Tuesday, September 30, 2014 By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామాయి షిర్డీసాయి సేవా సత్సంగం -70

ఓం శ్రీ హృదయ నివాసాయ నమ:

"సాయిబాబాగారి అవతార లక్ష్యం - హిందూ,ముస్లిములు ఐకమత్యంగా అన్నదమ్ములవలె

జీవించాలని,వారు ఏకాత్ములని బాబా నిశ్చితాభిమతం."

బ్రహ్మం అన్నా,ఈశ్వరుడన్నా, అల్లాహ్ అన్నా ఒక్కటేనన్నాడు. 

మనిషి మంచితనానికి,ఆధ్యాత్మికతకు,పవిత్ర జీవనానికి మతం అవరోధం కాదన్నది బాబా అభిమతం.


 బాబాగారు సశరీరులుగా ఉన్న ఆ రోజుల్లో, మరియు మా గృహమునందు సాయి మహత్యములు
 చూసిన ఈ రోజుల్లోనూభక్తులకు సరైన అవగాహన లేక అడిగే ఒక ప్రశ్న.. బాబాకి తెలుగు వచ్చా?
 అని కొందరు మా ఇంట్లో బాబాగారి అక్షరమాలను చూసి అడిగారు. మేము వారి ప్రశ్నకు
 నవ్వుతూ శ్రీ సాయిబాబాను మీరు సామాన్య వ్యక్తిగా తీసుకుని ఇలా ప్రశ్నిస్తున్నారు. 
 అవతార పురుషుడు అంటేనే భగవంతుని మానుష రూపం కదా! వారికి లేని 
పాండిత్యం, రాని భాషలు ఉంటాయా..ఆయన దివ్యాంశ సంభూతుడు.కారణజన్ముడు. 
"వారు ఫకీరు వేషధారణులు ,మసీదు నివాసం, అల్లాహ్ మాలిక్ స్మరణ. "కాబట్టి ఆయనకు 
ఇతర భాషలు రావు అని కొంతమంది అభిప్రాయం. శ్రీ సాయికి ఖురాన్ పైన ఎంత అవగాహన
 ఉందో, భగవద్గీత పైన అంత సాధికారత ఉంది. 

 బాబాగారు నానాసాహెబ్ చందోర్కరుగారి అహంకారమును తొలగించి 'శిష్యుడైనవాడు గురువుకు మనసా,వాచా,కర్మణా సర్వసమర్పణ కావాలీ' అని భగవద్గీత శ్లోకంతో  జ్ఞానబోధ ఏవిధంగా చేసారో చెప్పేముందు  
ఒక చిన్న ఉదంతం.  


శ్రీసాయి మహత్యాలు అనంతములు. వారి లీలలలో భాగంగా ఒకరి ఇంట్లో సాయి ఊదీ రూపధారుడుగా వెలిసారు. వారి గురించి సవివరంగా మరొక టపాలో వ్రాస్తాను. వారి ఇంటికి భక్తులు సమస్యలతో వచ్చేవారు.వారింట్లో ఆ మాత(పేరు గోప్యం)ద్వారా సాయి భక్తుల కష్టాలకు పరిష్కారాలు చూపేవారు. అర్ధరాత్రి కూడా కొందరు సమస్యలతో వచ్చుట వారి కుటుంబానికి అసౌకర్యంగా అనిపించి బాబాను వేడు కొని కలకత్తా బదిలీ పెట్టుకొని ఇల్లు తాళం పెట్టుకొని కలకత్తా వెళ్ళిపోయారుట. హమ్మయ్య! ఇక్కడ తెలుగువారు లేరు అందరూ బెంగాలి కదా ఆ భాష నాకు రాదు కాబట్టి భక్తుల తాకిడి ఉండదు అనుకొన్నారుట. ఆ స్వామి వచ్చిందే భక్తుల బాధలు తీర్చడానికి. అక్కడ కూడా వీరింట్లో మహత్యాలు తెలిసి జనులు వచ్చేవారట. ఆవిడకి తెలియకుండానే బెగాలీలో వారికి సమాధానాలు చెప్పేవారట. రాను,రాను ఆవిడకి అర్ధమైందేమిటంటే  ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా ఏ భాషైనా నా ప్రమేయం లేకుండా బాబా మాట్లాడిస్తారు. ఆయన నాద్వారా చేయాలనుకున్నది ఎక్కడున్నా చేస్తారు అని ఆ సద్గురు లీలలను తెలుసుకొని మరల వారు వారి సొంత ఇంటికి వచ్చారుట. ఆవిడ అంటారూ "వారిముందు మనమెంత సాయీ" అందరినీ ఆవిడ సాయీ అని పిలుస్తారు. వారు అనగా శ్రీసాయి భగవానుడు.  

తదుపరి భగవద్గీత శ్లోక వివరణ..   సశెషం 


సర్వం శ్రీసాయినాధార్పణ మస్తు.    

    

  

   

0 comments: