Thursday, August 6, 2015 By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామాయి షిర్డీసాయి సేవా సత్సంగం - 80 మనసు పూజ

 ఓం శ్రీ సమర్ధ సద్గురవే నమో నమ:




 ధ్యానంతో కూడిన మానసిక పూజే భక్తుడిని భగవంతుడికి చేరువ చేస్తుంది.

ప్రశాంతత నిండిన మనసే...పరుల అండను కోరని మనసే పరమాత్ముడికి ప్రీతికరమవుతుంది.

భక్తుడి సాధన భౌతికం నుంచి మానసికానికి ఎంత త్వరగా చేరుకుంటే పూజలో అంత పరిణతిని సాధించినట్లు!

 అశాంతి,అసంతృప్తి నిండిన మనసు,ప్రశాంతత లేని మనసులో పరమాత్మ ప్రకటితం కాడు.అలజడితో కూడిన అంతరంగంతో ఎన్ని ఆరాధనలు చేసినా ఆశించిన ఫలితం కనిపించదు. 

నిశ్చలమనసును మించిన నీరాజనం,ఆపద్భాంధవుడి ఆశ్రయాన్ని మించిన ఆరాధనం మరొకటి లేదు.

మనసును పవిత్రం చేయని పూజాపునస్కారాలు,
జపతపాలు,సంధ్యావందనాది కర్మల వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు.

మాధవ సంబంధాన్ని కాదని మానవసంబంధాలపై ఆధారపడినంతకాలం మనకు నిరాశలు, నిస్పృహలు, నిట్టూర్పులే!

అంతటా భగవంతుని చూడగలగడం భక్తుడి అత్యుత్తమ హృదయ సంస్కారం.

సుఖమైనా,దు:ఖమైనా సమచిత్తంతో సాగిపోయేవారే భగవంతునికి ఇష్టులు.! 


స్వతంత్రేచ్చను వదులుకొని, సర్వమూ నీవని ఆ సర్వేశ్వరుడి ముంగిట వాలిపోవడమే పూజ పరమావధి. శరణాగతి, సత్సాంగత్యమే భగవద్భక్తికి నిదర్శనాలు.

"  సతతం మనల్ని మనం సత్కర్మలలో నియోగించుకుంటూ, నిరంతరం స్వయంకృషితో, పట్టుదలతో, కార్యశూరత్వాన్ని ప్రకటించుకోవాలి. ఫలితంపై దృష్టి లేకుండా సదా కర్తవ్యనిర్వహణలో, విహితకర్మలను నిర్వర్తించడంలో నిమగ్నమవడమే దైవకృప లేదా దైవసంకల్పం లేదా శరణాగతి."


   సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు

1 comments:

bharati said...

nice... veda gaaru