Thursday, September 25, 2014 By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామాయి షిర్డీసాయి సేవా సత్సంగం - 64

                      ఓం శ్రీనారాయణాయ నమో నమ: 


మం"   ఇంధ్రియేభ్య: పరా హ్యర్ధా అర్ధేభ్యశ్చ పరం మన:!

       మనసస్తు పరా బుద్ధి: బుద్ధేరాత్మా మహాన్ పర:!!



భా:- ఇంద్రియాలకన్నా విషయ వస్తువులు శక్తి మంతమైనవి.

      విషయ వస్తువులకన్నా మనస్సు శక్తి మంతమైనది. 

     మనస్సుకన్నా బుద్ధి శక్తి మంతమైనది. 

    బుద్ధికన్నా మహత్వం సంతరించుకొన్నదైన ఆత్మ శక్తి మంతమైనది.


మం"   మహత: పరమవ్యక్తం అవ్యక్తాత్ పురుష: పర:!

      పురుషాన్న పరం కించిత్ సా కాష్ఠా సా పరా గతి:!!


భా:- మహత్వం గలదైన ఆత్మకన్నా అవ్యక్తం శక్తిమంతమైనది. 

       అవ్యక్తం అంటే భగవంతుని శక్తి. 

     ఏది ఈ ప్రపంచాన్నే ఉద్భవించి కార్యకలాపాలు సాగిస్తున్నదో ఆ శక్తి.

     ఆ శక్తీ భగవంతుడైన స్థానం లేకుండా పనిచేయలేదు. కనుక 

    అవ్యక్తంకన్నా భగవంతుడు శక్తిమంతుడు.

    భగవంతునికన్నా శక్తిమంతమైనది ఏదీ లేదు. 

   ఆయనే పరమ వస్తువు. ఆయనే చరమ గమ్యం.  

 అటువంటి శక్తిమంతుడు, సర్వాంతర్యామి అయిన శ్రీ సాయినాధుని అవతార మహత్యమును,శ్రీ సాయి సచ్చరిత్రము ద్వారా ఒకసారి శ్రీ సాయిని దర్శించగలరు!


మొదటి అధ్యాయములో శ్రీ సాయి వేదాంత తత్వము:- 

శ్రీ సాయిబాబా శిరిడీ యందు సుమారు 60 ఏండ్లు నివసించెను. ఈ కాలమంతయు వారు తిరుగలి విసరుచునే యుండిరి! నిత్యము వారు విసరునది గోధుమలు కావు. భక్తుల యొక్క పాపములు, మనోవిచారములు మొదలగునవి.తిరుగలి యొక్క క్రింది రాయి కర్మ; మీది రాయి భక్తి; చేతితో పట్టుకొనిన పిడి జ్ఞానము. 

జ్ఞానోదయమునకుగాని, ఆత్మసాక్షాత్కారమునకుగాని మొట్టమొదట పాపములను, కోరికలను తుడిచివేయవలయును.అటుపిమ్మట త్రిగుణరాహిత్యము పొందవలెను. అహంకారమును చంపుకొనవలయును.   

కబీరుకధ:- 

ఒకనాడు ఒక స్త్రీ తిరుగలిలో ధాన్యమును వేసి విసరుచుండెను. దానిని చూసి కబీరు యేడ్వసాగెను. నిపతినిరంజనుడను యొక సాధుపుంగవుడది చూచి కారణమడుగగా కబీరు ఇట్లు జవాబిచ్చెను. "నేను కూడా ఆ ధాన్యము వలె ప్రపంచమను తిరుగలిలో విసరబడెదను కదా? దానికి నిపతినిరంజనుడిట్లు బదులు చెప్పెను. 

"భయము లేదు! తిరుగలిపిడిని గట్టిగా పట్టుకొనుము. అనగా జ్ఞానమును విడువకుము. నేనెట్లు గట్టిగా పట్టియున్నానో నీవునూ అట్లే చేయుము. మనస్సును కేంద్రీకరించుము. దూరముగా పోనీయకుము. అంతరాత్మను జూచుటకు దృష్టిని అంతర్ముఖముగానిమ్ము.నీవు తప్పక రక్షింపబడెదవు.   

 రెండవ అధ్యాయములో శ్రీ సాయి యోగీశ్వరునిసచ్చరిత్రము మనకు సత్యమును, ఆధ్యాత్మిక మార్గమును తెలుపును. ఈ వివరణ తదుపరి టపాలో....సశేషం. 

సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు.  

   







 య నమ: 

0 comments: