Tuesday, September 1, 2015 By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామాయి షిర్డీసాయి సేవా సత్సంగం - 82 ఊదీ మహిమ

 ఓం శ్రీ సద్గురు సాయినాధాయ నమో నమ: 

" పరమం పవిత్రం బాబా విభూదిం
  పరమం విచిత్రం లీలా విభూదిం
 పరమార్ధ మిష్టార్ధ మోక్ష ప్రదాతం
 బాబా విభూదిం ఇదమాశ్రయామి "




" బాబాగారి పాదాల వద్దనున్న ఊదీ  ప్రసాదం 2011 గురుపౌర్ణమి రోజు  
 మా ఇంట బాబాగారు మాకునొసంగిన అపురూపమైన,వెలకట్టలేని సంపద."

ఆ ఊదీని సమస్యలతో వచ్చిన భక్తులకు ఇచ్చి,అందరికీ నుదుట పెట్టి,  అందరికీ ఇవ్వగా మిగిలిన   ఊదీ ఒక కవరులో వేసి బీరువాలో ఉంచాము.  

  ఆధ్యాత్మిక విషయములో లేదా సాధనలందు భక్తుల నమ్మకము అపారముగా నుండవలెను. 

జరిగే మహత్యాలను ఆక్షేపణ చేయుచు, సద్గురువును సిద్ధులను విమర్శించుచు నమ్మకమున్నవారిని ఖండించి వట్టి భ్రమ అని బాబాగారి మహత్యాలను అప్పుడూ,ఇప్పుడూ పరీక్షించే (మహానుభావులం మనం). కొంతమంది భక్తులు .

  మా వారి ఆఫీసులో చాలామందికి ఊదీ ద్వారా వ్యాధులు నయమయ్యాయి. ఒక వ్యక్తి తన పాపాకు తరచుగా జ్వరం వస్తుందని,చాలాసార్లు చెప్పగా మావారు పూర్తినమ్మకంతో బాబాగారిని స్మరిస్తూ ఊదీని రోజూ నీళ్ళలో కలిపి త్రాగింపమని చెప్పారు. రెండు రోజులలో అతను సంతోషముతో పాప చలాకీగా ఆడుకుంటోందని చెప్పాడు.

2010 నుండి ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. మా ఇంట్లో ఎవరికి అనారోగ్యము చేసినా ఊదీ నీళ్ళలో వేసుకొని మనస్పూర్తిగా బాబాని స్మరించుకొని తాగుతాము. 


  ఊదీ ని గూర్చి బాబా బోధ: -

"  ప్రపంచములో కనిపించు వస్తువులన్నియు బూడిద వలె అశాశ్వతములు. పంచభూతములచే చేయబడిన మన శరీరములన్నియు సౌఖ్యముల ననుభవించిన పిమ్మట పతనమై బూడిద యగును.ఈ ఊదీ వలననే బ్రహ్మము నిత్యమనియు, ఈ జగత్తు అశాశ్వతమనియు,ప్రపంచములో గల బంధువులు,కొడుకుగాని,తండ్రిగాని,తల్లిగాని,మనవారు కారనియు బాబా బోధించెను.ఈ ప్రపంచములోకి మనము ఒంటరిగా వచ్చితిమి,ఒంటరిగానే పోయెదము. ఊదీ అనేక విధముల శారీరకమానసికరోగములను బాగుచేయుచుండెను. "
 భక్తుల చెవులలో బాబా ఊదీ ద్వారా దక్షిణ ద్వారా నిత్యానిత్యములకు గల తారతమ్యము, అనిత్యమైన దానియందు అభిమానరాహిత్యము గంట మ్రోత వలె వినిపించుచుండెను.మొదటిది (ఊదీ) వివేకమును, రెండవది (దక్షిణ) వైరాగ్యమును బోధించుచుండెను.ఈ రెండును కలిగియున్నగాని సంసారమనే సాగరమును దాటలేము.అందుచే బాబా అడిగి దక్షిణ తీసికొనుచుండెను.శిరిడీనుంచి ఇంటికి పోవునపుడు భక్తులకు ఊదీయే ప్రసాదముగా నిచ్చి, కొంత నుదుటిపై వ్రాసి వరదహస్తమును   వారి శిరస్సుపై నుంచుచుండెను.ఇదంతయు ఊదీయొక్కఆధ్యాత్మికప్రాముఖ్యము.

దానికి భౌతికప్రాధాన్యము కూడాకలదు. అదిఆరోగ్యమును,ఐశ్వర్యమును,
ఆతురతుల నుండి విమోచనమును మొదలగునవి యొసగుచుండెను.


  సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు


0 comments: