బాగుండేది అన్న ప్రోత్సాహము.. ఆ రచయిత లేక రచయిత్రికి మరింత ముందుకు తీసుకెళ్ళి మరిన్ని భగవద్విషయాలు రాయాలన్న జిజ్ఞాసను కలిగిస్తాయి. కానీ చక్కటి విషయాలు చర్చించుకొంటూ ...మధ్యలో కారణం లేకుండా మౌనాలతో.. ఆ మౌనాలకు కారణం తెలియక ఆ రచయిత నొచ్చుకుంటుంటే...కొన్నాళ్ళకి ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళాలన్న తపనతో "మౌనం" అంటే... ఆ రచయిత ముందుకెళ్ళి ఆధ్యాత్మికంగా అత్యున్నతి సాధిస్తాడా!...సాధించాలి...రాగ ద్వేషాలను, ప్రేమాను రాగాలను ... మనసు నుండి క్రమ క్రమంగా వాటిని విముక్తి చేసి (చాలా కష్టం..కానీ మనసును క్షోభకు గురిచేసి వాత్సల్యాలను కన్నీటి రూపంలో కడిగేసుకోవడానికి ప్రయత్నించాలి) మనస్సును మాయకు లొంగనీయక...భగవన్నామ స్మరణలో జీవితం సార్ధకం చేసుకోడానికి ప్రయత్నించాలి.  ఒక బంధాన్ని గానీ, స్నేహాన్ని గానీ మనసులో నుండి కలిగే ఆ అనుభూతిని మాటలలో వ్యక్తం చేయలేక ...మనసునందే గౌరవించే వ్యక్తిత్వం కలిగిన   అపురూప  స్నేహ బంధమా నీకు జోహార్లు.  

 కానీ ఆ రచయితకి మనసు బలహీనపడినా.. అలసిపోకుండా..జీవితమనే కడలిని ఎదురీదుతూ.. .ఓడిపోకుండా.. మనిషిగా సమాజంలో ఒక భగవత్ సేవకుడిగా.. భగవత్ సేవలో కాలం గడపగలిగేలా బాబాను దీవించమని ఆయనను శరణు వేడుతూ..తన  స్నేహితులను కూడా వారి మార్గంలో వారు సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని వేడుకుంటూ....

సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు.

Monday, December 5, 2016 0 comments By: visalakshi

పరిశీలనా శక్తి

 భావిపౌరులను ఉత్తమపౌరులుగా తీర్చిదిద్దడానికి మనం మన జీవితపుస్తకంలో ఆచరించి అనుభూతి చెందిన పాఠాలే వారిని అధికంగా ప్రభావితం చేస్తాయి. అప్పుడే పిల్లల్లో పరిపూర్ణ వ్యక్తిత్వం సాధ్యమవుతుంది. నీతులు చెప్పడం వేరు, నీతిగా జీవించడం వేరు. మనం కాలక్షేపాలతో సమయం వృధా చేస్తూ, పిల్లలు మాత్రం సమయపాలన పాటించి, బుద్ధిగా చదువుకోవాలనుకుంటాము. ఏ నీతిబోధ అయినా, ఏ స్పూర్తిదాయక వాక్యమైనా ఆచరించకుండా పిల్లలే కదా మనం ఏం చెబితే అది వింటారు అని తేలికగా తీసుకుంటే పొరపాటే! నేటి పిల్లల గ్రహణశక్తి, పరిశీలనాశక్తి పెద్దలకన్నా మిన్న. పిల్లలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటే చాలాసార్లు పెద్దలు తడబడాల్సి వస్తుంది. ఈ విషయంలో పెద్దలు మంచి అనుభవం సంపాదించే ఉంటారు.





 ఓ పదిహేనేళ్ళ బాలుడు ఆర్ధిక ఇబ్బందులతో వర్తకుని వద్ద పనిలో చేరాడు. యజమాని నమ్మకస్తుడిగా గుర్తించి, ఆ యువకుణ్ణి పొరుగూరు వెళ్ళి ఇతర వ్యాపారస్థుల నుండి బాకీలను వసూలు చేసుకురమ్మన్నాడు. అతడు పొరుగూరు వెళ్ళి బాకీలన్నీ వసూలు చేసుకొని నదిని దాటడానికి పడవ కోసం వేచి ఉన్నాడు.ప్రయాణ బడలిక వల్ల, చల్లని గాలి తాకిడికి అలా కూర్చోగానే నిద్రలోకి జారుకున్నాడు. ఇంతలో ప్రయాణీకుల సందడి వినిపించింది. వెంటనే హడావిడిగా పరిగెత్తుకుంటూ వెళ్ళి పడవ ఎక్కాడు. పైకంతో ఉన్నా బ్యాగును మర్చిపోయాడు. కొంతసేపటికి బ్యాగు మరచిపోయిన సంగతి గుర్తుకు రాగానే పడవ దిగి పరిగెత్తుకుంటూ కూర్చున్నచోటికి వచ్చి చూశాడు. కానీ బ్యాగు కనబడలేదు. మొత్తం పైకం పోవడంతో కన్నీరుమున్నీరై విలపించాడు.  అంతలో అక్కడికి ఒక వృద్ధుడు వచ్చి అతణ్ణి విషయం అడిగి తెలుసుకున్నాడు. ఆ బ్యాగులో పైకం వివరాలను అడిగి తెలుసుకున్నాడు. అతడు చెప్పిన వివరాలు సరిపోలడంతో ఆ వృద్ధుడు బ్యాగును అతడికి ఇచ్చాడు. ఆ బ్యాగు అతడిదే! దాన్ని తెరిచి చూడగా పెట్టిన సొమ్ము పెట్టినట్లుగానే ఉంది. పట్టరాని సంతోషంతో ఆ వృద్ధుడికి కృతజ్ఞతలు తెలిపాడు. ఆయన ఉపకారానికి ప్రతిఫలంగా కొంత పైకం ఇవ్వబోయాడు. అందుకు ఆయన నిరాకరిస్తూ 'నాకు డబ్బు మీద వ్యామోహమే ఉన్నట్లయితే నీకీ పైకాన్ని తిరిగి ఇచ్చేవాణ్ణి కాదు. ప్రతిఫలం ఆశించకుండా చేసేదే నిజమైన సహాయం' అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ వృద్ధుని మాటలు ఆ యువకుణ్ణి ఎంతగానో ప్రభావితం చేసాయి. 




ఆ యువకుడు ఊరు వెళ్ళడానికి పడవ కోసం నది ఒడ్డున వేచి చూస్తున్నాడు. ఇంతలో నల్లని మేఘాలు కమ్ముకొని పెనుగాలులతో బోరున వర్షం కురవసాగింది. చూస్తుండగానే నది మధ్యలో ఒక పడవ పెనుగాలిలో చిక్కుకొని మునిగిపోసాగింది. ప్రయాణీకులంతా భయంతో కేకలు పెడుతున్నారు. ఇదంతా ఒడ్డున ఉన్న యువకుడు గమనించాడు. తనకు సహాయం చేసిన వృద్ధుడి మాటలు గుర్తుకువచ్చాయి. వెంటనే ప్రయాణీకులను రక్షించడానికి తన వద్ద ఉన్న సొమ్మును ఇచ్చి గజ ఈతగాళ్ళను పురమాయించాడు. ఆ విధంగా నదిలో మునిగిపోతున్న ప్రయాణీకులందరూ రక్షింపబడ్డారు. ఈ సంఘటనలో ఆశ్చర్యకర విషయమేమిటంటే పడవ ప్రమాదం నుండి రక్షింపబడిన వారిలో ఆ వృద్ధుని కొడుకు కూడా ఉండడం. మనం ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేస్తే అందుకు ప్రతిఫలంగా మనకు ఆ భగవంతుడు ఏదో రూపంలో సహాయం అందిస్తాడు.ఆ వృద్ధుడి ఆదర్శవంతమైన వ్యక్తిత్వం..ఆ యువకుణ్ణి కూడా ఆదర్శవంతమైన జీవితం వైపు పయనించేలా చేసింది. 








 జీవితంలో పిల్లలకు తల్లి తొలి గురువు. ఎంతో ప్రేమతో, ఓర్పుతో తన పిల్లలకు ఆటపాటలలోని మెళకువలను నేర్పిస్తూ, జీవిత సత్యాలకు అన్వయిస్తూ..భవిష్యత్ వ్యూహరచనా కౌశలాన్ని నేర్పిస్తుంది. గురువు కూడా గురుతరబాధ్యతగా జాతి భవిష్యత్తును తీర్చిదిద్దవలసినది తానే అనే విషయం నిరంతరం దృష్టిలో పెట్టుకోవాలి. ఒక వ్యక్తిగానీ, దేశంగానీ గొప్పది కావాలంటే 'మంచితనం యొక్క శక్తిని గుర్తించడం'.. 'అసూయ, అవమానాలకు తావివ్వకపోవడం'.. 'మంచిగా ఉండేవారికి, మంచి చేస్తున్న వారికి సహకరించడం'. అనే మూడు విషయాలు అవసరం. 

తమ తమ పిల్లల పరిశీలనా శక్తికి, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సహకరించి, వారిని గొప్పవారిగా తీర్చిదిద్దడానికి తాము కృషి చేయాలి. ఉన్నత స్థితికి ఎదిగేలా తీర్చిదిద్దాలి. వారి దీక్షాదక్షతలు తమ దేశాన్ని గొప్పదేశంగా మార్చడానికి ఎంతో ఉపయోగపడతాయని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు గమనించాలి. మంచి పరిణామాలు ఏర్పడుతాయి అనేలా  చుట్టూ ఉన్న చీకటిని తరిమికొట్టే చిన్న దీపాలను వెలిగించుదాం అన్న స్పూర్తిని పిల్లలకు అందజేద్దాం.  వ్యక్తిత్వాలను వికసింపజేద్దాం. 


Sunday, October 30, 2016 0 comments By: visalakshi

దీపాల వెలుగు






 అమావాస్య వెలుగులుగా ఈ రోజు మన దీపాలను అభివర్ణిస్తాం.

చీకటిలో అవి మనకిచ్చే కాంతిలో పండగను ఆనందంగా జరుపుకుంటాం.

ప్రతీ దీపంలో మనం భగవంతుని చూస్తాం.  

 ఈ ప్రకృతిలో ప్రతీ మార్పు పరమాత్మ చర్యే! అందుకే మనం పరమాత్మని శరణాగతి చేద్దాం.మన చుట్టూ ఉండే ప్రపంచమూ ఆయనది అని విశ్వసిద్దాం.

భగవద్బంధుత్వాన్ని గుర్తించి ప్రేమాదరాలతో అందరం సహజీవనం ఉత్సాహంగా సాగిద్దాం.

  మనసనే దీపం వెలుగులో ప్రతిరోజూ దీపావళి జరుపుకుందాం..




Thursday, September 29, 2016 1 comments By: visalakshi

బ్రహ్మచర్య వ్రతం

'మీ నర నరాల్లో బ్రహ్మచర్యం అగ్నిలా ప్రజ్వరిల్లాలి.' "శరీరం, మనస్సు, బుద్ధి ఈ మూడు సమగ్రంగా పరిణతి చెందాలంటే బ్రహ్మచర్యం అత్యంత ఆవశక్యం. బ్రహ్మచర్యాన్ని అవలంబించిన వ్యక్తులలో అద్భుతమైన జ్ఞాపకశక్తి, గణనీయమైన  అవగాహనశక్తి  వృద్ధి  చెందుతాయి."  బ్రహ్మచర్యాన్ని పాటించడం ద్వారా లైంగికశక్తి మరింత ఉన్నతమైన 'ఓజస్సు ' అనే మానసిక శక్తిగా రూపొందుతుంది.



  ఆత్మనిగ్రహానికి,జిహ్వేంద్రియాన్ని అదుపులో ఉంచడానికి చాలా దగ్గరి సంబంధం ఉంది. అతి బలమైన జిహ్వేంద్రియాన్ని అదుపులో ఉంచడం ద్వారా మిగిలిన ఇంద్రియాలపై నియంత్రణ సులభం అవుతుంది. అందుకే ఆహార విషయంలో కొన్ని నియమనిబంధనలు అవసరం. సాత్విక ఆహారం తీసుకోవడం ;అపక్వ ఆహారం అంటే పండ్లు, కాయగూరలు భుజించడం; ఉపవసించడం మొదలైనవన్నీ సాధనామార్గంలో అవసరం. బ్రహ్మచర్య సాధన ఆరంభంలో శరీరానికి ఎలాంటి ఆహారం ఇస్తున్నామనే విషయంతో పాటు మనస్సుకు ఎలాంటి సమాచారాన్ని అందజేస్తున్నామనేది కూడా అంతే ముఖ్యం. మనస్సులోని ఆలోచనలు, భావనలు, ఇంద్రియాల నుండి సేకరించే సమాచారం పరిశుద్ధమైనవిగా ఉండటం బ్రహ్మచర్యపాలనకు అత్యంత ఆవశ్యకం.



  గాంధీ మహాత్ముడు బ్రహ్మచర్యం గురించి తెలియజేస్తూ..." కేవలం జిహ్వేంద్రియాన్ని, గుహ్యేంద్రియాన్ని అదుపులో ఉంచడం బ్రహ్మచర్యం కాదు. త్రికరణశుద్ధిగా ఆత్మనిగ్రహాన్ని పాటించినప్పుడే అది సమగ్రమైన బ్రహ్మచర్య అనుష్ఠానం అవుతుంది." అని వివరించారు.

 విషయాసక్తిని  కేవలం భౌతికమైన పద్ధతులద్వారా అదుపు చేయలేము. మానసిక స్థాయిలో దాన్ని పరిష్కరించడం చాలా ముఖ్యం. 



 పూర్వమీమాంస కర్త అయిన జైమిని వేదవ్యాసుని వద్ద విద్యాభ్యాసం చేస్తున్న రోజులవి. పాఠ్యబోధనలో భాగంగా ఒకరోజు వ్యాసభగవానుడు ' ఎట్టి పరిస్థితులలోనూ స్త్రీలతో కలిసి మెలగవద్దు. అలాచేస్తే మీరు ఎంత జాగ్రత్త వహించినా, ఎంత మెలకువగా ఉన్నప్పటికీ కామానికి బానిసలయ్యే ప్రమాదం ఉంది.' అని సూచించారు. అప్పుడు జైమిని అతి విశ్వాసంతో గురువర్యా! నేను బ్రహ్మచర్యంలో సుప్రతిష్ఠుడనయ్యాను.ఏ స్త్రీ కూడా నన్ను ప్రలోభానికి గురి చేయలేదు. అని పలికాడు . ఓహో అలాగా! అది త్వరలోనే తెలుస్తుంది అంటూ వ్యాసమహర్షి తీర్ధయాత్రకు బయలుదేరారు.

ఒకనాడు వ్యాసుడు తన యోగశక్తి ప్రభావంతో అందమైన స్త్రీ రూపాన్ని ధరించాడు. ఆకాశం మేఘావృతమై మరి కొద్దిసేపట్లో కుండపోతగా వర్షం కురుస్తుందనగా నిస్సహాయురాలైన అబలవలె ఒక చెట్టు క్రిందకు చేరాడు. అదే దారిలో తన ఆశ్రమానికి వెళుతున్న జైమిని ఆమెని చూసి ఆశ్రయం కల్పించి రక్షించాలనే ఉద్దేశంతో తనతో పాటు తీసుకువెళ్ళాడు.ఆమెకు ఆశ్రమం లోపల బస ఏర్పాటు చేసి, తను మాత్రం వరండాలో పడుకున్నాడు. అర్ధరాత్రి కామప్రకోపం అధికరించగా బయట చలిగాలి బాగా వీస్తోంది అంటూ లోపలికి చేరాడు. మరికసేపటికి ఆ స్త్రీ చేతిగాజుల గలగలలు విని ఉండబట్టలేక ఆమెను సమీపించాడు. అప్పుడు అక్కడ ఆ స్త్రీ స్థానంలో వ్యాసమహర్షి ప్రత్యక్షమై జైమినీ! ఏమైంది నీ సంయమన శక్తి? ఇప్పుడు చెప్పు, నువ్వు బ్రహ్మచర్యంలో సుప్రతిష్ఠుడవయ్యావా? అని ప్రశ్నించారు. 

 మాయ యొక్క శక్తి, ఇంద్రియాల ప్రభావం ఎంతటి ఘనులైనా మోసగిస్తుంది. అందుకే బ్రహ్మచర్యాన్ని పాటించాలనుకునే సాధకులు పెద్దల సూచనలను అనుసరించే క్రమంలో ఎలాంటి అలసత్వానికి తావు ఇవ్వకూడదు. స్వామి వివేకానంద బ్రహ్మచర్య వ్రతపాలన గురించి చెబుతూ "బ్రహ్మచర్య ఆదర్శాన్ని చేపట్టాలని కోరుకునేవారు సంయమనానికి సంబంధించిన నియమాలను నిష్ఠగా పాటించాలి. స్త్రీ సాంగత్యాన్ని కూదా విడనాడాలి." అని హెచ్చరించారు.




 పతంజలి మహర్షి 'వితర్కభావనే ప్రతిపక్షభావనం - హానికరమైన భావాలను అరికట్టడానికి సద్భావాలను మనస్సులో ప్రవేశపెట్టాలి.'అని యోగసూత్రాల్లో సూచించారు.మహాత్ముల దివ్యసన్నిధి, స్పూర్తిదాయక వచనాల ప్రభావం వల్ల ప్రాపంచికుల మనస్సులు పవిత్రమవుతాయి. "పుణ్యక్షేత్రాలు,తీర్ధస్థలాల్లో ఎందరో మహాత్ములు సాధన చేస్తూ ఉంటారు. అలాంటి ప్రదేశాలను దర్శించినప్పుడు మనస్సు త్వరితగతిన ఉనంత ఆధ్యాత్మిక చైతన్యాన్ని పొందుతుంది."



 బ్రహ్మచర్య పాలనకు అత్యున్నత పరిష్కారం శరీర స్పృహను విడిచి ఆత్మబుద్ధిని అలవరచుకోవటం, సర్వులను లింగభేదంలేని నిత్య, శుద్ధ, బుద్ధ, ముక్త, ఆత్మ స్వరూపాలుగా పరిగణించడం. ఇందుకు పట్టుసడలని సుదీర్ఘ ప్రయత్నం అవసరం.జపము,ధ్యానము, స్వాధ్యాయము, సంకీర్తన, సేవ, ప్రార్ధన వంటి మంచి అలవాట్లతో శారీరకంగా, మానసికంగా బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించడం సులభమవుతుంది.
Wednesday, September 28, 2016 2 comments By: visalakshi

అస్తేయ సాధన

 మహాత్మాగాంధీ ఈ అస్తేయాన్ని సత్యాహింసలతో అనుసంధానించి ఇలా అంటారు.."అహింస యొక్క సారమే ప్రేమ". ఎప్పుడైతే మనం నిజంగా ప్రేమిస్తామో అప్పుడు చౌర్యం అనేది అసాధ్యం. మనకు తెలిసిగానీ, తెలియకగానీ ఇతరుల వస్తువులు తీసుకుంటే అపరాధభావానికి లోనవుతాము. మనకు అవసరంలేని వస్తువులను మన దగ్గర ఉంచుకుంటే -అదీ చౌర్యమే. మన నిజమైన అవసరాలు కొన్నే.కానీ మితిమీరిన ఆశలే చౌర్యాలకు పాల్పడేలా చేస్తాయి. దుబారాగా ఖర్చు చేయడం మరొక రకమైన చౌర్యం..పొదుపు చేయడం అస్తేయం.



 మనం తరచుగా అనేకచోట్ల నుండి ఇతరుల భావాలను సేకరించి, మన రచనలలోనూ, ప్రసంగాలలోనూ ఉపయోగించి ఆ ఘనతను మనకు ఆపాదించుకుంటాం..కానీ ఏ మూలం నుండి గ్రహించామో వారిపట్ల కనీసం కృతజ్ఞతా భావాన్ని వ్యక్తపరచకపోవడం కూడా చౌర్యమే!

  ఇక అస్తేయ సాధన ఎలాగో చూద్దాం. ఇందులో స్థూలమైనవి మరియు సులభమైన విషయాలను ముందుగా పరిశీలిద్దాం. ఇంటిని కొల్లగొట్టడం, జేబు దొంగతనాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, తప్పుడు కొలతలు, కల్తీ వ్యాపారం, పన్ను ఎగవేత కోసం తమ ఆదాయాన్ని తక్కువగా చూపడం....ఈ రకమైన పనులన్నింటినీ వదిలిపెట్టటమే అస్తేయ సాధన. 

 స్తేయానికి మూల కారణం - 'మనిషికి ఉన్న అత్యాశే', దాన్ని రూపుమాపడమే నిజమైన అస్తేయ సాధన. ఇక్కడ ప్రతిపక్షభావనం అంటే ఈ దుర్వ్యాపారాలను ప్రేరేపించే ప్రవృత్తులకు వ్యతిరేక ఆలోచనలను ప్రవేశపెట్టడం ద్వారా దీన్ని సాధించవచ్చు.దొంగతనం అనేది చట్టరీత్యా నేరం. అందుకు శిక్ష కూడా పడుతుంది. దొంగతనం వంటి పనులకు పాల్పడిన వ్యక్తుల పట్ల ప్రజలు విశ్వాసాన్ని కోల్పోతారు.ఆ పని అశాంతికి, అపరాధభావానికి లోను చేస్తుంది. మనిషికి ఆశ ఎన్నటికీ చావదు. మానసిక అస్థిరతకు, బాధలకు అదే మూలకారణం. ఇది మిత్రులను సైతం శత్రువులుగా మార్చివేయగలదు.ఈ రకమైన ఆలోచనలు ప్రతిపక్షభావనలు. ఈ ఆలోచనలు మనిషికి అస్తేయ సాధన పట్ల సంకల్పబలాన్ని కలిగిస్తాయి. 



 ఆధ్యాత్మిక సాధకుడు ఇతరుల నుండి దాచి ఉంచవలసిన పనులు ఎంతమాత్రం చేయరాదు. "ముందు నీ పట్ల నీవు సత్యవంతంగా ఉండు. ఆ తర్వాత ఇతరుల పట్ల కూడా! ఈ విషయంలో ఆత్మవంచనకు తావు ఇవ్వకూడదు."     - శ్రీరామకృష్ణులు... 

 ఎప్పుడైతే సమాజంలో  ధర్మాత్ముల కంతే ధనవంతులే ఎక్కువగా గౌరవించబడతారో, అప్పుడు జనసామాన్యం అంతా అడ్డదారిలోనైనా ధనవంతులు కావాలనే చూస్తారు. ఈ సామాజిక రుగ్మతను నిర్మూలించాలంటే నైతిక ధర్మాలను నిత్య జీవితంలో పునరుద్ధించి అనుసరించాలి.  



అంతరంగంలోను, బాహ్యంగానూ అస్తేయ సాధనను అలవరచుకున్న వ్యక్తి మనస్సు చురుకుగానూ, మిక్కిలి జాగరూకతతోను ఉంటుంది.తత్ఫలితంగా అది యోగసాధనలో పైస్థాయికి ధ్యానం వైపు సులభంగా మొగ్గుచూపుతుంది. దురాశ అనేది ఒక రకమైన బంధం.అది సాధనా మార్గంలో దు:ఖాన్ని కలిగించే అడ్డంకులైన పంచక్లేశాల (అవిద్య, అహంకారం, రాగం, ద్వేషం, అభినివేశం) వంటిది. 

 ఈశావాస్య ఉపనిషత్తులో నొక్కి వక్కాణించిన అస్తేయం యొక్క ఆధ్యాత్మిక దృక్కోణాన్ని ఇప్పుడు చూద్దాం. అంతా ఒక్కటిగా చూస్తున్నప్పుడు, అంతా ఒక్కటిగా ఉన్నప్పుడు ఇక 'చౌర్యం' మాట ఎక్కడ? ఈ రకమైన ఆధ్యాత్మిక భావంలో నెలకొన్న యోగికి ఆశించదగినది ఏదీ లేదు.అలాగని పోగొట్టుకునేది కూడా ఏదీ లేదు. తమలో ఉన్న భగవంతుడే ఆ దొంగలోనూ వ్యక్తం కావడం వారు చూస్తారు. 



  ఒకసారి ఘాజీపూర్ లోని పవహారీబాబా ఆశ్రమంలోకి ఒక దొంగ ప్రవేశించాడు. అతడు ఏదో అలికిడి విని తప్పించుకుందామనేసరికి బాబా మేల్కొన్నారు. తను దొంగిలించిన సొత్తు అక్కడే వదిలేసి ప్రాణభయంతో ఆ దొంగ పరిగెత్తసాగాడు. బాబా కూడా అతనిని వెంబడించి చాలా దూరం పరిగెత్తిన తరువాత అతడిని పట్టుకోగలిగారు. తరువాత బాబా ఆ దొంగను 'నారాయణా అని సంబోధిస్తూ అతడు దొంగిలించిన సొత్తు అతడికే ఇచ్చివేశాడు. ఆశ్చర్యపోయిన ఆ దొంగ తరువాత జీవితంలో గొప్ప సాధువుగా పరిణమించాడు.

 భగవద్గీతలో చెప్పినట్లు ఎవరైతే భగవంతుణ్ణి శరణుజొచ్చి, హృదయపూర్వకమైన భక్తిని కలిగి ఉంటారో అలాంటి వారి యోగక్షేమాలను ఆ భగవంతుడే చూసుకుంటాడు. చరాచర సృష్టి వెనుక ఉన్న ఏకత్వాన్ని ధ్యానించడం, స్తేయ అస్తేయాలనే ద్వంద్వాలకు అతీతమైన ఆధ్యాత్మిక చైతన్యం మనలో జాగృతం అవడం - అస్తేయ సాధన యొక్క అంతిమ లక్ష్యం ఇదే!    
Tuesday, September 27, 2016 3 comments By: visalakshi

అపరిగ్రహం

"అపరిగ్రహస్థైర్యే జన్మ కధంతా సంబోధ: - అపరిగ్రహమనే వ్రతంలో నిష్ఠులైనవారికి పూర్వజన్మ జ్ఞానం కలుగుతుంది." 

 అపరిగ్రహం అంటే ' ఇతరుల నుండి ఏమీ స్వీకరించకపోవడం' సహజంగా ఇక్కడ అందరూ భావించే విషయం ఇతరుల నుండి బహుమతులు, వస్తువులు తీసుకోకపోవడం అని. కానీ ఇక్కడ విషయం అది కాదు. ' స్వీకరించడం అనే భావన మనం విడనాడాలి.' అని ఇది సూచిస్తుంది. 



 ఇతరుల నుండి ఏమైనా స్వీకరించాలనే భావనే మనలను బద్ధులను చేస్తుంది...శారీరకంగాకానీ, మానసికంగాకానీ ఇతరులకు బానిస కావద్దు. తప్పనిసరి పరిస్థితులలో ఎవరినుండైనా ఏదైనా స్వీకరించవలసి వస్తే ' ఇది ధర్మాచరణకు మాత్రమే, నాకోసం కాదు ' అనే వైఖరి అవలంబించడం ఉత్తమం. ఇలా ఎవరి చేతులలోనూ బందీ కాకుండా, ఎవరికీ బానిస కాకుండా ఉంటే మానసిక స్వేచ్చ లభిస్తుంది. ఆ స్థితి నుండి ధర్మాచరణ అలవడుతుంది.   



 అలా మానసిక స్వేచ్చను పొందిన మనస్సు దాని అంతరాళాల లోతును కనుగొంటుంది. మన మనస్సుకు ఇప్పుడు స్వేచ్చ లేదు. ఎందుకంటే అది ఎన్నో పరిమితులకు లోబడి ఉంది. ఈ పరిమితులన్నీ( వాసనలు, అభిరుచి, తలంపు, భావము, జ్ఞాపకము) తొలగిపోతాయో అప్పుడు ఆ స్వేచ్చా మానసానికి మన ఆలోచనలను గమనించగలిగే శక్తి వస్తుంది.అలా గమనించడం వలన మనస్సుకు బంధనాలనుండి విముక్తి లభిస్తుంది.  

" మీకు ఎవరైనా ,ఏదైనా ఇస్తే, అది మీకు కాదు భగవంతునికి అని గుర్తుంచుకోండి. దాన్ని మీకై ఉపయోగించకుండా ఆయన సేవకై వినియోగించండి." ఈ ప్రపంచంలో ఎవరూ ఎవరికీ ఇవ్వలేరు. అంతా భగవంతుడిదే. అందుకే ఆయనకు నివేదించడానికే స్వీకరిస్తున్నామనే సమర్పణ భావంతో జీవించడం ఉత్తమం. అపరిగ్రహ సాధన చేసినప్పుడు మనం స్వేచ్చగా ఉన్నామనే భావనను పొందుతాం. అప్పుడు మనం పూర్తిగా స్వతంత్రులం. ఏ బానిసత్వమూ ఉండదు.





  అపరిగ్రహ ధర్మాన్ని అనుసరించి గత స్మృతులను పొందడం వల్ల ప్రయోజనం ఉంది. మనస్సుకు బానిసలైనవారి ఆలోచనలు అప్రయత్నంగా ఆచరణలోకి వస్తాయి. అందుకే ప్రతి ఆత్మజ్ఞాని ప్రేమ, దయ, క్షమ, అఔదార్యాలను కచ్చితంగా పొందుతారు. ఎప్పుడైతే స్వతంత్రేచ్చతో అన్ని ఆలోచనలను పైకి తీసుకు వస్తాడో అప్పుడు తన గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటాడు. తద్ద్వారా ఇతరులను క్షమించడం, వారిపట్ల దయ కలిగి ఉండడం మొదలైన అనుష్ఠాలను గావిస్తాడు. ఈ లోకంలోకి తన రాకపోకలను గమనించి ఈ మారు ఎలాగైనా ప్రకృతిమాయకు లోనవకుండా ముక్తుడవడానికి ప్రయత్నిస్తాడు. అతి చిన్న అంశంగా కనిపించే అపరిగ్రహం వెనుక ఇంత కధ దాగి ఉంది.అందుకే పతంజలి నైతికజీవన నిబంధనలైన   'యమ ' నిర్దేశకాలలొ దీనిని కూడా చేర్చాడు.



Monday, September 26, 2016 0 comments By: visalakshi

మా విశాల హృదయంలో సమాలోచనలు..పురుషార్ధాలు..

 పురుషార్ధాలు 



"  పురుషేణ (ఆత్మనాఅర్ధ్యతే కామ్యతే ఏతే పురుషార్ధా:"! 

పురుషునిచే అంటే ఆత్మచే (స్త్రీ పురుషులచేకోరబడేవి కనుక వీనికి పురుషార్ధాలని పేరు.పురుషార్ధాలు నాలుగుధర్మఅర్ధకామమోక్షాలుఅధర్మ కార్యాలనుండి ఇంద్రియాలను మరల్చి ధర్మకార్యాలలో వాటిని రమింపజేయాలనేది వేదఋషుల ఆదేశంఅందుకే మానవుని జీవనంలో శ్రమించి సాధించే శ్రేయోమార్గాన్ని మనకు చూపించారు శ్రేష్ఠ మార్గమే పురుషార్ధ సాధన-పురుషార్ధాలు.




ధర్మం:-
విశ్వమంతటా అంతర్యామి రూపంలో నిండి ఉన్న పరమాత్మ - విష్ణువుసృష్ఠిలోని త్రివిధ పదార్ధాలనూ సత్వ,రజస్తమో గుణాలతో కూడిన పదార్ధాలను  పరమాత్ముడే తయారు చేసాడుఅప్పుడే  పదార్ధాలన్నీ తమ తమ ధర్మాలను ధరించి ఆయా విధులను సక్రమంగా నిర్వహిస్తాయని వేదం ఉపదేశిస్తుందివేద విహిత కర్మలు ధర్మములువానికి విరుద్ధమైనవి అధర్మములు.ధర్మాన్ని నాశనం చేసేవారిని ధర్మమే నాశనం చేస్తుందిధర్మాన్ని రక్షించేవారిని ధర్మమే రక్షిస్తుందిధర్మాన్ని విడిచిపెట్టినవారిని ధర్మమే విడిచి పెడుతుందిఅందువలన శ్రద్ధతో ధర్మాన్ని ఆచరించాలి.

 పురుషార్ధాలన్నింటికీ 'ధర్మమే ప్రధాన లక్ష్యం ' అందుకే ఋషులు ధర్మాన్ని అతిక్రమించ వద్దని పదే పదే హెచ్చరించారుఅపుడే మనుష్యుడు తన పరిధిలో తను జీవిస్తాడుసుఖిస్తాడుతృప్తినిశాంతిని పొందుతాడు

  ప్రపంచములో మానవులకు ధర్మమొకటే మిత్రుడు.  అది మరణించిన తరువాత కూడా మన వెంట ఉంటుందిబాంధవ్యాలతో సహా అన్నీ మనలను విడిచిపోతాయికానీ  ధర్మం మాత్రం మనలను ఎప్పుడూ విడువదు.





అర్ధం:- మనం  లోకంలో అనుభవించే పదార్ధాలన్నీ అర్ధాలేధర్మబద్ధంగా వస్తువులను సంపాదించుకొని వానిని త్యాగభావంతో అనుభవించడమే అర్ధ ప్రయోజనంగృహస్తులకు సంపదలు కావాలివాటిని కష్టపడి పురుషార్ధంతో సాధించాలిసాధించిన వానిని భోగించాలి భోగంలో త్యాగముండాలి. నాది కాదనే ఆలోచన ఉండాలి. ఇతరులు కూడా  వస్తువులను అనుభవించేందుకు అవకాశం కల్పించాలి. నాది అనే భావం వీడి అందరిదీ అనే విశాల మనస్తత్వం అందరిలో కనిపించాలి. అదే అర్ధం... 

 కామం:- అంటే ధర్మబద్ధమని కోరికలు. పురుషార్ధాలలో ప్రధమంగా ఉన్న ధర్మంతోనే వస్తువులను పొందాలి. అలాగే కోరికలు కూడా చాలా సహజంగా ధర్మానికి నీతికి అత్యంత దగ్గరగా ఉండాలి. ఉత్తమ సంతానాన్ని ఉత్పన్నం చేసి లోకానికి ఉపకారం చేయాలి. మనుష్యుడు వాంచలకు లొంగిపోకూడదు. అందని కోరికలకు ఆశించి భంగపడకూడదు. కోరికలు మనిషికి దు:ఖాన్ని కలిగిస్తాయి. జీవితావసరాలను సాధ్యమైనంతవరకు తగ్గించుకోవాలి. అవసరాలు మనిషిని వేధించి బాధిస్తాయి. ఈ నాటి మానవులు మొదటిదైన ధర్మాన్ని, చివరిదైన మోక్షాన్ని విడిచి, మధ్యలోని అర్ధకామాల వెంట పరుగులు తీస్తున్నారు. ఋషుల ఆలోచనలకు భిన్నంగా వ్యవహరిస్తే మానవులకు దు:ఖమే కలుగుతుంది. త్రికాలజ్ఞులైన వేదఋషులను అనుసరించడం మన ధర్మం.

మోక్షం:- ఇది పరమ పురుషార్ధం కైవల్యం. ఇది యోగులకు మాత్రమే ప్రాప్తించే అత్యంత పరమపద సోపానం. దానికి మానవులు యమములు, నియమములు శ్రద్ధతో పాలించి, ప్రాపంచిక మోహాలను వదిలించుకొని ఈశ్వర ప్రాప్తిని పొందాలి.యోగికి చిత్తస్థైర్యం కొరకు ప్రణవనాదం ఆలంబనమౌతుంది. యోగి బ్రహ్మప్రాప్తికై యత్నించి ముక్తుడౌతాడు. బ్రహ్మము శాంతము, అజరము, అమరము, అమృతము అభయము......  






      
  .......Visalakshi.....