Saturday, August 22, 2015 By: visalakshi

పాఠశాల మిత్రుల అపురూప కలయిక

"  నిన్న మీ మిత్రులను కలిసిన మీ ఆనందం అంబరాన్ని తాకగా, ప్రకృతి కూడా పులకించి వర్ష రూపేణా తన హర్షాన్ని తెలుపుతున్నట్లు వుంది ఈరోజు వాతావరణం. ఏమంటారు నేస్తం?" అని నా ఆత్మీయ స్నేహితురాలు ..అభినందిస్తుంటే నా మనసు సంతోషములో మునిగి తేలింది.

పదవ తరగతి 1982 బాచ్ మాది. 


33 ఏళ్ళ తరువాత మా పాఠశాల స్నేహితులం ఒక 15 మంది ఒక స్నేహితురాలి సహకారంతో ఒకచోట కలుసుకోవడం అనేది జీవితంలో మధురమైన మరపురాని రోజు."స్వాతంత్ర్యము" వచ్చిన రోజు. అదేరోజు మేము కలుసుకొన్నది.


ఒకరినొకరు ఆనందముగా పలకరించుకొని,ఒకరివిషయాలు ఒకరు తెలుసుకొని చాలా సందడిగా సమయము తెలియకుండా గడిచిన ఆ మధుర క్షణాలు మరపు రావు. 




 విశేషమేమిటంటే ..ఇన్నేళ్ళ తరువాత కూడా ఒకరినొకరు అందరం గుర్తుపట్టి ఆనాటి విషయాలను మాట్లాడుకోవడం ఆనందదాయకం.అందరూ డాక్టర్లు,ఆఫీసర్లు,ప్రొఫెసర్లు, టీచర్లు, హౌస్ వైవ్ లు...వగైరా అయివుండి కూడా, సమయం కేటాయించుకొని .....ఆతృతగా,ఆర్తిగా,ప్రేమగా కలిసాము. 





 




ఇంకా 25 మంది మా బాచ్ వాళ్ళు ఎక్కడ ఉన్నారా అని తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నాము.ఆకాంక్ష బలీయమైనది.నెరవేరాలని ఆశిద్దాము. ..... 



1 comments:

భారతి said...

Apuroopa aatmeeya sneha sangamam... Kadu ramaneeyam.