Friday, October 9, 2015 By: visalakshi

నా ఆత్మకు ( To my soul )

నా ఆత్మకు 


 స్వామి వివేకానంద ' భావజాలం ' ఈ కవిత. స్వామీజీ ఈ కవితను 1899 నవంబరు లో అమెరికానందు ఒకరి ఇంట్లో ఉన్నప్పుడు ఆంగ్లములో వ్రాసారు. ఈ ' మహాత్మ ' ను మన హృదయాల్లో పదిలపరచుకొని, దివ్యత్వాన్ని పొందుదాం.



  
వర్తమానం చీకటిగా ఉన్నా
భవిష్యత్తు ఆశావిహీనంగా కనిపించినా
ధీర హృదయమా
ఈ జీవనభారాన్ని విడువకు
ఓపికతో ఒకింత నిరీక్షించు.


  
ఒకప్పుడు
పర్వతాల నెక్కుతూ దిగుతూ
మరొకప్పుడు
అరుదైన సముద్రాలను సులభంగా దాటుతూ
నువ్వూ నేనూ కలిసి
ఈ ప్రయాణం మొదలుపెట్టి
ఎన్నో యుగాలైంది అని అనిపిస్తుంది.



నా మనస్సులో ఆలోచనలు 
మసలడానికి ఎంతో ముందే 
నువ్వు నాకు
అత్యంత దగ్గరివాడివై
ప్రకటించుతావు.  


ప్రతి ఆలోచనను ప్రతిబింబిస్తూ
నాతో పరిపూర్ణంగా ఐక్యమైన
నిజమైన అద్దానివి నువ్వే.  


 సాక్షీ!
ఇప్పుడు మనం ఇద్దరం విడిపోవడం 
ఉచితమా! చెప్పు?
నిజమైన నేస్తానివి,నమ్మకస్తుడివి
నువ్వొక్కడివే.


నాలో 
దురాలోచనలు చెలరేగుతున్నప్పుడు
అనలసుడవై హెచ్చరించావు
నీ హెచ్చరింపులను
నిర్లక్ష్యం చేసినా
నన్ను విడిచిపోని 
శుభమైన నిజమైన 
మిత్రుడవు నువ్వే!   సాగిపో... నేస్తమా!---- స్వామి వివేకానంద  


 


0 comments: