Friday, July 18, 2014 2 comments By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామాయి షిర్డీ సాయి సేవా సత్సంగం _63

ఓం శ్రీ గురుభ్యో నమో నమ:





    సర్వదా సర్వభావేన నిశ్చింతై: భగవానేవ భజనీయ:

'సమస్త చింతలను మరచి, సదా సమస్త పరిస్థితుల యందును పరమాత్మనే సేవించాలి.' 


 కలియుగంలో మన జీవితాల్ని ఉద్ధరించే ఏకైక మార్గం భక్తియోగంలో అంతర్భాగమైన పురాణగ్రంధ పఠనం, శ్రవణమే! 

  అలసులు, అల్పాయుష్కులు,మందబుద్ధియుతులు,మందభాగ్యులు,నానారోగపీడితులు అయిన ఆధునిక మానవులకు ఆనందం అతి దుర్లభం. పూర్వ యుగాల్లా మనం తపస్సులు,యాగాలు చేయలేం. కేవలం భగవన్నామ స్మరణమే శరణ్యం. మన నిస్సహాయస్థితిని ముందే ఊహించి సులువైన తోవను నిర్దేశిస్తూ, తన కధాగానంతో తరించమన్నాడు భగవానుడు.

జూన్ 17వ తేదీ మంగళవారం శ్రీ సాయినాధుడు "కలియుగంలో మొదటి అద్భుతం, పాపాలు అంతరించే మార్గం" అని వివరిస్తూ 2010లో జూన్ 17న మా శ్రీవారి మీద శ్రీ చక్రరూపంలో సర్వదైవాలను ఇష్టదైవాలను సందర్శించుకునే సాక్షాత్కార ఆత్మదర్శనం ఇచ్చిన రోజు. 5వ సంవత్సరంలో మరల స్వామిని స్మరిస్తూ..మరియు తిధుల ప్రకారం మా గృహము నందు "స్వయంభూగా స్వామి అర్చావతార పాలరాతిమూర్తిగా" , ఆవిర్భవించిన రోజు కూడా... రెండూ కలిసివచ్చి బహు విశేషమైన రోజు కావున మా కుటుంబ సభ్యులం మా గృహమున శ్రీ హనుమాన్ చాలీసా 108 సార్లు సంకీర్తన చేయుటకు నిశ్చయించుకుని భక్తులను, సత్సంగ సభ్యులను ఆహ్వానించినాము. 

ఆరోజు స్వామికి అభిషేక, పూజలను చేసుకొని, వారి సోదరులైన ఆంజనేయస్వామికి కూడా అభిషేక, పూజలొనరించిన తదుపరి , భక్తితో  భక్తులందరమూ హనుమాన్ చాలీసాను మనసారా 108 సార్లు భజనబృందం వారితో సమంగా సంకీర్తన చేసాము. 

భక్తులకు శ్రవణము,కీర్తనములు ప్రియములు. భగవంతుని అనంత కళ్యాణ గుణములను పరవశించి ప్రవచించడం కధా శ్రవణం. భగవంతుని అనంత కళ్యాణ గుణములను మైమరచి గానం చేయడం కీర్తనము.

విషయ ప్రపంచంలో జీవితమును కొనసాగించు చున్ననూ ఎవరి మనస్సు భగవద్గుణ శ్రవణ కీర్తనాదుల యందు రమిస్తూ ఉంతుందో వారే ధన్యులు.

రాగద్వేషాలను ప్రక్కకు నెట్టి ధర్మాన్ని అర్చనగా మార్చుకొనే పుణ్యాత్ములు కర్మయోగులై అంత:కరణ శుద్ధిని పొందుతారు. అట్టి నిర్మల చిత్తముతో శాస్త్రమును శ్రవణం చేసి ఆత్మ విదులై తరిస్తారు.

శ్రీ సాయినాధుని ఆశీర్వాదముతో భక్తులంతా ఉ"  9గం"లకు ప్రారంభించిన హనుమాన్ చాలీసాను భజనద్వారా భక్తితో,ఆరతి తాంబూలాలతో ఆంజనేయస్వామిని 108సార్లు అర్చించి, తదుపరి సాయీనామ సంకీర్తనలతో పరవశించి, సాయి చాలీసాతో కీర్తనలను ముగించి,తీర్ధ,ప్రసాదములు మరియు విందు స్వీకరించి భక్తులు శ్రీ సాయినాధ,హనుమాన్ జీ లకు ప్రణమిల్లి వారీఅశీర్వాదములు అందుకొని ధన్యులైనారు.  

జూలై 12 శనివారం గురుపౌర్ణమి  సందర్భంగా మేము అభిషేకం,అర్చనల తదుపరి శ్రీ సాయి సత్యవ్రతం మా గృహమునందు భక్తి,శ్రద్ధలతో జరుపుకున్నాం. పిలిచిన భక్తులంతా 11.30 ని"లకు ఒక్కొక్కరుగా వచ్చుచున్నారు. కానీ స్వామికి అభిషేక,అర్చనలు అయిన తరువాత నేను పట్టుచీర కట్టుకొని వ్రతమునకు  వచ్చుసరికి ఇద్దరు అమ్మాయిలు (10,12ఏళ్ళ ప్రాయము గల) భక్తితో కూర్చొని ఉన్నారు. అందులో పెద్దామ్మాయి నన్ను చూసి నవ్వుతోంది పలకరింపుగా. నాకు మనసులో తెలియని ఆనందం.ఎవరీ పిల్లలు అని మావారిని అడగగా వారు వేణుసాయినాధ్ అని మనింటికి వచ్చారే సాయిభక్తులు. వారి పిల్లలు వారి శ్రీమతి కూడా వచ్చారు అని చెప్పారు. వ్రతం మొదటినుండి ఐదు కధలు పూర్తి అయ్యేవరకు ఆ అమ్మాయి అత్యంత శ్రద్ధతో భక్తితో అన్నీ ఆలకించింది. తీర్ధ ప్రసాదాలను స్వీకరించిన  తదుపరి ఆపాప ప్రత్యేకంగా మా వారి వద్దకు వచ్చి "ఊదీ ఇస్తారా!" అని అడిగి తీసుకుందిట. వారి కుటుంబం బయలుదేరుతుంటే వాళ్ళ అమ్మగారికి తాంబూలం ఇస్తూ చిన్నపాపకు ఒక పండు చేతిలో పెట్టి గుమ్మం వైపు చూడగా, అక్కడ పెద్దపాప నవ్వుతూ నన్ను చూస్తోంది.కళ్ళతో రమ్మని పిలిచాను. జామపండు ఇవ్వనా అని అడిగాను. తలూపింది.నేను ఇవ్వగానే వాళ్ళు వెళ్ళిపోయారు. మా భోజనాలు అవగానే, మావారు ఈరోజు బాబాగారు ఎవరి రూపంలో మనమధ్య ఉన్నారో తెలుసా! అన్నారు. వేణు సాయినాధ్ పెద్దపాప రూపంలో అనిచెప్పారు.మా అందరికీ తన్మయత్వంతో వైబేషన్స్.స్వామి ఆవిధంగా దగ్గరుండి పంచమ గురుపౌర్ణమి భక్తి శ్రద్ధ్లలతో మాచే చేయించారు. 

"సాయినామ స్మరణములో బ్రతుకును సాగించిన వారి జీవితము భవ్యంగా,దివ్యంగా శోభిస్తుంది.  విస్మరణమెరుగని స్మరణ బ్రతుకును పావనం చేస్తుంది. ప్రారబ్ధము యొక్క బరువు ఎక్కువై, పురుషార్ధము తేలికపడుతున్న సందర్భాలలో భక్తి పూర్వకంగా పరమాత్మను పిలవాలి. ప్రేమిస్తూ పిలవాలి. ప్రేమ పలుకులకు పరమాత్మ స్పందిస్తాడు. అవరోధాలను తొలగించి మార్గాన్ని సుగమం చేస్తాడు. ప్రతిబంధకములను దూరం చేసి తనకు దగ్గరగా తీసుకుంటాడు."      


సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు        
Wednesday, July 9, 2014 0 comments By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామాయి షిర్డీ సాయి సేవా సత్సంగం-62

                  శ్రీరస్తు                           శుభమస్తు                         అవిఘ్నమస్తు

ఆహ్వాన పత్రిక

 ఓ౦ శ్రీ గురుమూర్తయే నమ:

 శ్లో”  శుక్లా౦ భరధర౦ విష్ణు౦ శశివర్ణ౦ చతుర్భుజ౦!
     ప్రసన్నవదన౦ ధ్యాయేత్ సర్వవిఘ్నోప శా౦తయే॒॒!!

 శ్లో” గురూణా౦ వ౦దన౦ శ్రేష్ఠ౦, గురుణామర్చన౦ తధా!
    గురూణా౦ స్మరణ౦ నిత్య౦ తస్మైశ్రీ గురవేనమ:
        గురుచరణారవి౦దాభ్యా౦ నమో నమ:!!

నాయ౦దెవరి దృష్టి కలదో, వారియ౦దే నా కటాక్షము కలదు. – బాబా

స్వస్తిశ్రీ చా౦ద్రమాన శ్రీ జయ నామ స౦వత్సర౦ ఆషాడ శుద్ధ పౌర్ణమి అనగా “గురుపౌర్ణమి” పర్వదినాన్ని పురస్కరి౦చుకొని తేది:  12-07-2014  శనివార౦ మా గృహమున౦దు శ్రీ షిర్డీసాయి పూజ, అభిషేక౦, సాయి సత్యవ్రత౦ మరియు  సాయినామ స్మరణ  చేయ నిశ్చయి౦చాము. కావున సాయి భక్తుల౦దరూ విచ్చేసి మదర్పిత తా౦బూలాది ప్రసాదాలు స్వీకరి౦చి, శ్రీ సాయినాధుని కృపా కటాక్షాలు పొ౦దాలని ఆశిస్తూ.....ఈ శుభస౦కల్ప౦ మాకు కలుగజేసి, స్వయ౦భూగా మా ఇ౦ట వెలసిన షిర్డీబాబావారికి వారి ఆదేశానుసార౦ గుడి, సేవాశ్రమ౦ కట్టుటకు నిర్ణయి౦చాము. మా ఈ శుభ స౦కల్పాన్ని భక్తుల౦తా విజయవ౦త౦ చేయాలని మా హృదయ పూర్వక విన్నప౦. భక్తుల౦దరికీ ఇదే మా  హృదయ పూర్వక ఆహ్వాన౦.

                                                       జై శ్రీ సాయిరా౦                                                              
సర్వ౦ శ్రీ సాయినాధార్పణ మస్తు 
          
                         శ్రీశ్రీశ్రీ ద్వారకామయి షిర్డీసాయి సేవా సత్స౦గ౦  - నిర్వాహకులు  
                                                                  SRI N. SURYA  PRAKASH